హోం

22, డిసెంబర్ 2012, శనివారం

ధూంధాం పదేళ్ల నడక...



తిరుపతి ఏడు కొండలపై ప్రపంచ తెలుగుమహాసభలు. దక్కన్ పీఠభూమి హైద్రాబాద్ నడిబొడ్డున ధూంధాం పదేళ్ల సభ. కాలం కత్తి అంచున రాలుతున్న రక్తపు బొట్లను తాగి బలిసిన కోస్తాంధ్ర పెత్తనానికి నిలు సాక్ష్యం తెలుగు మహాసభలు. శ్రీకాకుళ పోరాటంలో సుబ్బారావు పాణి గ్రాహి, చిన బాబును చంపిన వెంగళరావు 1975లో తెలుగు మహాసభలను జరిపాడు. తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని కనుమరుగు చేయడానికి తెలుగు భాషా ఉత్స వాలు సాధనమయ్యాయి. తెలంగాణ విద్యార్థులను, కవులను, కళాకారులను హత్య చేసినవాడు భాషపేరుతో ఊరేగాడు.

మళ్లీ ఇవ్వాళ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి ప్రపంచ తెలుగు మహాసభల కు పూనుకున్నాడు. తెలంగాణలో వెయ్యిమంది విద్యార్థులు నేలరాలారు. రచయితలను, కళాకారులను (అరుణోదయ విమల)బంధిస్తున్నారు. తెలంగా ణ అస్తిత్వం కోసం పెనుగులాడుతున్నది. మరోవైపు పాలకులు భాష పేరుమీద పండగ చేస్తున్నారు. నేటి పాలకులు కాసు బ్రహ్మానందడ్డి, జలగం వారసులే. తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్షను కనుమరుగు చేయటానికి తెలుగు భాషను ఆయుధంగా ఉపయోగిస్తున్నారు.

అందుకే తెలంగాణ బుద్ధిజీవులు ఆంధ్ర భాషా సాహిత్యాలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ సాహిత్యం, కళారూపాల ను ఎజెండా మీదికి తీసుకురావాలి. ఈ సందర్భంలో హైదరాబాద్ లలిత కళాతోరణంలో ఈనెల 22న జరుగుతున్న పదే ళ్ల ధూంధాం దశాబ్ది ఉత్సవాలు కాకుండా తెలుగు మహాసభలకు ధీటుగా తెలంగాణ కళలు, సాహిత్యాన్ని నిలబె వేదికగా మారాలి. తెలంగాణ ప్రజలపై కోస్తాంధ్ర పాలకులు ప్రయోగిస్తున్న నిర్బంధానికి వ్యతిరేకంగా కలాలు, గళాలు విన్పించే శబ్దం కావాలి.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగా ణ గానకోకిల బెల్లి లలితను కోస్తాంధ్ర పాలకు లు పదిహేడు ముక్కలుగా నరికేసి, ఐలన్నను బూటకపు ఎన్‌కౌంటర్ చేసి విద్యార్థులను, మేధావులను జైళ్లలో బంధించి గద్దర్‌పై తుపా కి పేల్చి ఆట, పాట, మాటపై ఆంక్షలు విధించి న రోజుల్లో కళాకారుల సంఘటితశక్తిగా 2002 సెప్టెంబర్ 30న ధూం ధాం ఆవిర్భ వించింది. ఏ తెలుగు నిఘంటువును వెదికి నా ఈ పదం కనిపించదు. నిఘంటువుకు కావాల్సిన జనం పదాన్ని ఎజెండామీదికి తెచ్చిన ఘనత తెలంగాణ కళాకారులది. తెలంగాణ పల్లెలన్ని ధూంధాం ఆడాయి. రాజకీయ వేదికలన్నీ ధూంధాం సభలుగా మారాయి. కాలం విధించిన సామాజిక బాధ్యతను ధూం ధాం కళాకారులు నెరవేర్చా రు. బాలకిషన్ అనే అరుంధతి సుతుండు ధూంధాంకు సర్వనామమయిండు. సాధార ణ బడిపంతులు అసాధారణ మనిషిగా ఎద గటానికి ఈ కాలం సహకరించింది. ఈ నేల మీద చిందిన నెత్తురు, కారిన కన్నీళ్లు, రాలిన చెమట ధూంధాం పుట్టుకకు నేపథ్యమైంది.

పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని కాళోజీ చెప్పినట్లు తెలం గాణ కోసం యాదగిరి అమరుడయ్యాడు. నైజాం ఘోరీ కట్టి చుక్కల్లో చంద్రుడ య్యాడు. పశుల పిలగాని చేతికి పాటను అందించి ముళ్లుగపూరను ఆయుధంగా మలచిన సుద్దాల హన్మంతు ఈ భూమి పుత్రుడే. తేనెపూసిన కత్తివి నీవు నెహ్రయ్యా అనగలిగిన సాహసం పోరాడే ప్రజలు తెలంగాణ కవులకు ఇచ్చారు. నాగలి మోసిన రైతు తుపాకిని ఎత్తి నైజాం సర్కారు మెడలు వంచితే రివిజని జం పార్లమెంటులో కూర్చుంది. రైతు భంగపడ్డాడు. ఊరుపోయింది. మళ్లీ తెలుగు నేలలో వసంత కాలమేఘం శ్రీకాకుళం మీదుగా తెలంగాణలో కురిసింది. ఈ వానకు తడిసి ఊరు మనదిరా/ ఈ వాడ మనదిరా/ దొర ఏందిరో/ వాని దోపిడేందిరో అంటూ గూడ అంజయ్య పాటల కొలిమి రాజేశాడు. చెర బండరాజు కొండలు పగలేసే బండలు పిండిన మనిషి కోసం కలాన్ని ఎక్కుపె ట్టాడు. సిరిమల్లె చెట్టు కింద ఒంటరి శోకం పెడుతున్న లచ్చుమమ్మ కొడుకుగా పుట్టిన గుమ్మడి విఠల్‌రావు తూప్రాన్ తుపాన్ బిడ్డగా గద్దరయ్యాడు.

ఒరిగిపో యిన బిడ్డల కోసం కరిగిపోయిన గుండెలను ఎర్రజెండాలుగా మలచి నెత్తుటి జెండాను ఎత్తుకొని మురిసిపోయాడు.‘అన్నెము పున్నెము ఎరుగని చిన్నితమ్ము ల తీసుకెళ్లి/అడగరాని ప్రశ్నలడిగి అన్నలను చూపెట్టుమని’ రాజ్యం రౌడీగా మారినప్పుడు రాజ్యహింసను గానం చేస్తూ తిరిగిన బైరాగి గోరటి వెంకన్న పాటల చెలిమెలో ఊరిన నీటి చెమ్మ. ఈ ప్రజా వాగ్గేయకారుల పాటలకు చైతన్యం పొందిన రెండో తరం కళాకారులు కలిసి సృష్టించిన జలపాతమే తెలంగాణ ధూంధాం. జన నాట్య మండలి పాటలు పాడుకుంటూ అన్నలు ఇంటికొస్తే బువ్వపెట్టిన పిలగాడు ధూం ధాం రసమయిగా మారటానికి ఇంతటి చరిత్ర ఉంది. కోట్లాదిమందిని లాలించి, ఊగించిన పాట గురించి పాటను రాసిన భిక్షపతి ఎన్ని త్యాగాలను నెమరువేసుకొని ఉంటాడు.

దయానర్సింగ్, నాగరాజు, నేర్నాల కిషోర్, అమరుడు కృష్ణవర్మ, గర్జన విద్యార్థి వీరులను మల్లెపులుగా మట్టి వాసనలుగా కవిత్వీకరించిన దరువు ఎల్లయ్య ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన సూర్యుళ్లను మరిగించిన అభినయ శ్రీనివాస్, దేశప తి, ఏపూరి సోమన్న ఇట్లా వందలాది గళాలు విచ్చుకోవటానికి జననాట్య మండ లి, అరుణోదయ సంస్థలు చిందించిన నెత్తురే కారణం. ఎక్కడో ఒకచోట వీళ్ల నాడుల్లో ఎరుపు ప్రవహిస్తుంది. వీళ్లందరి సామూహిక బృందగానమే ‘ధూంధాం’. వీళ్లందరిని కూడేసిన మనిషి మాత్రం కచ్చితంగా రసమయి బాలకిషన్. వ్యక్తులుగా గద్దర్, గూడ అంజయ్య, గోరటి వెంకన్న, డప్పు రమేష్, అంద్శై, జయరాజ్ సంస్థలుగా అరుణోదయ, ప్రజాకళామండలి ఈధూంధాం విస్తరించడానికి మూలం.

ఊరు, వాడ ఏకమై కళాకారుల కోసం 70వ దశకం ఎదురు చూసినట్లు, మళ్లీ ధూంధాం కళాకారుల కోసం ఎదురుచూసింది. నాయకులు వేదిక కింద కూర్చుంటే, కళాకారులు వేదికపై నుంచి పాటలు పాడే ప్రజాస్వామిక వాతా వరణానికి ధూంధాం పునాది వేసింది. కళాకారులే సభను నిర్వహించే స్థితి సృష్టించబడింది. దళితులే ఆటగాళ్లుగా, పాటగాళ్లుగా మారారు. నాయకులయ్యా రు, గాయకులయ్యారు. కొత్త సాహిత్య వస్తువు, కొత్త రూపం కష్టజీవి కనుకొ లుకుల నుంచి వచ్చింది. ఊరు, పేరు తెలి య ని కవులకు, కళాకారులకు ధూం ధాం వేదికయింది. ఏ ఉద్యమంలో లేని అద్భుత మైన రసాయన చర్య ధూంధాంలో జరిగింది. చరి త్రలో ఒక లోటును ధూంధాం పూడ్చింది. అల్లిక వారసత్వం నుంచి ఎదిగివచ్చిన అందె శ్రీ తెలంగాణ గొంతుల్లో జయజయహే తెలంగాణగా మారాడు. జనగర్జనల జడివాన ను కురిపించాడు. ఇదొక గుణాత్మక మార్పు.

కానీ సమాజంలో పెరిగిన విలువల రాహి త్యం కళాకారులపై పడింది. చెడు అలవాట్ల కు, రాజకీయ నాయకులకు బానిసల య్యా రు. ఉద్యమం కోసం కాకుండా ఓట్ల కోసం, నోట్ల కోసం పాడటానికి పూనుకున్నారు. విప్లవ సాంస్కృతిక సంస్థలు బలంగా లేకపోవ డం వలన ఇలా జరిగిందని సంతృప్తి చెందితే ఉద్యమానికి నష్టం. సైద్ధాంతిక పునా ది లేని ధూం ధాంలే కళాకారులు ధ్వంసం కావటాని కి కారణమయ్యాయంటే తప్పు అన్నవాళ్లది కాదు. రాజకీయ నాయకులను ఓట్లలో గెలి పించడమే ప్రధాన లక్ష్యంగా ధూం ధాం ప్రయాణించటం కూడా కారణం. కవులు, కళాకారులు ప్రతిపక్షంగా ఉండాలనే ఎరుకను కళాకారులు మర్చిపోయారు. అగ్రకుల నాయకులు కళాకారులకుండే ప్రజాదరణ కు భయపడ్డారు. దీంతో వీళ్ల ప్రాధాన్యాన్ని తగ్గించటానికి కుట్రపూరితంగా ఈ విలువల రాహిత్యాన్ని పెంచారు. కళాకారులకు ఎప్పుడైనా బండి యాదగిరి, బెల్లిలలిత, గద్దర్ నమూ నా కావాలే తప్ప, రాజకీయ నాయకులు కాదు.

కళాకారులు తెలంగాణ కోసం ఎన్నికలను ఎత్తిపట్టే వారుగా, ఉద్యమం ద్వారానే తెలంగాణ అని చెప్పే వారుగా చీలిపోయారు. ధూంధాం ఎన్నికల వైపు మొగ్గు చూపిందని చరిత్ర రుజువు చేసింది. గద్దర్ గౌరవాధ్యక్షులుగా, గూడ అంజయ్య అధ్యక్షులుగా తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య ఉద్యమాల ద్వారానే తెలంగాణ అనే నినాదాన్ని ముందుకు తెచ్చింది. అంటరానివిగా చూసి న కళారూపాలను గౌరవంగా ప్రదర్శించిన తెలంగాణ ధూంధాం, సాంస్కృతిక ఉద్యమం ఇవాల్టి సందర్భంలో బలం పుంజుకోవాలి. ధూంధాం ఉత్సవాలుగా కాకుండా పదేళ్ల నడకలో జరిగిన లోటుపాట్లను చర్చించుకునే సభగా మార్చి తే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది. రసమయికి చరివూతలో చోటు దొరుకుతుంది.   (from namaste telangana)                              
                             -డాక్టర్ కాశీం                                                   



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి