హోం

13, నవంబర్ 2011, ఆదివారం

తెలంగాణా ప్రజలను వంచించిన భారత ప్రభుత్వం....


తెలంగాణా పై యు పీ ఎ విధానమేమిటి అనేది నిన్న ప్రధాని, ఆర్ధిక మంత్రి ల వ్యాక్యాలతో తెలిసి పోయింది, తెలంగాణా రాష్ట్రం ఇవ్వడం పరిష్కారం కాదని, ప్రత్యామ్నాయాల్ని అన్వేషించి ఒక ప్రకటన చేస్తామని దాన్ని అందరు ఆమోదిన్చేల ఒప్పిస్తామని ప్రధాని అన్నారు, కాంగ్రెస్ చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం అని ప్రణబ్ అన్నారు, అధికారానికి 10 సంవత్సరాలు దూరంగా ఉన్న కాంగ్రెస్, 2004 లో దేశవ్యాప్తంగా అనేక చిన్నచితకా పార్టీలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ టి ఆర్ ఎస్ తో పొత్తుపెట్టుకొని తెలంగాణా ఏర్పాటుకోసం రెండవ ఎస్ ఆర్ సి వేస్తామని చెప్పారు, ఆ తర్వాత తెలంగాణా ఏర్పాటుకోసం సుధీర్గ చర్చల అనంతరం తెలంగాణా ఏర్పాటుచేస్తామని యు పీ ఎ కామన్ మినిమం ప్రోగ్రాంలో చేర్చారు,  ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణా అంశం చేర్చారు, 2009 ఎన్నికల ముందు తెలంగాణా ఏర్పాటుకు కాంగ్రెస్ సుముఖంగా ఉందని, రోశయ్య కమిటిని వేసారు రాజశేకర్ రెడ్డి, చివరగా 2009 లో కేంద్రం తెలంగాణా ఏర్పాటుచేస్తామని, దానికి సంబంధించిన తీర్మానం అసంబ్లీ లో ప్రవేశ పెడతామని చెప్పారు, ఆ మాట నుండి వెనక్కి వెళ్లి నిన్న ప్రధాని, కేంద్ర ఆర్ధిక మంత్రి యు పిఎ తెలంగాణా రాష్ట్రము ఏర్పాటు చెయ్యడానికి, బదులుగా ప్యాకేజి, రీజినల్ కమిటి లు ఏర్పాటు చెయ్యడానికి రంగం సిద్ధమైంది, కాంగ్రెస్ తన సాచివేత ధోరణి, తన చేతకాని తనాన్ని మరో సారి బయటపెట్టింది, ఎ ఎండకు ఆ గొడుగు పట్టేరకం, ఓడ దిగాక బోడి మల్లయ్య అనే రకం అనే విషయం అర్థం అవుతుంది, తనిచ్చే మాటను కూడా తాను నిలబెట్టుకోలేని చేతకాని చేవచచ్చిన ప్రభుత్వాలు ప్రజలనుండి ఓట్లు దండుకోవడానికి అడ్డమైన వాగ్ధానాలు చేసి జనాన్ని వంచించి మోసం చేసి మల్లి ఎన్నికల నాటికి జనాన్ని మబ్యపెట్టి పబ్బం గడుపుకొనే దరిద్రపు , దిక్కుమాలిన ప్రభుత్వాలను నమ్ముకోవడం వలన ఇంతకంటే గొప్పగా జరుగుతుంది అని ఆశించడం మన వెర్రితనం,  ఇక సమ్మెలు, ఉద్యమాలతో తెలంగాణా రాదని తెలిసి పోయింది, ఇక ఆయుధం పూర్తిగా ప్రజల చేతుల్లో ఉంది, మల్లి ఈ పనికి మాలిన, చవటలను(కాంగ్రెస్, టి డి పి) ఎన్నుకుంటే ఇక తెలంగాణా అనేది రానే రాదు, ఇకనైనా జనం ఓట్లు సరైన వారికి వేసి సరైన వారిని ఎన్నుకుంటే తెలంగాణా సాధించవచ్చు... ఈ కింది విడియో కు ప్రధాని చెప్పే సమాధానం ఏమిటి, నిజంగా ప్రజాస్వామ్యంలోనే తెలంగాణా ప్రజలు ఉన్నారా..? లేక స్వతంత్ర భారతంలో ఉన్న భానిసలు ఎవరైనా ఉన్నారా అంటే అది తెలంగాణా ప్రజలు అనడానికి ఈ కింది విడియో ఒక నిదర్శనం.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి