హోం

20, జులై 2013, శనివారం

తెలంగాణ తొవ్వ


రాష్ట్రాన్ని ఒకవేళ విభజిస్తే పరిష్కరించలేని సమస్యలుంటాయా? విభజనతో విపరీతమైన ఇబ్బందులు వస్తాయా? అసలు ప్రపంచంలో విభజన డిమాండ్ కొత్తగా ఇక్కడే పుట్టిందా? విభజన అంటూ జరిగితే.. పారే నీళ్లు, బొగ్గులు మండితే వచ్చే విద్యుత్, వివిధ పనుల్లో జనానికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, భూములు.. అవి సృష్టించిన బూమ్‌లు.. అవి పుట్టించిన ప్రైవేటు సంపదలు.. వాటి నుంచి మొలిచిన రాజకీయ అధికారాలు.. ఆ అధికారాలను కిందిస్థాయిలో పాలనగా మార్చే అధికార యంత్రాంగాలు.. అవి కేంద్రంగా ఉండే రాజధాని!! సకల రంగాల్లో సమస్యలు ఏపాటివి? విభజన జరుగకపోతే ఫలితమేంటో అనుభవాలు ఉండనే ఉన్నాయి. అవి అప్రస్తుతం! రాష్ట్రాన్ని విభజిస్తే ఏం జరుగుతుంది? తలెత్తే సమస్యలేంటి? వాటికి పరిష్కారాలేంటి? పరిష్కారాలను చేరుకునే తొవ్వలేంటి? విభజన అనేది బీభత్స రస ప్రధాన దృశ్యం కానేకాదు. ఎవరైనా అలా అంటే కచ్చితంగా అది వారి స్వప్రయోజ నాల కోసమేనని భావించాల్సి ఉంటుంది. నిజానికి ఈ వాదనలు కొత్తవేమీ కావు. 

విభజన అనంతర పరిస్థితులపై మేధావులు కాచివడపోసినవే. నీళ్లు.. విద్యుత్.. ఉద్యోగాలు.. రాజధాని! ఎటు చూసినా సమస్యలు తలెత్తుతాయని భావిస్తున్న కీలక రంగాలు ఇవే! విభజన జరిగితే.. ఎగువన ఉన్న తెలంగాణ నుంచి పారే నదుల నీటిలో ఆంధ్రకు హక్కు ఎగిరిపోదు. ఎందుకంటే ఈ అంశం కొత్తగా ఏర్పడే తెలంగాణ దయాదాక్షిణ్యాలపై ఉండదు! దీనికి ట్రిబ్యునళ్లు ఉంటాయి. అంతర్జాతీయ జల పంపకాల సూత్రాల ప్రకారం అవి ప్రకటించే అవార్డులుంటాయి. వాటిని పర్యవేక్షించే కోర్టులుంటాయి! ఉద్యోగాలు పోతాయన్న బెంగే లేదు. ఎందుకంటారా.. తెలంగాణ విభజనతో మిగిలే సీమాంధ్ర ప్రాంతాల రాష్ట్రానికి అంతే స్థాయిలో అధికార యంత్రాంగం అవసరం! నీటి వనరుల పంపిణీకి ప్రత్యేక విధానాలున్నట్లే.. విద్యుత్ విషయంలోనూ మార్గదర్శకాలున్నాయి. ఇక మరో కీలక అంశం రాజధాని! వాస్తవానికి కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా సీమాంధ్ర ప్రాంతం మరింత వృద్ధి చెందేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. 

కొత్త రాజధాని నిర్మాణంతో ఆ ప్రాంతానికి అందే వేల కోట్లు.. కూలి పని చేసినా.. కాంట్రాక్టులు చేసినా.. అంతిమంగా వెళ్లేది స్థానిక ప్రజల్లోకే! వీటన్నింటికి మించి రాజకీయ ప్రయోజనాలు కూడా కోరుకునేవారికి కోరుకున్నన్ని! ప్రస్తుత రాజకీయ చిత్రంలో చూస్తే.. తెలంగాణ ఏర్పాటుతో.. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ బలీయమైన శక్తిగా పుంజుకుంటుంది. తెలంగాణ సాధన కోసం ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ అనివార్యంగా కాంగ్రెస్‌లో విలీనం కాక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ రీత్యా కాంగ్రెస్‌కు ఇక్కడ ఇది అత్యంత ప్రయోజనకారి. మరి సీమాంవూధలో? అక్కడా కాంగ్రెస్‌కు లబ్ధి కలిగేందుకే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కీలక స్థానాల్లో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స, కేంద్ర మంత్రి చిరంజీవి సహా అనేక మంది సీమాంవూధులే. తెలంగాణలో కొత్తగా వచ్చే బలంతో కాంగ్రెస్‌కు పెరిగే పునాది సహజంగానే సీమాంవూధలోనూ కలిసివస్తుంది. 

ఊపుతగ్గిందని భావిస్తున్న జగన్ పార్టీ రేపోమాపో కాంగ్రెస్‌లో కలిసే అవకాశాలూ లేకపోలేదు! ఈ రీత్యా అక్కడా కాంగ్రెస్‌కు జయమే! దేశంలో ఇప్పటికే ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన అనేక చోట్ల విభజన అనుభవాలున్నాయి. సామరస్యపూర్వకంగా ఎలా విడిపోవచ్చో అవి నిరూపించాయి. విడిపోయి అభివృద్ధి దిశగా ఎలా దూసుకుపోవాలో పాఠాలు చెబుతున్నాయి. ఇప్పుడు వీటికి అదనంగా తోడు చేసుకోవాల్సింది ఒక సుహృద్భావపూర్వక వాతావరణమే! ఒక తెలుగు రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాలుగా శక్తిని రెట్టింపు చేసుకునేందుకు దీర్ఘకాలం తర్వాత లభిస్తున్న సువర్ణావకాశం! విభజనపై కాంగ్రెస్‌పార్టీ దాని నేతృత్వంలోని ప్రభుత్వం అటో ఇటో తేల్చేస్తామని చెప్పి, ఏం జరిగితే ఏమవుతుందో రోడ్‌మ్యాప్‌ల తయారీ నిమిత్తం తన పార్టీలోని ముగ్గురు ముఖ్య నేతలను ఆదేశించిన క్రమంలో.. తెలంగాణ ప్రజల తరఫున ‘నమస్తే తెలంగాణ’ ఒక చొరవ చేస్తున్నది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల నుంచి, ఆత్మబలిదానాల నుంచి, దశాబ్దాల అన్యాయాల నుంచి అక్షరీకరించిన ‘తొవ్వ’ను కేంద్ర పాలకులకు అందజేస్తున్నది.

7, జులై 2013, ఆదివారం

భూదాన్ పోచంపల్లి..

                                                 (వినోబాబావే)
చేనేత, భూదానోద్యమానికి పురుడు పోసిన మన పల్లె ఇవాళ అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక విస్తృత అధ్యయన కేంద్రంగా విలసిల్లుతోంది.
నల్లగొండ జిల్లాలోని భూదాన్ పోచంపల్లి పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే, అక్కడి చేనేత కార్మికులు నేసిన చీరలు అందరినీ మురిపిస్తాయి మరి. ఇక ఆడవారినైతే అమితంగా ఆకర్షిస్తాయి. రక్తపాత రహితంగా జరిగిన భూదానోద్యమం పుట్టింది ఇక్కడే. అందుకే ఈ గ్రామం చరిత్రలో నిలిచిపోయింది. అనాడు అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను నేసిన నేతగాళ్ళు రాన్రాను అనేక డిజైన్‌లలో చేనేత బట్టలను నేసి, అందరినీ ఆకర్శించేలా చేస్తున్నారు. హైద్రాబాద్ నగరానికి కేవలం 35 కి.మీ. దూరంలోని ఈ ఊరును చూసేందుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల వారే కాకుండా రోజూ అనేకమంది విదేశీయులు కూడా ఇక్కడికి వస్తూ, వారికి కావల్సిన సమాచారాన్ని మోసుకు పోతున్నారు. 
             అంతేకాదు, ఈ గ్రామం అనేక రకాల శిక్షణలు, వృత్తివిద్యలు, సాంప్రదాయ విద్యలను అభ్యసించే విద్యార్థులకు అధ్యయన వేదికగానూ నిలిచింది. ఒక ‘గ్రామీణ పాఠశాల’గా ఔత్సాహిక పరిశోధకులకు ఉపయోగపడుతోంది. నిజాం నవాబులు వాడిన కండువా రుమాళ్ళను నేసినా, అరబ్బు దేశాలకు ఎగుమతి చేసిన గాజుల పూసలను తయారు చేసినా, పేద ప్రజల ఆశలకు ప్రతిరూపమైన భూదానోద్యమానికి శ్రీకారం చుట్టినా- అది ఈ గ్రామానికే చెల్లిందనుకోవాలి. సాధారణ పడుచుల నుండి దేశ విదేశీ వనితల వరకూ అందరినీ ఆకట్టుకునే చేనేత ఉత్పత్తులు, చీరలతో ఖండాంతర ఖ్యాతిని ఆర్జిస్తూ ఎందరికో ఈ గ్రామం చక్కని ‘అధ్యయన కేంద్రం’గా మారడం గొప్ప విషయమే మరి. 
చేనేత రంగంలో అధ్యయనాలు:-

చేనేత వస్త్రోత్పత్తికి పేరెన్నిక గన్న ఈ గ్రామానికి నిత్యం అనేక మంది చేనేత అధ్యయనకారులు వస్తుంటారు. హైద్రాబాద్‌లోని (ఎన్‌ఐఆర్‌డీ) జాతీయ గ్రామీణాభివృద్ది సంస్థలో వివిధ అంశాలలో అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ పొందే అనేక దేశాలకు చెందిన అధికారులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు, ఆర్థిక రంగ నిపుణులు, అధ్యాపకులు, రాజకీయ వేత్తలు క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా ఇక్కడికి తరచూ వస్తుంటారు. ‘పోచంపల్లి చేనేత వస్త్రాలను మార్కెట్ అవసరాలకు దగ్గట్టుగా ఏ విధమైన కొత్త డిజైన్‌లను రూపొందించవచ్చు’ అనే అంశంలోఎన్‌ఐఎఫ్‌టీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) బృందాలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ బృందాల వారూ గ్రామాన్ని సందర్శిస్తారు. వీరితోపాటు నిమ్స్‌మీ (జాతీయ, సూక్ష్మ, లఘు, మధ్య పరిక్షిశమ సంస్థ), చేనేత జౌళి శాఖలకు చెందిన అధికారులు, వివిధ రాష్ట్రాల చేనేత క్లస్టర్ల బృందాలు, పలు రాష్ట్రాలకు చెందిన వీవర్స్ సర్వీసింగ్ సెంటర్స్ సభ్యులు, టెక్స్‌టైల్స్ కమిటీలు, పార్లమెంట్ కమిటీలు, సెరీఫైడ్, ఎన్‌హెచ్‌డీసీ, ప్రపంచ దేశాలకు చెందిన పలు ఫొటోక్షిగఫీ అసోసియేషన్ సభ్యులు కూడా ఇక్కడికి వస్తుంటారు. మండల పరిధిలోని పోచంపల్లి హ్యాండ్లూమ్ ఫార్కును, పోచంపల్లి చేనేత సహకార సంఘాన్ని, చేనేత కార్మికుల గృహాలను చేనేత ఉత్పత్తిలోని వివిధ ప్రక్రియలను వారు తిలకించడంతోపాటు ఫొటోలు తీసుకుంటారు. 
వ్యవసాయ పరిశోధనలు:-
మరోవైపు వ్యవసాయ పరిశోధకులూ ఇక్కడికి వస్తుంటారు. భూదాన్ పోచంపల్లిలో మూసీ నది ప్రవహిస్తోంది. ఇక్కడి రైతులు ఎక్కువగా వరి పంట పండిస్తారు. హైద్రాబాదుకు అతి తక్కువ దూరంలో ఉంటుంది కాబట్టి, వ్యవసాయ పరమైన కొన్ని అధ్యయనాలు జరపడానికి ఇక్కడికి ఆంధ్రవూపదేశ్ అగ్రికల్చరల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నాన్ ఫెస్టిసైడ్ మేనేజ్‌మెంట్ బృందాలు, నాబార్డ్, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించడానికి వివిధ రాష్ట్రాల అధికారులు, గ్రామీణ మహిళామండలి సభ్యులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, డీఆర్‌డీఏ, ఎన్‌సీఆర్‌డీ (నేషనల్ కౌన్సిల్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్) బృందాల వారూ ఈ గ్రామాన్ని సందర్శిస్తారు. 
విద్యార్థులకు కొత్తపాఠాలు:-
ఇక్కడి పురాతన కట్టడాలు పరిశీలించడానికి వివిద రాష్ట్రాలకు చెందిన ఆర్కిటెక్ట్ కళాశాలలకు చెందిన విద్యార్థులూ ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నారు. ఇక్కడి 101 దర్వాజల భవనాన్ని, పాత పెంకుటిళ్లను పరిశీలించేందుకే కాకుండా కాలక్షికమేణా నిర్మాణ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులను అధ్యయనం చేయడం ప్రధానంగా వారి పర్యటన లక్ష్యంగా కనిపిస్తోంది.
పథకాల పరిశీలన:-
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ పథకాలను పరిశీలించేందుకు పలువురు అధికారులు ఈ గ్రామాన్ని సందర్శిస్తుంటారు. మరోవైపు మహిళా సాధికారతకు సర్కారు తీసుకునే చర్యలను పరిశీలించేందుకుగాను విదేశాల ప్రతినిధులు, అధికారుల బృందాలు, వివిధ రాష్ట్రాల నిపుణులు, బ్లాక్ లెవల్ అధికారులు, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు వంటి వారందరూ తరచుగా ఇక్కడికి రావడం జరుగుతోంది. 
పుణ్యస్థలి:-
మహాత్ముని ప్రియశిష్యుడు ఆచార్య వినోబాబావే నిర్వహించిన భూదాన్యోమం ఇక్కడే పుట్టింది. ఈ దృష్ట్యా అనేక పర్యాయాలు ఇక్కడికి ఎందరో సర్వోదయ నాయకులు, గాంధేయవాదులు వినోబాబావే తన రెండవ జన్మస్థలంగా చెప్పుకున్న ఈ గ్రామాన్ని అత్యంత ఆసక్తితో సందర్శిస్తారు. ఇలా వారికి ఈ గ్రామం ఒక పుణ్యస్థలంగానూ పేరొందింది. 
వృత్తివిద్యలు, శిక్షణల పరిశీలన:-
దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు గురువు, తెలంగాణ విమోచన గాంధీ స్వామి రామానందతీర్థ పేరున ఇక్కడ గ్రామీణ యువతీ యువకులకు వివిధ వృత్తివిద్యలతోపాటు సాంకేతిక అంశాలలో శిక్షణ ఇచ్చే లక్ష్యంతో ఏర్పాటైన ఎస్‌ర్‌టీఆర్‌ఐ సంస్థను కూడా పలువురు ఆసక్తిగా సందర్శిస్తుంటారు. 
         హైద్రాబాద్‌కు అతి సమీపంలో ఉండటంతో రాజధానికి వచ్చే దేశ విదేశీ పర్యాటకులలో చాలామంది పోచంపల్లిని కూడా సందర్శించడం పరిపాటిగా మారింది. అంతేకాదు, వచ్చే ప్రతీ ఒక్కరు వచ్చిన పని ముగిశాక, ఇక్కడి చేనేత కార్మికులు నేసే వస్త్రాలను కూడా కొనుగోలు చేస్తుంటారు. అలా ఈ కార్మికులకు మరింత పని దొరికేందుకు పరోక్షంగా వారు దోహద పడుతున్నారు. అధిక సంఖ్యలో సందర్శకులు వస్తున్న కారణంగా ఇక్కడ ప్రభుత్వం గ్రామీణ పర్యాటక కేంద్రం ఒకదానిని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. పర్యాటకులకు తగు వసతులు కల్పించడం ద్వారా మరింత మంది సందర్శుకులను ఆకట్టుకునే అవకాశం కూడా ఉంటుంది.

                                                                                   -from namaste telangaana

తెలంగాణ కాటన్-నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్


హైదరాబాద్ రాజ్యంలో పటిష్టమైన ప్రణాళికలు రచించి, అనేక భారీ మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ తెలంగాణ సాగునీటి రంగానికి పితామహుడు. జూలై 11న ఆయన జయంతి. ఈ సందర్భంగా ‘బతుకమ్మ’ ప్రత్యేక వ్యాసం...

ఏ జాతికైనా తమ జాతి వైతాళికులు ఉంటారు. తమ జాతి ఔన్నత్యం కోసం, తమ జాతి వికాసం కోసం అహర్నిశలు కృషి చేసిన ఉద్ధారకులు, మేధావులు ఉంటారు. అయితే, తెలంగాణ వంటి వలసవాదానికి బలయిన ప్రాంతాలలో ఈ చరిత్ర అంతా మరుగున పడిపోతుంది. చరిత్ర వక్రీకరణకు గురి అవుతుంది. విజేతల చరిత్రే చరిత్ర అన్నట్లు చరిత్ర పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు రూపొందుతాయి. అట్లా 1956లో ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ చరిత్ర ఆంధ్రవూపదేశ్ చరివూతలోంచి లేదా తెలుగువారి చరివూతలోంచి తొలగిపోయి మరుగున పడిపోయింది.

తెలంగాణ నేల అనేక రాజకీయ, సామాజిక ఉద్యమాలకు ఊతమిచ్చింది. 1857 భారత ప్రథమ స్వాతంవూత్య సమరం ఉత్తర భారతదేశాన్ని కుదిపేస్తున్న వేళలో, ఆ సమరంలో భాగం కాకుండా బ్రిటిష్ వాళ్లకు మద్దతిచ్చిన నిజాం రాజ్యంలో తుర్రేబాజ్‌ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్ నాయకత్వంలో బ్రిటీష్ రెసిడెన్సీపై దాడి జరిగింది. ఆ పోరాటంలో తుర్రేబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్ లిద్దరూ బ్రిటిష్ వాళ్ళకు పట్టుబడి అమరులైనారు. అటువంటి మహత్తర ప్రతిఘటన పోరాటం చరివూతకు అందకుండా పోయింది. బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించిన రాంజీగోండు, అడవిపై గ్రామాలకు హక్కుని కోరుతూ జరిగిన కొమురం భీం బాబేఝరీ పోరాటం ఇటీవలి దాకా ఎవరికీ తెలియని చరివూతగా మిగిలిపోయింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ఇప్పటికీ మొయిన్ స్ట్రీం చరివూతకారులు గుర్తించనే లేదు. తెలంగాణలో భాషా సాంస్కృతిక వికాసం కోసం కృషి చేసిన వైతాళికుల గురించి తెలంగాణ చరివూతకారులు వెలికితీసే దాకా ఎవరికీ తెలియనే తెలియదు. అట్లా మరుగున పడిపోయిన వైతాళికులలో హైదరాబాద్ సంస్థానంలో పుట్టి, భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతుడైన ఇంజనీరుగా పేరు పొందిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ ఒకరు.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి దేశవ్యాప్తంగా తెలియని వారుండరు. ఆయన భారతదేశం గర్వించదగ్గ ఇంజనీరు. భారతరత్న బిరుదాంకితుడు. భారతదేశంలో నీటి పారుదల రంగానికి పునాదులు వేసిన తొలి తరం మేధావి. అటువంటి మేధావికి సమకాలికుడు, అంతటి స్థాయి కలిగిన ప్రతిభావంతుడైన ఇంజనీరు నవాబ్ అలీ నవాజ్‌జంగ్. అయితే, ఆంధ్రవూపదేశ్ నీటిపారుదల రంగ చరివూతలో సర్ అర్థర్ కాటన్‌కు ఆ తర్వాత కె.ఎల్.రావులకు దక్కిన ఖ్యాతి నవాబ్ అలీ నవాజ్ జంగ్‌కు దక్కకపోవడం యాధృచ్చికం కానే కాదు.

కృష్ణా, గోదావరి, పెన్నా, కావేరీ డెల్టాలకు సాగునీటి సౌకర్యాలను ఏర్పరిచి, డెల్టా ఆర్థిక స్థితిగతులను గుణాత్మకంగా మార్చివేసిన వ్యక్తి సర్ ఆర్థర్ కాటన్. కాటన్‌కు చరివూతలో ఆ ఖ్యాతి, ఆ స్థానం దక్కవలసిందే. అయితే, హైదరాబాద్ రాజ్యంలో సాగునీటి ప్రణాళికలు రచించి అనేక భారీ మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిన తెలంగాణ సాగునీటి రంగానికి పితామహుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్. ఆయన కృషిని స్మరించుకొన్న సందర్భాలు ఇటీవలి దాకా లేనే లేవు. తెలంగాణ ఇంజనీర్లు సెప్టెంబరు 15న ‘ఇంజనీర్స్ డే’ రోజున మోక్షగుండం విశ్వేశ్వరయ్య సరసన నవాబ్ అలీ నవాజ్ జంగ్ ఫొటోను పెట్టి ఆయన కృషిని స్మరించుకుంటున్నారు. ఆయన జయంతి, వర్థంతి సభలను జరుపుతున్నారు. నవాబ్ అలీ నవాజ్ జంగ్ కృషిని సంక్షిప్తంగా ప్రపంచానికి అందించే ప్రయత్నమే ఈ జీవిత చిత్రణ.

నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్‌గా ప్రపంచానికి ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు పరిచితుడైన ఈయన అసలు పేరు మీర్ అహ్మద్ అలీ. 11-7-1877న హైదరాబాద్‌లో జన్మించాడు. తండ్రి మీర్ వాయిజ్ అలీ హైదరాబాద్ రాజ్యంలో ‘ధప్తర్-ఎ-ముల్కీ’లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తుండేవారు. భారత ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం ‘ధప్తర్-ఎ-ముల్కీ’ చేసేపని. హైదరాబాద్ రాజ్యంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మీర్ అహ్మద్ అలీ హైదరాబాద్ అబిడ్స్‌లోని సెయింట్ జార్జి గ్రామర్ స్కూల్‌లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసుకొన్నాడు. ఇంగ్లీషుతో పాటు లాటిన్ భాషను కూడా నేర్చుకొన్నాడు. ఆ తర్వాత నిజాం కాలేజీలో చేరాడు. అక్కడ నాలుగేండ్లు ఉన్నత విద్యను అభ్యసించి 1896లో ప్రభుత్వం ఇచ్చే స్కాలర్‌షిప్‌తో ఇంగ్లండ్‌లో ప్రఖ్యాతి గాంచిన కూపర్‌హిల్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరి, సివిల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. కూపర్ హిల్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతిభావంతుడైన విద్యార్థిగా తన బ్యాచ్‌లో ప్రథముడిగా నిలిచి అనేక స్కాలర్‌షిప్‌లను అందుకున్నాడు. 1899లో ఇంగ్లండ్ నుండి తిరిగి వచ్చి అదే సంవత్సరం హైదరాబాద్ ప్రభుత్వ ప్రజాపనుల విభాగంలో (పీడబ్ల్యూడీ)లో అసిస్టెంట్ ఇంజనీరుగా చేరి, అంచెలంచెలుగా ఎదిగి చీఫ్ ఇంజనీరయ్యాడు. ఆ తర్వాత చీఫ్ ఇంజనీరు సెక్రటరీగా పదోన్నతి పొంది పదవీ విరమణ చేశాడు. తర్వాత కూడా హైదరాబాద్ ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి సాంకేతిక సేవలు అందించాడు. హైదరాబాద్‌లో ప్రభుత్వంలో అసిస్టెంట్ ఇంజనీరుగా చేరినపుడు ఆయన వేతనం రూ.400, పదవీ విరమణ సమయంలో ఆయన వేతనం రూ.3350.

నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ నిర్వహించిన పదవులు
- అసిస్టెంట్ ఇంజనీర్ - గుల్బర్గా జిల్లా
- అసిస్టెంట్ ఇంజనీర్ - మహబూబ్‌నగర్ జిల్లా
- అసిస్టెంట్ ఇంజనీర్ - మెదక్ జిల్లా
- అసిస్టెంట్ ఇంజనీర్ - వరంగల్ జిల్లా
- అసిస్టెంట్ ఇంజనీర్ - హైదరాబాద్ మున్సిపాలిటీ
- అసిస్టెంట్ సూపరింటెండింగ్ ఇంజనీర్, సాగునీరు
- ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, సాగునీరు- హైదరాబాద్
- సూపరింటెండింగ్ ఇంజనీరు, సాగునీరు- హైదరాబాద్
- చీఫ్ ఇంజనీరు, సెక్రెటరీ, పి.డబ్ల్యూ.డి., సాగునీరు (1918 నుండి 1937 దాకా)
- నిజాం వ్యక్తిగత కన్సల్టింగ్ ఇంజనీర్ (1937-1938)

నవబ్ అలీ నవాజ్ జంగ్ రూపకల్పన చేసిన/నిర్మించిన ప్రాజెక్టులు
- ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ (హైదరాబాద్)
- పోచారం ప్రాజెక్టు, నిజాంసాగర్ ప్రాజెక్టు (నిజామాబాద్ జిల్లా)
- వైరా ప్రాజెక్టు, పాలేరు ప్రాజెక్టు (ఖమ్మం జిల్లా)
- ఢిండీ ప్రాజెక్టు, రాయనిపల్లి, సింగభూపాలం, తుంగభధ్ర కొయిల్ సాగర్ (మహబూబ్‌నగర్ జిల్లా)
- కడెం ప్రాజెక్టు (ఆదిలాబాద్ జిల్లా)


- మూసీ ప్రాజెక్టు (నల్లగొండ జిల్లా)
- చంద్రసాగర్ ప్రాజెక్టు (నల్లగొండ జిల్లా)
- రాజోలిబండ ప్రాజెక్టు (మహబూబ్‌నగర్ జిల్లా)
-పోచంపాడు ప్రాజెక్టు (నిజామాబాద్ జిల్లా)
- నందికొండ ప్రాజెక్టు (నల్లగొండ జిలా)
- పెండ్లిపాకు ప్రాజెక్టు (నల్లగొండ జిల్లా)
- సరళాసాగర్ ప్రాజెక్టు (మహబూబ్‌నగర్ జిల్లా)
- పూర్ణా ప్రాజెక్టు (మహారాష్ట్ర)
- భీమా ప్రాజెక్టు (మహబూబ్‌నగర్ జిల్లా)
-దేవనూరు ప్రాజెక్టు (మెదక్ జిల్లా)
- పెన్‌గంగ ప్రాజెక్టు (మహారాష్ట్ర)
- ఇచ్చంపల్లి ప్రాజెక్టు (కరీంనగర్ జిల్లా)
-లోయర్ మానేరు ప్రాజెక్టు (కరీంనగర్ జిల్లా)

-ముప్పయి ఏండ్ల తన సుధీర్ఘ ఉద్యోగ ప్రస్థానంలో 18 ఏండ్లు చీఫ్ ఇంజనీరు, సెక్రెటరీగా పనిచేసిన రికార్డు అలీ నవాజ్ జంగ్‌దే. ఈ పదవీ కాలంలో ప్రజాపనుల విభాగాన్ని పటిష్టమైన పునాదులపై నిలిపాడు. ఆయన నేతృత్వంలో హైదరాబాద్ రాజ్యంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, వంతెనలు, భవనాలు నిర్మితమైనాయి. ప్రజాపనుల విభాగంపై తనదైన ముద్రను వేశాడు. ఆయన సాధించిన విజయాలకు హైదరాబాద్ రాజ్యంలోనే కాదు భారతదేశంలోనూ గుర్తింపు వచ్చింది. ఆయన ప్రదర్శించిన సాంకేతిక నైపుణ్యాన్ని భారత ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తించి తమ రాష్ట్రాలలోని ప్రాజెక్టుల రూపకల్పనలలో, నిర్మాణ సమస్యలపై సంప్రదింపులు, సలహాల కోసం ఆహ్వానించేవి. అట్లా అలీ నవాజ్ జంగ్ సలహాలు సూచనలతో బొంబాయి, బీహార్, ఒరిస్సా, మద్రాసు, సింద్ రాష్ట్రాలు తమ రాష్ట్రాలలో సాంకేతిక సమస్యలను అధిగమించాయి.
1938లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్లానింగ్ కమిటీ జవహర్‌లాల్ నెహ్రూ చైర్మన్‌గా ఏర్పాటైంది. ఈ ప్లానింగ్ కమిటి ‘సాగునీరు, నదుల మళ్లింపు’ తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు ఒక సబ్ కమిటీని నియమించింది. ఆ కమిటికి నవాబ్ అలీ నవాజ్ జంగ్ చైర్మన్‌గా నియమితులు కావడం ఆయన ప్రతిభకు నిదర్శనం. అలీ నవాజ్‌జంగ్ నేతృత్వంలోని సబ్ కమిటీ నదీ జలాల వినిమోగంపై, తాగునీటి పథకాలపై, జల విద్యుత్ పథకాలపై, వరద నియంవూతణ పథకాలపై, జలరవాణా పథకాలపై, కాలువలు, చిన్న నీటి చెరువుల నిర్మాణాలపై సమక్షిగమైన నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో మూడు విభాగాలున్నాయి. మొదటిది భారతదేశంలో సాగునీటి పథకాల నిర్మాణం, రెండవది నదుల మళ్లింపు-వరద నియంవూతణ పథకాలు, మూడవది జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం.

అలీ నవాజ్ జంగ్ ఇతర నిర్మాణాలు
నవాబ్ అలీ నవాజ్ జంగ్ సాగునీటి రంగంలోనే కాదు రోడ్లు, భవనాలు రైల్వేలు, టెలిఫోన్లు, వంతెనలు తదితర ఇతర రంగాలలో తన ప్రతిభను చాటుకున్నాడు. గోదావరి, కృష్ణా వంటి పెద్ద నదులపై ఆయన హయాంలో నిర్మితమైన రాతి వంతెనలు వందల సంవత్సరాలు సేవలందించాయి. గోదావరి నదిపై ఆదిలాబాల్ జిల్లా సోన్ గ్రామం వద్ద నిర్మితమైన వంతెన రెండేండ్ల కింద కొత్త వంతెన నిర్మించేదాకా సేవలందించింది. దాన్ని ఇప్పటికీ ‘అలీ నవాజ్ జంగ్ బ్రిడ్జి’గా పిలుస్తారు.

భవన నిర్మాణ రంగంలో ఆయన ప్రతిభకు తార్కాణాలు 
- ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ భవనం, హాస్టల్ భవనాలు.
-ఉస్మానియా జనరల్ ఆసుపత్రి భవనం (1933-34).
- ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్.
- ఫతేమైదాన్‌లో మహబూబియా గ్రాండ్ స్టాండ్.
- పబ్లిక్ గార్డెన్స్‌లోని ఉస్మానియా జూబ్లీహాలు.
- అఫ్జల్‌గంజ్‌లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ భవనం.
- మక్కా మసీదు దగ్గర సదర్ నిజామియా షఫాఖానా.
- మహబూబియా బాలికల పాఠశాల.
- నాందేడ్ సివిల్ హాస్పిటల్.
- సైన్యం కోసం రెండవ లాన్సర్స్ బిల్డింగ్స్, కేవలరీ ట్రెయినింగ్ స్కావవూడన్, చాంద్రాయణ గుట్ట, మల్లేపల్లి లైన్స్.
- నిజాంసాగర్, నిజాం చక్కెర కర్మాగారం.

సాగునీటి రంగంలో, నిర్మాణ రంగంలో ఆయన ప్రతిభావంతుడన్న దానికి తిరుగులేని నిదర్శనాలు పైన చూశాం. ఆయన ముందు చూపు కలిగిన ఓ ఆర్థికవేత్త, గొప్ప పరిపాలనాదక్షుడు కూడా. నిజామాబాద్ జిల్లా ముఖచిత్రాన్ని మార్చివేసిన రెండు ప్రధాన నిర్మాణాలకు అలీ నవాజ్‌జంగ్ దార్శనికతే కారణం. అవి మంజీరా నదిపై నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు, బోధన్‌లో నిర్మించిన నిజాం చక్కెర కర్మాగారం. 2,75,000 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలిగించడానికి మంజీరాపై నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు 1933 నాటికే పూర్తయ్యింది. మొత్తం హైదరాబాద్ రాజ్యంలోనే నిజామాబాద్ జిల్లా ఈ ప్రాజెక్టు కారణంగా సంపద్వంతమైన జిల్లాగా మారింది. మొత్తం దేశానికి, తెలంగాణకు గర్వకారణంగా రూపొందించిన నిజాం చక్కెర కర్మాగారం ఆనాటికే ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్యాక్టరీ. దీనికి అవసరమయ్యే చెరుకును పండించడానికి నిజాం కాలువల కింద వందల ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. చంద్రబాబు నాయుడు అమలు పరిచిన ప్రైవేటీకరణ విధానాలతో నిజాం చక్కెర కర్మాగారం మూతపడింది. నిజాంసాగర్ ప్రాజెక్టులో భాగంగా అలీసాగర్ బ్యాలెన్సింగ్ జలాశయం కూడా నిర్మితమైంది. అది అలీ నవాజ్ జంగ్ పేరుమీద ‘అలీసాగర్’గా ప్రసిద్ధి చెందింది.

నిజామాబాద్ జిల్లాకు ఇంత అద్భుతమైన కానుకనిచ్చిన అలీ నవాజ్ జంగ్ విగ్రహం నిజాంసాగర్ ప్రాజెక్టు వద్దనో, ఆయన పేరు మీదనే పిలువబడుతున్న అలీసాగర్ జలాశయం వద్దనో లేకపోవడం కృతజ్ఞతా రాహిత్యమే అవుతుంది. ప్రభుత్వ పెద్దలు ఆ పని ఎట్లాగూ చెయ్యరు. ఇది నిజాంసాగర్ ఆయకట్టు రైతులు, నిజామాబాద్ జిల్లా ప్రజలు పూనుకొని చెయ్యవలసిన కార్యం. ధవళేశ్వరం వద్ద, గోదావరి ఆనకట్ట వద్ద సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం ఉన్నప్పుడు నిజాంసాగర్ వద్దనో, అలీసాగర్ వద్దనో అలీ నవాజ్ జంగ్ విగ్రహం ఉండొద్దా? అక్కడే కాదు, ఆయన విగ్రహం టాంక్‌బండ్‌పైనా సర్ ఆర్థర్ కాటన్ సరసన, ఎర్రమంజిల్‌లోని జలసాధనలో కూడా తప్పనిసరిగా నెలకొల్పాలి.

ఇప్పటిదాకా అలీ నవాజ్ జంగ్‌కి దక్కిన గౌరవం ఒక్కటే. మే నెల 1966లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, ఆంధ్రవూపదేశ్ స్టేట్ సెంటర్, ఖైరతాబాద్‌లో ఆయన చిత్రపటాన్ని వేలాడదీయడం. ఆ కార్యక్షికమానికి ఆనాటి కేంద్ర మంత్రి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ (మాజీ రాష్ట్రపతి) వచ్చి చిత్రపటాన్ని ఆవిష్కరించాడు. ప్రముఖ ఇంజనీరు కె.ఎల్.రావు అధ్యక్షత వహించిన ఆ సభలో ప్రముఖ తెలంగాణ నాయకులు కె.వి. రంగాడ్డి డా॥ అక్బర్ అలీఖాన్‌లు అలీ నవాజ్ జంగ్ సేవలను కొనియాడుతూ ప్రశంసించారు.
6 డిసెంబర్ 1949న అలీ నవాజ్ జంగ్ చివరి శ్వాస విడిచినప్పుడు ఆయన అంతిమయావూతలో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌తో పాటు అనేకమంది ప్రముఖులు పాల్గొని నివాళులర్పించారు.
తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం సందర్భంగా పురాతన తవ్వకాలలో దొరికిన, తెలంగాణ గర్వించదగిన కోహినూర్ వజ్రం నవాబ్ అలీ నవాజ్ జంగ్. ఆయన జీవితం, ఆయన సాధించిన విజయాలు తెలంగాణ ఇంజనీర్లకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి. దానితోనే తెలంగాణ సర్వీసు ఇంజనీర్లు , ఇంజనీర్లు (అ)విక్షిశాంత ఇంజనీర్లు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమవుతున్నారు. ఆయన సమున్నత వారసత్వాన్ని కొనసాగించడానికి వారంతా సమాయత్తమవుతున్నారు.

వరద జలాల అంచనాకు ఫార్ములా
భారతదేశంలోని నదులపై గరిష్ట వరద ప్రవాహం అంచనాకు అత్యంత సాధారణంగా ఉపయోగించేవి డికెన్స్ ఫార్ములా, రైవ్స్ ఫార్ములా. ఈ ఫార్ములాలను ఉపయోగించి లెక్కించిన గరిష్ట వరద ప్రవాహం అంచనా వాస్తవ వరద ప్రవాహం పరిమాణానికి చాలా పెద్ద అంతరం ఉండటం అలీ నవాజ్ జంగ్ గమనించాడు. ఈ సూత్రాలకున్న పరిమితుల కారణంగానే ఈ అంతరాలున్నట్లు గమనించి వాస్తవ పరిస్థితులకు సరిపోయే విధంగా ఒక ఫార్ములాను అలీ నవాజ్‌జంగ్ రూపొందించారు. ఇదే ‘అలీ నవాజ్‌జంగ్ ఫార్ములా’గా ప్రసిద్ధి చెందింది. హైడ్రాలజీ పాఠ్యపుస్తకాలలో ఈ ఫార్ములాను డికెన్స్, రైన్స్ ఇతర ఫార్ములాల సరసన చేర్చి విద్యార్థులకు బోధిస్తారు.

