హోం

6, ఏప్రిల్ 2012, శుక్రవారం

రాములవారు నడయాడిన స్థలాలు..



రాముడు తెలంగాణలో సంచరించాడనడానికి మూడు రకాల ఆధారాలు కన్పిస్తున్నాయి. ఒకటి వాల్మీకి రామాయణం (అరణ్యకాండ), రెండు పురావస్తు-చారివూతక విశేషాలు, మూడు జానపద స్థల పురాణ గాథలు.సీతారామ లక్ష్మణులు తమ పద్నాలుగేళ్ళ వనవాసంలో భాగంగా ఉత్తర, మధ్య భారతంలో అనేక స్థలాలు తిరుగుతూ వాల్మీకి ఆశ్రమాన్ని దర్శించారని, ఆ తర్వాత చిత్రకూట పర్వతాన్ని చేరుకొని పర్ణశాల నిర్మించుకున్నారని మనకు తెలుసు. అయితే, అగస్త్య మహర్షి రాములవారిని దక్షిణాన గోదావరి తీరాన ఉన్న పంచవటికి వెళ్లమని చెప్తూ ‘‘తాడిచెట్ల వనం దాటి ఉత్తరం గుండా మఱ్ఱి చెట్టు వద్దకు చేరుకొని, అక్కడి నుండి పర్వత తలంపై నడవాలి’’ అని వివరించినట్లు అరణ్యకాండ 13వ సర్గలోని 13,1,21,22 శ్లోకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ‘పంచవటి’ అంటే మఱ్ఱి, మారేడు, మేడి, రావి, అశోక వృక్షాల వనాలుండే ప్రదేశమని అర్థం. ఈ వనాలున్న ప్రదేశం గోదావరి నది వెంట కరీంనగర్ జిల్లాలోని రామగిరి ఖిల్లా నుండి ఖమ్మం జిల్లా తూర్పు సరిహద్దుల వరకూ ఉండేది. ఇంత విశాలమైన పంచవటిలో రాముడు మొదట పర్ణశాల నిర్మించుకున్నది చిత్రకూటంపైన. 

‘‘న మూలం లిఖ్యతే/నానపేక్షిత ముచ్యతే’’ (మూలంలో లేనిది చెప్పను, అనవసరమైంది అసలే చెప్పను) అని ఢంకా బజాయించి చెప్పుకున్న అగ్రక్షిశేణి వ్యాఖ్యానకారుడు మల్లినాథసూరి ‘చివూతకూటం అంటే రామగిరి’ అని చెప్పాడు. ఆయన మన మెదక్ జిల్లా వాసి అన్నది తెలిసిందే. నిజానికి ‘అరణ్యకాండ’లోని పైన పేర్కొన్న శ్లోకాలలో వివరించినట్లుగానే రామగిరికి ఉత్తరాన వేల తాడి చెట్లుండటం విశేషం. అట్లే, ఆగ్నేయంలో ‘తాడిచెట్ల’ అనే ఊరు కూడా ఉన్నది. ఆ శ్లోకంలో చెప్పినట్లే, రామగిరి పర్వత తలంపై 10 కిలోమీటర్లు నడవాలి కూడా. ఇంకొక గొప్ప విషయమేమిటంటే, రాముడు ఇక్కడికి వచ్చినప్పటి సంగతి! అంటే క్రీ.పూ. 5179వ సంవత్సరం నాటి మధ్య శిలాయుగ మానవుల స్థావరం, వారి పనిముట్లు, ఆయుధాలు ఇక్కడ లభించడం! వీటిని 197లో పెద్దపల్లి నివాసి ఠాకూర్ రాజారాం సింగ్ పూర్వ పురావస్తు శాఖ సంచాలకులు వి.వి.కృష్ణశాస్త్రి సమక్షంలో రామగిరి గుట్ట మొదట్లో సేకరించారు.
‘సీతాస్నాన పుణ్యోదకేషు రామగిరి’ అని క్రీ.శ. 5వ శతాబ్దంలో మహాకవి కాళిదాసు తన మేఘసందేశం’ కావ్యంలో రాశారు. వారు రాసినట్లుగానే ఈ రామగిరిపై సీత స్నానం చేసిన కొలనులూ ఉన్నయి. ఆమె పసుపు కుంకుమలు ఇక్కడి రాళ్ళ నుంచి సేకరించుకున్న ఆనవాళ్లు...అంటే గుంటలు కూడా ఉన్నయి. అట్లే, సీతారామ ప్రతిష్టిత శివలింగాలను కూడా మనం రామగిరి పైన ఇప్పటికీ చూడవచ్చు. అంతేకాదు, రాముడు భూమిలోకి శక్తివంతమైన బాణాలను సంధించి సృష్టించిన ఊటలను కూడా రామగిరిపై చూడవచ్చు. 

రాముడు ఇక్కడున్నప్పుడే దశరథుడు మరణిస్తాడు. దాంతో తండ్రికి ఇక్కడే పిండం పెట్టాడని స్థానికులు చెప్తరు. తదనంతరం భరతుడు ఇక్కడికి వచ్చి రాముడి పాదుకలను అయోధ్యకు తీసుకెళ్ళాడని అంటరు. ఈ చరివూతాత్మక విషయాలకు సంబంధించిన ఎన్నో విగ్రహాలు కూడా రామగిరి కొండ కోనపైనున్న గుహలో మనం చూడవచ్చు.అయితే, రాముడి ఉనికి ఈ ప్రాంతపు రాజు ఖరునికి కంట గింపయిందట అతని సైన్యం మునులు, ఋషులపై అఘాయిత్యాలకు పాల్పడిందట. దాంతో రాముడు మునుల కోసం ఈ జనస్థానాన్ని (రాజధాని ఖరియాల్, చత్తీస్‌ఘడ్) వదిలి దండకారణ్యంలోకి ప్రవేశించాడని తెలుస్తున్నది. ఈ అరణ్యం మంత్రకూటం అంటే మంథని - దాని తూర్పు నుండి ప్రారంభిమవుతుందని కూడా గమనించవచ్చు. రాములవారు దండకారణ్యంలో మొదట ఎదురైన విరాధుడు అనే రాక్షసుని చేతులు నరికి శరభంగ మహాముని ఆశ్రమంలో గడుపుతున్నప్పుడు ఆ ప్రాంత మునులందరూ ఆయన దగ్గరికి వచ్చారట. వారంతా మునుపూందరినో రాక్షసులు చంపుతున్నారని చెబుతూ, వారి బొక్కలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన ఒక స్థలాన్ని కూడా రాములవారికి చూపారట. ఆ స్థలం ఇప్పటికీ ‘బొక్కల గుట్ట’ పేరుతో రామగిరికి వాయవ్యాన -మంచిర్యాలకు 5 కి.మీ. దూరంలో ఉండటం కూడా ఒక ప్రబలమైన ఆధారంగా కనిపిస్తున్నది.
Raamagiripaiమునులకు అభయమిచ్చిన సీతారామ లక్ష్మణులు ఆ ప్రాంతంలో ఉన్న సుతీక్షుడు తదితర మునుల ఆశ్రమాలను దర్శిస్తారు. ఇక అదే రోజు పొద్దుగూకే సమయంలో పంచాప్సర సరస్సును చూశారట. ఆ సరస్సును మాండకర్ణి అనే ఋషి సృష్టించుకొన్నడు. అందులో ఆయన ఒక రహస్య మందిరాన్ని నిర్మించుకొని వాటిల్లో ఐదుగురు అప్సర సలతో రతి సుఖాలను అనుభవించాడట. ఈ సంగతి ధర్మభృతుడనే ఋషి రాముడికి చెప్పినట్లు అరణ్యకాండ 9వ సర్గ -1 శ్లోకాలలో ఉన్నది. మాండకర్ణి తాలూకు ఈ వ్యవహారాన్ని బట్టి ఆ సరస్సును స్థానికులు ఇప్పుడు ‘లంజమడుగు’ అంటున్నరని కూడా మనం గమనించాలి. ఇది గోదావరిలో మంథనికి సమీపంలో ఉంది. మాండకర్ణి తాలూకు ఈ కథ ఎంతగా ప్రచారమయ్యిందంటే ఆ వృత్తాంతాన్ని తెలిపే శిల్పం విజయవాడ కనకదుర్గ ఆలయ సమూహంలోని శిథిల ఆలయంపైన కూడా ఉన్నది. ఇలాంటి శిల్పాలు ఈ ప్రాంత గుహాలయాల్లో కూడా ఉన్నయి. 
ఇక, ఇక్కడి నుంచి రాముడు ఖమ్మం జిల్లాలోని ప్రస్తుతం పర్ణశాల ఉన్న ప్రాంతానికి వెళుతున్నప్పుడు మధ్యలో జటాయువు అనే (టోటెమ్) పక్షిరాజు ఎదురై తాను దశరథునికి స్నేహితున్నని చెప్తూ, ప్రసంగ వశాన సృష్టిలో జీవజాల పుట్టుక ఎలా జరిగిందో వివరిస్తడు. (14వ సర్గ). ఈ వివరణ తాలూకు శిల్పాలను మనం రామగిరి ఖిల్లా రెండవ, మూడవ కోటల దర్వాజాలపై చూడవచ్చు. మరో విషయం, ఈ ప్రాంతంలో రామాయణ కాలం నాటి జటాయువు లేదా గద్దను (సంస్కృతంలో గృధ్రం) పూజించే వారి ప్రాబల్యం ఉండేది. ఇక్కడి నుండి తూర్పు వైపున్న అరణ్య ప్రాంతానికి అతి ప్రాచీన కాలంలో ‘గృవూధవాడి’ అనే పేరు ఉన్నట్లు కూడా శాసనాల ద్వారా తెలుస్తున్నది. గద్దను తమ జెండాపై చిత్రించుకున్న పొలవాస రాజులు ఈ ప్రాంతంలో క్రీ.శ.12వ శతాబ్దం వరకూ పరిపాలన చేశారన్నది చరిత్ర. ఇలాంటి జెండాలను ఇప్పటికీ మనం సమ్మక్క జాతరలో చూడవచ్చు.

సీతారామ లక్ష్మణులు నేటి ఖమ్మం జిల్లాలో గోదావరి తీరాన పర్ణశాల కట్టుకొని కొంతకాలం హాయిగా గడిపారు. భద్రాచలానికి ఉత్తరాన సుమారు 35 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పర్ణశాల పంచవటి ప్రాంతంలో భాగమే. ఇక్కడ ఒక వటవృక్షం కింద రామపాద ముద్రలున్నయి. ఈ పర్ణశాల ప్రాంతం ఒక అందమైన సంగమ ప్రదేశం. ఇక్కడ గోదావరిలో తాలిపేరు, సీలేరు, సీతవాగు కలుస్తయి. సీతవాగులో సీత స్నానం చేసి వాగులోని బండల మీద తన పట్టుచీరలు, నారచీరలను ఆరబెట్టుకున్నప్పుడు వాటి రంగు అంటిన చారలను మనం నేటికీ అక్కడ దర్శించవచ్చు. రాముడు స్నానం చేసిన స్థలాన్ని ఇప్పుడు ‘స్నానాల లక్ష్మీపురం’ అంటున్నారు. ఇది వైరా మండలంలో ఉంది. ఇక్కడ శివరావూతినాడు లక్షలాదిమంది భక్తిక్షిశద్ధలతో స్నానం చేస్తరు.

సీతారాములు పర్ణశాలలో ఉన్నప్పుడు అక్కడి పరిసర ప్రాంతాలలో కూడా తిరిగారని పరంపరగా వస్తున్న మౌఖిక ఆధారాలు తెలియజేస్తున్నయి. అలా వారు అదే గోదావరి వెంట నేటి భద్రాచలం వరకూ వచ్చి, ఆ గిరిపై కొంత సమయం విశ్రాంతి కూడా తీసుకున్నారని, అదే స్థలంలో భద్ర మహర్షి సీతారామ లక్ష్మణుల విగ్రహాలను కూడా ప్రతిష్టించి పూజలు ప్రారంభించారని భద్రాచల స్థలపురాణం తెలియజేస్తున్నది. ఇక్కడికి ఆగ్నేయంలో ఆన్న ఉష్ణకుండంలో చలికాలంలో సీత స్నానం చేసేదని కూడా చెప్తరు. ఈ సందర్భంగా ఇదే ప్రాంతంలో నవీన శిలా యుగానికి చెందిన మానవుల స్థావరపు పనిముట్లను డా॥ పి.వి.పరవూబహ్మశాస్త్రి గుర్తించిన విషయం మనం దృష్టిలో ఉంచుకోవాలె.

ఖమ్మం పట్టణానికి 22 కి.మీ. దూరంలో ఉన్న ‘నాగులవంచ’కు కూడా రాముడు వచ్చిండనుకోవచ్చు. ‘వంచ’ అంటే ‘వాగు’ అని అర్థం. ఆయన ఇక్కడి వంచలో స్నానం చేశాడట. ఇక్కడున్న అతి ప్రాచీన కోదండ రామాలయంలో భద్రాచలంలో ఉన్నట్లే సీతారాములు ఒకే వేదికపై దర్శనమిస్తరు. ఇక్కడే హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తెస్తున్నటువంటి శిల్పం కూడా చిత్రితమైంది. సమీపంలోని గజగిరి నరసింహస్వామి గుట్టపై ఉన్న దేవుడు ప్రసిద్ధి చెందిన మంగళగిరి పానకాల స్వామిలా ఎంత పానకం పోసినా తాగేస్తడు. అంతేకాదు, ఇదే నాగులవంచలో సీతారాములు సృష్టించుకున్నవిగా చెప్తున్న సీతానగర్, రామసముద్రం అనే రెండు చెరువులు కూడా ఉన్నయి.

సీతారామ లక్ష్మణులు పర్ణశాలలో ఉన్నప్పుడు రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ (అంటే చాటంత చెవులు కలదని అర్థం) ఇక్కడికి వచ్చి రాముడిని మోహిస్తుంది. లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు కోస్తడు. దానికి ఆగ్రహించిన ఈ ప్రాంత పాలకుడు, శూర్పణఖ అన్న అయిన ఖరుడు రాముడిపై పద్నాలుగువేల మంది సైన్యంతో యుద్ధం చేస్తడు. ఆ యుద్ధ సమయంలో సూర్యక్షిగహణం సంభవించిందని, ఆ రోజు రాత్రి అమావాస్య అని, అప్పుడు మధ్యలో ఉన్న అంగారక గ్రహానికి ఒక పక్క బుధ-శుక్ర గ్రహాలు, మరో పక్క శని గ్రహం - సూర్యుడు ఉన్నారని అరణ్యకాండ 23వ సర్గ 10-13,34 శ్లోకాలలో వాల్మీకి వివరించిండు. ఈ గ్రహస్థితిని అమెరికన్ టైమ్ మిషన్‌లో పొందుపర్చినప్పుడు అది ఆ రోజు తేది క్రీ.పూ. 5077 అక్టోబర్ 7 అని సూచించిందని ‘డేటింగ్ ది ఎరా ఆఫ్ లార్డ్ రామ’ అనే పుస్తకంలో పుష్కర్ భట్నాగర్ అనే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి పేర్కొన్నాడు. ఆ నాటి యుద్ధంలో రాముడు ఖర, దూషణ, త్రిశిరాదులతో సహా 14వేల మంది రాక్షస సైన్యాలను చంపుతున్నప్పుడు రాముని సూచన మేరకు లక్ష్మణుడు సీతను ఒక కొండ గుహలో దాస్తడు. ఆ కొండ పేరు లక్ష్మణకొండ. ఈ యుద్ధం జరిగిన స్థలం దుమ్ముగూడెం, లక్ష్మణకొండ ప్రాంతాలు. ఇవి పర్ణశాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంటయి. దుమ్ముగూడెంలో అత్యంత ప్రాచీనమైన రామలింగేశ్వరాలయం కూడా ఉన్నది. 

రాముడు ఖరున్ని చంపాక శూర్పణఖ రావణుడితో మొరపెట్టుకుంటది. దాంతో రావణుడు లంక నుండి ఇక్కడికి వచ్చి మారీచున్ని ఒప్పించి అతని సహకారంతో సీతను ఎత్తుకుపోయే పథకం పన్నుతడు. రావణుడు ఇక్కడికి కంచర గాడిదల రథం మీద వచ్చిండని, సరైన సమయం కోసం గోదావరి ఆవలి ఒడ్డున వేచి ఉన్నడని, ఆ వేచివున్న గుట్టపేరు ‘రావణగుట్ట’ అని, అతని రథ చక్రాల గాడి ఇదే అని స్థానికులు ఆ గుట్టపై ఉన్న ఆనవాళ్ళను చూపిస్తరు. రావణుడు సీతను ముట్టజాలక ఆమె నిల్చున్న భూమినంతా పెకిలించుకొని పోవడంతో ఆ ప్రాంతంలో ఏర్పడ్డ గుంటను ‘రావణుకొలను’ అని కూడా అంటున్నరు. ఇది పర్ణశాలలోని రామాలయం వెనక ఉన్నది. సమీపంలోనే ‘దశకంఠేశ్వరాయం’ అనే శివాలయం కూడా ఉంది. అందులో శివలింగాన్ని పరమ శివభక్తుడైన దశకంఠుడు అంటే రావణుడే తను లంక నుండి తెచ్చి ప్రతిష్టంచిండని చెబుతరు. 

రావణుడు తనను ఎత్తుకుపోతున్న విషయాన్ని గురించి సీతమ్మ తన రాముడికి చెప్పండని మాల్యవంతం పైనున్న ప్రస్రవణగిరికి, గోదావరికి చెప్పిందట. ఈ ప్రస్రవణమే తెలుగులో ‘పొరవణం’గా, క్రమంగా ‘పోలవరం’గా మారింది. సుమారు రెండు శతాబ్దాల కింద భద్రాచలంపై జరిగిన ధంసా (దొంగ గిరిజనుల) దాడి సమయంలో భద్రాచల రాముడ్ని రహస్యంగా ఈ పోలవరం మీదికే తీసుకొచ్చి, ప్రతిష్టంచి పూజించారు. కొన్నాళ్ళ తరువాత మళ్ళీ భద్రాచలానికి తీసుకొచ్చిండ్రు.

సీత అరుపులను విని జటాయువు రావణుడ్ని ఎదిరించిండు. కానీ, రావణుడు జటాయువు రెక్కలను నరికివేసిండు. ఆ రెక్కలు పడిన స్థలం పేరు ‘రెక్కపల్లి’. అది క్రమంగా ‘రేకపల్లి’ అయ్యింది. జటాయువు రాముడికి సీతాపహరణ విషయం చెప్పి మరణించిన స్థలమే ‘జటపాక.’ అది కాలక్షికమంలో ‘ఎటపాక’ అయ్యింది. ఇక్కడ ఇప్పుడు ‘జటాయువు మంటపం’ కూడా ఉన్నది. పక్కనే భద్రాచలానికి 5 కి.మీ.ల దూరంలో ‘జటాయువు పర్వతం’ కూడా ఉంది. రాములవారు చనిపోయిన ఆ జటాయువుకు సమీపంలో ఉన్న గోదావరిలో పిండాలు పెట్టిండట. అలా పిండాలు పెట్టిన ప్రదేశం పేరుతో తెలంగాణలో కొన్ని చోట్ల ‘పెండ్యాల’ అనే ఊర్లేర్పడినాయి.
RaamunigunDaalaloరావణుడు తనను ఆకాశమార్గంలో ఎత్తుకు పోతున్నపుడు సీత కింద కనిపిస్తున్న ఐదుగురు వానరులను చూసి తన నగలను ఒలిచి, తన పట్టు ఉత్తరీయంలో చుట్టి వారి దగ్గర పడేసిందట. ఆ ప్రదేశం పేరు ‘సీతంపేట’ అయ్యింది. ఇది భద్రాచలానికి తూర్పున 50 కి.మీ.ల దూరంలో కూనవరానికి దగ్గర్లో ఉంది. అటు తర్వాత రామలక్ష్మణులు సీతను వెతుక్కుంటూ కూనవరానికి వచ్చారు. అక్కడ వారికి స్థానిక సవర తెగ స్త్రీ శబరి కనిపించింది. ఆమె రేగుపళ్ళ రుచి చూసి తియ్యగా ఉన్నవాటిని రాముడికి తినిపించింది. ఆ ప్రదేశాన్ని ఇప్పుడు ‘శ్రీరామగిరి’ అంటున్నరు. 

ఈ కూనవరం దగ్గరే శబరి నది ఉత్తరం నుండి వచ్చి గోదావరిలో సంగమిస్తుంది. పాపికొండల టూర్ బోట్లు ఇక్కడి నుండే గోదావరిలో ప్రయాణిస్తయి. సమీపంలో వాలి సుగ్రీవుల కొండ కూడా ఉన్నది. ఆ కొండపై వాలి సుగ్రీవులు కొట్లాడినారని అంటరు. అయితే, వాళ్లు కొట్లాడినట్లు తెలిపే శిల్పాలు ఇక్కడికి దక్షిణంగా కొన్ని పదుల కిలోమీటర్ల దూరంలో, పశ్చిమ గోదావరి జిల్లాలోని కామవరపు కోట గ్రామ పరిధిలోని కొండల్లో ఉన్నయి. ఆ కొండల్లో వాలి భార్య తారను పూజించే ఒక ప్రాచీన గుహాలయం ఉన్నది. వీటన్నిటి మూలంగా కూనవరం దగ్గర వాలి సుగ్రీవుల కొండలో రాముడు వాలిని చంపినట్లు, సుగ్రీవునితో స్నేహం చేసి అతని సహచరులను నలు దిశలకు పంపి సీతను వెదికించినట్లు అనుకోవడానికి ఆధారం లభిస్తుంది. కూనవరంలోని రామాలయంలో యోగరాముని విగ్రహం ఉంది. దీనికీ ఒక కారణం కనిపిస్తుంది. రాముడు పర్ణశాలలో ఉన్నప్పుడు ఇక్కడున్న మతంగముని ఆశ్రమంలో యోగ నేర్చుకున్నారట.

చారివూతక స్థలాలు
కరీంనగర్ జిల్లా రామగుండం మండలంలోని అడవి సోమనపల్లిలో ‘ఎక్కటె విమున’ అనే అతడు క్రీ.శ. 10వ శతాబ్దంలో రామేశ్వర ప్రతిష్ట చేసినట్లు అక్కడ శాసనమున్నది. ఈ ఊరికి ఉత్తరాన గోదావరికి అవతల విమునపల్లి (వేమనపల్లి)లో కూడా అనేక శిథిల శిల్పాలున్నయి. అక్కడ కూడా ఈ ‘ఎక్కటె విమున’ అనే అతనే రామేశ్వర దేవాలయం కట్టించి ఉండవచ్చునని, అతని పేరుతో ఉన్న ఊరు పేరును బట్టి ఊహించవచ్చు. అడవి సోమనపల్లి రామేశ్వరాలయం కోసం క్రీ.శ. 110 ప్రాంతంలో పెనుకంటి ముచ్చిడ్డి అనే రామగిరి ప్రాంత రాజు భూదానం చేశాడని తెలిపే శాసనం కూడా లభిస్తున్నది.కరీంనగర్ జిల్లాలోనే ఉన్న పొట్లపల్లి రామాలయానికి సాగు నీరును తోడే ‘మోట రాట్నాన్ని’ కళ్యాణి చాళుక్యరాజు త్రిలోకమల్లదేవుని మహాసామంతుడు- రేగొండ రాజు చందయ్యరసర్ మకీ.శ. 1066 మార్చి 14వ తేదీ ఆదివారం (చంవూదక్షిగహణం) నాడు దానం చేసిండని ఆలయ శిలాశాసనంలో ఉంది. రాముడు తన తండ్రికి ‘ఉల్లింతపప్పు’తో శ్రాద్ధం పెట్టినట్లు చెప్పబడుతున్న ప్రాంతం ఇదే. అది ‘ఇల్లంతకుంట’కు సమీపంలోనే ఉండటం గమనార్హం.

