హోం

25, మార్చి 2013, సోమవారం

వానా కాలపు వినోదం ..


                     మరో నాటకానికి తెరలేస్తుంది, ఇందిరా గాంధీ మార్గంలో సోనియా గాంధీ పయనించడానికి సిద్దం అవుతుంది, మరో సారి తెలంగాణా ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి నయవంచన అనే పాత ఫార్ములానే వాడబోతుంది, గతంలో మర్రి చెన్నారెడ్డి పావులా మారితే ఇప్పుడు జైపాల్ రెడ్డి పావులా మారబోతున్నాడు.
                    తెలంగాణా ఉద్యమం పతాక స్థాయిలో లేవడానికి, లేచిన ఉద్యమాన్ని అదుపులో పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు, జగన్ ను అదుపులో పెట్టాలని తెలంగాణా కు అనుకూల వాతావరణం సృష్టించడం, కె సి అర్ కు ఇమేజ్ పోతుందని జె ఎ సి బలపడేలా చెయ్యడం కాంగ్రెస్ కనుసన్నల్లో జరుగుతున్న పరిణామాలను నిశితం గా గమనిస్తే తనకు లాభం కలగక పోయిన పరవాలేదు, కాని పక్కవాడు బాగుపడకూడదు అనేది కాంగ్రెస్ పాలసీ, కోదండ రామ్ ను ఇతర జె ఎ సి సభ్యులను అరెస్ట్ చేసి బెయిల్ ఇవ్వకుండా రెండు రోజుల పాటు జైలు లో పెట్టి సడక్ బంద్ క్రెడిట్ కె సి అర్ కు వెళ్ళకుండా కట్టడి చేసింది కేంద్రం, జె ఎ సి బలపడుతుండడం కూడా కాంగ్రెస్ కు మింగుడుపడక ఇప్పుడు కొత్త డ్రామాకు తెర తీచింది.
                  ఇన్ని రోజులు హాయిగా పదవులు అనుభవించిన జైపాల్ రెడ్డి , జానా రెడ్డి లు కొత్త వేదికను ఎర్పరుస్థారట ..? ఇది ఇతర ఉద్యమ పార్టీలను జె ఎ సి ను కాతరు చెయ్యకుండా స్వతంత్ర నిర్ణయాలతో ఉద్యమాన్ని వేడెక్కిస్తారట..? అయితే జైపాల్ రెడ్డి ఇప్పుడే రాజీనామా చెయ్యడట అది మార్చ్ చివరివారంలో చేస్తారట..? ఎందుకో తెలుసా... సార్వత్రిక ఎన్నికల సమయం సంవత్సరం కన్నా తక్కువగా ఉంటె అప్పుడు రాజీనామా చేసినా ఉప ఎన్నికలు రావు, ఆ స్థానాలకు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటే ఓటింగ్ నిర్వహిస్తారు, కావున జైపాల్ రెడ్డి వానాకాలం లో రాజీనామా చేసి కొత్త పార్టీ ప్రకటించగానే కాంగ్రెస్ వారి డ్రామాలు మొదలవుతాయి, ఒక్కొక్కరుగా మన కాంగ్రెస్ ఎం పీ లు, ఎం ఎల్ ఎ లు అంత క్యు కట్టి మరి రాజీనామా చేస్తారు, ఆమోదించమని స్పీకర్ పై ఒత్తిడి తెస్తారు, రాజీనామా ఆమోదించినా ఉపఎన్నికలు రావు, ప్రభుత్వము పడిపోదు, ఎందుకంటే ఆపద్ధర్మ ప్రభుత్వంగా సార్వత్రిక ఎన్నికల వరకు ఈ ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి.
                         ఇక ఉద్యమాన్ని అణచివేయ్యాలంటే జైళ్ళు నింపితే కుదరదని వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కుటిల కాంగ్రెస్ కు తెలుసు, ఉద్యమాన్ని అణచాలంటే ఉద్యమ కారులు జై తెలంగాణా అంటే ద్రోహులు జై జై తెలంగాణా అంటారు, ఉద్యమాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు, వారి ప్రయోజనం పూర్తికాగానే ఉద్యమాన్ని గాలికి వదిలి వెళ్ళిపోతారు, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఇదే విధానాన్ని ఫాలో కావాలనుకుంటున్నారు, గతం నేర్పిన పాటలను మరో సారి సోనియా నిర్దేశనంలో జైపాల్ నాయకత్వాన  నయవంచనకు ఊపిర్లుదనున్నారు. ఇప్పటికి ఇంకా ఎం నిర్ణయం తీసుకోలేదని చెప్పిన, మీడియా సృష్టి అని ఖండించిన వానాకాలం లో  మరో వినోదం చోటుచేసుకోవడం ఖాయం, నూతన వేదిక రావడం అనివార్యం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, రాహుల్ గాంధీ ప్రధాని పీటం ఎక్కడానికి మన నాయకులు చేస్తున్న ఆత్మవంచన క్రతువు, కావున తస్మాత్ జాగ్రత్త ..!

                                          

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి