హోం

28, అక్టోబర్ 2011, శుక్రవారం

ఉద్యమ నేతలపై సర్కార్ ముప్పేట దాడి...

(28/10/2011) 42  రోజుల సకల జనుల సమ్మే ను విరమింపజేయడంలో సక్సెస్ సాధించమని విర్ర వీగుతున్న సర్కార్, ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన వారిని టార్గెట్ చేసింది, దీనికి సీమంద్ర మీడియా పూర్తి సహకారం అందిస్తుంది, స్వామి గౌడ్ పై తెలంగాణా స్ట్రగుల్ ఫోరం వాళ్ళు తమ భూములు స్వామి గౌడ్ ఆక్రమించుకున్నాడని వాదిస్తున్నారు, దీనికి సీమంద్ర మీడియా విశేష ప్రచారం కల్పిస్తుంది, అయితే ఆ ఫోరం వాళ్ళు కూడా ఉద్యోగులే, ఉద్యోగుల్లో చీలిక తెచ్చి నాయకత్వానికి దెబ్బ కొట్టాలనే ఆంద్ర సర్కార్ ప్లాన్ కు మీడియా కూడా తోడవడంతో స్వామి గౌడ్ పై బురద జల్లడం ప్రారంబించారు, అయితే ఆ ఫోరం వాళ్ళు ఈ విషయమై గవర్నర్ ను కలిసి స్వామి గౌడ్ పై ఫిర్యాదు చేస్తామని చెప్పారు, అయితే వాళ్ళు వెళ్ళలేదు పిర్యాదు చెయ్య లేదు, ఎందుకంటే ఫిర్యాదు చెయ్యాలంటే ఆధారాలు ఉండాలి కదా, కాని సీమంద్ర ఛానల్ లు పెద్ద పెద్ద అక్షరాలతో బ్రేకింగ్ న్యూస్ ను ఇచ్చాయి, ఫోరం వాళ్ళు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసారని, ఇక స్వామి గౌడ్ పని అయిపోయిందని వ్యక్యనాలు చేసుకున్నారు, అయితే చివరికి గవర్నర్ తన వద్దకు ఎవరు రాలేదని, తనకు అంత మతి మరుపు లేదని, వినతి పత్రం ఇచ్చి ఉంటె తనకు గుర్తు ఉండేదని, ఆయన అన్నారు, దీనితో సీమంద్ర మీడియా తెలంగాణా నాయకత్వాన్ని దెబ్బ తీయడానికి ఎంతల ప్రయత్నిస్తుందో అర్థం అవుతుంది.
                             ఇక రాజకీయ దాడి కూడా తక్కువగా జరగడం లేదు, పోలవరం టెండర్ల విషయంలో నమస్తే తెలంగాణా పత్రికపై బురద జల్లడానికి చూసారు, టెండర్లు నమస్తే తెలంగాణా ఎం డి కంపని కి వచ్చాయని టి డి పి నానా యాగి చేసింది, అయితే టెండర్లు ఇంకా ఎవరికీ ఇవ్వలేదని సి ఎం చెప్పే సరికి ఇప్పుడు కెసిఆర్ పై పడ్డారు, నీ ఆస్తులు ఎంత అంటే నీ ఆస్తులు ఎంత అని వాగుతున్నారు టి డి పి వాళ్ళు, ఇక తెలంగన కు చెందినా టి ఆర్ఎస్ వ్యతిరేక వర్గం ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎన్నడు కలిసి రాని, కొంతమంది, గద్దర్, మంద కృష్ణ మాదిగ , వీళ్ళకు మద్దతు దారులు, కొండ లక్ష్మన్ బాపుజిల తో మరో వైపు మాటల యుద్ధం చేయిస్తున్నారు, వాటికి సీమంద్ర మీడియా విశేష ప్రచారం చేస్తుంది, అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఒక్కటే మొదటి నుండి నిబద్ధతతో ఉన్నదీ ఎవరు అని, ఉద్యమం జరుగుతున్న సమయంలో ఉద్యమాన్ని కించపరిచి, కానీసం పాల్గొనకుండా ఈ రోజు ఉద్యమం విఫలమైందని, దానికి వాళ్ళు అమ్ముడు పోయారని వీళ్ళు అమ్ముడు పోయారని అని అంటున్నారు, ఎన్నడైనా ఉద్యమానికి వీళ్ళు కలిసి వచ్చారా..? మరి  మాట్లాడే హక్కు ఎక్కడిది...? 
                                                                మరో వైపు రచ్చబండ పేరుతో సి ఎం , మంత్రులు గ్రామాల్లోకి వచ్చేందుకు చూస్తున్నారు, వాళ్ళను అడ్డుకుంటే అభివృద్దికి ఆటంకం కల్గిస్తున్నారని సీమంద్ర మీడియాతో విశేష ప్రచారం చేయించాలనేది ఉపాయంగా తోస్తుంది, ఎలాగో తెలంగాణా ఉద్యమానికి కలిసిరాని, అమ్ముడు పోయే వాళ్ళు తెలంగాణాలో చాల మందే ఉన్నారు కదా వాళ్ళను ఉపయోగిన్చుకున్ధమని కిరణ్ చూస్తున్నారు..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి