హోం

11, ఫిబ్రవరి 2013, సోమవారం

హిందీ గడ్డపై తెలంగాణా బిడ్డ..



శ్యామ్ బెనగళ్ ప్రముఖ భారతీయ సినీదర్శకుడు, చిత్ర రచయిత. చాలా దూరదర్శన్ సీరియల్ లకు కూడా దర్శకత్వం వహించారు. అనేక అవార్డులు పొందారు. తను తీసిన నాలుగు సినిమాలు - అంకుర్ (1973), నిషాంత్ (1975), మంతన్ (1976) మరియు భూమిక (1977) తో భారతీయ సినీ రంగంలో మధ్యేవాద సినిమా (మిడిల్ సినిమా) అనే కొత్త ఒరవడిని, వర్గాన్ని సృష్టించాడు. ఈయన చేసిన కృషికి కాను భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీ పురస్కారాన్ని, 1991లో పద్మ భూషణ్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. 2007, ఆగష్టు 8 న భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రముఖమైన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని 2005 సంవత్సరానికి గాను అందుకున్నాడు. భారత జాతీయ సినిమా అవార్డులలో శ్యాం బెనగళ్ ఏడు సార్లు హిందీలో అత్యుత్తమ సినిమా అవార్డును అందుకున్నాడు.
ఆయన  1934 డిసెంబరు 14న అల్వాల్‌, హైదరాబాదులో జన్మించారు, శ్యామ్ బెనగళ్, ప్రఖ్యాత హిందీ నటుడు, దర్శకుడు గురు దత్‌ దూరపు బంధువు. ఈయన బాల్యం విధ్యాబ్యాసం పూర్తిగా తెలంగాణా లోనే జరిగాయి, ఎం. ఎ . ఎకానమిక్స్ నిజాం కళాశాల నుండి అందుకున్నారు. భార్య నీర బెనగల్, ఒక కూతురు పియా.ప్రఖ్యాత హిందీ నటుడు, దర్శకుడుగురు దత్‌ దూరపు బంధువు.
                              1959 మొదలైన ఆయన సినిమా ప్రస్థానంలో మొదట ఆయన కాపీ రైటర్ గా చేరారు, 1962 లో ఆయన గుజరతిలో తొలి డాక్యుమెంటరి "Gher Betha Ganga" ని తీసారు, ఆయన మొదట ప్రచార సినిమాలను తీసారు, ఆ సమయంలో 900 ల వాణిజ్య ప్రచార చిత్రాలను( ADVERTISEMENTS) తీసారు.
                                               ఆయన అనేక జాతీయ అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు, ఆ తర్వాత ఆయన ముంబై వెళ్లారు, ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం": ankur ", ఈ చిత్రంలో ఆయన తెలంగాణాలోని ఆడవారిపై జరుగుతున్న ఆకృత్యాలను తెరపై చిత్రించారు, ఆయన పుట్టి పెరిగింది ఇక్కడే కావున ఆయన చిత్రాలలో తెలంగాణా జీవనచిత్రం ప్రతిబింబిస్తుంది, ఈ చిత్రానికి జాతీయ 2 జాతీయ అవార్డు లు లబించాయి. ఆ తర్వాత 1975 లో nishanth చిత్రాన్ని తీసారు, ఇది పూర్తిగా తెలంగాణా నేపధ్యంలో జరిగే చిత్రం, భూస్వామి గ్రామాన్ని పట్టి పీడిస్తుంటే ప్రజలు తిరగబడి ఎలా విముక్తి పొందారనేది చిత్ర కథ, ఈ చిత్రం హిందీ పరిశ్రమలో ఒక సంచలనం సృష్టించింది, తెలంగాణా నేపధ్యం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ముడి సరుకు కాలేకపోయినప్పటికీ, శ్యాం బెనగల్ దయ వలన జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది, Manthan (1976) and Bhumika (1977) ఆయన తర్వాతి చిత్రాలు.

                     1970 లలో ఆయన బాలల చిత్రాలను రూపొందించి ఇచ్చారు, అలాగే డైరీ డేవలోప్మెంట్ వారికి కూడా ప్రచార చిత్రాలను రూపొందించారు, ఆయన అనేక ప్రభుత్వ లగు చిత్రాలను తయారు చేసారు.1985 మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు జ్యూరి మెంబర్ గా వ్యవహరించారు, ఆయన జాతీయ సినిమా అభివ్రుది సంస్థ NFDCకి కూడా డైరెక్టర్ గా భాధ్యతలు నిర్వహించారు, 1988 లో జవహర్ లాల్ నెహ్రు రచించిన   DISCOVERYOFINDIA పుస్తకాన్ని TV ధారావాహికగా మలచారు.
                          ఆయన చిత్రాలు Satyajit Ray, in 1985, Sardari Begum (1996), Mammo (1995), Sardari Begum (1996), Zubeidaa (2001), 1992- Suraj Ka Satvan Ghoda (Seventh Horse of the Sun) ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం లభించింది, ఈయన సుభాస్ చంద్రబోస్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన చిత్రం Netaji Subhas Chandra Bose: The Forgotten Hero(2005),2008-Welcome to Sajjanpur, 2010- Well Done Abba., ఆయన ప్రస్తుతం  World War II చిత్రానికి పనిచేస్తున్నారు.
 ఈయన ప్రస్తుతం  Federation of Film Societies of India.అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఆయన చిత్రాల్లోని తెలంగాణా నేపద్యాన్ని గురించి   TIMES OF INDIA లో కథనాలు కూడా వచ్చాయి.

                                తెలంగాణా గడ్డపై పుట్టిన ఆయన నేడు భారత దేశం గర్వించ దగ్గ దర్శకుడిగా ఎదిగారు, ఎంతటి స్థాయికి ఎదిగినా  జన్మించిన గడ్డ పై  ఆయనకు ఎనలేని అనురాగం, అందుకే ఆయన ప్రతి చిత్రంలోనూ తెలంగాణా నేపధ్యం కనిపిస్తుంది, ఆయన తెలంగాణా లో పుట్టినందుకు మనందరం గర్వించాలి..

2013 సంవత్సరానికి గాను అక్కినేని పురస్కారం అందుకున్నారు....
      
       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి