హోం

1, నవంబర్ 2011, మంగళవారం

దిక్షా దక్షులు....

కోమటిరెడ్డి దిక్ష:
( 01 /11 / 2011 ) తెలంగాణా బిల్లు పార్లమెంట్లో పెట్టాలనే డిమాండ్ తో మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎం ఎల్ ఎ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండలోని తెలంగాణా చౌక్ వద్ద నేడు ఉదయం ఆమరణ నిరాహార దిక్ష ప్రారంబించారు, ఉదయం వేలాది  మంది తెలంగాణా వాదులతో కలిసి రాలిగా నిరాహార దిక్ష వేదిక వద్దకు వచ్చారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన దిక్షను సి ఎం కుట్ర పూరితంగా భగ్నం చెయ్యాలని చూస్తే ఆత్మాహుతి చేసుకుంటానని సి ఎం ను హెచ్చరించారు, దిక్షలొ ఈ రోజు ఎం పిలు మంద జగన్నాధం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొన్నం, వివేక్, రాజయ్య, కేకే లు మరి కొంత మంది ఎం ఎల్ ఎ లు పాల్గొన్నారు, కాగ దిక్షకు కెసిఆర్ తన మద్దతును తెలిపారు, అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు మద్ధతుపలికాయి, జాక్ చైర్మెన్ కోదండ రామ్ కూడా మద్దతు ప్రకటించారు, మొత్తం 140 సంఘాలు దిక్షకు మద్దతు తెలిపాయి,  దిక్షలొ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులూ పాల్గొని దిక్షకు మద్దతు ప్రకటించారు, అన్ని కుల సంఘలవాళ్ళు పెద్దఎత్తున దిక్ష స్థలికి చేరుకొని తమ సంపూర్ణ మద్దతు తెలిపాయి, మొదటిరోజు కళాకారుల ఆటపాటలు, ఉద్యోగ సంఘాలు, కాంగ్రెస్ ఎంపి ఎం ఎల్ ఎ లు కుల సంఘాల తోపాటు భారీగా జనం తరలి రావడంతో మొదటి రోజు దిక్ష విజయవంతం అయింది... 

కొండ లక్ష్మణ్ బాపూజీ దిక్ష...


తెలంగాణా బిల్లు పర్లిమెంట్లో ప్రవేశపెట్టాలనే డిమాండ్తో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు  కొండా లక్ష్మణ్ బాపూజీ  ఈ రోజు ఉదయం డిల్లి లోని జంతర్ మంతర్ వద్ద దిక్ష ప్రారంబించారు, సామజిక జై ఆంద్ర కార్య కర్తలు పెద్ద  సంక్యలో వచ్చి జై తెలంగాణా, జై ఆంద్ర నినాదాలు చేసారు..
JAC మద్దతు:
కోమటి రెడ్డి, బాపూజీ ల దిక్షకు jac పూర్తిగా మద్దతిస్తుందని కోదండ రామ్ చెప్పారు, అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి ఉద్యమాన్ని ఉదృతం చెయ్యడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని ఆయన చెప్పారు...


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి