హోం

1, నవంబర్ 2011, మంగళవారం

తెలుగు ప్రజల ఆత్మ గౌరవం, ఎన్టిఆర్ కుట్ర ...

తెలంగాణా సంస్కృతిని, అస్తిత్వాన్ని సమూలంగా నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్న వ్యక్తి తెలంగాణా ప్రజల ఆరాధ్య దైవం, అన్న అని అభిమానంగా  పిలుచుకునే ఎన్ టి ఆర్. ఈ విద్రోహ దినం నాడు ఆ తెలంగాణా ద్రోహి చేసిన ద్రోహాన్ని తెలుసుకోవడం సముచితమే, తెలంగాణా పై సీమంద్రులు రాజకీయంగా, ఆర్ధికంగా, నీళ్ళు నిధులు, నియామకాల్లో దోపిడి చేస్తే ఎన్ టి ఆర్ మాత్రం తెలంగాణా సంస్కృతిపైన తెలంగాణా అస్తిత్వంపైన దాడి చేసాడు, దానికే తెలుగు వారి ఆత్మ గౌరవం అని పేరు పెట్టాడు, తెలుగు వారి ఆత్మ గౌరవం పేరుతో తెలంగాణా అస్తిత్వం లేకుండా చేసాడు, 1985 లో తెలంగాణాలో మంచి పేరు సంపాదించుకోవడానికి 610 జి ఓ తీసుకొని వచ్చాడు, కాని దాన్ని వ్యూహాత్మకంగా అమలు చెయ్యలేదు, తెలంగాణాలోని ప్రభుత్వ రంగ సంస్థలైన ఆల్విన్, నిజం షుగర్ ఫ్యాక్టరీ, అజంజాహి మిల్లు, అంతర్గం మిల్లు, సర్ పుర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు, హైదరాబాద్ పవర్ స్టేషన్, ఫిరంగుల ఫ్యాక్టరీ, సోడా, ఐరన్, దక్కన్ బటన్, దక్కన్ గ్లాస్, డి.బి.ఆర్. ఫాక్టరీ  లను లాభాలలో ఉండగానే ముసివేసాడు ఈ ఎన్ టి ఆర్, అయితే అవన్నీ నిజాం రాజు స్థాపించిన ప్రభుత్వ రంగ కంపెనీలు. ఇతను అధికారంలోకి వచ్చే సరికే తెలంగాణాలో ఉన్న 12 పాల శుద్ధి కేంద్రాలను ఇతను అధికారం లోకి రాగానే మూసి వేసాడు. అలాగే 1983 లో ఆయన మొదటి సారి ముఖ్య మంత్రి కాగానే చేసిన మరో పని తెలంగాణా ప్రాంతీయ బోర్డు ను రద్దు చెయ్యడం.
                        ఇంతే కాదు శ్రీ శైలం నుండి ఎడమ కాలువ నీరు తెలంగాణా కు కేటాయించింది, అయితే కుడి కాలువ తో తెలుగు గంగ , గాలేరు నగరి హంద్రి నీవ లను జత పరిచి దాని సామర్ధ్యాన్ని మూడు నాల్గు రెట్లు పెంచేసాడు, ఉన్న నీరు మొత్తం వంపున ఉన్న కుడిగట్టు కాల్వలకే వెళ్ళేలా ఏర్పాటు చేసారు, ఎడమ కాల్వ నిజానికి అది ఎడమవైపు లేదు అది పూర్తిగా ఎత్తులో నీటి చుక్క కూడా రాణి ప్రాంతంలో ఏర్పాటు చేసారు, ఎదమకాల్వ పూర్తి చేస్తంమని చెప్పారు కాని అది చెయ్యలేదు, చెన్నై తనను అక్కున చేర్చుకుందని చెన్నై తాగునీటి అవసరాలకని తెలుగు గంగ ను చెన్నై వరకు పొడగించి ప్రతి ఏడు 2  టి ఎం సి లనీరు ఇచ్చిన ఎన్ టి ఆర్ కు అన్న అని గుండెల్లో పెట్టుకుని, అతని సినిమాలకు 60 % కాలేక్షన్లు తెచ్చి పెట్టె తెలంగాణా ప్రజలు, ఫ్లోరైడ్ బారిన పడి అవస్థలు పడుతుంటే కనబడ లేదు, వాళ్ళకు గుక్కెడు నీళ్ళు ఇవ్వలేదు..
      నిజం షుగర్ ఫాక్టరీ లాభాలను నష్టాల్లో ఉన్న ఆంధ్ర కంపనిలకు తరలించి ఈ కంపని ని సంక్షోభం లోకి నెట్టి తన అల్లుడికి అమ్ముకున్నాడు, అతను తర్వాత వేరే వాళ్ళకు అమ్ముకున్నాడు,.
            ఇక తెలంగాణకు చెందిన మహోన్నత కవి దాశరధి ఆయన అప్పటివరకు ఆస్థాన కవి గా ఉన్నారు, అయితే ఎన్ టి ఆర్ అధికారంలోకి రాగానే ఆయనను పదవిచుతిన్ని చేసి తీవ్రంగా అవమానించాడు, ఆ అవమానంతో ఆయన మరణించారు.అయితే ట్యాంక్ బoడ్ పై విగ్రహాలు కూడా కుత్రపురితంగా ఎంపిక చేసినవే, అందులో తెలంగాణకు ఎ మాత్రం సంబంధం లేని ఆంద్ర కు చెందిన పొట్టి శ్రీ రాములు , టంగుటూరి ప్రకాశం పంతులు, దామోదరం సంజీవయ్య, తెలంగాణా ద్రోహి బ్రమ్హానంద రెడ్డి, శ్రీ కృష్ణ దేవ రాయలు లాంటి వారి విగ్రహాలు ఉన్నాయ్, తెలుగు జాతిని మొత్తాన్ని పాలించిన రుద్రమ దేవి, ప్రతాప రుద్రుల విగ్రహాలు పెట్టని ఎన్ టి ఆర్ , కన్నడ రాజు శ్రీ కృష్ణ దేవరయలును పెట్టడంలో ఆంతర్యమేమిటి, శ్రీ శ్రీ ఉన్నప్పుడు దాశరధి ఎందుకు లేడు, అల్లూరి ఉన్నప్పుడు కొమురం భీమ ఎందుకు లేడు, టంగుటూరి ప్రకాశం పంతులు ఉన్నప్పుడు భుర్గుల రామ కృష్ణ రావు ఎందుకు లేడు, అసలు హైదరాబాద్ నగరాన్ని, ట్యాంక్ బుండ్ ను నిర్మించిన మొహమ్మేద్ కూలి కుతుబ్ షా విగ్రహం లేకపోవడం దారుణం. తెలంగాణ అస్తిత్వం పై దెబ్బ కొట్టాలనే కుట్రతో ముందుకు సాగిన ఎన్ టి ఆర్ ముమ్మాటికి తెలంగాణా ద్రోహే.....
                                                  

2 కామెంట్‌లు: