హోం

25, ఆగస్టు 2013, ఆదివారం

ఎవరికోసం సమైక్యత..?


దేశ స్వాతంత్రోద్యమం తరవాత మల్లి అంత పెద్ద ఉద్యమమంట, లక్షలాది మంది రోడ్ ల మీదికి వస్తున్నారట, నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఈ ఉద్యమం మరింత తీవ్రమై దేశ విభజన జరిగినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదట..?  విభజన వళ్ళ తెలంగాణా అందకారమవుతుందట. నీటి యుద్ధాలు జరుగుతాయట. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది సీమంద్రులే అని తెలంగాణా ప్రజలకు అర్థం అవుతున్నదంట, విడిపోవడం ఆంద్ర వాళ్ళకు ఇష్టం లేదు కాబట్టి, తెలంగాణాలో ఎవడైనా జై తెలంగాణ అంటే తన్నే పరిస్థితికి ఇక్కడి జనం వచ్చారంట.. తెలంగాణా ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రకటించనా తెలంగాణావాదులు హర్షించలేదట, పండుగ చేసుకో లేదట.. అంటే తెలంగాణా వాదులంతా సమైక్యందులు గా మరిపోయరట..ఇవన్ని సీమంద్రుల మాటలు.
                                  హైదరాబాద్లో లక్షల మంది వచ్చి నగరాన్ని దిగ్బందిన్చినా సి ఎం కు జనం కనిపించలేంట, కాని ఈ రోజు సీమంద్రలో లక్షల మంది రోడ్ ల మీదికి వస్తున్నారట.. వాళ్ళను అదుపు చెయ్యలేక పోతున్నాడట. నిర్ణయం వెనక్కి తీసుకుంటే తెలంగాణా వారిని అదిలించి , బెదిరించి అవసరమనుకుంటే పిట్టల్ల కాల్చిపారేసి తెలంగాణా ఉద్యమకారుల సమాధులపై  తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెడతాడట..! నిన్నటి దాక తెలంగాణా విషయం ప్లీనరీలో స్పష్టంగా చెప్పినం అని జగన్ పార్టీ వాళ్ళన్నారు, వాళ్ళు ఎం చెప్పిర్రో తెలవలేదు కాని ఈ రోజు స్పష్టంగా తెలుస్తోంది, వాళ్ళు చెప్పింది సమక్యంద్ర కె కట్టుబడి ఉన్నామని, తెలంగాణా ఇస్తే కొంగ జపాలు చేస్తారని. కొండమ్మకు నేడు జగన్ రాక్షసుడిలా కనిపిస్తున్నాడట.. ఎన్ని డ్రామాలు.. మొత్తం మీద మరో ప్రా రా పా లా వై కా పా  మిగిలిపోయింది.
                        తెలంగాణ కు కట్టుబడి ఉన్ననని  చెప్పి పార్లమెంట్లో మాత్రం లొల్లి చేయిస్తూన్న చంద్రబాబు, తనతో కొంతకాలంగా సక్యంగా లేని హరి కృష్ణను సమైక్యంద్ర కోసం బాలి పశువును చేసాడు. తెలంగాణాలో పుంజుకోవడానికి ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన ఒక గ్రూప్ ను పార్టిలో చేర్చుకోవడం ద్వార యువతకు సీట్లు ఇచ్చామని చెప్పుకోవచ్చు, పార్టీ ని బలోపేతం చేసుకోవచ్చనే ఆలోచనలో బాబు ఉన్నారని సమాచారం. ఇక హైదరాబాద్ అంటే ఏంటో తెలియని సీమంద్రులకు హైదరాబాద్ ను నిర్మించింది నేనే, దాన్ని అభివృద్ధి చేసింది నేనే అని చెప్పి నమ్మించడం పెద్ద కష్టమేమి కాదు, ఇలాంటి రాజధానిని నేను మాత్రమె నిర్మించగలను అని సీమంద్రులకు చెప్పి అక్కడ అధికారంలోకి రావాలని అనుకుంటున్నాడు.
                             ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతుంటే అందరి గేమ్ కాంగ్రెస్ ఆడుతోంది.   ఇప్పుడు సోనియా ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి టి అర్ ఎస్ కు వచ్చింది, నాయనో బయన్నో కె సి అర్ ను పార్టీలో విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది, అందుకే కె సి అర్ ని బలహీన పరచడానికి ఆ పార్టీని చీల్చే వ్యూహం చేస్తోంది. అటు సీమంద్ర లోఅశాంతిని రేపి జనాన్ని రెచ్చగొట్టి సీమంద్రలో చెంద్రబాబు ను అడ్డుకోవాలని కాంగ్రెస్ వ్యూహం.
                   సీమంద్రలో ఉద్యమం చెయ్యడానికి ప్రోత్సాహం పూర్తిగా కాంగ్రెస్ నాయకుల నుండే వస్తోందన్నది తెలుస్తూనే ఉది. ఎందుకంటే రాజీవ్ , ఇందిరా విగ్రహాల కూల్చివెత సమయంలో సి ఎం, సీమంద్ర మంత్రులతో సమావేశం నిర్వహించిన అనంతరం విగ్రహాలు కూల్చడం మంచి సాంప్రదాయం కాదు అని ఆయన చెప్పగానే విగ్రహాల విద్వంసం ఆగిపోయింది. అంటే ఏ పార్టీ వాళ్ళు చేస్తున్నారో తెలుసుకోవడానికి ఈ సంఘటనే ఒక ఉదాహరణ. అసలు సీమంధ్రులు చేస్తున్న ఉద్యమ లక్ష్యం ఏమిటి..? తెలంగాణ వాళ్ళతో కలిసుండాలనా.. లేక హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయ్యలనా..?
                        లక్ష్మి పార్వతి కి సమైక్యంద్ర ఉద్యమం స్వాతంత్రోద్యమం లా కనిపిస్తుందట.. దేశ స్వాతంత్రోద్యమం ఇక్కడి ప్రజల హక్కులను కాపాడటానికి, స్వేచ్చ కోసం జరిగింది, కాని సమైక్యంద్ర ఉద్యమం పక్కవాని హక్కులను హరించడానికి, పక్కవాడు ఎక్కడ బాగుపడతాడో అన్న ఓర్వలేనితనం నుండి, మాకు దక్కంది ఎవరికీ దక్కకూడదు, మేము బాగు పడితే చాలు పక్కవాడు నాశనం ఐన పరవాలేదు అనే కుస్వార్ధం నుండి పుట్టింది. అక్రమ ఆస్తులు కూడబెట్టుకొని తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళు,  అక్రమంగా ఉద్యోగాల్లో చొరబడ్డ వాళ్ళు, అక్రమ ప్రమోషన్ లు పొందిన వాళ్ళు ఈ ఉద్యమానికి నాయకులు. ఊరిలో ఉన్న నాలుగఐదు పాటశాలల విద్యార్థులను రోడ్ల్ పైకి తీసుకొచ్చి, మీడియా వాళ్ళు ఫోటోలు, విడియోలు తీసుకున్న తర్వాత ఇంటికి వెల్లిపొతే అది ఉద్యమం, పోట్లాల్లో అన్నం కూరలు తెచ్చుకొని వంట వార్పూ అని నాటకాలు చెయ్యడం మరో వింత. అర్ టి సి బస్సులు నడపరు, కాని ప్రవేట్ బస్సులు ఎదేచ్చాగా తిరుగుతాయి, ప్రభుత్వ పాటశాలలు బంద్, కాని కార్పోరేట్ పాటశాలలు నడుస్తాయి, జెన్కో విద్యుత్ కేంద్రాలు బంద్, లాంకో విద్యుత్ కేంద్రాలు చాలున్టాయ్, మనకు ఇప్పుడు నీళ్ళు రాకపోయినా పర్వాలేదంట, నల్గొండలో తాగునీరు  కలుషితమై బొక్కలు వంకరపోయినా వాళ్ళకు మాత్రం మూడు పంటలకు నీళ్ళు కావాలట. వాళ్ళ బాగుకోసం మనం పాటుపడాలంట.
                            ఇద్దరు వ్యక్తులు కలిసుండాలంటే ఇద్దరి మద్య అవగాహన ప్రేమ ఉండాలి, అవి లేనప్పుడు ఒకరు విడిపోతానంటే మరొకరు చెయ్యల్సిన్దేమిటి..? తను చేసిన తప్పును దిద్దుకుంటానని హామీ ఇచ్చి, తన లో వచ్చిన మార్పును చూపించాలి, నమ్మకం కలిగించాలి.  కాని నువ్వు నానుండి విడిపోవడానికి వీలు లేదు అని బలవంతం చేస్తే అది ఉన్మాదం అవుతుంది, మరి ఈ రోజు సీమాంద్రులు చేస్తున్నది ఏమిటి...? 

23, ఆగస్టు 2013, శుక్రవారం

స్వార్థం కోసం సమైక్యం


నాయకుడు నలుగురికి దారిచూపే వాడై ఉండాలి, అందులోనూ బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగులకు నాయకత్వం వహించేవాడే ఆక్రమణదారుడైతే ఉద్యమం దారితప్పుతుందని చరిత్ర ఎన్నోసార్లు రుజువు చేసింది. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌కుమార్ వ్యవహా రం కూడా అచ్చం ఇలాగే ఉంది. అశోక్‌బాబు ఉద్యోగ వ్యవహారం అనైతికమని, ఆయన సృష్టించిన దొంగ విద్యార్హత పత్రాలతో పొందిన బదిలీ అక్రమమనీ... హైదరాబాద్‌కు ఆయన బదిలీ నిబంధనలకు విరుద్దమనేందుకు కొన్ని పత్రాలు ‘టీ మీడియా’ చేతికి అందాయి. అశోక్‌బాబుతోపాటు ఏపీఎన్జీవో హైదరాబాద్ అధ్యక్షుడు పీవీవీ సత్యనారాయణ కూడా ఇలాగా ఉద్యోగం సంపాదించాడనే ఆరోపణలున్నాయి. ప్రస్తుత ఎపీఎన్జీవో అధ్యక్షుడి హోదాలో ఉన్నట్లుగా చెలామణి అవుతున్న పరుచూరి అశోక్‌కుమార్ కృష్ణా జిల్లా విజయవాడలోని వాణిజ్య పన్నుల శాఖ డిప్యుటీ కమిషనర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించేవారు. తదుపరి పోస్టింగ్ అయిన అసిస్టెంట్ కమిర్షియల్ టాక్స్ అధికారి(ఏసీటీఓ) హోదా కోసం తప్పుడు విధానాన్ని అనుసరించి హైదరాబాద్‌కు వచ్చినట్లు సహచర ఉద్యోగులు చెబుతున్నారు. వాస్తవానికి ఏసీటీవో హోదా కోసం ఏదేని డిగ్రీ ఉత్తీర్ణత లేదా శాఖాపరంగా బుక్ కీపింగ్ అర్హత కలిగి ఉండాలి. కానీ ఈ రెండింటిలో అశోక్‌బాబుకు ఏ ఒక్క అర్హత లేకపోవడం గమనార్హం. ఇక ఆయన బదిలీకి ఎంచుకున్న వక్రమార్గంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో పర్చూరి అశోక్‌బాబు దొంగ సర్టిఫికెట్లు సమర్పించినట్లుగా...సర్వీస్ రికార్డులో మార్పులు చేర్పులు చేసినట్లుగా స్పష్టంగా రుజువైంది. విజిపూన్స్ విచారణలో ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవాలేనని...ఆయన అక్రమాలు ఒకటి రెండూ కావని విజిపూన్స్ విచారణ నివేదికను ప్రభుత్వానికి అందించింది. 

వీటిపై విచారణ చేసిన రెవెన్యూ విజిపూన్స్ శాఖ తేదీ 30, జనవరి 2013న ప్రభుత్వానికి నివేదిక(మెమో నెం.1716/విజిపూన్స్-1(2)2013-1లో అందజేసింది. అశోక్‌బాబుపై వచ్చిన ఆరోపనలన్నీ వాస్తవాలేనని...ఆయన అక్రమాలకు పాల్పడి ప్రభుత్వాన్ని మోసం చేశారని ఈ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయం ఆయనపై వచ్చిన ఆరోపణలు వాస్తవం అని తేలుస్తూ మొమోను జారీ చేసింది. ఇందులో సర్వీసు రిజిస్టర్‌లో పేజి నెంబర్ 6లో ఇంటర్మడియట్ చిదివినట్లు ఉందని వాణిజ్య పన్నుల శాఖ తేల్చింది. అయితే ఆయన ఇందుకు భిన్నంగా డిగ్రీ చదివినట్లగా ఎలా డిక్లరేషన్ ఇచ్చారని ప్రశ్నించింది. ఇందుకు 15 రోజుల్లో సమాధానం చెప్పాలని మెమోలోపేర్కొంది. అయితే ఆయన డిగ్రీ చదివినట్లు తప్పుడు దృవీకరణ ఇచ్చి 2008 ఫిబ్రవరి 11 న ప్రభుత్వం నిర్వహించిన సాంకేతిక పరీక్ష ఎందుకు రాశారని, డిగ్రీ చదివిన వారికి ఈ పరీక్ష అవసరం లేదని కమిషన్ చురుకలు వేసింది. ఈయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయినా ప్రభుత్వం ఎందుకో మిన్నకుండి పోతోంది. ఇక్కడ ఇంకో గమ్మత్తయిన విషయం ఏమిటంటే ఏపీఎన్జీఓ హౌజింగ్ సొసైటీలో సభ్యత్వానికి వాస్తవానికి అశోక్‌బాబు అనర్హుడు.

2012 ఆగష్టులో టెన్యూర్ విధానంద్వారా హైదరాబాద్‌కు బదిలీపై వచ్చిన ఆయన 22 జనవరి 2010న ఏపీఎన్జీఓ హౌజింగ్ సొసైటీలో సభ్యత్వం పొందినట్లుగా రికార్డులు సృష్టించడం విమర్శలకు తావిస్తోంది. ఇది ఎలా సాధ్యమని సొంత ఉద్యోగ సంఘాల నేతలే ఆరోపణలు చేసున్నా ఆయన నోరుమెదపడం లేదు. దీనిపై కోర్టులో కేసు విచారణలో ఉంది. వాస్తవానికి నిబంధనల ప్రకారమయితే ఇందులో సభ్యత్వానికి సొసైటీ ఏర్పాటయ్యేనాటికి హైదరాబాద్‌లో 5ఏళ్ల సర్వీసు పూర్తయి ఉండాలి. కానీ ఇవేవీ ఆయనకు వర్తించలేదు. తెలంగాణ విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యంగా కలిసుందామని ఉద్యమిస్తున్న అశోక్‌బాబు తెలంగాణ పోస్టును కొల్లగొట్టి...అక్రమంగా ఉద్యోగాన్ని అనుభవిస్తున్నాడు. విజిపూన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ విభాగంలో 22 పోస్టులు ఉండగా విజయవాడ డివిజన్లో ఈయన విధులు నిర్వహించాల్సి ఉండగా ఈ కోటాలో కాకుండా తెలంగాణ కోటాలో ఆయన నియామకం కావడం విశేషం. ప్రస్థుతం ఈయన సికింవూదాబాద్ డివిజన్లో పనిచేస్తున్నారు.

డిగ్రీ చదవకున్నా చదివినట్లు దొంగ సర్టిఫికేట్...
ఏపీఎన్జీఓ అప్రకటిత అధ్యక్షునిగా కొనసాగుతూ... అసలు ఎన్నికలే జరగని సంఘానికి అధ్యక్షునిగా చెప్పుకుంటున్న అశోక్‌బాబు ప్రభుత్వాన్ని మోసం చేసిన ఆరోపణలును ఎదుర్కొంటున్నారు. అనుభవం ప్రాతిపధికగా జిల్లాల్లో పనిచేసే ఉద్యోగులకు శాఖాధిపతుల కార్యాలయాలకు డెప్యు పంపేందుకు 12.5 శాతం కోటాను ప్రభుత్వం అమలుచేస్తోంది. ఇందుకు ఆయా ఉద్యోగులకు గ్రాడ్యుయేషన్(డిగ్రీ) తప్పనిసరి. ఇదే అంశంలో అర్హతలతో కూడిన విద్యార్హతల జాబితాలతో కూడిన అభ్యర్ధుల వివరాలను తమకు పంపాలని అన్ని శాఖల కమిషనర్లకు 1995 నవంబర్ 10న ప్రభుత్వం ఆదేశించింది.

సరిగ్గా ఇదే అంశాన్ని వాడుకొని హైదరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ కావాలని పథకం పన్నిన అశోక్‌బాబు తనకు లేని అర్హతలను సృష్టించుకున్నారు. డిగ్రీతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానంలో 1991లోవిజయవాడలోని ఎన్‌ఐఐటీ నుంచి డిప్లొమా ఇన్ సిస్టం మేనేజ్‌మెంట్ కోర్సును పూర్తి చేసినట్లుగా ప్రభుత్వానికి తప్పుడు డిక్లరేషన్‌ను సమర్పించాడు..అయితే సర్వీస్ రికార్డుల్లో మాత్రం ఆయన ఇంటర్‌మీడియెట్ మాత్రమే చదివినట్లుగా ఉండటంతో అనుమానం వచ్చిన అధికారులు దీనికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్లు, సర్వీస్ రిజిస్టర్‌ను పంపాలని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టెలిక్షిగాంద్వారా ఆదేశించారు. దీంతో బెంబేపూత్తిన అశోక్‌బాబు తన గుట్టు బయటపడుతోందని...ఇక దొరికిపోవడం ఖాయమని భావించి యూ-టర్న్ తీసుకుని..‘నాకున్న కుటుంభపరమైన కారణాలవల్ల నేను హైదరాబాద్(హెచ్‌ఓడీ)లో పనిచేసేందుకు సుముఖంగా లేను...నా ధరఖాస్తును ఉపసంహరించుకుంటున్నాను’ అని ప్రభుత్వానికి పంపిన అభ్యర్ధనలో పేర్కొన్నారు. ఇక అక్కడే ఆయన మరో మోసానికి తెగబడ్డారు.

ఆయన చేసిన మోసాన్ని ఆయనే బట్టబయలు చేసుకుని సాంకేతికంగా మరోసారి దొరికిపోయారు. వాస్తవానికి ఇన్‌సర్వీస్ కేడర్‌లో వాణిజ్య పన్నుల సహాయ కార్యదర్శిగా నియామకానికి ప్రభుత్వం నియమించే ఇన్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి...అయితే ఇందుకు డిగ్రీ చదవని వారు మాత్రమే పరీక్ష రాయాలి...డిగ్రీ చదివినవారు దీనిని రాయాల్సిన అవసరం లేదు. అయితే గమ్మత్తుగా డిగ్రీ ఉత్తీర్ణత అయ్యానని చెప్పుకున్న అశోక్‌బాబు ఈ పరీక్ష రాసి ఉత్తీర్ణుడు కావడంతో ఆయన మోసాన్ని ఆయనే దృవీకరించుకున్నారు. గతంలో ఒక ఉద్యోగి ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు చేసింది.‘ప్రత్యక్షంగా లబ్ది పొందకపోయినా సరే తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ప్రభుత్వాలను మోసం చేయాలని చూస్తే సదరు ఉద్యోగి ఆ ఉద్యోగంలో కొనసాగేందుకు అనర్హుడ’ని పేర్కొంది. 1996లో తప్పుడు డిక్లరేషన్ ఇచ్చిన అశోక్‌బాబును ప్రభుత్వం ఉపేక్షించడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎన్నికలే జరగలేదు...అధ్యక్షుడెలా అయ్యాడో....
రాష్ట్రంలో 100కుపైగా గుర్తింపు ఉద్యోగ సంఘాల్లో ఒకటిగా ఉన్న ఏపీఎన్జీకు 31మే 2013 వరకు గోపాల్‌డ్డి అధ్యక్షుడిగా కొనసాగారు. అయితే అదే తేదీన ఆయన పదవీవిరమణ చెందడంతో ఈ పదవికి ఖాళీ ఏర్పడింది. దీంతో ఏలూరు ఏపీఎన్జీఓ అధ్యక్షుడు భోగరాజు ఎన్నికల అధికారిగా మే 26న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఎన్నికలను సవాలు చేస్తూ కొందరు ఉద్యోగులు 2013 జూన్ 20న సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఇంటెరియం ఇంజక్షన్ ఉత్తర్వులను జారీ చేస్తూ అదేతేదీన అదనపు చీఫ్ జడ్జి ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. అసలు ఎన్నికలే జరగని సంఘానికి అశోక్‌బాబు ఎలా అధ్యక్షుడయ్యాడో ఆయనే చెప్పాలి.

హౌజింగ్ సొసైటీలో క్రిమినల్ చర్యలకు సిఫార్సు....
ఏపీఎన్జీఓలకు రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలిలో కేటాయించిన 190 ఎకరాల్లో అక్రమాలు జరిగాయని, రూ. 13కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని కొందరు ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసిన సాధారణ పరిపాలనా శాఖ(విజిపూన్స-ఎన్‌ఫోర్స్‌మెంట్)శాఖ అక్రమాలు నిజమే అని నిర్దారించింది. వీరు ఉద్దేశపూర్వకంగానే అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంటూ వారిపై వాఖా పరమైన చర్యలతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి నివేదించింది. ఇందుకు హైదరాబాద్ నగర అధ్యక్షుడు పివివి సత్యనారాయణను ఎఫ్‌ఐఆర్‌లో పొందుపర్చుతూ సీసీఎస్ కేసు నమోదు చేసింది. ఇందుకు 2013 జూన్ 6న కేసు నెంబర్ 81ను నమోదు చేసింది. ఇందులో సెక్షన్ 406, 409, 420, 182 రెడ్‌విత్ 120 సెక్షన్‌లను నమోదు చేసింది.

610, రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించి నియామకమైన పీవీవీ సత్యనారాయణ...
ఇరిగేషన్ శాఖలో టెక్నికల్ ఆపీసర్గా పనిచేస్తున్న ఏపీఎన్జీఓ హైదరాబాద్ అధ్యక్షుడి ఉద్యోగ నియామకంపై కూడా అనేక అనుమానాలున్నాయి. ఈయన స్వస్థలం తూర్పు గోదావరి కాగా విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది. అయితే నిబంధనలు ఉల్లంఘించి ఈయన ఖమ్మం జిల్లాలో (జోన్-5) క్లాస్-4 క్యాడర్లో జూనియర్ టెక్నికల్ అధికారిగా ఉద్యోగం పొందారని ఆరోపణలున్నాయి. అయితే ఈయన ధవలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో విధులు నిర్వహించారు. 20శాతం ఉండే ఓపెన్ ఫర్ ఆల్ కేటగిరీలో నాన్ లోకల్‌లో ఉద్యోగం పొందినా ఆయన జోన్ -6లో పనిచేసేందుకు అర్హుడు కాదని నిబంధనలున్నాయి.

అయితే ఇవేవీ వర్తించని రీతిలో ఆయన హైదరాబాద్ చీఫ ఇంజనీర్ కార్యాలయంలో మే 15, 1990న బదిలీపై వచ్చి చేరారు. అనంతరం ఈయన టెక్నికల్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందడం తెలంగాణ ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. నాన్ లోకల్ క్యాడర్లో జోన్-6కు బదిలీపై రావడం అంటే రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పేరా5(1)కి వ్యతిరేకమని నిబంధనలు సూచిస్తున్నాయి. దీంతో యన నియామకంపై పలువురు ఫిర్యాదు చేయడంతో ఐ అండ్ సీఏడి శాఖ విచారణకు స్వీకరించింది. ఇందులో ఆయన సర్వీస్ రికార్డు గల్లంతయిందని...ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవమేనని తేల్చింది. ఈ అవకతవకలపై రాయకోటి కమిషన్‌ను ఆశ్రయించిన కొందరు ఉద్యోగులకు కమిషన్ హామీ ఇచ్చింది కానీ ఈ నివేదిక ప్రభుత్వానికి చేరకపోవడంతో ఆయన తెలంగాణ ప్రాంతంలోనే కొనసాగుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది.

అక్రమార్కులే నాయకత్వంలో ఉంటే న్యాయం జరగడం అసాధ్యం
అవినీతి పరులు, అర్హత లేని వ్యక్తులు ఉద్యోగ సంఘాల్లో నాయకత్వం వహించి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి నేతల నాయకత్వంలో ఉద్యోగులకు న్యాయం జరగకపోగా మరింత అన్యాయం జరుగుతందని గుర్తించాలి. ఇప్పటికైనా ఏపీఎన్జీఓలో పనిచేస్తున్న ఉద్యోగులు వాస్తవాలను గుర్తించి వీరిపై తిరగబడాలి. ఉద్యమం ముసుగులో తమపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్న వీరి దమననీతిని గుర్తించి పక్కకు తప్పిస్తే మంచిది. లేకపోతే సోదరుల్లా కలిసిమెలిసి పనిచేస్తున్న తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య విద్వేషాలు రేగడం ఖాయం. ఇప్పటికే తెలంగాణ విభజనకు ఉద్యోగుల్లో మానసిక విభజన జరిగిపోయింది...ఇక భౌగోళిక విభజనే జరగాల్సి ఉందనే వాస్తవాన్ని నేతలు గ్రహించి సహకరించాలి. అక్రమాలకు అడ్డాగా మారిన ఏపీఎన్జీఓ సంఘం గుర్తింపును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అశోక్‌బాబును సర్వీసులనుంచి భర్తరఫ్ చేసి ఆయన అక్రమాలపై ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణ జరిపించాలి
- గంజి వెంక టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు
                              -నమస్తే తెలంగాణ నుండి  

19, ఆగస్టు 2013, సోమవారం

తెలంగాణ ఏర్పాటుకు ఓకే


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును స్వాగతిస్తున్నామని ఆంధ్ర,రాయలసీమ, తెలంగాణ బడుగు,బలహీనవర్గాల ప్రజాసంఘాలు ముక్తకంఠంతో ప్రకటించాయి. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర విభజనను ఆహ్వానిద్దాం- ఉభయ రాష్ట్రాల ప్రజల మధ్య శాంతి, సహృద్భావాన్ని కాపాడుకుందాం, విభజనతో అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేద్దాం’ తదితరాంశాలపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. దీనికి సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు విచ్చేసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం విభజన నిర్ణయం జరిగిపోయిందని, ఇక ప్రక్రియ ఎలా జరగాలి అనే అంశంపైనే చర్చలు జరగాలన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొన్ని సమస్యలు వచ్చినా..అవి పరిష్కరించలేనంత పెద్ద సమస్యలు కావని అభిప్రాయపడ్డారు.

ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్ర వారిని ఇక్కడివారు ఎంతో గౌరవంగా చూసుకుంటున్నారని..ఏనాడూ కూడా ఉద్యమంలో సీమాంధ్ర ప్రజలను తెలంగాణ ప్రజలు విమర్శించిది లేదని గుర్తుచేశారు. హైదరాబాద్ సెటిలర్స్ ఫోరం ప్రతినిధి కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ తాము తెలుగువారిగా గర్విస్తున్నామని తెలంగాణలో నివసిస్తున్నందుకు ఎంతో ఆనందపడుతున్నామన్నారు.

హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమేనని స్పష్టంచేశారు. రాయలసీమ అధ్యయన కమిటీ ప్రతినిధి భూమన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటును స్వాగతిస్తున్నామని కానీ రాష్ట్రం ఏర్పడితే తాము ఆంధ్రావారితో కలిసి ఉండలేమని రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రమివ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఫోరం ఫర్ సిటిజన్స్ ప్రతినిధి సజయ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జైఆంధ్రా ఉద్యమనేత సాంబశివరావు, బహుజన కెరటాలు సంపాదకులు పల్నాటి శ్రీరాములు, విజయవాడ మైనార్టీ రిప్రెజెంటేషన్ ప్రతినిధి సయ్యద్ రషీద్, వేపపల్లె సర్పంచ్ జ్యోతి, జైఆంధ్ర జేఏసీ ప్రతినిధి జైబాబు, రాష్ట్ర కాపునాడు ప్రతినిధి పి.వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.  
 

                                                                                                                  -from sakshi media

11, ఆగస్టు 2013, ఆదివారం

తెలంగాణ గుండెచప్పుడు



తెలంగాణా గుండె హైదరాబాద్ మహా నగరం, దక్షిణ భారత దేశంలోని వివిధ ప్రాంతాలకు రాజధానిగా నిలిచి, అనేక సంస్కృతులను ఆకళింపు చేసుకున్న నగరం, చారిత్రక వారసత్వ నగరంగా కీర్తినందుకున్న నగరంపై నేడు వివాదం ఎందుకు ..? హైదరాబాద్ రాజధానిగా పరిపాలన సాగిన గత 500 ఏళ్ళ కాలంలో మహారాష్ట్ర, కర్నాటక, ఛత్తీస్ ఘడ్, ఆంద్ర ఇలా దక్షిణ భారతాన ఉన్న అనేక ప్రాంతాలు ఈ రాజ్యంలోకి వచ్చాయి వెళ్ళాయి, కాని ఏ రోజైతే ఈ నగరం పురుడు పోసుకుందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హైదరాబాద్కు చుట్టుపక్కల ఉన్న ఈ 9 తెలంగాణా జిల్లాలకు మాత్రం హైదరాబాదే రాజధాని . ఎందుకంటే హైదరాబాద్ నిర్మాణం జరిగిందే ఈ ప్రాంత రాజధాని అవసరాలు తీర్చడానికి, కావున దీనిపై పూర్తి హక్కు ఈ ప్రాంతంవారికే దక్కుతుంది.
                  సీమాన్ధ్రులు వచ్చాకే హైదరాబాద్కు పెట్టుబడులు వచ్చాయని, వాల్లే ఇక్కడ సంపదను పెంచి పోషించారని అవేశపడుతూ మాట్లదేవాళ్ళను అడగవలసింది ఒక్కటే, నువ్వు ఎన్ని కోట్ల పెట్టుబడులు ఇక్కడ పెట్టావు అని, 5 కోట్లమంది ఆంద్ర వాళ్ళలో ఎంతమంది హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టారు అనేది అడిగితే మేం పెట్టుబడులు పెట్టి పోషించాం అనే వాదన వెనక ఉన్న డొల్లతనం తెలిసిపోతుంది, సముద్రంలో వలలు వేసుకుంటూ జీవనం సాగించుకునే జాలరికి, ఎక్కడో నెల్లూరులో ఆటో నడుపుకునే ఆటో డ్రైవర్ కి, శ్రీ కాకుళం లో వ్యవసాయం చేసుకునే ఒక రైతు కులికి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళతో ఎం సంబంధం..? వాళ్ళ లాభాల్లో వీళ్ళకు వాటాలేం రావు కదా ..? 
              ఒక ఊరిలో వెయ్యి జనాభా ఉంది 9 కిరాణా షాపులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇంకో కిరాణ షాప్ పెట్టాలనుకోవడం అర్థం లేని ఆలోచన, ఆ ఊర్లో లేని ఏ వస్తువు కోసం జనం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారో గమనించి, ఆ షాప్ పెట్టడం అనేది తెలివైన ఆలోచన.. వ్యాపారం చేసుకునేవాడు లాభం కోసమే వ్యాపారం చేస్తాడు. కిరాణా షాప్ సరిగా నడవనన్ని రోజులు ఆ యజమాని, అతని భార్య, వారి కుటుంబమే నడిపించుకుంటుంది, కాని ఒక్కసారిగా షాప్ అభివృద్ధి చెంది బాగా గిరాకి అయినప్పుడు, వస్తున్న జనాన్ని బట్టి ఒకరో ఇద్దరో పనివాళ్ళను పెట్టుకుంటారు, ఇక్కడ పనివాళ్ళను ఎందుకు పెట్టుకున్నారు, వాళ్ళకు ఎ ఉద్యోగం లేదు కాబట్టి దయతలచి కాదు కదా తనకు అవసరం ఉంది కాబట్టే, ఇందులో ఎ సమాజ సేవా లేదు. ఆ షాప్ బాగా అభివృద్ధి చెందితే ఆ షాప్ లో  వస్తువులు కొన్నవాడికి, గతం లో వాడికి భూమిని అమ్మినవాడికి, ఆ ఊరికి వచ్చే లాభం ఏమిటి ..? అక్కడ ఆ వ్యాపారానికి మార్కెట్ లేకపోతే అంటే ఆ వ్యాపారి అక్కడ పెట్టుబడి పెట్టే వాడు కాదు. తనకు కావాల్సింది కేవలం లాభాలు అంతే కాని ఆ ఊరి అభివృద్ధి కాదు కదా..? అతను తన వ్యక్తిగత ఆస్తులు పెంచుకున్నాడు అంతే తప్ప అతను సమాజానికి చేసిన గొప్ప మేలు ఏమిలేదు.. మరి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టినవాడు నగరాన్ని అభివృద్ధి చేద్దామనో, సామాన్యులకు ఉపాది కల్పిద్దామనొ పెట్టారా..? ఇక్కడ అన్ని అనుకూలతలు ఉన్నయి, వ్యాపారం చేస్తే లాభాలు వస్తాయి అని మాత్రమె కదా పెట్టుబడులు పెట్టింది , ఇక్కడ పెట్టుబడులు పెడితే లాస్ వస్తుంది అని తెలిస్తే పెట్టుబడులు పెట్టడు కదా.  హైదరాబాద్ లో వచ్చిన ప్రవేట్ పరిశ్రమల ద్వార వారి వ్యక్తిగత ఆస్తులు పెరిగాయి అంతే దాని వాళ్ళ హైదరాబాద్ లో ఉన్న సామాన్య జనానికి ఒరిగింది ఏమి లేదు, పాతనగరం లో తోపుడు బల్లపై పండ్లమ్ముకునే వాడి జీవితం, బస్తిల్లో బతికే సామన్యుని జీవితం హై టెక్ సిటీ రావడం వాల్ల మారాయా..? 
               అభివృద్ధి అంటే ఏమిటి..? ఒక ప్రాంతం లో అభివృద్ధి జరిగింది అంటే అక్కడి ప్రజల కొనుగోలు సామర్ధ్యం పెరగాలి. ఉదాహరణకు రోజుకు 20 సంపాదించే వారు 200 రూపాయలు సంపాదించే పరిస్థితి వచ్చిందంటే అతని జీవన ప్రమాణం మారుతుంది, అతను విలువైన వస్తువులు కొనగాలుగు తారు, అక్కడికి కొత్త వ్యాపార సంస్థలు వస్తాయి, ఫలితం గా మార్కెట్ సదుపాయాలు పెరుగుతాయి, రావాణా సదుపాయాలు మెరుగవుతాయి, ఇలా ఆ ప్రాంతం నుండి ప్రభుత్వానికి రాబడి పెరుగుతుంది. మరి హైదరాబాద్ లో ఇది జరిగిందా ..? పాతనగరంలో,బస్తిల్లో దశాబ్దాలుగా జీవిస్తున్న వారి పరిస్థితులలో ఐటి, ఫార్మ పరిశ్రమల రాకతో మార్పు జరిగిన్దా..? వాళ్ళ జీవన ప్రమాణం మారిన్దా..? మరి హైదరాబాద్ అభివృద్దికి సీమంధ్రులు కారణం ఎలా అవుతారు..?
            ఒక ప్రాంతం లో పుష్కలం గా తాగునీరు లభిస్తే, నీటి సమస్య లేకపోతే ఆ ప్రాంతం నిజంగా అభివృద్ధి చెందిన ప్రాంతం, 1950 ల నాటికి స్వచ్చమైన తాగు, సాగు నీరు అందించిన మూసి నది, హుస్సేన్ సాగర్ జలాశయమ్ నేడు మురికి కుపాలుగా మారాయి, ఈ రోజు ఇక్కడి ప్రజలు తీగునీటి కోసం మరో నదిపై ఆధారపడవలసిన పరిస్థితి వచ్చింది.. సహజ వనరులను ధ్వంసం చెయ్యడమెనా... అభివృద్ధి అంటే..? 
                            హైదరాబాద్ లో ఉన్న సీమంద్రులకు తెలంగాణా ఏర్పడటం తో భద్రత కరువవుతుంది అనే ప్రచారం చేస్తున్నారు, కేవలం నగరం లోనే కాకుండా నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, ఇలా తెలంగాణా లోని అన్ని జిల్లాల్లో ఆంద్ర వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ లేని భద్రత సమస్య హైదరాబాద్ లో ఉండేవాళ్లకే ఎందుకు వచ్చింది..? 
                    హైదరాబాద్ ప్రజల అభిప్రాయాన్ని అడిగితే ఎక్కువ మంది తెలంగాణ తో ఉండటానికి ఇష్టపడరని మరో విష ప్రచారం చేస్తున్నారు, నిజానికి హైదరాబాద్ నగరం ఊపిరిపోసుకున్నదే తెలంగాణ ప్రాంతానికి రాజధాని సమస్య తీర్చడాని, పుష్కలమైన నీరు, ఎత్తైన ప్రాంతంలో ఉండటం వళ్ళ విపత్తుల సమస్య లేదు, వాతావరణం ఆహ్లాదకరం గా ఉండటం, అమీబా లా ఎంత వరకైనా విస్తరించగల విశాలమైన కాళీ భూములు నగరం చుట్టుపక్కల ఉండటం ఇవన్ని ఈ ప్రాంతం రాజధానిగా 4 శతాబ్దాలుగా కొనసాగడానికి అనుకూల అంశాలు, ఈ కాలంలో మహారాష్ట్ర ప్రాంతాలు, కర్ణాటక, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, సీమంద్ర ఇలా అనేక ప్రాంతాలు కలిసి విడిపోయాయి, కాని 4 శతాబ్దాలుగా తెలంగాణా లోని 10 జిల్లాలకు రాజధాని హైదరాబాదే..! ఇక ముందు కుడా తెలంగాణా రాష్ట్రానికి రాజధాని హైదరాబాదే అని హైదేరాబాదిలు కోరుకుంటున్నారు, ఆ సర్వే రిపోర్ట్ మీ కోసం.... 
                                                           - సర్వే రిపోర్ట్ ఆంద్రజ్యోతి నుండి... 
                                               
                           

4, ఆగస్టు 2013, ఆదివారం

కాంగ్రెస్ కొత్త నాటకాలు...


కాంగ్రెస్ పార్టీ డ్రామాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. నిన్నటిదాకా అవునని కాని, కాదు అని చెప్పకుండా మూతి ముడుచుకొని ఉన్న కాంగ్రెస్ ఒకే రోజు సి డబ్ల్యు సి, యుపిఎ సమన్వయ భేటి నిర్వహించి తెలంగాణకు అనుకూల తీర్మానాలు చేశారు. 
            ఇక్కడే అసలు నాటకం మొదలయ్యింది. అంతవరకు తెలంగాణకు అంగీకరిస్తున్నామని చెప్పిన సీమంధ్రులు ఉద్యమ(?) బాట పట్టారు. ఉద్యమం అంటే ఏమిటో కాదు వారి దృష్టిలో విద్వంసమే..! వారి ఆరాటం పరమార్ధం ఏమిటంటే ఎలాగో రాష్ట్రం విడిపోతుంది, వాళ్లకు దక్కని హైదరాబాద్ అవతలి వాళ్ళకు కుడా దక్కకుండా చెయ్యాలనే కుట్ర, సీమంద్ర నాయకులు హైదరాబాద్ ను తెలంగాణా ప్రజలు వదులుకొని కరీంనగర్, వరంగల్ లో ఎక్కడైనా రాజధాని పెట్టుకొమ్మని అంటున్నారు... 
                   అయితే ఈ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా సి ఎం, ఫై సి సి చీఫ్ బుర్రల్లోనించి పుట్టిందే.. వై సి పీ కి ఉన్న అతికొద్దిమంది నాయకులూ కుడా తెలంగాణా లో కాలి అవడంతో వాళ్ళు సీమంద్ర జండా పట్టుకున్నారు, సమైక్యంద్ర కోసం రాజీనామాలు చేసి విధ్వంసాలు మొదలుపెట్టారు, ఇప్పుడు కేంద్రం గతంలో మాదిరిగా వెనక్కి వెల్లదని వాళ్ళకు కుడా తెలుసు మరి అలాంటప్పుడు ఉద్యమం ఎందుకు అంటే...2014 ఎన్నికలలో లాభం పొందాలి కదా... అలాగే వై ఎస్ అర్ చనిపోయినప్పుడు టి వి లో ఆ వార్త చూస్తూ గుండె పోటు వచ్చి మరణించారని లిస్టు తయరుచేసినట్టే, ఇప్పుడు కుడా సమైక్యంద్ర కోసం టి వి చూస్తూ మరణించారంటూ లిస్టు తయారు చేస్తున్నారు మీడియా వారు... ఇదంతా ఎన్దుకొసమంటే 2014 లో కాంగ్రెస్ మల్లి అధికారంలోకి రావాలి. వై సి పీ తో ఇప్పటికే అవగాహన కుదుర్చుకున్నారు కాబట్టే తెలంగాణా పై ప్రకటన చేసారు. 2014 లో కాంగ్రెస్ కు ఓటు వేసిన, వై సి పీ కి వేసినా అది కాంగ్రెస్ కు వేసినట్టే. ఇప్పుడు నడిపిస్తున్న ఉద్యమం ద్వారా వై సి పీ ని సీమంద్రలో బలపరచడం ద్వారా 2014 లో లాభం పొందవచ్చానేది కాంగ్రెస్ వ్యూహం ... 
                మరి టి డి పీ ఎం చేస్తున్నట్లు? తెలంగాణా రాకుండా చివరివరకు కాంగ్రెస్ పెద్దలకు ఫోన్లు చేస్తూ ప్రదేయ పడ్డాడట బాబు, ఒక ఆంగ్ల పత్రిక వెల్లడించిన విషయం ఇది, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నాక ప్రెస్ మీట్ పెట్టి రెండు రాష్ట్రాలు సక్యతతో ఉండాలని సీమంద్రకు 5 లక్షల కోట్ల ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి మొఖం చాటేశాడు. ఇక మిగతా పని ఆ పార్టీ సీమంద్ర నాయకులూ చూసుకుంటున్నారు, బాబు మార్గదర్శనంలో రాజీనామాలు చేసారు, ఇలాగు రాష్ట్ర ఏర్పాటు ఆగదు కాబట్టి హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయించేందుకు కృషి చేస్తున్నాడు. 

మొత్తంగా అన్ని పార్టీల అసలు రంగులు బయట పడుతున్న ప్రస్తుత తరుణంలో...  తెలంగాణా కాంగ్రెస్ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయి. తెలంగాణ మేమే తెచ్చామ్, సోనియమ్మతో మాట్లాడి తెచ్చాం, కె సి అర్ నోటిని అదుపులో పెట్టుకోవాలని అంటూ, సీమందృ లపై తెగ సానుభూతి కురిపిస్తున్నరు, గడచిన 12 ఏళ్ళ ఉద్యమంలో ఒకే ఒక సభపెట్టి మేమే తెలంగాణా తెచ్చాం అని చంకలు గుద్దుకునే వారు 1000 మంది చనిపోక ముందు సోనియా తో ఎందుకు మాట్లాడి తెలంగాణా తేలేదు..? ఇవ్వాళ్ళ ఉద్యమ ఫలితమే తెలంగాణ రాష్ట్రం అంటే చిర్రు బుర్రు లాడుతున్న ఈ నాయకులు ఎప్పుడు ఉద్యమం చేసారు..?  వీళ్ళు తెలంగాణా ఏర్పడే వరకూ తెలంగాణ కు వ్యతిరేఖమే, సి ఎం కు అనుకూలం, ఇంకా కొంతమైంది నాయకులైతే దిగజారి మాట్లాడి తెలంగాణా నాయకులంటే బానిస మనస్తత్వమ్ కల్గినవారని నిరూపించారు, వీళ్ళ చేతుల్లో రేపు కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రాన్ని పెడితే కుక్కలు చింపిన విస్తరిగా చేస్తారు, వీళ్ళు ఇప్పుడే కె సి అర్ ను పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు, రేపు ఉద్యమకారులను ఇలాగె పక్కకు నేట్టేస్తారేమో, తెలంగాణ ఉద్యమం ఇక్కడితో ముగుసిపోలేదు, ఈ బానిస నాయకత్వం పోయేవరకు, మనం కోరుకున్న అన్ని కోరికలు తీరేవరకు పోరాడాలి.. ఇది అంతం కాదు ఇదే నిజమైన ఆరంభం...