తను రూపొందించిన ఫార్ములా సమర్థతను డింఢీ ప్రాజెక్టు గరిష్ట వరద ప్రవాహాన్ని అంచనా కట్టి, మిగతా ఫార్ములాల కన్న తన ఫార్ములా వాస్తవిక వరద జలాల పరిమాణానికి ఎంత దగ్గరగా ఉందో నిరూపించాడు. డింఢీ డ్యాం స్థలం వద్ద 1513 చదరపు మైళ్ల పరీవాహక విస్తీర్ణం కలిగి ఉన్న ఢిండీ నదిలో గరిష్ట వరద ప్రవాహం 2,76,000 క్యూసెక్కులని తేలింది. అలీ నవాజ్‌జంగ్ ఫార్ములాతో లెక్కిస్తే అది 2,71,500 క్యూసెక్కులు.

హైదరాబాద్ రాజ్యంలోని దాదాపు అన్నీ చిన్న, పెద్ద నదులపై అలీ నవాజ్ జంగ్ సర్వేలు చేశాడు. నివేదికలు సిద్ధం చేసి ఉంచాడు. ఏ నదిపైన ఎప్పుడైనా నివేదిక అందించడానికి సిద్ధంగా ఉండేవాడు. ఉదాహరణకు 1951లో ప్లానింగ్ కమీషన్ కృష్ణానదిపై నందికొండ ప్రాజెక్టు ప్రాథమిక నివేదికను ఇమ్మని అడిగినప్పుడు అప్పటికే అలీ నవాజ్ జంగ్ కృష్ణానదిపై సంపూర్ణమైన సర్వేలు చేసి ఉన్నాడు. ఆయన ఆనాటికి బతికి లేకున్నా నెలరోజుల్లోనే ప్లానింగ్ కమీషన్‌కు ప్రాజెక్టు ప్రాథమిక నివేదికను హైదరాబాద్ ఇంజనీర్లు అందించగలిగారు. పోచంపాడ్ ప్రాజెక్టుపై అప్పర్ కృష్ణా ప్రాజెక్టుపైన కూడా అలీ నవాజ్ జంగ్ జరిపి ఉంచిన సర్వేలు తర్వాత కాలంలో ఆ ప్రాజెక్టుల రూపకల్పనలో ఎంతగానో ఉపయోగపడ్డాయి.

ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ చెరువుల నిర్మాణం
1908లో మూసీనదికి వచ్చిన వరదలు, హైదరాబాద్ నగరంలో అవి సృష్టించిన బీభత్సం, సంభవించిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అందరికీ తెలిసిందే. 28 సెప్టెంబర్ 1908న మూసీకి వచ్చిన వరద ఇప్పటికీ రికార్డే. ఆ వరద బీభత్సానికి మూసీ దక్షిణపు ఒడ్డున అర చదరపు మైలు విస్తీర్ణంలో సుమారు 19 వేల ఇండ్లు కూలిపోయాయి. 8000 వేల మంది నిరాక్షిశయులయ్యారు. మూడు కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. పది నుండి పదిహేను వేల మంది వరదల్లో కొట్టుకుపోయి, చనిపోయినట్లు అంచనా. మూసీకి తరచుగా వస్తున్న వరదల నియంవూతణకు నివారణా చర్యలు సూచించమని మోక్షగుండం విశ్వేశ్వరయ్యని ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్‌కు ఆహ్వానించాడు. హైదరాబాద్ విచ్చేసిన విశ్వేశ్వరయ్య తనకు సహాయకారిగా ఉండేందుకు ఎంపిక చేసుకున్న ఇంజనీర్లలో ప్రథముడు కూపర్ హిల్ విద్యార్థి అయిన అలీ నవాజ్ జంగ్. అప్పటికే ఆయన ప్రజాపనుల శాఖకు చీఫ్ ఇంజనీరుగా (సాగునీరు) వ్యవహరిస్తున్నాడు. వారిద్దరి మేథో మధనంలోంచి ఉద్భవించినవే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చెరువులు. ఈ రెండు చెరువులు మూసీ నదిలో వరదలని నియంవూతించడమే కాక నగరానికి శాశ్వత తాగునీటి వనరులుగా ఇప్పటికీ సేవలందిస్తున్నాయి.
ఉస్మాన్‌సాగర్ చెరువు మూసీనదిపై, హిమాయత్‌సాగర్ చెరువు మూసీకి ఉపనది అయిన ఈసీపై ప్రతిపాదించారు. ఉస్మాన్‌సాగర్ పేరు నిజాంమీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ పేరుతో, హిమాయత్‌సాగర్‌ను బేరార్ రాకుమారుడు హిమాయత్ అలీఖాన్ బహదూర్ పేరుతో నిర్మించారు.
                                                                 -బతుకమ్మ నుండి.       
వ్యాసకర్త తెలంగాణ ఇంజనీర్స్ జెఏసి కో-చైర్మెన్. మొబైల్: 94910 60585
- శ్రీధరరావు దేశ్‌పాండే