హోం

2, జూన్ 2013, ఆదివారం

అసెంబ్లీ తీర్మానం, ప్రకటనతో సరి పెడతారా..?


డిల్లి లో ఎం జరుగుతుంది..? తెలంగాణా కాంగ్రెస్ ఎం పీ లు ఇద్దరు టి అర్ ఎస్ లో చేరడం పై కోర్ కమిటిలో చర్చించిన అధినాయకురాలు ఎం చెప్పారు..? నిజం గా కాంగ్రెస్ నుండి ప్రకటన వస్తుందా..?
                  ఎన్నికల సీజన్ దగ్గరపడుతుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణా విషయం లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తుంది, ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎం పీలు పార్టీని వీడడంతో  హడావిడి ప్రకటనలు గుప్పిస్తుంది కాంగ్రెస్, మొదట 6 గురు ఎం పీ లు పార్టీ మారడానికి సిద్దపడిన ఆ తర్వాత ఆ సంఖ్యను 2 కు తగ్గించడంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం వ్యూహం ఫలించింది, ఇప్పుడు పార్టీ మారిన ఇద్దరితో మరికొంత మంది బయటకు వెళ్ళకుండా తీసుకునే చర్యల పైనే నిన్నటి కోరే కమిటి మీటింగ్ జరిగింది, ఎం పీ లు బయటకు వెళ్ళడం తో తెలంగాణా కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేఖం అనే ప్రచారం ప్రజల్లోకి వెళ్ళకుండా ఉండే విధంగా జాగ్రత్తపడాలని సోనియా గాంధీ అదేశినట్టు సమాచారం, అందుకే నేడు ఆజాద్ నెలరోజుల్లో ప్రకటన అని చెప్పారు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అయితే ఏకంగా ఇంకో అడుగు ముందుకు వేసి జూలై 5 న పార్లమెంట్ లో బిల్లు పెడుతున్నారని చెప్పాడు, ఇవన్ని కేవలం జనాల్ని మభ్యపెట్టడానికి మాత్రమే, కాంగ్రెస్ తెలంగాణా కు వ్యతిరేఖం అనే భావన ప్రజలకు కలగకూడదనే...
                          మరి ఇలా సంకేతాలు ఇచ్చి ఊరికే ఉంటారా..? తెలుగు దేశం పార్టీ మహా నాడులో తెలంగాణా పై తీర్మానం చేసింది ఐన ఆ తీర్మానం పై సమైక్యంద్ర వాదులనుండి ఎలాంటి వ్యతిరేఖత వ్యక్తం కాలేదు, కావున ప్రకటన చెయ్యడానికి కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఏర్పడింది, ప్రస్తుత పరిస్థితులే ఉంటె 2014 ఎన్నికలలో కాంగ్రెస్ కు కేవలం 8 ఎం పీ స్థానాలు వస్తాయని పలు సర్వేల్లో తేలింది, అదే ఇప్పుడు తెలంగాణా పై ప్రకటన చెయ్యడం ద్వార ఆ సంఖ్యా పెరుగుతుంది, పైగా మహానాడు తీర్మానం పై వ్యతిరేఖత రాకపోవడం వాళ్ళ సీమంద్ర నేతల్లో కుడా మార్పు వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తుంది, కావున ఇప్పుడు ఏదో ఒక ప్రకటన చెయ్యవలసిన పరిస్థితి. 
              మరి ఎం ప్రకటన చేస్తారు..? అసెంబ్లీ లో తీర్మానం చేయించి, తెలంగాణా  ప్రక్రియ మొదలయ్యింది, రాష్ట్ర ఏర్పాటు జరగడానికి కొంత సమయం పడుతుంది కావున 2014 ఎన్నికలు ఐపొయెవరకు ఆగాలని ప్రకటించే అవకాశం ఉంది, ఈ ప్రకటన కు కెసిఅర్ కన్విన్సు అయ్యి జె ఎ సి ని ఒప్పించాగలిగితే రాష్ట్రంలో టి అర్ ఎస్, కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. 
                                     ఒకవేళ యు పీ ఎ 3 తెలంగాణా ఇస్తే టి డి పీ నుండి వచ్చిన దళితుడు కడియం శ్రీ హరి కంటే కాంగ్రెస్ నుండి వచ్చిన వివేక్ వైపే కాంగ్రెస్ మొగ్గుచూపుతుంది కావున వివేక్ లేదా వినోద్ సి ఎం అయ్యే అవకాశం ఉంది, అందుకే ఈ జంపింగ్..?? కావున మరోసారి మోసం చెయ్యడానికి కాంగ్రెస్ సిద్ధమయ్యింది, తెలంగాణా ప్రక్రియ మొదలయ్యిందని అసెంబ్లీ లో ఒక తీర్మానం చేసి ప్రజలను 2014 లో వాడుకొని ఒధిలెయ్యదనికి పథకం సిద్ధమయ్యింది, కావున తెలంగాణా వాదులు టి అర్ ఎస్ లోకి వస్తున్న వలసలను చూసి మురిసి పోకుండా జాగ్రత్తగా పరిణామాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది, తెలియకుండానే మరో మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి కావున తస్మాత్ జాగ్రత్త ..!
                             

                  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి