హోం

23, నవంబర్ 2011, బుధవారం

ఉద్యమ కార్యాచరణ....

మహాత్మా జ్యోతీరావు పూలే వర్ధంతి సందర్భంగా ఈ నెల 28న ‘తెలంగాణ విద్యార్థి ఆత్మగౌరవ సభ ’ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి జేఏసీ నాయకులు తెలిపారు. ఈరోజు సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో పోస్టర్‌లను విడుదల చేశారు. కార్యక్రమంలో పిడమర్తి రవి, రాజారాం మాట్లాడుతూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా 24వ తేదిన కళాశాల ఎదుట కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణా జే ఎ సి కూడా ఉద్యమ కార్య చరణను ప్రకటించింది, డిసెంబర్ 1 వ తేదిని నిరసన దినం పాటించాలని, 9 వ తేది తెలంగాణా ప్రకటన వచ్చిన రోజు కావున ఆత్మ గౌరవ దినంగా జరుపుకోవాలని పిలుపునిచ్చింది.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి