హోం

19, జనవరి 2013, శనివారం

సమైక్యాంద్ర ఉద్యమం కృత్రిమమే : బైరెడ్డి


కొంత మంది పెట్టుబడిదారులు మాత్రమే తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, సమైక్యాంధ్ర ఉద్యమం కృత్రిమ ఉద్యమేనని రాయలసీమ హక్కుల వేదిక నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పెద్దరాష్ట్రాలకు సీఎం, మంత్రులు కావాలనుకునేవారే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, వందల సంఖ్యలో విద్యార్థులు, యువకులు చనిపోతుంటే పట్టించుకోకుండా స్వార్థకోసం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పెద్ద రాష్ట్రాల్లో పదవులను అనుభవించి అక్రమంగా దండుకోవాలనేవారే సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారని బైరెడ్డి ఆరోపించారు. కోస్తా నేతల ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడి సీమ నేతలు సమైక్య వాదాన్ని వినిపిస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఇచ్చినా, ఇవ్వకపోయినా ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాలని బైరెడ్డి డిమాండ్ చేశారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి