హోం

28, అక్టోబర్ 2011, శుక్రవారం

కాంగ్రెస్ కో కథం కరో, తెలంగాణా కో హాసిల్ కరో ...

(29 /10 /2011 ) గత నాలుగు రోజులుగా కే సి ఆర్ పైన, నమస్తే తెలంగాణా పేపర్ పైన మాటల దాడిని తీవ్రం చేసింది టి డి పి, నిన్న ఏకంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే స్వయంగా మీడియా ముందుకు వచ్చి కే సి ఆర్ పై విమర్శలు చేసారు, దీనికి కే సి ఆర్ స్పందించారు, గత నాలుగు రోజులుగా టి డి పి నేతలు వాగుతుంటే ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగు తాయి అనుకున్నాను కానీ నిన్న ఏకంగా చంద్ర బాబే రంగం లోకి దిగి విమర్శించడంతో మీడియా ముందుకు రావలసి వచ్చిందని చెప్పారు,
               పోలవరం విషయంలో జరుగుతున్న దుమారానికి తెర దించారు, పోలవరాన్ని మొదటినుండి వ్యతిరేకిస్తున్నది టి ఆర్ ఎస్ ఎ నని, 2005 లో పోలవరానికి వ్యతిరేకంగా హై కోర్ట్ కు వెళ్ళమని అయితే హై కోర్ట్ అన్ని అనుమతులు తీసుకున్నాకే, ప్రాజెక్ట్ను మొదలు పెట్టాలని చెప్పిందని, అందుకు సంబంధిచిన తీర్పు కాపిని చూపించారు, ఆ తర్వాత సుప్రీం కోర్టకు కూడా వెళ్ళమని ఇంకా కేసు విచారణ లోనే ఉందని, కేసు విచారణలో ఉండగా టెండర్లు ఇవ్వడం ఏమిటని మల్లి ఈ నెల 14 న సుప్రీం కోర్టులో మరో పిటిషన్ వేశామని చెప్పారు, తను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే పోలవరం విషయం సోనియా దృష్టికి తీసుకెల్లానని, అప్పటి కేంద్ర మంత్రి, ఆది వాసి ఐన శిభు సోరెన్ ను ఖమ్మం ఆది వాసుల దగ్గరికి తీసుకొని వచ్చి వారి వాయిసు కేంద్రానికి తెలిసేలా చేసానని, ఈ రోజుకి కూడా మేము స్పష్టంగానే ఉన్నామని, టెండర్లను రద్దు చెయ్యాలని సి ఎం కు లేఖ రాసానని, ఎలైన్ మెంట్ మార్చాలని అనేదే మా ప్రధాన డిమాండ్ అని అన్నారు, నమస్తే తెలంగాణా పత్రికకు కానీ , తనకు కానీ పోలవరం టెండర్ లతో ఎలాంటి సంబంన్ధం లేదని ఆయన స్పష్టం చేసారు, తనకు ఎవరు బినమిలు లేరని, షూ అనే కంపెనీకి తనకు ఎలాంటి సంబంధం లేదని, అది ప్రారంబించి 55 సంవత్సరాలు అవుతుందని, తనకు ఇప్పుడు 57 సంవత్సరాలని 2 ఏళ్ళ వయసులో బినమిని పెట్టి కంపని పెట్టాన అని ప్రశ్నించారు.. నమస్తే తెలంగాణాలో తను 4  కోట్ల పెట్టు బదులు పెట్టనని, అవికూడా తన మిత్రుని దగ్గర అప్పుగా తీసుకున్నానని, ఆ వివరాలు  రిజిస్ట్రేషన్ ఆఫీసు లో కూడా ఇచ్చానని వీళ్ళు కొత్తగా బయట పెట్టింది ఏమి లేదని అన్నారు, తాము తెలంగాణా కు జరుగుతున్న అన్యాయాలను ఎత్తి చూపడానికి ఒక కర పత్రం కావాలని నమస్తే తెలంగాణా ను స్త్తాపించమే తప్ప "నీలగ బినామీ పేర్లతో హెరిటేజ్ లు పెట్టలేదు కదా" అని చంద్రబాబు ను ఉద్దేశించి అన్నారు, అయితే నమస్తే తెలంగాణా పేపర్లో చాలామంది పెట్టుబడులు పెట్టారని అందులో ఒకరు రాజం అని, ఆయన కు ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో మనకు ఎం తెలుసని, ఆయన ను నియంత్రించాల్సిన అవసరం మనకేంటని, తెలంగాణా కోసం ఒక పత్రిక పెట్టం, అందులోని షేర్ హోల్దేర్స్ ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారే తప్ప వాళ్ళకు పత్రికకు ఎం సంబంధం అని ఆయన ప్రశ్నించారు.
                                    2 ఎకరాల భూమి ఉన్న కుటుంబం లో చంద్ర బాబు పుట్టాడని, తన ఇల్లే తను పుట్టేనాటికి 2  ఎకరాల్లో ఉండేదని, అది ఇప్పుడు సిద్దిపేట లో జిల్లా పరిషత్ స్కూల్ కు విరాళంగ ఇచ్చామని కెసిఆర్ చెప్పారు, తన దగ్గర దాచు కోవడానికి ఏమి లేదని, కే సి ఆర్ తన ఆస్తుల వివరాలను భహిర్గతం చేసారు, ఆయనకు మెదక్ జిల్లలో లో 24 ఎకరాల పంట భూమి ఉందని, హైదరాబాద్లో ఒక ఇల్లు, 2006 ఎన్నికల తర్వాత కరీం నగర్లో ఒక ఇల్లు కట్టుకున్నానని ఆయన తెలిపారు, నమస్తే తెలంగాణా పత్రికలో నాలుగు కోట్లు అప్పు తీసుకొని పెట్టుబడి పెట్టనని, అలాగే టి న్యూస్ లో 55 లక్షల పెట్టు బడులు ఉన్నాయని అన్నారు, చంద్ర బాబు ఇంటి పేరు నమ్మక ద్రోహం, ఒంటి పేరు నయ వంచన, అసలు పేరు కుంబకోణం అని ఎద్దేవా చేసారు.
                                           టి ఆర్ ఎస్ కేవలం తమనే టార్గెట్ చేస్తుంది అంటున్న టి డి పి నేతలకు కూడా ఆయన సమాధానం చెప్పారు, మొన్ననే  జే ఎ సి కొత్త నినాదం తీసుకుందని, కాంగ్రెస్ కో కథం కరో, తెలంగాణా కో హాసిల్ కరో  అని ఇది ఎవరిని టార్గెట్ చేసినట్టు అని ఆయన ప్రశ్నించారు.
                                            అయితే రెండు మూడు రోజుల నుండి జరుగు తున్న పరిణామాలను చూస్తే టి డి పి, కాంగ్రెస్, సీమంద్ర మీడియా కలిసి కుట్ర చేసి పథకం ప్రకారమే దాడికి దిగినట్టు అర్థం అవుతుంది, ముక్యంగా టి డి పి వారికీ కొరకరాని కొయ్యగా మారిన నమస్తే తెలంగాణా పై బురధజల్లాలని చూసారు, కాని అది బెడిసి కొట్టింది, షూ కంపని ని తెరపైకి తెచ్చారు, అలాగే నమస్తే తెలంగాణా ఎం డి పై కూడా కామెంట్స్ చేసారు అయితే రాజం అనే వ్యక్తి కి అనేక వ్యాపారాలు ఉన్నాయ్, ఆయన తెలంగాణా పత్రికలో ఒకానొక వాటా దారు మాత్రమే కాని పత్రిక అతనిది కాదు, మనకున్న సమాచారం మేరకు ఆయనకు వచ్చింది కూడా కేవలం 3 % కాంట్రాక్టు మాత్రమే, అతనికి టి ఆర్ ఎస్ తో ఎ సంభందం లేదని తెలిసి కూడా బురద జల్లి పబ్బం గడపుకోవాలని చూసారు, తెలంగాణా లో రాజీవ్ రహదారిని సుబ్బరామి రెడ్డి కట్ట వచ్చు కాని, పోలవరం ను మంతనీ కి చెందినా రాజం అనే వ్యక్తి కంపని కట్ట కూడద..?, అయితే నాకు తెలిసిన చాల మంది కూడా అన్న మాట ఇదే, కే సి ఆర్ అమ్ముడు పోయాడని కాంట్రాక్టు తెచ్చుకున్నాడని, అయితే టి ఆర్ ఎస్ కొన్నేళ్ళుగా పోలవరంకు వ్యతిరేకంగా పోరాడుతుంది అనే విషయం ఎవరికీ తెలియదు, గద్దర్ ఏదో మాట్లాడే సరికి మనవాళ్ళు కే సి ఆర్ ను అను మానిస్తారు, మరి గద్దర్ వెళ్లి ఆపగలడ పోలవరాన్ని..? అన్ని సార్లు కోర్ట్ కు  వెళ్లి ఆపెయ్యలని తీర్పు తెచ్చుకున్న అపనివాళ్ళు గద్దర్ ఏదో చెప్తే వింటారా..? కే సి ఆర్ ఉద్యమాన్ని తాకట్టు పెట్టాడని టి డిపి , గజ్జెల కాంతం, విమలక్క, గద్దర్, మంద కృష్ణ మాదిగ అంటూ ఉంటె సీమంద్ర మీడియా దాన్నే మల్లి మల్లి చూపిస్తే మనం అనుమనిస్తం, నిజంగా మనం తెలంగాణా ను కోరుకునే వాళ్ళం అయితే 100 స్థానాలు కట్ట బెట్టిన కాంగ్రెస్ , టి డి పి లు చెప్పే మాటలు విని , కేవలం 10 స్థానాలు ఇచ్చిన టి ఆర్ ఎస్ ను అనుమానించడం ఎంతవరకు సమంజసం..? ఆ 100  స్థానాలు టి ఆర్ ఎస్ కు వచ్చి ఉంటె ఈ పాటికి తెలంగాణా రాకపోయ్యేద ..? మనం వీళ్ళను ఇన్ని సార్లు రాజీనామా చెయ్యండి అని అడిగే అవసరం ఉండేదా ..? 2009  లో కే సి ఆర్ దిక్ష చేసిన 11  రోజులు కాని ఆతర్వాత జరిగిన ఉద్యమంలో కానీ గద్దర్ ఎక్కడైనా కనిపించాడ..? దళితున్ని ముఖ్య మంత్రిని చేస్తాను అనగానే కెసిఆర్ పక్కకు వెళ్లి, తెలంగాణా ప్రకటన వెనక్కి వెళ్ళంగానే బయటకు వెళ్లి టి ఆర్ ఎస్ ను తిడుతున్నా మంద కృష్ణ మదిగనా మనం నమ్మేది..? సకల జనుల సమ్మె జరుగుతున్న సమయంలో కలిసిరాని వాళ్ళ ఇళ్ళను ముట్టడించని గజ్జెల కాంతం  42  రోజులు సమ్మె చేసి ముగించిన తర్వాత కోదండ రామ్ ఇంటిపై దాడి చెయ్యడం ఎంత వరకు సమంజసం...?  ఇక నైన నిజం గ తెలంగాణా కోసం పోరాడేది ఎవరో గుర్తించడం ప్రజలుగా మన భాద్యత, విమర్శించే వాడు ఎవడు వాడి స్థాయి ఏంటి అనేదానితో పాటు అది ఎ ఛానల్ లో ప్రసారం అయ్యింది అనేది కూడా ఈ రోజుల్లో ముక్యమే. సహాయ నిరాకరణ ముగిసిన తర్వాత ఉద్యమం ఐపోయింది అని ప్రచారం చేసిన సీమంద్ర ఛానల్ లను నమ్మిన వాళ్ళు ఆరోజు కూడా ఉద్యోగ సంఘాలు అమ్ముడు పోయాయి అన్నారు, కాని అంత కంటే గొప్పగా సకల జనుల సమ్మె చేసి చూపించారు, ఇప్పుడు మన కర్తవ్యం ఏంటంటే నోట్లకు సీట్లకు అమ్ముడు పోయేది ఎవరో అందరికి తెలిసి పోయింది, రచ్చబండ కార్యక్రమమని రాషన్ కార్డ్లు లు ఇస్తామని మల్లి గ్రామాల్లోకి అడుగు పెడదామని అనుకుంటున్నా కాంగ్రెస్ మంత్రులు, ఎం ఎల్ ఎ లను బహిష్కరించాలి...ఆ ద్రోహులను అడ్డుకోవాలి... ఇప్పుడు మన నినాదం ఒక్కటే..కాంగ్రెస్ కో కథం కరో, తెలంగాణా కో హాసిల్ కరో ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి