హోం

21, నవంబర్ 2011, సోమవారం

2014 ప్రధాని పీటంపై కన్నేసిన మాయ..


ఉత్తర ప్రదేశ్ ను విబజించాలంటూ యు పీ సి ఎం మాయావతి ఈ రోజు ఆ రాష్ట్ర అసెంబ్లీ లో తీర్మానం ప్రవేశపెట్టారు, ఈ సందర్భంగా ఆమె మీడియా తో మాట్లాడారు, ఆంద్ర ప్రదేశ్ విబజన విషయంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ లో తీర్మానం పాస్ చేస్తేనే కేంద్రం ముందుకు వెల్ల గలుగుతుంది అని చెప్పిన కాంగ్రెస్ కు సమాధానం గా ఆమె అసెంబ్లీ లో యు పీ ని విబజించాలంటూ తీర్మనంచేసి౦ది. అసెంబ్లీ తీర్మానం కావాలని కేంద్రం తెలంగాణా విషయంలో చెప్పింది, ఇప్పుడు మేము అదే చేసాం మరి ఇప్పుడు కేంద్రం యు పీ ని చిన్న రాష్ట్రాలుగా విబజిస్తుంద లేకపోతే ఆడిన మాట తప్పుతుంద అని ఆమె నిలదీసింది.
      ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, గతంలో యు పీ ని మూడు రాష్ట్రాలుగా విబజించడానికి సుముకంగా ఉన్నామని చెప్పిన కాంగ్రెస్ వైకరిని నగ్నంగా ప్రజలమున్దుంచడమే కాకా, చిన్న రాష్ట్రాల విషయంలో కాంగ్రెస్ ఆడుతున్న దొంగ నాటకాలను దేశానికి ఎత్తి చూపించి రాబోయే యు పీ ఎన్నికలలోనే కాకుండా 2014 లో తెలంగాణా లో కూడా పాగా వెయ్యాలని చూస్తుంది, తాను ప్రధాని కావడానికి ఉన్న అన్ని అనుకులతలను మాయ ఉపయోగించుకుంటుంది, ఈ పరిణామం ద్వార కాంగ్రెస్ ను ఇరుకున పెట్టడమేకాక చిన్న రాష్ట్రాలకు అనుకూలం అని చెప్పే బి జే పీ ని కూడా ఇరుకున పెటింది, యు పీ, తెలంగాణా ప్రజల ముందు కాంగ్రెస్, బి జే పీ ల వైకరులను తెలియజెప్పి తాను లాభం పొందాలని చూస్తుంది.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి