హోం

24, అక్టోబర్ 2011, సోమవారం

నల్ల సూరీల్లకు సలాం

(24/10/2011)తెలంగాణా లోని నాల్గు జిల్లాల్లో ఉన్న సింగరేణి గని కార్మికులంత తెలంగాణా కోసం ఒక్కటయ్యారు, జాక్ ఇచ్చిన పిలుపు మేరకు సెప్టెంబర్ 13 నుండి సకల జనుల సమ్మెలో భాగామయ్యిండ్రు, సింగరేణి కార్మికుల సమ్మె రాష్ట్రము పైనే కాక దేశవ్యాప్తంగా ప్రభావం చూపింది, తెలంగాణా వచ్చే దాక బొగ్గు పెల్ల పెకిలించేది లేదని తేల్చి చెప్పిన్రు, సింగరేణి సమ్మె ప్రభావం విద్యుత్ రంగం పై పడింది, దీనితో రాష్ట్రము లో మొదట రెండు గంటలతో ప్రరంబమైన విధ్యుత్కోతలు ఆ తర్వాత నగరాల్లో నాల్గు, పట్టణాల్లో ఆరు , గ్రామాల్లో పది గంటలు, వ్యవసాయానికి మూడు నుండి నాల్గు గంటలు విధించే వరకు వెళ్ళింది, పరిశ్రమలపై కూడా సమ్మె ప్రబావం పడింది, ఎన్నడు లేని విధంగా మొదటి సరిగా వర్షాకాలంలో పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించారు, అంతేకాదు, వారానికి రెండు రోజులు పవర్ హాలిడే అని ఒక రోజు వీక్ ఆఫ్ అని, పీక్ అవర్స్ ( 6 to 10 pm ) కరంటు కోతలు విధించారు, ఈ సమ్మె ప్రబావం మనరాస్త్రం తో పటు కర్ణాటక, కేరళ, తమిళ నాడు, ఢిల్లీ, మధ్య ప్రదేశ్, పశ్చిమ బంగా రాష్ట్రాలపై కూడా పడింది,
            బొగ్గు నిల్వలు లేక పోవడంతో NTPC వెయ్యి MW ల ఉత్పత్తిని నిలిపి వేసింది, KTPP , RTPP లను షట్ డౌన్ చేసారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యుత్ కేంద్రాల సామర్ధ్యం తగ్గించారు, మన రాష్ట్రము లోనే కాకుండా మహారాష్ట్రలో వెయ్యి MW ల విద్యుత్ కేంద్రం షట్ డౌన్ చేసారు, ఉత్తర ప్రదేశ్ కు కూడా సింగరేణి నుండే బొగ్గు వేల్తున్దడంతో అక్కడ కూడా ఉత్పతి నిలిచి పోయింది, మొత్తం గా NTPC తన అన్ని కేంద్రాల్లో కలిపి వెయ్యి MW మాత్రమే ఉత్పతి చేసింది.
                      35  రోజుల సింగరేణి సమ్మెతో దేశవ్యాప్తంగా అందకారం అలుముకుంది, కార్మికులను ఒక్క రోజు పని చేస్తే ఐదు రోజుల జీతం ఇస్తామని మబ్య పెట్టింది ప్రభుత్వం కాని ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టారు కార్మికులు, NTPC పైనే పూర్తిగా ఆధార పడిన కర్ణాటకలో సమ్మె మొదలైన మొదటి వారంలోనే ఎనిమిది గంటలు జిల్లాల్లో, రెండు గంటలు బెంగలూరు లో కరెంటు కోతలు విధించారు, ఇక మహారాష్ట్ర లో గ్రామీణ ప్రాంతాల్లో కర్రెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక జనం తిరగబడ్డారు, రోజుకు అప్రకటితంగా పది గంటల విద్యుత్ కోత ఉండేది, దేశ వాణిజ్య రాజధాని ముంబై, రాజధాని ఢిల్లీ లకు కూడా కర్రెంట్ కోతలు తప్పలేదు అన్ని రాష్ట్రాల సి ఎం లు సమస్య త్వరగా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరారు. 
                    సింగరేణి ప్రబావం కేవలం విధ్యుత్రంగం మీదనే కాదు, పారిశ్రామిక రంగం పై కూడా పడింది, బొగ్గు ఆధారిత పరిశ్రమలైన సిమెంట్ రంగం పై తీవ్ర ప్రభావం చూపింది, అంతే కాదు బొగ్గు ఆధారంగా నడిచే మధ్యతరహ, చిన్న తరహా పరిశ్రమలన్నీ మూత పడ్డాయి.                                                                                                                                                          35 రోజుల సమ్మెతో ఇది తెలంగాణా సత్తా అని లోకానికి చాటి చెప్పారు మన సింగరేణి కార్మికులు, ఇంకో పది రోజులు సమ్మె చేస్తే దేశం అందకారంలో కొట్టుమిత్తడుతుందని దాని ప్రబావం తొలగిపోవడానికి చాల సమయం పడుతుందని ప్రజల సౌకర్యార్ధం సమ్మెను విరమించుకున్నారు, చీకటి సూర్యుల్లకు సలాం.....

1 కామెంట్‌:

  1. సింగరేణిలో ఉత్పత్తి అయ్యిన బొగ్గును దేశం మొత్తంలో ఉన్న NTPC వాళ్లకు విద్యుత్తు ఉత్పత్తికోసం ఇచ్చి కాలువలు లేని తెలంగాణ ప్రాంత రైతన్నలకు విద్యుత్తు ఇవ్వకుండా వాళ్ళ గోస పోసుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతున్న తెలంగాణ ద్రోహులు మనుష్యులేనా?

    రిప్లయితొలగించండి