హోం

6, నవంబర్ 2011, ఆదివారం

ఇంటిని చక్కదిద్దలేనోడు, ఊరిని చక్క దిద్దుతనన్నాడట..!


పరకాల ప్రభాకర్ అనే వ్యక్తి పేరు వినే ఉంటారు, ఇతగాడు విలేకరిగా పని చేసి ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యంలో చేరి టికెట్ ఇవ్వలేదని అలిగి పార్టీ నుండి బయటకు వచ్చి చిరంజీవిని, పార్టీని చెడమడా తిట్టి ఆతర్వాత ఎం చెయ్యాలో అర్థం గాని సమయంలో తెలంగాణా ఉద్యమ౦ ప్రారంబం అయ్యింది, ఇంకేం విశాలాంద్ర మహా సభలు అని డిల్లి లో నిర్వహించాడు, అక్కడ జే ఎన్ యు విద్యార్థులు అడ్డుకుంటే వారికి ఏమి సమాధానం చెప్పాలో తెలియక బిత్తరపోయిన ఈయన ఆతర్వాత హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడితే అవికూడా రసాభాస అయ్యాయి, ఇతగాడు ఈ రోజు రాష్ట్రం సమైక్యంగా ఎందుకు ఉండాలి అనే విషయం పై 101 కారణాలతో ఒక పుస్తకాన్ని తీసుకొని వచ్చాడంట.. దీనిని దేశ రాజధాని డిల్లి లో ఆవిష్కరించాడు . మీకు నిర్మల సీతరామన్ ఎవరో తెలుసా..? ఆవిడ బి జే పీ జాతీయ మీడియా ప్రతినిధి, ఆవిడ తన పార్టీ సిద్ధాంతం ప్రకారం తెలంగాణా కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు, ఆవిడ నల్గొండ లో జరిగిన తెలంగాణా పోరు సభకు సుష్మ స్వరాజ్ తో పాటు హాజరయ్యారు.. ఇక వీరిద్దరికీ సంబంధం ఏమిటంటే , వీళ్ళిద్దరు భార్య భర్తలు..మరి పరకాల ప్రభాకర్ కనీసం తన భార్య చేత కూడా విశాలన్ద్రకు మద్దతు పొందలేక పోయాడు మరి ప్రజలను ఎలా సముధయిస్తడు...?



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి