హోం

27, జనవరి 2012, శుక్రవారం

మద్యం తాగిన మర్కటాలు ఎవరు..? తెలంగాణావాదుల లేక సీమంద్రులా..?


2010 మార్చ్ పదవ తేదిన హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై మిలియన్ మార్చ్ జరిగింది, ఆరోజు ట్యాంక్ బండ్ పై ఉన్న ఆంద్ర విగ్రహాలను తెలంగాణా వాదులు ద్వంసం చేసారు, దీనిని సీమంద్ర మీడియా విద్రోహంగా చిత్రీకరించింది, టీవీ 9 అనే  ఒక వార్త ఛానల్ సంఘటనకు ప్రతిస్పందనగా వివేచనను కోల్పోయి ఒక కథనాన్ని ప్రసారం చేసింది, ఇందులో తెలంగాణా వాదులను నోటికివచ్చినట్టు తిట్టారు, మద్యం తాగిన మర్కటాలు అని, తోక తెగిన కోతులు అని, జాతికే కళంకం అని, నానా రకాలుగా సాగింది ఆ కథనం.
                           ఆంద్ర మేధావుల సంఘం అనే ఒక సంఘానికి అధ్యక్షుడుగా వ్యవహరించబడుతున్న చలసాని శ్రీనివాస్ అనే వ్యక్తిని ప్రతి చానెల్ వాడు పిలిచి, కొంతమందిని లైన్లోకి తీసుకొని తెలంగాణా వారిని నానా మాటలు అన్నారు, టి వి లలో తరచు కనిపించే గరికపాటి నరసింహారావు అనే ఆంద్ర పండితుడు{ భక్తి టి వి లో భాగవతం, ఈ టివి  2 లో తెలుగు వెలుగు, hmtv లో ఒక కార్యక్రమంలో కనిపిస్తాడు} ఆ మధ్యకాలంలోనే మాకు{జర్నలిజం విద్యార్థులకు) ఒక స్పెషల్ క్లాస్ చెప్పారు , ఇతను గత 20 సంవత్సరాలుగా  తెలంగాణాలోనే బతుకుతున్నాడట, ఇతను అంటాడు" తెలంగాణా ప్రజలు రౌడిలంట, జాతికే మాయని మచ్చ తెచ్చారంట, గొప్ప గొప్ప మహాను భావుల విగ్రహాలు కుల్చారని తెలిసినప్పటి నుండి ఈయన పచ్చి మంచి నీరుకూడా తాగాలేదట( మా క్లాస్ లో టి తాగారు), ఆ భాధతో తిండిమీద ధ్యాసే లేదట.. వెళ్లి ట్యాంక్ బండ్ మీద కూల్చిన విగ్రహాల పక్కన కూర్చొని నిరాహార దీక్ష చేస్తాడట.. ఎవడైనా వచ్చి చంపితే చంపనివ్వండి, అలంటి గోప్పవల్లకోసం చావడానికైనా సిద్ధం అంట".. ఇతను నిరాహార దీక్ష చెయ్యలేదు, ఇంకా తెలంగాణా పై పడి బతుకుతున్నాడు.
                                          మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా..? సందర్భం వచ్చింది కాబట్టి, గత నాలుగైదు రోజులుగా ఆంధ్రలో జరుగుతున్న విగ్రహాల ద్వంసం గురించి చదివి చదివి ఈ పోస్ట్ రాస్తున్న..
                                          తెలంగాణా నడిబోడ్డులో హైదరాబాద్ గడ్డపై ట్యాంక్ బండ్ పై ఉన్న ఆంద్ర బొమ్మలను భరించలేక తెలంగాణా ప్రజలు కూల్చారు. తెలంగాణా తో ఏ సంభంధంలేని అల్లూరి సీతారామ రాజు, అరువు తెచ్చుకున్న కన్నడ రాజు శ్రీ కృష్ణ దేవరాయలు, అది ఆంద్ర కవి నన్నయ, కవి అన్నమయ్య, కవయిత్రి మొల్ల, త్రిపురనేని రామస్వామి చౌదరి, శ్రీ శ్రీ. లాంటి వాళ్ళ విగ్రహాలు కూల్చడం జరిగింది, ఇందులో ఏ ఒక్కరు తెలంగాణతో ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని సంభంధం ఉన్నవారు లేరు, విగ్రహాలను కుల్చడంలో తెలంగాణా ప్రజలు విచక్షణ చూపారు, ఎందుకంటే వారు విచక్షణ కోల్పోయి తమ వారిని అవమానించలేదు, తమ గడ్డపై పరాయివారి విగ్రహాలను  వ్యతిరేకించారు.
                    మరి ఆంధ్ర వాళ్ళు చేసింది రాజ్యాంగ నిర్మాత, స్వాతంత్ర సమరయోధుడు బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను కుల్చుతున్న ఆంధ్ర వాళ్ళను ఏమనాలి. మరి ఈ విషయం ఆ సోకాల్డ్ టీవీ 9 , మిగతా ఆంద్ర ఛానల్ లకు  తప్పుగా అనిపించడం లేదా ..? ఇది జాతికి మాయని మచ్చ కాదా..? దేశ ప్రజల ముందు సిగ్గుమాలిన పని చేసిన అపకీర్తి తెలుగు ప్రజలకు రాలేదా..? అంటే జాతీయ నాయకుడిని అవమానిస్తే పట్టించుకోని ఆంద్ర ఛానళ్ళు తెలంగాణా వారిని అగౌరవ పరచడానికి మిలిఒన్ మార్చను రాద్దంతం చెయ్యడం ఏంటి..? ఇప్పటికే అనేక విగ్రహాలను కుల్చారు , ఏకం గా రాజ్యాంగం అమలులోకి వచ్చిన 26 జనవరి రోజే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం కుల్చారంటే దాని అర్థం ఏంటి.. వారికి భారత రాజ్యాంగం మీద గౌరవం లేదా..? ప్రజా స్వామ్యం మీదే నమ్మకం లేదా..? తెలంగాణా వారిని తాలిబన్లు అని అన్నాడు ఒకడు, పాకిస్తాన్ వాళ్ళు అన్నాడు ఒకడు.. ఇప్పుడు తెలుస్తుందు కదా ఎవరు తాలిబన్లు, తాలిబన్లు తమ సంస్కృతికి చెందని బుద్దుని విగ్రహాలే కుల్చారు మరి వీళ్ళు దేశం మొత్తం ఆరాధించే అంబేద్కర్ విగ్రహాలు పగులగోడుతున్నారు అంటే వీళ్ళను ఏమనాలి..? ఉగ్రవాదులనా .. దేశ ద్రోహులనా.. ఇప్పుడు మాట్లాడటం లేదు సోకాల్డ్ మేధావులు, పండితులు. ఆ రోజు చస్తానని ఇంకా బతికి ఉన్నవాళ్లు ఎందుకు ఇప్పుడు మాట్లాడటం లేదు..? అంటే నేతి బీర కాయలో నేతి చందమేనా వీళ్ళు.. పక్కోడికి చెప్పడానికే నీతులు ఉన్నది.. వాళ్ళు పాటించడానికి కాదన్నమాట..
                   తెలంగాణ ప్రజలకున్న విచక్షణ, ఓర్పు, అన్ద్రోల్లకు లేవు అని నిరుపితం చేసిన సంఘటన.. దేశ ప్రజల ముందు ప్రతి అన్ద్రోడు సిగ్గుతో తలదించుకునే సంఘటన, రాజ్యాంగ నిర్మాత విగ్రహం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే కూల్చడం.. ఇది సీమంద్ర ఛానల్ లకు పెద్ద విషయంగా కనిపించకపోవడం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు, టీవీ 9 లాంటి ఛానల్ లో ఉన్న రైటర్ లు కల్లు తాగిన కోతుల..? తెలంగాణ ప్రజల అనేది అర్థం అవుతుంది కదా ఇప్పుడు.. ప్రతి ప్రాధాన్యత లేని విషయాన్నీ రాద్ధాంతం చేద్దామని చూసే ఆంద్ర సేటిలర్ కులం పేరుతో బతుకుతున్న మంద కృష్ణ మాదిగ కూడా ఈ విషయం లైట్ తీసుకున్నాడంటే అతని ప్రేమ దేనిమీదో అర్థం అవుతుంది కదా..
                        తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం, కూర్చున్న కొమ్మను నరుక్కోవడం లాంటి పనులు ఆంద్ర వాళ్ళకే సాధ్యం తెలంగాణా ప్రజల ఊర్పు వల్లనే అన్ద్రోల్లు ఇంత స్వేచ్చగా తెలంగాణ లో తిరగ గల్గుతున్నారు, ఐన తెలంగాణా ప్రజలను సందుదోరికితే ఉతికి ఆరేయ్యలనుకునే ఇలాంటి వాళ్ళు గురవింద తన నలుపు ఎరుగాధన్నట్టు, తాము చేసే నీతిమాలిన పనులను సమర్ధించుకుంటూ పోతే చివరికి వారి స్వభావం ఇలా నగ్నంగా బయటపడక తప్పదు.
      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి