హోం

1, నవంబర్ 2011, మంగళవారం

నవంబర్ 1 నలుపు దినోత్సవం....

(నవంబర్ 1 ) తెలంగాణా JAC ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణా వాదులంత నల్ల జెండాలను ఎగురవేసి తమ నిరసనను తెలిపారు, పది జిల్లాలలోని ప్రజలు నల్లజెందాలను తమ ఇళ్ళపై ఎగురవేసారు,, నాయిని నరసింహ రెడ్డి తెలంగాణా భవన్ పై నల్ల జెండా ఎగురవేసారు, రంగారెడ్డి కోర్ట్ పై నల్ల జెండా ఎగురవేయడానికి లాయర్లు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు, OU లో మరో సరి ఉద్రిక్తతలు కొనసాగాయి, కాంపస్ నుండి గన్ పార్క్ వరకు విద్యార్థులు చేపట్టిన రాలీని పోలీసులు యాదయ్య NCC గేటు వద్ద అడ్డుకున్నారు, విద్యార్థులు పెద్దఎత్తున నినాదాలు చెయ్యడంతో పోలీసులు లాటి చార్జ్ చేసారు, దీనితో విద్యార్థులు పోలీసులపైకి రాళ్ళూ విసిరారు, దీంతో రెచ్చిపోయిన పోలీసులు భాష్పవాయు గోలాలను ప్రయోగించారు, ఇలా మధ్యానం వరకు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి, ఉద్యోగులు నల్ల బాడ్జి లతో ఆఫీసు లకు వెళ్లారు, కార్మికులు, ఉపాధ్యాయులు కూడా నల్ల బాద్జిలతో విధులకు హాజారయ్యారు, వరంగల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన అవతరణ వేడుకలను ఎం ఎల్ ఎ వినయ భాస్కర్ అడ్డుకున్నారు, వేదికపైకి వెళ్లి పోస్టర్ ను  చిన్చివేసారు, దీనితో అక్కడే ఉన్న పోలీసులు ఆయనపై దురుసుగా ప్రవర్తించడంతో ఆయన స్పృహ కోల్పోయారు, ఆయన పై నాన్ బెయిలబుల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలనీ ప్రయత్నిస్తున్నారు, అయితే విషయం తెలుసుకున్న కార్యకర్తలు పెద్ద సంక్యలో చేరుకొని పోలీసులను అడ్డుకుంటున్నారు,..


లండన్ లో బ్లాక్ డే:

లండన్ లో  ఉన్న తెలంగాణా NRI లు నల్ల జెండాలను ఎగురవేసి బ్లాకు డే ను జరుపు కునారు, ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమం లో పాల్గొన్న వక్తలు సమైక్య రాష్ట్రంలో తెలంగాణా పూర్తిగా దోచుకో బడిందని, ప్రత్యేక రాష్ట్రమే సరైన పరిష్కారమని వారు అభిప్రాయపడ్డారు....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి