హోం

31, డిసెంబర్ 2012, సోమవారం

తెలంగాణా పై చంద్ర బాబు నిజాయితి ఎంత..?


అకిల పక్ష భేటి లో తన వికారి స్పష్టం చేస్తానని చెప్పిన చంద్రబాబు సీల్డ్ కవర్ లో తాము 2008 లోనే ప్రణబ్ కు లేఖ ఇచ్చామని అది ఇంకా తమ దగ్గరే ఉందని, దానిని ఉపసంహరించు కాలేదని చెప్పారు.ఆ లేఖకు కాలం చెల్లింది అని ఆ పార్టీ నాయకుడు, అకిలపక్షం లో పాల్గొన్న యనమల రామకృష్ణుడే గతంలో చెప్పారు, మరి ఆ లేఖకు ఎ పాటి విలువ ఉంది, పోనీ ఆ లేఖ వాపసు తీసుకోలేదు అంటున్నారు కాబట్టి, మరో సారి మీరు రాసిన లేఖలో మేం తెలంగాణా కు అనుకూలం గా ఉన్నాం, తెలంగాణా ఏర్పాటుకు సహకరిస్తాం అని చెప్పవచ్చు కదా..? ఇదే అందరిలో ఉన్న సందేహం గతం లోనే టి డి పీ ని నమ్మి మోసపోయిన తెలంగాణా ప్రజలు చంద్ర బాబు ను నమ్మడానికి సిద్దం గా లేరు, డిసెంబర్ 7 న అనుకూలం అని డిసెంబార్ 10 న ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారని అన్న ఈయన , వచ్చిన తెలంగాణా ప్రకటనను అడ్డుకున్నదని తెలంగాణా ప్రజలందరికీ తెలుసు.ఇతగాడి తెలంగాణా వ్యతిరేఖత నిన్న వరంగల్ జిల్లా లో మల్లి బయటపడింది.

                         

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి