హోం

5, ఫిబ్రవరి 2013, మంగళవారం

పోదాం పద.. పెద్దగట్టుకు!


కల్మశం లేని కష్టజీవులు కలిసి జరుపుకునే పెద్దగట్టు జాతర తెలంగాణలోనే రెండో అతిపెద్ద సామూహిక వేడుక. ఇక్కడ భగవంతుడికి, భక్తుడికి మధ్య వారధుపూవరూ ఉండరు. వీరిని ఏకం చేసే ఒకే ఒక దివ్యమంత్రం... ‘ఓ లింగా’.!! చలో... ఇక పోదాం పద.. పెద్దగట్టు జాతరకు..! 

జాతర.. సంస్కృతి, ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే ఉత్సవం. ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని, జీవన సౌందర్యాన్ని ప్రతిబింబింపజేసే సంరంభం. ప్రజలు తమకు రక్షణ కల్పించిన వారినో, యుద్ధ వీరులనో దేవుళ్లుగా తలచి పూజించే సంబురం. వందల ఏండ్ల చరిత్ర కలిగిన పెద్దగట్టు జాతరకు చాలానే పేర్లున్నాయి. దురాజ్‌పల్లి జాతర, గొల్లగట్టు జాతర.. లింగమంతుల జాతర.. పేరు ఏదైనా, దైవం మాత్రం లింగమంతుడే.. 

రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు దాదాపు 15 లక్షలకు పైనే జనం వస్తుంటారు. మన రాష్ట్రం నుంచే గాక మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, ఒరిస్సా, కర్నాటకల నుంచి కూడా భక్తులు పోటెత్తుతారు. సబ్బండ వర్ణాల ప్రజలు ‘‘ఓలింగా..! ఓ లింగా !!’’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తూ ఆ దేవుడిని వేడుకుంటారు. ఇక్కడి లింగమంతుల జాతరలో వేద బ్రాహ్మణులు కాకుండా యాదవులు పూజారులు కావడం విశేషం. ‘ఓ లింగా ఓ లింగా’ అనే భక్తుల పిలుపే ఏకైక మంత్రం. 

లింగమంతుడికి నైవేద్యం..
పెద్దగట్టు జాతరలో లింగమంతుడు సహా చౌడేశ్వరి (సౌడమ్మ, చాముండేశ్వరి), గంగాభవాని, యలమంచమ్మ, అకుమంచమ్మ, మాణిక్యాలదేవి పూజలందుకుంటారు. వీరిలో లింగమంతుడు శాఖాహారి కావడంతో ఆయనకు నైవేద్యం సమర్పిస్తారు. తక్కిన దేవతలకు జంతుబలి ఇచ్చి సంతృప్త్తి పరుస్తారు. 
bonaluఅన్నా, చెల్లెళ్లకు ప్రత్యేకం...
పెద్దగట్టు పరిధిలో ఎటుచూసినా ఐదు కిలోమీటర్ల వరకు జాతర రద్దీ కనిపిస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులు టెంట్లు ఏర్పాటు చేసుకుని విడిది చేస్తారు. ఇక గట్టు సమీపంలో కోలాహలం అంతా ఇంతా కాదు. అన్నలు తమ చెల్లెళ్లకు జాతరలో గాజులు కొనివ్వడం ఏళ్ల తరబడి వస్తున్న సంప్రదాయం. గజ్జెలు, భేరీలు, తాళాలు, పిల్లనక్షిగోవి శబ్దాలు.. బండ్లు లాగుతున్న ఎద్దుల మెడలో గణగణ మోగే గంటలు..‘ఓలింగా ఓ లింగా’ అంటూ భక్తుల తన్మయం.. మరోవైపు జెయింట్ వీల్స్, జంతువూపదర్శన శాలలు, రంగులరాట్నాల వద్ద యువతీ, యువకుల కేరింతలు, తప్పిపోయిన వారికోసం ఏర్పాటు చేసిన శిబిరాల నుంచి పోలీసుల అనౌన్స్‌మెంట్లు.. పెద్ద మర్రిచెట్టు దగ్గర ఏర్పాటు చేసిన సామాజిక చైతన్య కార్యక్షికమాలు, ప్రత్యేకంగా తయారు చేసిన మిఠాయిల విక్రయాలు, చిన్నపిల్లల బొమ్మల కొనుగోళ్లు, చెరుకు రసాలు.. ఒక ప్రతి ఏటా జాతర వస్తే బాగుండనే ఆలోచనలు మది నిండిపోతాయి. దూరం నుంచి గుట్టను గమనిస్తే మూడువైపులా ఉన్న మెట్ల మార్గంలో భక్తుల రాకపోకలు గట్టుకు పూలమాలలు అల్లినట్లుగా తోస్తుంది. 

యాదవుల ప్రత్యేక వేషధారణ
యాదవులు తమకు, తమ సంపదలైన గోవులకు రక్షణగా నిలిచిన లింగమంతుడిని ఇక్కడ ఆరాధిస్తారు. జాతరకు వచ్చే భక్తుల్లో అత్యధికులు యాదవులు. వారు ప్రత్యేక వేషధారణ, వాయిద్యాలతో జాతరకు ఒకరోజు ముందే బంధుమివూతులతో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లపై ఇక్కడికి చేరుకుంటారు. మగవాళ్లు ఎరుపు రంగు బనియన్, గజ్జెల నిక్కరు ధరించి, కాళ్లకు గజ్జెలు కట్టుకుని, అవుసరాలు పత్యేకమైన తల్వార్లు) చేతుల్లో పట్టుకుని భేరీలు, తాళాల ఢిళ్లిం... భళ్లిం... శబ్దాల నడుమ లయబద్దంగా నడుస్తూ ‘ఓలింగా... ఓ లింగా!!’ అంటూ హోరెత్తిస్తారు. 

మహిళలు తడి బట్టలతో పసుపు, కుంకుమ, పూలదండలు, అగరొత్తులతో అలంకరించిన మంద గంపను నెత్తిన పెట్టుకుని నడుస్తారు. ఇంట్లోని ఆడపిల్లలు, సంతానం లేని మహిళలు బోనం కుండ ఎత్తుకుంటారు. తోడుగా వచ్చిన వాళ్లు దేవుడికి బలిచ్చే గొర్రెపోతును తీసుకొస్తుంటారు. ఇక్కడికి రావడానికి ముందుగానే గొర్రెపోతుకు స్నానం చేయిస్తారు. పూలమాల మెడలో వేసి దేవుడు ఉన్న దిక్కువైపు వదిలేస్తారు. దాంతో గొర్రెపోతు తన ఒంటిపై ఉన్న నీళ్లను దులిపేసుకోవడానికి శరీరాన్ని దులిపేస్తుంది. అలా చేయడాన్ని ‘జడత పట్టించడం’ అంటారు. అలా చేయనిపక్షంలో దాని బదులు మరో గొర్రెపోతును తీసుకొస్తారు. జడత ఇచ్చే వరకు నీళ్లు చల్లుతారు. జడత ఇస్తేనే దేవుడు మెచ్చాడని యాదవుల నమ్మకం. లేదంటే ‘నీకు ఏం తక్కువ చేశాం దేవుడా’ అంటూ నిట్టూరుస్తారు.

పెద్దగట్టుకు 200 ఏళ్ల చరిత్ర
పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు చరివూతకారులు చెబుతున్నారు. ఇందుకు పలు, ప్రాంతాల్లో ఆయా సందర్భాల్లో లభించిన శాసనాలే వారికి ఆధారం. కానీ, క్రీ.శ.11వ శతాబ్దంలో రాష్ట్రకూట వంశానికి చెందిన ధ్రువుడు అనే రాజు తన పేరిట ఇక్కడ గ్రామాన్ని నిర్మించాడని, ఆయన పేరిటే ఈ గ్రామం దురాజ్‌పల్లిగా పేరొందినట్లు కొందరి వాదన. కానీ, చరివూతకారులు మాత్రం ప్రస్తుతం పూజలందుకుంటున్న విగ్రహాలకు 200 సంవత్సరాల వయసు ఉంటుందని చెబుతున్నారు. కానీ, గతంలో జాతర జరిగిన గట్టును, అక్కడి విగ్రహాలను ఇంత వరకు ఎవరూ పరిశీలించలేదు. నేటికీ ఆ ప్రయత్నాలు జరగలేదు. ఆ పరిసరాలను గమనిస్తే ఎన్నో ఏళ్ల చరిత్ర ఉండవచ్చని సమాచారం. జాతర విశేషాలను గురించి ఇక్కడ పూజారిగా పనిచేసే 76 ఏళ్ల మట్ట రామనర్సయ్య యాదవ్ మాట్లాడుతూ ‘తమ ముత్తాతల కాలం నుంచి మా వంశీకులు జాతరలో పూజారులుగా వ్యవహరిస్తున్నారని’ చెప్పారు. దీనిని బట్టి జాతరకు దాదాపు వందల ఏళ్ల చరిత్ర ఉంటుందని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో లింగమంతుల చరిత్ర, జాతర తదితర అంశాలపై 2009 సంవత్సరంలో ‘లింగమంతుల అధ్యయన పీఠం’ ఏర్పాటైంది. లింగమంతుల స్వామి కాలం, సమయం, జాతర నేపథ్యం, ఆధారాలు, విశేషాలు తదితర అంశాలపై పీఠం అధ్యయనం చేస్తోంది. 

ఉండ్రుగొండ నుంచి దురాజ్‌పల్లికి...
దురాజ్‌పల్లికి సమీపంలో ఉండ్రుగొండ అనే గ్రామం ఉంది. దీని శివారులో పెద్ద అటవీవూపాంతం, ఏడు నుంచి ఎనిమిది కొండ గుట్టలు ఉన్నాయి. ఇక్కడ శైవ, వైష్ణవ మతాలు వర్ధిల్లినట్లు తెలిపే ఆనవాళ్లు, రాతి కట్టడాల మధ్యన కోనేరు నిర్మితమై ఉంది. ప్రస్తుతం దురాజ్‌పల్లి సమీపంలో జరిగే లింగమంతుల జాతర గతంలో ఉండ్రుగొండకు సమీపంలోని పెద్దగుట్టపై జరిగేది. అక్కడి నుంచి పెద్దగట్టుకు మారేందుకు కారణమేదైనా... ఓ కథ మాత్రం ప్రచారంలో ఉన్నది. జాతర సమయంలో మందగంప ఎత్తుకుని వెళ్తున్న ఓ గర్భిణి ఉండ్రుగొండ గుట్ట ఎత్తుగా ఉండడంతో అదుపుతప్పి పడిపోయి మృతి చెందిందని, ఆ కారణంతో దేవుడు ఓ వ్యక్తి కలలో కనిపించి తనను పెద్దగట్టుకు మార్చమని చెప్పాడని చెబుతుంటారు. దాంతో 200 ఏళ్లుగా పెద్దగట్టులో జాతర నిర్వహిస్తున్నారు. 

ఆలయ నిర్మాతలు వీరే...
1981కి ముందు పెద్దగట్టు జాతరను వెలమదొరలు నిర్వహించగా, ఆ తర్వాత 1982 నుంచి యాదవ కులస్తుల ఆధీనంలో జరుగుతోంది. పెద్దగట్టుపై రెండేళ్ల కిందట కొత్త ఆలయాలు నిర్మించారు. గతంలో ఇక్కడ రెండు చిన్న గుడులు మాత్రమే కనిపించేవి. వీటిని కొన్నేళ్ల కిందట పెద్దగట్టు సమీపంలోని కాసారం గ్రామానికి చెందిన గొర్ల లింగమడ్డి, మెంతెబోయిన భిక్షం యాదవ్ అనే ఇద్దరు లింగమంతుల స్వామి భక్తులు నిర్మించినట్టు సమాచారం. 

ఇలా వెళ్లాలి...
నల్లగొండ జిల్లాలోని పెద్దగట్టు... హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై దురాజ్‌పల్లి గ్రామ పరిధిలో ఉంది. హైదరాబాద్‌కు 150 కిలో మీటర్లు, సూర్యాపేటకు 6 కి.మీ. దూరంలో ఉంటుంది. విజయవాడ నుంచి వచ్చే భక్తులు కోదాడ మీదుగా చేరుకోవాలి. గుంటూరు వైపు నుంచి వచ్చే వారు మిర్యాలగూడ, నేరేడుచర్ల, గరిడేపల్లి మీదుగా నేరుగా పెద్దగట్టు చేరుకోవచ్చు. వరంగల్, హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు సూర్యాపేట చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక బస్సుల్లో జాతరకు రావచ్చు. అన్ని ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకునేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తుంది. ఇక్కడికి రైల్వే సౌకర్యం లేదు. 

జాతర ప్రారంభం ఇలా...
‘గొల్లగట్టు జాతర’గా మరోపేరుతోనూ పిలుచుకునే ఈ జాతర ఐదు రోజులపాటు ఘనంగా జరుగుతుంది. పుష్యమాస అమావాస్య ఆదివారం రోజు (ఫివూబవరి 10)న దిష్టిపూజతో జాతర ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. ఆ రోజున తల్లి, పిల్ల గొర్రెను గట్టుపై బలిస్తారు. దీనినే బలిపూజ అనికూడా పిలుస్తారు. తిరిగి మాఘ శుద్ధ పౌర్ణమికి అటుఇటుగా వచ్చే ఆదివారం (ఫివూబవరి 24) జాతర మొదలవుతుంది. కాగా, శనివారం మధ్యాహ్నం నుంచి మూలవిరాట్‌లకు అలంకరణ మొదలవుతుంది. వరంగల్ జిల్లా చీకటాయపాలెం నుంచి యాదవ పూజారులు చౌడమ్మ పల్లకి తీసుకురాగా, సూర్యాపేట నుంచి మకరతోరణం ఇతర ఆభరణాలు గుట్టకు తీసుకువచ్చి అలంకరిస్తారు.
జాతర తొలి రోజు: ఆదివారం ఫిబ్రవరి 10న జాతర హడావిడి మొదలవుతుంది. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తులు రాత్రి తమ ఇళ్లలో గంపలు వెళ్లదీసే కార్యక్షికమానికి శ్రీకారం చుడతారు. సంప్రదాయ ఆయుధాలు తీసుకుని ఎవరికి వారు తమ వాహనాల్లో రాత్రి లోపే ఇక్కడకు చేరుకుంటారు. 
రెండో రోజు: సోమవారం జాతరలో ప్రత్యేకమైంది. యాదవ పూజారులు పోలు ముంతలు, బొట్లు, కంకణాలు తదితర కార్యక్షికమాలు నిర్వహిస్తారు. మహిళలు తెల్లవారుజామునే బోనం వండుకుని లింగమంతుల స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. ఇదే రోజున జంతుబలి కొనసాగుతుంది. ఈ రోజున భక్తజన రద్దీ ఎక్కువగా ఉంటుంది. 

మూడో రోజు: మంగళవారం ‘చంవూదపట్నం’ వేస్తారు. బియ్యం పిండి, పసుపు కలిపిన పదార్థంతో ఆలయాల ఎదుట ముగ్గు వేస్తారు. నాలుగువైపులా గురుగులు ఏర్పాటు చేసి దీపాలు వెలిగిస్తారు. 
నాలుగో రోజు: బుధవారం నెలవారం. దేవరపెట్టెను తొలగిస్తారు. ఈ దేవరపెట్టె దిష్టిపూజరోజున ఇక్కడికి చేరుకుంటుంది. తొలగించిన అనంతరం సమీపంలోని కేసారం గ్రామానికి తరలిస్తారు. తిరిగి మరో ఏడాది జరిగే జాతర సమయంలోనే ఈ పెట్టెను తీసుకొస్తారు. 
ఐదో రోజు: మకర తోరణం తొలగింపు. మూలవిరాట్‌ల అలంకరణకు ఉపయోగించే ఈ ఆభరణం మొసలి శరీరం, సింహం తలభాగం కలిసిన ఆకృతితో చెక్కి ఉండడం గమనార్హం.

పెద్దగట్టుపై కొండంత వివక్ష
తెలంగాణలో రెండో అతి పెద్ద జాతరైన ‘లింగమంతుల జాతర’పై సీమాంధ్ర పాలకులు ఏళ్ల తరబడి వివక్ష చూపుతున్నారు. జాతర ఆదాయంపై కన్నేసి, దోచుకుంటూనే.. నాటి నుంచి నేటి వరకు ఎలాంటి వసతులు సమకూర్చకపోవడం విచారకరం. జాతరలో క్రయ, విక్రయాలకు సంబంధించి వేలం నిర్వహిస్తూ వచ్చే ఆదాయంలో కనీసం పదిపైసల వంతైనా గుట్ట అభివృద్ధికి వెచ్చించడం లేదు. ఫలితంగా జాతర సమయంలో భక్తులు పడరాని పాట్లు పడుతుంటారు. నిలువ నీడలేక, తాగడానికి నీరు లేక, కాలకృత్యాల తీర్చుకునే ఏర్పాట్లు లేక అలమటిస్తుంటారు. పిల్లాపాపలు, బంధుమివూతులతో మండుటెండలో తీవ్ర ఇక్కట్లు వారికి తప్పవు. వాస్తవానికి లింగమంతుల జాతర 1967లో ప్రభుత్వ గుర్తింపు పొందింది. అప్పటి నుంచి జాతర ఆదాయాన్ని గ్రామపంచాయతీనే అనుభవిస్తోంది. కేవలం జాతర సమయంలో మాత్రం అరకొర నిధులతో సరిపెడుతోంది. ఈ నేపథ్యంలో లింగమంతుల జాతరను రాష్ట్ర పర్వంగా గుర్తించి అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు. 

గోలీ సోడా సీసాలు పేలిన ఘటన
1969వ సంవత్సరం.. తెలంగాణ తొలిదశ ఉద్యమం జోరుగా సాగుతున్న సందర్భం. అదే సమయంలో పెద్దగట్టు జాతర జరుగుతుండగా గుట్టపై ప్రమాదవశాత్తూ గోలీ సోడాలు పెద్ద శబ్ధంతో పేలిపోయాయి. దీంతో అక్కడున్న భక్తులంతా భయపడ్డారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాళ్లు వచ్చి బాంబులు వేస్తున్నారని ప్రచారం జరగడంతో భక్తులు పెద్దగా కేకలు వేస్తూ తలో దిక్కు పారిపోయారు. జాతర చరివూతలో ఈ సంఘటన మరిచిపోలేనిది, ప్రత్యేకమైంది. ఎందుకంటే, ఆ కాలంలో చాలామంది నిరక్షరాస్యులే కావడంతో తమ పిల్లల పుట్టిన రోజులు రాసిపె కాదు. దాంతో క్రీ.శ., క్రీ.పూ. అన్నట్లు తమ పిల్లలు గోలీసోడాలు పేలిన ఘటనకు ముందు పుట్టారా లేక తర్వాత పుట్టారా అనేదే గుర్తుంచుకున్నారు.
                                                                                                                      -namaste telangana

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి