హోం

11, ఆగస్టు 2013, ఆదివారం

తెలంగాణ గుండెచప్పుడు



తెలంగాణా గుండె హైదరాబాద్ మహా నగరం, దక్షిణ భారత దేశంలోని వివిధ ప్రాంతాలకు రాజధానిగా నిలిచి, అనేక సంస్కృతులను ఆకళింపు చేసుకున్న నగరం, చారిత్రక వారసత్వ నగరంగా కీర్తినందుకున్న నగరంపై నేడు వివాదం ఎందుకు ..? హైదరాబాద్ రాజధానిగా పరిపాలన సాగిన గత 500 ఏళ్ళ కాలంలో మహారాష్ట్ర, కర్నాటక, ఛత్తీస్ ఘడ్, ఆంద్ర ఇలా దక్షిణ భారతాన ఉన్న అనేక ప్రాంతాలు ఈ రాజ్యంలోకి వచ్చాయి వెళ్ళాయి, కాని ఏ రోజైతే ఈ నగరం పురుడు పోసుకుందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హైదరాబాద్కు చుట్టుపక్కల ఉన్న ఈ 9 తెలంగాణా జిల్లాలకు మాత్రం హైదరాబాదే రాజధాని . ఎందుకంటే హైదరాబాద్ నిర్మాణం జరిగిందే ఈ ప్రాంత రాజధాని అవసరాలు తీర్చడానికి, కావున దీనిపై పూర్తి హక్కు ఈ ప్రాంతంవారికే దక్కుతుంది.
                  సీమాన్ధ్రులు వచ్చాకే హైదరాబాద్కు పెట్టుబడులు వచ్చాయని, వాల్లే ఇక్కడ సంపదను పెంచి పోషించారని అవేశపడుతూ మాట్లదేవాళ్ళను అడగవలసింది ఒక్కటే, నువ్వు ఎన్ని కోట్ల పెట్టుబడులు ఇక్కడ పెట్టావు అని, 5 కోట్లమంది ఆంద్ర వాళ్ళలో ఎంతమంది హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టారు అనేది అడిగితే మేం పెట్టుబడులు పెట్టి పోషించాం అనే వాదన వెనక ఉన్న డొల్లతనం తెలిసిపోతుంది, సముద్రంలో వలలు వేసుకుంటూ జీవనం సాగించుకునే జాలరికి, ఎక్కడో నెల్లూరులో ఆటో నడుపుకునే ఆటో డ్రైవర్ కి, శ్రీ కాకుళం లో వ్యవసాయం చేసుకునే ఒక రైతు కులికి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళతో ఎం సంబంధం..? వాళ్ళ లాభాల్లో వీళ్ళకు వాటాలేం రావు కదా ..? 
              ఒక ఊరిలో వెయ్యి జనాభా ఉంది 9 కిరాణా షాపులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇంకో కిరాణ షాప్ పెట్టాలనుకోవడం అర్థం లేని ఆలోచన, ఆ ఊర్లో లేని ఏ వస్తువు కోసం జనం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారో గమనించి, ఆ షాప్ పెట్టడం అనేది తెలివైన ఆలోచన.. వ్యాపారం చేసుకునేవాడు లాభం కోసమే వ్యాపారం చేస్తాడు. కిరాణా షాప్ సరిగా నడవనన్ని రోజులు ఆ యజమాని, అతని భార్య, వారి కుటుంబమే నడిపించుకుంటుంది, కాని ఒక్కసారిగా షాప్ అభివృద్ధి చెంది బాగా గిరాకి అయినప్పుడు, వస్తున్న జనాన్ని బట్టి ఒకరో ఇద్దరో పనివాళ్ళను పెట్టుకుంటారు, ఇక్కడ పనివాళ్ళను ఎందుకు పెట్టుకున్నారు, వాళ్ళకు ఎ ఉద్యోగం లేదు కాబట్టి దయతలచి కాదు కదా తనకు అవసరం ఉంది కాబట్టే, ఇందులో ఎ సమాజ సేవా లేదు. ఆ షాప్ బాగా అభివృద్ధి చెందితే ఆ షాప్ లో  వస్తువులు కొన్నవాడికి, గతం లో వాడికి భూమిని అమ్మినవాడికి, ఆ ఊరికి వచ్చే లాభం ఏమిటి ..? అక్కడ ఆ వ్యాపారానికి మార్కెట్ లేకపోతే అంటే ఆ వ్యాపారి అక్కడ పెట్టుబడి పెట్టే వాడు కాదు. తనకు కావాల్సింది కేవలం లాభాలు అంతే కాని ఆ ఊరి అభివృద్ధి కాదు కదా..? అతను తన వ్యక్తిగత ఆస్తులు పెంచుకున్నాడు అంతే తప్ప అతను సమాజానికి చేసిన గొప్ప మేలు ఏమిలేదు.. మరి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టినవాడు నగరాన్ని అభివృద్ధి చేద్దామనో, సామాన్యులకు ఉపాది కల్పిద్దామనొ పెట్టారా..? ఇక్కడ అన్ని అనుకూలతలు ఉన్నయి, వ్యాపారం చేస్తే లాభాలు వస్తాయి అని మాత్రమె కదా పెట్టుబడులు పెట్టింది , ఇక్కడ పెట్టుబడులు పెడితే లాస్ వస్తుంది అని తెలిస్తే పెట్టుబడులు పెట్టడు కదా.  హైదరాబాద్ లో వచ్చిన ప్రవేట్ పరిశ్రమల ద్వార వారి వ్యక్తిగత ఆస్తులు పెరిగాయి అంతే దాని వాళ్ళ హైదరాబాద్ లో ఉన్న సామాన్య జనానికి ఒరిగింది ఏమి లేదు, పాతనగరం లో తోపుడు బల్లపై పండ్లమ్ముకునే వాడి జీవితం, బస్తిల్లో బతికే సామన్యుని జీవితం హై టెక్ సిటీ రావడం వాల్ల మారాయా..? 
               అభివృద్ధి అంటే ఏమిటి..? ఒక ప్రాంతం లో అభివృద్ధి జరిగింది అంటే అక్కడి ప్రజల కొనుగోలు సామర్ధ్యం పెరగాలి. ఉదాహరణకు రోజుకు 20 సంపాదించే వారు 200 రూపాయలు సంపాదించే పరిస్థితి వచ్చిందంటే అతని జీవన ప్రమాణం మారుతుంది, అతను విలువైన వస్తువులు కొనగాలుగు తారు, అక్కడికి కొత్త వ్యాపార సంస్థలు వస్తాయి, ఫలితం గా మార్కెట్ సదుపాయాలు పెరుగుతాయి, రావాణా సదుపాయాలు మెరుగవుతాయి, ఇలా ఆ ప్రాంతం నుండి ప్రభుత్వానికి రాబడి పెరుగుతుంది. మరి హైదరాబాద్ లో ఇది జరిగిందా ..? పాతనగరంలో,బస్తిల్లో దశాబ్దాలుగా జీవిస్తున్న వారి పరిస్థితులలో ఐటి, ఫార్మ పరిశ్రమల రాకతో మార్పు జరిగిన్దా..? వాళ్ళ జీవన ప్రమాణం మారిన్దా..? మరి హైదరాబాద్ అభివృద్దికి సీమంధ్రులు కారణం ఎలా అవుతారు..?
            ఒక ప్రాంతం లో పుష్కలం గా తాగునీరు లభిస్తే, నీటి సమస్య లేకపోతే ఆ ప్రాంతం నిజంగా అభివృద్ధి చెందిన ప్రాంతం, 1950 ల నాటికి స్వచ్చమైన తాగు, సాగు నీరు అందించిన మూసి నది, హుస్సేన్ సాగర్ జలాశయమ్ నేడు మురికి కుపాలుగా మారాయి, ఈ రోజు ఇక్కడి ప్రజలు తీగునీటి కోసం మరో నదిపై ఆధారపడవలసిన పరిస్థితి వచ్చింది.. సహజ వనరులను ధ్వంసం చెయ్యడమెనా... అభివృద్ధి అంటే..? 
                            హైదరాబాద్ లో ఉన్న సీమంద్రులకు తెలంగాణా ఏర్పడటం తో భద్రత కరువవుతుంది అనే ప్రచారం చేస్తున్నారు, కేవలం నగరం లోనే కాకుండా నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, ఇలా తెలంగాణా లోని అన్ని జిల్లాల్లో ఆంద్ర వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ లేని భద్రత సమస్య హైదరాబాద్ లో ఉండేవాళ్లకే ఎందుకు వచ్చింది..? 
                    హైదరాబాద్ ప్రజల అభిప్రాయాన్ని అడిగితే ఎక్కువ మంది తెలంగాణ తో ఉండటానికి ఇష్టపడరని మరో విష ప్రచారం చేస్తున్నారు, నిజానికి హైదరాబాద్ నగరం ఊపిరిపోసుకున్నదే తెలంగాణ ప్రాంతానికి రాజధాని సమస్య తీర్చడాని, పుష్కలమైన నీరు, ఎత్తైన ప్రాంతంలో ఉండటం వళ్ళ విపత్తుల సమస్య లేదు, వాతావరణం ఆహ్లాదకరం గా ఉండటం, అమీబా లా ఎంత వరకైనా విస్తరించగల విశాలమైన కాళీ భూములు నగరం చుట్టుపక్కల ఉండటం ఇవన్ని ఈ ప్రాంతం రాజధానిగా 4 శతాబ్దాలుగా కొనసాగడానికి అనుకూల అంశాలు, ఈ కాలంలో మహారాష్ట్ర ప్రాంతాలు, కర్ణాటక, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, సీమంద్ర ఇలా అనేక ప్రాంతాలు కలిసి విడిపోయాయి, కాని 4 శతాబ్దాలుగా తెలంగాణా లోని 10 జిల్లాలకు రాజధాని హైదరాబాదే..! ఇక ముందు కుడా తెలంగాణా రాష్ట్రానికి రాజధాని హైదరాబాదే అని హైదేరాబాదిలు కోరుకుంటున్నారు, ఆ సర్వే రిపోర్ట్ మీ కోసం.... 
                                                           - సర్వే రిపోర్ట్ ఆంద్రజ్యోతి నుండి... 
                                               
                           

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి