హోం

9, సెప్టెంబర్ 2013, సోమవారం

నిజం నిప్పులాంటిది


హైద్రాబాద్ రెవిన్యూ – నిజా నిజాలు: 

‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన ఖాయం, వెనక్కి వెళ్ళేది లేదు’ అని కాంగ్రెస్ అధినాయకులు స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీమాంధ్ర నాయకులు హైద్రాబాద్ సెంటిమెంటును తమ ప్రాంత ప్రజల్లో విస్తృతంగా ప్రవేశపెట్టారు. దశాబ్దాల తరబడి సీమాంధ్రులు రాజధానిని అభివృద్ధి చేశారని, ఇప్పుడు వెళ్లమంటే ఎలా వెళ్తాం అని పెట్టుబడిదారులు, భూస్వాములు వాదిస్తున్నారు. వారి వాదనలను ప్రజలు కూడా మోస్తున్న పరిస్ధితి కనిపిస్తోంది.
‘హైద్రాబాద్ రెవిన్యూ ఆదాయం ఎలా పోగొట్టుకుంటాం?’ అన్న సూపర్ ధనికుల ప్రశ్నకు పై రూపమే ‘హైద్రాబాద్ సెంటిమెంటు.’ రాష్ట్ర ఆదాయంలో హైద్రాబాద్ నుండి వచ్చే ఆదాయమే 50 శాతం అని కొందరు చెబుతుంటే మరి కొందరు 70 శాతం అని చెబుతున్నారు. ఇంత ఆదాయాన్ని కోల్పోతే సీమాంధ్ర ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం కూడా కష్టం అవుతుందని అనేకమంది బలంగా వాదిస్తున్నారు. దానితో ఉద్యోగులు భయాందోళనలతో సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇస్తూ అందులో పాల్గొంటున్నారు.
రాష్ట్ర విభజన ద్వారా సీమాంధ్ర ఉద్యోగులకు జీతాలు లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుందా? ఇంత పిచ్చి పనికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుందా? ఇందులో వాస్తవాలు విచారించడం అవసరం. రాష్ట్ర విభజన సందర్భంగా అయినా రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయ వ్యయాల పైన చర్చ జరగడం ఒక ఆహ్వానించదగిన పరిణామం కాగా, ఆ చర్చ ఆరోగ్యకరమైన రీతిలో కాకుండా అపోహలతో, విద్వేషపూర్వక వాతావరణంలో జరగడం దురదృష్టకరం!
కొన్ని అంశాలు చూద్దాం.
1..రాష్ట్రాల ఆదాయం ప్రధానంగా పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రం పన్నుల ఆదాయంలో వాటా, గ్రాంట్ ఇన్-ఎయిడ్ ల మొత్తం.
2. విభజన ప్రభావం కేంద్ర పన్నుల వాటా, పన్నేతర ఆదాయం (ప్రభుత్వ భూముల అమ్మకంపై వచ్చే ఆదాయం), గ్రాంట్-ఇన్-ఎయిడ్ లపైన ఉండదు. పైగా సీమాంధ్రలో కొత్త రాజధాని వల్ల రియల్ ఎస్టేట్ ఆదాయం పెరుగుతుంది కనుక పన్నేతర ఆదాయం పెరుగుతుంది. హైద్రాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోతుంది గనక ఆ ఎరకు తెలంగాణ పన్నేతర ఆదాయం తగ్గుతుంది.
3. విభజన ప్రభావం ఉండేది రాష్ట్ర పన్నుల ఆదాయం పైనే.
4. అమ్మకపు పన్ను, ఎక్సైజ్ పన్ను, స్టాంపులు & రిజిస్ట్రేషన్, వాహన పన్ను... ఇవే రాష్ట్ర పన్నుల ఆదాయంలో ప్రధానం (98 శాతం). ఇవి జిల్లాల్లోనే వసూలవుతాయి గనక విభజన తర్వాత ఎవరివి వారికే చెందుతాయి.
5. 2003-06 మధ్య కాలంలో గ్రేటర్ హైద్రాబాద్ సగటు సాంవత్సరిక పన్నుల ఆదాయం 7,704 కోట్లు అని, రాష్ట్ర పన్నుల ఆదాయంలో ఇది 37 శాతం అని అప్పటి ఆర్ధిక మంత్రి రోశయ్య గారు శాసనసభలో ఒక సభ్యుడి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. (ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఆగస్టు 28, 2013).
6. 2012-13 లో రాష్ట్ర పన్నుల ఆదాయం 66,021 కోట్లు.
7. రోశయ్య గారు చెప్పినట్లు ఇందులో 37 శాతం అంటే 24,428 కోట్లు.
8. గ్రేటర్ హైద్రాబాద్ అంటే హైద్రాబాద్ నగరం మాత్రమే కాదు. ఇందులో 54 లక్షల జనాభా నివసించే హైద్రాబాద్ తో పాటు సంగారెడ్డి, భువనగిరి మునిసిపాలిటీలు, 849 అర్బన్ గ్రామాలు కూడా ఉన్నాయి. వీటి జనాభా 19 లక్షలు. ఇవి రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల పరిధిలోనివి.
9. ఈ పన్నుల ఆదాయం కూడా మొత్తం హైద్రాబాద్ కి చెందినవి కాదు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అమ్మకాలు జరిపే కంపెనీలు హైద్రాబాద్ లో రిజిస్టర్ అయి ఉన్నాయి. అంటే రాష్ట్ర వ్యాపితంగా అమ్మకాలు జరిపినా, పన్ను (APGST) మాత్రం హైద్రాబాద్ డివిజన్ లో కడతారు.
10. రాష్ట్రం విడిపోయాక ఆయా కంపెనీలు హైద్రాబాద్ లోనే కొనసాగితే అవి సీమాంధ్రలో జరిపే అమ్మకాలు అంతర్రాష్ట్ర అమ్మకాలు అవుతాయి. కాబట్టి వాటిపైన కేంద్ర పన్నులు ఉంటాయి తప్ప తెలంగాణ రాష్ట్ర పన్నులు కాదు.
11. కంపెనీలు తమ రిజిష్ట్రేషన్ ను సీమాంధ్ర రాజధానికి మారిస్తే అవి తెలంగాణలో జరిపే అమ్మకాలపై కూడా కేంద్ర పన్నులు వర్తిస్తాయి తప్ప సీమాంధ్ర రాష్ట్ర పన్నులు కాదు.
12. కంపెనీలు తమకు ఏ పన్నులు తక్కువో బేరీజు వేసుకుంటాయి. కేంద్ర పన్నులా, తెలంగాణ పన్నులా లేక సీమాంధ్ర పన్నులా... ఇందులో ఏది తక్కువో తేల్చుకుని ఆ మేరకు రిజిస్ట్రేషన్ మార్చుకుంటాయి. కొత్తగా వచ్చే సీమాంధ్ర రాష్ట్రం తగిన సౌలభ్యం కల్పిస్తే ప్రాంతంతో సంబంధం లేకుండా కంపెనీలు తమ రిజిస్టర్డ్ కార్యాలయాల్ని మార్చుకుంటాయి.
13. కాబట్టి కొత్తగా వచ్చే ఇరు రాష్ట్రాలు కేంద్రంతో చర్చలు జరిపి తగిన రాయితీలు తెచ్చుకోడానికి పోరాడాలి తప్ప తమలో తాము తగువు పడడం సరికాదు. రాష్ట్ర విభజన వలన అదనపు రెవిన్యూ ఆదాయం ద్వారా లబ్ది పొందేదీ కేంద్రమే తప్ప తెలంగాణ కాదని ఇక్కడ అర్ధం అవుతోంది.
14. పైగా సీమాంధ్ర కొత్త రాజధాని ఏర్పడే క్రమంలో అక్కడ ఉత్పాదక కార్యకలాపాలు వేగం అవుతాయి. అంటే జి.డి.పి వృద్ధి రేటు ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా కొత్త రాష్ట్రానికి పన్నుల ఆదాయం కూడా వేగంగా పెరుగుతుంది. ప్రారంభంలో కొన్నేళ్లపాటు సీమాంధ్ర రాజధానిలో రియల్ ఎస్టేట్ మార్కెట్ అభివృద్ధి అయితే, హైద్రాబాద్ లో పడిపోతుంది. అనంతరం స్ధిరీకరణ చెందుతుంది.
15. సీమాంధ్రకు 973 కి.మీ పొడవైన సముద్ర తీరం ఉంది. దేశంలో గుజరాత్ తర్వాత సీమాంధ్ర కోస్తా తీరమే పొడవైనది. దీన్ని అభివృద్ధి చేసుకుంటే బోలెడంత రెవిన్యూ. రామాయపట్నం రేవుకి ఇప్పటికే కేంద్రం అనుమతి ఇచ్చింది. దీనికి అనుబంధంగా అనేక వ్యాపారాలు జరుగుతాయి. తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది.
16. హైద్రాబాద్ ఐ.టి ఉద్యోగాలు మిస్ అవుతాయనీ, ఆ ఉద్యోగాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా కోల్పోతామని కొందరు చెబుతున్నారు. ఆ లెక్కన బెంగుళూరులోనూ తెలుగువారు అత్యున్నత ఐ.టి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ ఆదాయం మనకే రావాలని అడగొద్దా? మద్రాసు, ఢిల్లీ నగరాల్లోనూ తెలుగువారు ఉద్యోగాలు చేస్తున్నారు. అమెరికా, ఐరోపాల్లోనూ చేస్తున్నారు. అక్కడి ఆదాయాల్లో వాటా వద్దా? ఎద్దు ఈనిందంటే దూడని కట్టెయ్యమన్నట్లు ఈ వాదన ఉంటుంది. సీమాంధ్ర రాష్ట్రంలో ఆదాయాలు పెంచుకునే మార్గం చూడడం మాని వాళ్ళ ఆదాయం మనకి కావాలనడం అన్యాయం కాదా?
17. విభజన వల్ల ఒక తరం నష్టపోతుందని ఎ.పి.ఎన్.జి.ఓ నేత చెబుతున్నారు. అంటే ఆ తర్వాత తరాలకు నష్టం ఉండదు అన్న అంగీకారం ఇందులో ఉంది. కానీ 60 యేళ్లుగా (అంటే మూడు తరాలా?) నీళ్ళు, ఉద్యోగాలు లేక తెలంగాణ జనం ఎదుర్కొన్న నష్టం మాటేమిటి?

                                            
                                                     -విజయశేఖర్ గారు
                                                                                    ' జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు ' బ్లాగ్ నుంచి 

8, సెప్టెంబర్ 2013, ఆదివారం

ఆట కాంగ్రెస్ ది - మరి వేట(ఓట్లు) ?


తెలంగాణా రాష్ట్రము ఏర్పదనుందా ..? కాంగ్రెస్ ఇస్తుందా..? బిజేపీ ఇస్తుందా ..? నిజంగా కాంగ్రెస్ కు  తెలంగాణా ఇచ్చే ఉద్దేశ్యమే ఉంటె సీమంద్రలో ఈ లోల్లంత ఎందుకు..? సోనియా చెప్పందే ఏ పని చెయ్యని నల్లారి  వారికి సి డబ్ల్యు సి నిర్ణయాన్ని వ్యతిరేకించే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ..? సీమంద్రలో కిరణ్ ను స్ట్రాంగ్ చెయ్యడానికి కాంగ్రెస్ ఆడుతున్న నాటకమే సీమంద్రలో జరుగుతున్న ఆందోళనలు... ?
* 12 ఏళ్ళుగా గుర్తురాని ప్రజల ఆకాంక్ష కాంగ్రెస్ కు సరిగా ఎలక్షన్లకు ఏడాది ముందే ఎందుకు గుర్తుకు వచ్చింది..?
* అది మోడీ సభకు 10 రోజుల ముందే తీర్మానం ఆగ మేఘాల మీద ఎందుకు చెయ్యవలసి వచ్చింది..? 

జూలై 30 తెలంగాణా తీర్మానం చెయ్యడం ద్వార కాంగ్రెస్ పొందిన లాభాలు:- 

* వై కాపా తెలంగాణా లో కాలి అయ్యింది. 
* నరేన్ద్ర మోడికి నవభారత యువభేరి లో చెప్పడానికి ఏమి లేకుండా పోయింది. బి జీ పీ ని ఎదగకుండా దెబ్బకొట్ట గలిగారు. 
*  అంతవరకు కె సి అర్ దగ్గరకు కాంగ్రెస్ వచ్చే పరిస్థితి కాని ఒక్కసారి ప్రకటన రాగానే కాంగ్రెస్ దగ్గరికే కె సి అర్ వెళ్ళాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది. 
* సమైక్యంద్ర ఉద్యమాన్నిలెవదీయడం తో చంద్ర బాబు ఇరుకునపడ్డాడు, రెండు రాష్ట్రాలుంటే తప్పేంటి అన్న చంద్ర బాబు తర్వాత గొంతు సవరించుకొని కాంగ్రెస్ను దుమ్మత్తి పొయ్యడం ప్రారంభించారు. ఎన్ డి ఎ హయాంలో రాష్ట్ర విభజనను అడ్డుకున్నది తానే అంటూ తన అసలు స్వారూపం బయటపెట్టి, సీమంధ్రుల మనసు గెలుచుకోవాలని తెగ తాపత్రయ పడుతున్నాడు. కాంగ్రెస్ ఆటలో బాబు పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యింది. 
*  హైదరాబాద్ ను UT చేస్తామనే ప్రకటనలతో MIM బయపెట్టి తనదారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. 
* సీమంద్రలో బిజేపీని శాశ్వతంగా రాకుండా చెయ్యాలనే వ్యూహంలో భాగంగా సమైక్యంద్ర ఉద్యమాన్ని పోలీస్లు, మీడియా సహాయంతో నడిపిస్తోంది. 
* బి జె పీ సీమంద్రులకు అన్యాయం జరగా కుండా రాష్ట్ర విభజన జరగాలి అంటే అలంటి ప్రకటనలను చూపించి తెలంగాణా ప్రాంతం లో ఆ పార్టీ పై అనుమానాలు కలిగేలా చేస్తోంది. 
* వై కా పా నమ్ముకున్న రాజశేకర్ రెడ్డి సానుభూతి కాస్త సమైక్యంద్ర ఉద్యమం తో కరిగిపోయింది . ఇప్పుడు వై కా పా పరిస్థితి కాంగ్రెస్ తో కలిసి సాగడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. 
ఇలా కాంగ్రెస్ ఆడుతున్న ఆటా నాదే.. వేట నాదే అంటూ ఆడుతున్న ఈ ఆటలో చివరికి వేట(ఓట్లు) ఎవరికీ దక్కుతుందో..? 

2, సెప్టెంబర్ 2013, సోమవారం

హైదరాబాద్ నగరాన్ని ఎవరు అభివృద్ధి చేశారు?


హైదరాబాద్ నగరాన్ని తెలంగాణలో ముచ్చటగా ‘పట్నం’ అంటారు. సుమారు 400 యేళ్ల నుండి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఏకైక పెద్ద ‘పట్టణం’ హైదరాబాద్. కుతుబ్‌షాహీల రాజ్యానికి తొలి రాజధాని గోలకొండ నగరం. ఈ గోలకొండ కోట ఒక గుట్టపై కాకతీయుల కాలంలో క్రీ.శ.1143లో నిర్మితమైంది. ఓరుగల్లును పాలించిన ప్రభువు కృష్ణదేవ్ దీనిని క్రీ.శ. 1363లో బహమనీ సుల్తాన్ మొదటి మహ్మద్ షాకు అప్పగించాడు. కాలక్షికమంలో అప్పటి బహమనీ సుల్తాన్ మహమూద్ క్రీ.శ.1496లో సుల్తాన్ కులీ కుతుబుల్ ముల్క్‌ను గోలకొండ తరఫ్‌దారుగా నియమించారు.
బహమనీ రాజ్యం పతనమవుతున్న కాలంలో సుల్తాన్ కులీకుతుబ్ షా (1518-1543) క్రీ.శ.1518లో స్వతంత్ర రాజై, గోలకొండను రాజధానిగా చేసుకొని, ఆ మేరకు పట్టాభిషిక్తుడైనాడు. తర్వాత ఇబ్రహీం కుతుబ్ షా నకీ.శ. 1550-1580) కాలం నాటికి గోలకొండ నగర జనాభా పెరిగిపోయింది. నీటి వసతులు సరిగా లేకుండా అంటువ్యాధులు ప్రబలినాయి. పట్టణాన్ని విస్తక్షుత పరచడం కోసం అతడు మూసీనదిపై పురానాపూల్ నిర్మించాడు.

అలా కొత్త పట్టణ నిర్మాణానికి పునాదులు వేశాడు. తర్వాత ఇబ్రహీం కుతుబ్ షా మరణానంతరం అతని కుమారుడు కులీ కుతుబ్ షా నూతన పట్టణ నిర్మాణం కోసం ఒక బృహత్ ప్రణాళికను సిద్ధం చేయించి, ఆ మేరకు మూసీనది ఒడ్డున కొత్త పట్టణాన్ని నిర్మించాడు. ఆ నూతన నగరమే ‘భాగ్యనగర్’గా, ‘హైదరాబాద్’గా పేర్గాంచింది.
మూసీనది ఒడ్డున వెలిసిన ఈ సుందర నగరాన్ని కులీ కుతుబ్ షా తన ప్రియురాలు భాగ్‌మతి (భాగ్యమతి) పేర ‘భాగ్‌నగర’మని, ‘భాగ్యనగరమని’ పిలిచాడు. హైదర్‌మహల్ అనే గౌరవనామంతో భాగ్‌మతి కులీ కుతుబ్ షా జనానాలో చేరిన తర్వాత భాగ్యనగరం హైదరాబాద్ అయ్యింది.

చార్మినార్ నిర్మాణం 
ప్రపంచ ప్రసిద్ధ సుందర నిర్మాణాలలో హైదరాబాద్ చార్మినార్ ఒకటి. నాలుగు గోపురాలతో కూడిన అందమైన చార్మినార్ క్రీ.శ.1592లో నిర్మితమైంది. చార్మినార్‌కు నాలుగు వైపులా రోడ్లు నిర్మించారు. ఈ రహదారులకు ఇరువైపుల 14,000 దుకాణాలు, మదరసాలు, మసీదులు, కారవాన్ సరాయిలు నిర్మితమైనాయి. నూతన నగరానికి మరింత తలమానికంగా ఉండేలా నడిబొడ్డున చార్మినార్ నిర్మించారు. అప్పట్లో హైదరాబాద్‌లో ప్లేగు (గత్తర) వ్యాధి వచ్చిందని, దాన్ని అరికట్టమని ప్రభువు అల్లాకు మొక్కుకోగా అది తగ్గగానే ఆ జ్ఞాపకార్థకంగా అద్భుత కట్టడం చార్మినార్ నిర్మించారని ప్రతీతి.

చార్‌కమాన్ నిర్మాణం 
చార్మినార్‌కు ఉత్తరాన 250 అడుగుల దూరంలో నాలుగు అద్భుతమైన ఎత్తయిన కమాన్‌లు క్రీ.శ.1594లో నిర్మితమైనాయి. దీనినే ‘చార్‌కమాన్’ ప్రాంతమంటారు. మహ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్, చార్‌కమాన్ కట్టడాలనే కాకుండా దారుష్‌షిఫా అనే రెండంతస్తుల జనరల్ ఆసుపవూతిని కట్టించారు. ఇందులో యునాని వైద్య కళాశాలను నిర్వహించేవారు. అనుభవం గల హకీమ్‌లను (డాక్టర్‌లను) గ్రీసు, ఇటలీ, పర్షియన్, గల్ఫ్ దేశాల నుండి పిలిపించి రోగులకు వైద్యం చేయించాడు.
1596లో బాదుషాహి అషూర్ ఖానా, 1597లో చార్మినార్ సమీపంలో జమామసీదు నిర్మితమైనాయి.

తర్వాత పాలనకు వచ్చిన మహ్మద్ కుతుబ్ షా నకీ.శ.1612-1626) మక్కామసీదు నమునాను సిద్ధపరిచి క్రీ.శ.1617లో చార్మినార్‌కు సమీపంలోనే దక్షిణ దిశలో తన స్వహస్తాలతో పునాది రాయి వేసి నిర్మాణం ప్రారంభించాడు. ఇతడు ఇస్లాం పంట్ల అమిత విశ్వాసం గలవాడు. రోజుకు ఐదుసార్లు తన 12వ ఏట నుండి తప్పకుండా నమాజు చేసిన సుల్తాన్ తర్వాత వచ్చిన అబ్దుల్లా కుతుబ్ షా, అబుల్ హాసన్ తానీషా సుల్తాన్‌ల కాలంలో కూడా మక్కా మసీదు నిర్మాణం కొనసాగింది. చివరకు 77 సంవత్సరాల తరువాత ఔరంగాజేబు హయాంలో మక్కా మసీదు నిర్మాణం పూర్తయింది.

భారతదేశంలోని పెద్ద మసీదులలో ఇదొకటి. ఇందులో పదివేల మంది ఒకేసారి ప్రార్థన చేయవచ్చు. మేస్త్రీ రంగయ్య తాపీపని సారధ్యంలో పైజుల్లా బేగ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో దీని నిర్మాణం మొదలైంది. మహ్మద్ కుతుబ్ షా మక్కా నుండి తెచ్చిన మట్టితో చేసిన కొన్ని ఇటుకలను మధ్యలోని కమాన్ పై కట్టడంలో నిలిపి నిర్మించారు. ఈ కారణంగానే దీనికి ‘మక్కామసీదు’ అన్న పేరు స్థిరపడింది.

మాసబ్‌ట్యాంక్ నిర్మాణం
మహ్మద్ కుతుబ్ షా పట్టపు రాణి హయత్ బక్షీ బేగమ్. ఆమె ఐదవ మహ్మద్ కులీ కుతుబ్‌షా తనయగా, ఆరవ సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా భార్యగా, ఏడవ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా తల్లిగా ముగ్గురు సుల్తాన్‌ల కాలంలోని రాజకీయాలలో ప్రధాన పాత్ర వహించింది. ఆమె పేరున హైదరాబాద్‌కు తూర్పున 16 కి.మీ. దూరంలో హయత్‌నగర్ నిర్మించారు.

ఆమె తన 76వ ఏట మరణించింది. ఆమెను గౌరవంగా ‘ముసాహెబ్’ అని పిలిచేవారు. ఆమె పేరిట నిర్మించిన ‘మా సాహెబ్’ చెరువే ‘మాసాబ్‌ట్యాంక్’గా పిలువబడుతోంది.
తర్వాత గోలకొండ రాజ్యానికి అబ్దుల్లా కుతుబ్ షా నకీ.శ.1626-1672) సుల్తానయ్యాడు. మహమ్మద్ కుతుబ్ షా పుత్రిక, అబ్దుల్లా కుతుబ్ షా సోదరి ఖైరాతున్నిస్సా బేగం ఆమె గురువు గౌరవార్ధమై కమాన్‌ల మసీదు కట్టించింది. ఆ మసీదు చుట్టు పెరిగిన ప్రాంతమే నేడు ఖైరతాబాద్‌గా పిలువబడుతోంది.
కుతుబ్ షాహీ సుల్తాన్‌ల, అసఫ్ జాహీ నవాబుల కాలంలో నౌబత్ పహాడ్‌పై నగారాలు మోగించి రాచఫర్మానాలు ప్రజలకు చదివి వినిపించే వారు. ‘నౌబత్’ అంటే ‘డ్రమ్’, ‘డోలు’ లేదా ‘నగారా’. పహాడ్ అంటే గుట్ట. నగారాలు మోగించి ఫర్మానాలు చదివి వినిపించే గుట్ట కనుక దీనికి ‘నౌబత్ పహాడ్’ అని పేరు వచ్చింది. ఈ నౌబత్ పహాడ్‌కు దక్షిణంగా ఫతేమైదాన్ ఉంది. ఇప్పుడీ మైదానంలోనే లాల్‌బహదూర్ స్టేడియం నిర్మితమైంది.

అబ్దుల్లా కుతుబ్ షా అనంతరం అతని అల్లుడు అబుల్ హాసన్ కుతుబ్ షా (తానీషా క్రీ.శ.1672-1687) సుల్తాన్ అయ్యాడు. ఇతడు పరిపాలనాదక్షుడు. ఇతని పాలనలోనే హిందువైన మాదన్న గోలకొండ రాజ్యానికి దివాన్‌గా పధానమంత్రి) పనిచేశాడు. మాదన్న సోదరుడు అక్కన్న సేనా నాయకుడిగా నియమింపబడ్డాడు. తానీషా కాలంలోనే అక్కన్న, మాదన్నల మేనల్లుడు కంచర్ల గోపన్న భద్రాచల ప్రాంతపు తహసీల్‌దారుగా ఉండి, అక్కడ వసూలైన రెవెన్యూ ద్వారా భద్రాచలంలో రామాలయం నిర్మించి, గోలకొండలో జైలు పాలై, కీర్తనలు రాశాడు.

క్రీ.శ.1687 జనవరి 28న మొగల్ చక్రవర్తి ఔరంగాజేబ్ స్వయంగా తన సైన్యంతో గోలకొండను ముట్టడించాడు. అబుల్ హాసన్ తానీషా బందీగా చిక్కాడు. కాలక్షికమంలో క్రీ.శ.1700లో తానీషా మరణించాడు. అలా కుతుబ్‌షాహీల వంశపాలన అంతమైంది. గోలకొండలో 170 సంవత్సరాలకు పైగా క్రీ.శ.1518 నుంచి1687 వరకు వైభవంగా పాలించిన గోలకొండ రాజ్యపు కుతుబ్ షాహీల పాలన ముగిసిన తర్వాత ఈ ప్రాంతం మొగలుల స్వాధీనంలోకి వచ్చింది. మొగలుల పాలన కింద గోలకొండ ప్రాంతం క్రీ.శ.1687-1724 వరకు ఉంది.

అసఫ్ జాహీల పాలన 
ఔరంగాజేబ్ మరణం తర్వాతి మొగల్ రాజు మహమ్మద్ షా ఆస్థానంలోని ‘నిజాముల్ ముల్క్’ (మీర్‌ఖవూమోద్దీన్) ఫక్రీర్ ఖేడ్ యుద్దంలో మొగలుల పాలనలో ఉన్న గోలకొండ ప్రాంతమైన దక్కన్‌కు సుబేదారుగా ఉన్న ముబారిజ్ ఖాన్‌ను ఓడించాడు. స్వతంత్ర రాజుగా గోలకొండలో అసఫ్‌జాహీల పాలనను క్రీ.శ. 1724లో ప్రారంభించాడు. ‘నిజాముల్ ముల్క్’గాని ‘ఆసఫ్‌జాహీ’గాని మొగలు ప్రభువులు మీర్‌ఖవూమోద్దీన్‌కు ఇచ్చిన బిరుదులు. అలా దక్కన్ ప్రాంతానికి నిజాముల్ ముల్క్ మొదటి అసఫ్‌జాహీ ప్రభువు. అతడు 1748 వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు.

అసఫ్ జాహీ ప్రభువులు హైదరాబాద్ రాష్ట్రం దక్కన్ ప్రాంతాన్ని సుమారు 225 సంవత్సరాలు పరిపాలించారు. మొదటి అసఫ్‌జా నిజాముల్ ముల్క్ మరణానంతరం అతని వారసులు నాసర్‌జంగ్, సలాబత్‌జంగ్ క్రీ.శ.1748-1762 వరకు పాలించారు. తర్వాత రెండవ అసఫ్‌జా నిజాం అలీఖాన్ క్రీ.శ. 1762-1803 వరకు పాలించాడు. మూడవ అసఫ్‌జాహీ ప్రభువు సికిందర్‌జా నకీ.శ. 1803-1829) పేరు మీదే హైదరాబాద్‌తో పాటు అభివృద్ధి చెందిన ప్రాంతానికి ‘సికింవూదాబాద్’ అనే పేరు వచ్చింది.
నాల్గవ నిజాం ప్రభువు నసీరుద్దీలా అసఫ్‌జా నకీ.శ.1829-1857) కాలంలో క్రీ.శ.1853-1854 మధ్య ‘దారుల్ ఉల్మ్’ పాఠశాలను స్థాపించారు. క్రీ.శ.1853లోని అప్పటి దివాన్ సాలార్‌జంగ్ 1853లో కేంద్ర ట్రెజరరీ, 1856లో స్టాంపు కాగితాల కార్యాలయాలను ఏర్పాటు చేశారు. అయిదవ నిజాం ప్రభువు అఫ్జల్‌ద్దౌల కాలంలో అఫ్జల్‌గంజ్ మసీదు, అఫ్జల్‌గంజ్ బజారు, అఫ్జల్‌గంజ్ బ్రిడ్జిల నిర్మాణాలు జరిగాయి.

ఆరవ నిజాం ప్రభువు మీర్ మహబూబ్ అలీఖాన్ నవాబుకు గుర్రాలపై మక్కువ ఎక్కువ. అతడు గుర్రపు స్వారీలో దిట్ట. 1879లో మలక్‌పేట్‌లోని అశ్వశాల, గుర్రాల రేస్ కోర్స్‌ను ఏర్పాటు చేశాడు. 1869లో నిజాం స్టేట్ రైల్వేశాఖ స్థాపితమైంది. ఇదే సమయంలో విద్యావ్యాప్తికి కూడా కృషి జరిగింది. 1870లో ఒక ఇంజనీరింగ్ కళాశాల స్థాపితమైంది. 1870లో సిటీ హైస్కూల్, 1872లో ఛాదర్‌ఘాట్ హైస్కూల్, 1878లో మదరసె ఆలియా, 1884లో నిజాం కళాశాల, 1910లో మహబూబియా బాలికల పాఠశాల స్థాపించబడ్డాయి. 1880లో తపాల శాఖ ఏర్పాటు చేయబడింది.

1892లో అసఫియా లైబ్రరీ ఏర్పాటైంది. 1893లో దివాన్‌వ వికారుల్ ఉమ్రా నిర్మించిన అందమైన ఫలక్‌నుమా ప్యాలెస్‌ను ఆరవ నిజాం 1897లో అతని నుండి కొన్నాడు. సాలార్‌జంగ్ సలహాపై ఐదవ నిజాం 1864లోనే పబ్లిక్ గార్డెన్ స్థలాన్ని సేకరించి, అభివృద్ధి పరిచారు. దానిలో మీర్ మహబూబ్ అలీఖాన్ ప్రభువు 1905లో తన 40వ జన్మదిన సందర్భంగా టౌన్‌హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలా ఆ అందమైన భవనం 1913లో పూర్తయింది. అదే నేటి అసెంబ్లీ భవనం.

1910లోనే హైద్రాబాద్ విద్యుత్ శక్తి శాఖ ఏర్పాటు చేయబడింది. జనరేటర్ల ద్వారా విద్యుత్ దీపాలు జంట నగరాలలో వెలిగింప బడినాయి. ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ మరణించగానే అతని కుమారుడు మీర్ ఉస్మాన్‌ఖాన్ క్రీ.శ.1911 ఆగస్ట్ 29న ఏడవ నిజాంగా ప్రకటించబడ్డాడు. అతని కాలంలోనే ప్రధానమంవూతిగా పనిచేసిన మూడవ సాలార్‌జంగ్ 1914లో రాజీనామా చేసి నాలుగు దశాబ్దాలు ప్రపంచంలోని విలువైన, అందమైన, అద్భుతమైన వస్తువులను సేకరించి, విశ్వవిఖ్యాతమైన ‘సాలార్‌జంగ్ మ్యూజియం’ను తన నివాసమైన దివాన్ దేవిడీలో ఏర్పాటు చేశాడు.

ఏడవ నిజాం కాలంలోనే హైదరాబాద్ రాజ్యం సర్వతోముఖాభివృద్ధి సాధించింది. ఈ నిజాం కాలంలోనే అనేక సంస్కరణలు ప్రవేశ పెట్టబడినాయి. 1914లో పురావాస్తు శాఖ ఏర్పాటయ్యింది. 1919లో నూతన రాజ్యంగంతో ఒక కార్యనిర్వాహక మండలి ఏర్పడింది. 1922లో న్యాయశాఖ ఇతర శాఖల నుండి వేరు చేయబడింది. 1927లో ఉస్మానియా మెడికల్ కాలేజ్, 1924లో ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటైనాయి. 1930లో రాష్ట్ర పురావస్తు ప్రదర్శన శాల ఏర్పాటైంది. 1932లో విమాన సర్వీసుల బోర్డు స్థాపితమైన తర్వాత 1935లోనే విమానాక్షిశయం హైదారాబాద్‌లో ఏర్పడింది.

1933లో కోఠీలోని బ్రిటిష్ రెసిడెన్సీని ఆంగ్లేయులు తిరిగి నిజాం ప్రభుత్వానికి అప్పగించారు. అప్పటి నుండే కోఠీ రెసిడెన్సీ బజారును ‘సుల్తాన్‌బజారు’గా పిలుస్తున్నారు. 1935లో హైదరాబాద్‌లో ఆకాశవాణి కేంద్రం ఏర్పడింది. 1919 ఆగస్టు 7న ఉస్మానియా విశ్వవిద్యాలయం కోసం అడిక్‌మెట్ వద్ద 1400 ఎకరాల స్థలం సేకరించారు. 1934లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్మాణం ఆరంభమయ్యింది. వేలమంది కార్మికులతో, 36 లక్షల వ్యయంతో భవన నిర్మాణం పూర్తయి, 1939లో ఏడవ నిజాం ప్రభువు తన స్వహస్తాలతో ప్రారంభోత్సవం చేశాడు. ఈ విశ్వవిద్యాలయ భవనం భారతదేశంలోనే అందమైన, అద్భుతమైన కట్టడాలలో ఒకటి.

మూసీనది ఒడ్డున ఉన్నత న్యాయస్థాన భవన (High Court Building) నిర్మాణం 1915లో ఆరంభమైంది. నిజాం ప్రభువు 1920 ఏప్రిల్ 20న హైకోర్టు భవనాన్ని ప్రారంభించాడు. మూసీనది వరదలు అరికట్టడానికి విఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహాపై 1914లో గండిపేట చెరువు, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల నిర్మాణాలు ప్రారంభమైనాయి. ఉస్మాన్‌సాగర్ నిర్మాణం 1920లో 54 లక్షల వ్యయంతో, హిమాయత్‌సాగర్ నిర్మాణం 1927లో 92 లక్షల వ్యయంతో పూర్తయినాయి. 1937లో భారత రాజధాని ఢిల్లీలో అందమైన హైదరాబాద్ హౌజ్ కూడా నిర్మించారు.

1936లో మూసీనది ఒడ్డున స్టేట్ సెంట్రల్ లైబ్రరీ భవనం, 1937లో జూబిలీహాల్ నిర్మించబడ్డాయి. ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, యునాని దవాఖాన, పబ్లిక్ గార్డెన్స్‌లోని రాష్ట్ర పురావస్తు మ్యూజియం, హెల్త్ మ్యూజియం, భాలభవన్ మున్నగు భవనాలన్నీ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అసఫ్‌జా కాలంలోనే పూర్తయ్యాయి.
ఇలా కుతుబ్‌షాహీల, అసఫ్‌జాహీల 400 ఏళ్ళ పాలనలో హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం సర్వాంగ సుందరంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది. 1 నవంబర్ 1956న ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఏర్పడే నాటికే దేశంలోని ఢిల్లీ, కలకత్తా, ముంబయి, మద్రాస్ వంటి నగరాల తర్వాత ఒక ముఖ్య నగరంగా మన హైదరాబాద్ అభివృద్ధి చెంది ఉంది. అప్పటికీ, ఇప్పటికీ భారతదేశంలోని ఐదు గొప్ప నగరాల్లో హైదరాబాద్ ఒకటిగానే ఉంది.

హైద్రాబాద్‌లో చారివూతక కట్టడాలు, నిర్మాణాలు
1507 గోల్కొండ స్వతంత్ర రాజ్యంగా అవతరణ
1562 హుస్సేన్ సాగర్ నిర్మాణం
1578 పురానాపూల్ నిర్మాణం
1578 హైదరాబాద్ నగరం గోల్కొండ కోట నుండి మూసీకి దక్షిణం విస్తరణ
1589-94 చార్మినార్, గుల్జార్‌హౌజ్, చార్‌కమాన్ల నిర్మాణం
1793 సరూర్‌నగర్‌లో జనావాసాలు ఏర్పడటం
1803 సుల్తాన్ షాహీలో టంకశాల ఏర్పాటు
1805 మీరాలం మండీ ఏర్పాటు
1806 మీరాలం చెరువు నిర్మాణం...........................
1808 బ్రిటీష్ రెసిడెన్సీ భవన నిర్మాణం....................
1828 చందూలాల్ బారాదరీ నిర్మాణం
1831 చాదర్‌ఘాట్ వంతెన నిర్మాణం
1859-66 అఫ్జల్‌గంజ్ వంతెన నిర్మాణం
1862 పోస్టాఫీసుల నిర్మాణం
1873 బాగేఅం - పబ్లిక్ గార్డెన్ నిర్మాణం
1873 బొంబాయి - సికింవూదాబాద్ రైల్వేలైన్ల నిర్మాణం
1874 నిజాం రైల్వే సంస్థ ఏర్పాటు
1884 ఫలక్‌నామా ప్యాలెస్ నిర్మాణం
1882 చంచల్‌గూడా జైలు నిర్మాణం
1883 నాంపల్లి రైల్వేస్టేషన్ నిర్మాణం
1884 ముస్లింజన్ వంతెన నిర్మాణం
1885 టెలిఫోన్ సౌకర్యం ఏర్పాటు
1890 నిజామియా అబ్జర్వేటరీ టెలిస్కోపు ఏర్పాటు.......
1893 హనుమాన్ వ్యాయామశాల
1920 హైకోర్టు నిర్మాణం
1920 ఉస్మాన్‌సాగర్ నిర్మాణం
1927 హిమాయత్‌సాగర్ ఆనకట్ట నిర్మాణం
1930 హైదరాబాద్ నగరంలో సిమెంటు రోడ్ల నిర్మాణం

నైజాం కాలంలో పరిశ్రమల స్థాపన
1871 సింగరేణి బొగ్గు గనులు
1873 మొదటి స్పిన్నింగ్ మిల్లు
1876 ఫిరంగుల ఫ్యాక్టరీ
1876 ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్
1910 సోడా ఫ్యాక్టరీ
1910 ఐరన్ ఫ్యాకరీ
1916 దక్కన్ బటన్ ఫ్యాక్టరీ
1919 వి.ఎస్.టి ఫ్యాక్టరీ
1921 కెమికల్ లాబోరేటరీ
1927 దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ
1929 డి.బి.ఆర్.మిల్స్
1931 అజంజాహి మిల్స్, వరంగల్
1932 ఆర్.టి.సి. స్థాపన
1937 నిజాం షుగర్ ఫ్యాక్టరీ
1939 సిర్పూర్ పేపర్ మిల్లు
1941 గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ
1942 హైదరాబాద్ స్టేట్ బ్యాంక్
1942 హైదరాబాద్ ఆల్విన్ మెటల్స్
1943 ప్రాగా టూల్స్
1946 హైదరాబాద్ అస్బెస్టాస్
1947 హైదరాబాద్ లామినేషన్ ప్రొడక్ట్

హైదరాబాద్‌లో స్కూళ్లు, కాలేజీల స్థాపన
1856 దారుల్ ఉలూం పాఠశాల
1872 చాదర్‌ఘాట్ పాఠశాల
1879 ముఫీదుల్ అనాం హైస్కూల్
1879 అలియా స్కూల్
1884 సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ
1874 నిజాం కాలేజీ
1887 నాంపల్లి బాలికల పాఠశాల
1894 అసఫియా స్కూల్
1894 మెడికల్ కాలేజీ
1904 వివేక వర్ధిని పాఠశాల
1910 మహబూబియా బాలికల పాఠశాల, గన్‌ఫౌండ్రి..
1918 ఉస్మానియా యూనివర్సిటీ
1920 సిటీ కాలేజీ భవనం
1923 హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (జాగిర్దార్ కాలేజీ)
1924 మార్వాడీ హిందీ విద్యాలయ
1926 హిందీ విద్యాలయ, సికింద్రాబాద్

హైద్రాబాద్ స్టేట్‌లో గ్రంథాలయాల స్థాపన
1872 ముదిగొండ శంకరారాధ్యుల లైబ్రరీ, సికింద్రాబాద్
1892 ఆసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ
1895 భారత్ గుణ వర్ధక్ సంస్థ లైబ్రరీ, శాలిబండ
1896 బొల్లారం లైబ్రరీ
1901 శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్రబాషా నిలయం, సుల్తాన్‌బజార్...
1904 రాజ రాజనరేంద్ర ఆంధ్రభాషా నిలయం, హన్మకొండ
1905 విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి, హైద్రాబాద్
1913 ప్రతాపరుద్ర ఆంధ్రభాషా నిలయం, మదికొండ, వరంగల్ జిల్లా
1913 సంస్కక్షుత కళావర్ధినీ గ్రంథాలయం, సికింద్రాబాద్
1923 బాల సరస్వతీ గ్రంథాలయం, హైద్రాబాద్
1930 జోగిపేట గ్రంథాలయం, మెదక్ జిల్లా

దవాఖానాల నిర్మాణం
1890 ఆయుర్వేదం, యునానీ వైద్యశాలల ఏర్పాటు....
1894 మెడికల్ కాలేజీ
1897 మెంటల్ హాస్పిటల్, ఎర్రగడ్డ
1905 జిజ్గిఖానా (విక్టోరియా మెమోరియల్ ప్రసూతి దవాఖాన)
1916 హోమియోపతి కాలేజీ
1927 చార్మినార్ యునానీ, ఆయుర్వేదిక్ ఆసుపత్రుల నిర్మాణం
1945 నీలోఫర్ చిన్నపిల్లల దవాఖాన
1925 ఉస్మానియా జనరల్ హాస్పిటల్, గాంధీ దవాఖాన, సికింద్రాబాద్, టి.బి. దవాఖాన, ఎర్రగడ్డ కాన్సర్ దవాఖాన, ఇ.ఎన్.టి. దవాఖాన, నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్, కోరంటి దవాఖాన.

హైదరాబాద్ స్టేట్‌లో ప్రభుత్వ శాఖల స్థాపన
1875 సర్వే, సెటిల్‌మెంట్ శాఖ
1876 లాండ్ సెటిల్‌మెంట్ శాఖ
1881 జనాభా లెక్కల సేకరణ
1882 ఎకై్సజ్ లెక్కల సేకరణ
1883 పోలీస్ శాఖ
1892 గనుల శాఖ
1892 పరిశ్రమలు, వాణిజ్యం శాఖలు
1893 లోకల్ ఫండ్ శాఖ
1896 నీటి పారుదల శాఖ
1911 స్టేట్ లైఫ్ ఇన్యూరెన్స్ ఫండ్
1912 సిటీ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు
1913 వ్యవసాయ శాఖ
1913 హైదరాబాద్ సివిల్ సర్వీసు
1914 ఆర్కియాలజీ శాఖ
1932 ఆకాశవాణి, హైద్రాబాద్
1945 కార్మిక శాఖ
1864 రెవెన్యూ శాఖ
1866 కస్టమ్స్ శాఖ (కరోడ్‌గిరి)....................................
1866 జిల్లాల నిర్మాణం
1866 వైద్యశాఖ
1866 మొదటి రైల్వేలైను ముంబై - రాయచూర్
1867 ప్రింటింగ్, స్టేషనరీ
1867 ఎండోమెంట్ శాఖ
1867 అటవీ శాఖ (జంగ్లాత్)
1869 మున్సిపల్ శాఖ
1869 పబ్లిక్ వర్స్ డిపార్ట్‌మెంట్
1870 విద్యాశాఖ
1870 హైకోర్టు ఏర్పాటు
- సబ్బని లక్ష్మీనారాయణ
(from namaste telangaana)