కరీంనగర్ జిల్లాలోని యెల్గేడులోని రామనాథ దేవరకు ఓరుగల్లు కాకతీయరాజు రెండవ ప్రతాపరువూదుని ఒక భార్య లకుమాదేవి తన తండ్రి పేర స్థానిక పన్నులను క్రీ.శ. 1301 జూన్ 27 నాడు వృత్తిగా (దానంగా) ఇచ్చినట్లు అక్కడ శాసనమున్నది. ఇదే జిల్లాలోని విలాసాగర్‌లో ఉన్న రామేశ్వర దేవాలయానికి క్రీ.శ. 1302లో మల్యాల వంశ రాజులు దానం చేసినట్లు తెలిపే శాసనం కూడా ఆ ఆలయంలో ఒకటున్నది.
నిజామాబాద్ జిల్లాలోని బండరామేశ్వరపల్లి దేవాలయంలోని శ్రీరామనాథ దేవునికి క్రీ.శ. 1264లో రాణి రుద్రమదేవి సామంతుడు ‘గుండయ పిన్నవేలుకొండ’ అనే గ్రామాన్ని దానం చేసినట్లు ఆ ఆలయ స్తంభ శాసనం తెలియజేస్తోంది. ఇదే జిల్లా తాండూరులో త్రిలింగ రామేశ్వరాలయం అనే ఒక శిల్పకళాశోభిత చారివూతక ఆలయం ఉంది. అలాగే సిరికొండ మండలం లొంక రామాలయంలో కూడా కనీసం క్రీ.శ. 5వ శతాబ్దం నుండే మూలాలున్నాయని అక్కడి శాసనాలు, పురావస్తు విశేషాల ఆధారంగా తెలుస్తున్నది.
హైదరాబాద్ దగ్గరి కీసరగుట్ట పైనున్న 10 శివలింగాలను క్రీ.శ. 5వ శతాబ్దంలో విష్ణుకుండి రాజు రెండవ మాధవవర్మ తన ఒక్కొక్క యుద్ధ విజయానికి గుర్తుగా ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్టించాడనేది చారివూతక సత్యం. మార్చి 11నే ఆయన అక్కడ కట్టించిన యాగశాలలు బయటపడినట్లు ఫొటోలతో సహా పత్రికల్లో వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే.

శ్రీశైలం మల్లికార్జునస్వామి దేవాలయం దక్షిణ ముఖ మండపానికి ఎదురుగా ఉన్న క్రీ.శ. 1313 నాటి స్తంభశాసనంలో ఈ దేవాలయానికి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర, కలియుగాల కాలాల్లో ఇవ్వబడుతూ వస్తున్న మాన్యాలను ఫిబ్రవరి 26న స్థిరీకరించినట్లు ఉంది. అందులో కుసలనాటిలోని మల్లికార్జునింపల్లి, సాసుఱ్ఱాల, పిప్పరిగె, కలుచెఱులు, దేవరపల్లి అనే ఐదు గ్రామాలు కూడా మాన్యాలుగా పేర్కొని ఉన్నయి. ఈ కుసలనాడు గ్రామాలు మెదక్ జిల్లాలోనివి. ఈ కుసలనాడు మొదట అంటే త్రేతాయుగంలో కుశస్థితి అని, అంటే రాముడి కొడుకు కుశుడు పాలించిన ప్రాంతమని వి.వి.కృష్ణశాస్త్రి అభివూపాయం.
అయితే, రాముడి గురువు విశ్వామివూతుని వంశంలో కూడా ఒక కుశుడు ఉన్నాడు. అతని కథను రాముడికి వినిపించడం జరిగింది. విశ్వామివూతుడు తన యాభై మంది కొడుకులను ఆంధ్రులలో కలిసి పొమ్మని శపించిండు. కాబట్టి, ఆనాడు ఆంధ్రులు నేటి తెలంగాణ ప్రాంతంలో విస్తరించి ఉండేవారు. వాళ్లలో ఒకడైన కుశుని పేర ఇది ‘కుశలనాడు’ కావడానికి ఆస్కారముంది. ఎట్లా చూసినా మెదక్ జిల్లాలోని చారివూతక ‘కుసలనాడు’ రామ సంబంధ ప్రాంతమే. ఉత్తర భారత సామ్రాట్ సమువూదగుప్తుడు క్రీ.శ. 360 ప్రాంతంలో దక్షిణ దేశాన్నంతటినీ జయించి తిరిగి ఉత్తర భారతానికి ఈ కుశలనాటి నుంచే వెళ్ళినట్లు అలహాబాద్ స్తంభశాసనంలో కూడా ఉంది.

సమువూదగుప్తుడు, అతని కొడుకు చంద్రగుప్తుడు తదితర గుప్తరాజులు శ్రీరామ భక్తులు. శ్రీరామున్ని తమ నాణేలపై ముద్రించారు. తాము జయించిన రాజులు రామ మతాన్ని పోషిస్తే వారి రాజ్యాలను వారికి తిరిగి ఇచ్చేవారని పి.వి. పరవూబహ్మశాస్త్రి నిరూపించారు కూడా. రెండవ చంద్రగుప్తుని కూతురు, వాకాటక రాజ్యపు రాణి ప్రభావతీ గుప్తతో బంధుత్వమున్న తెలంగాణ రాజు విష్ణుకుండి రెండవ మాధవవర్మ వారి ప్రభావంతోనో లేక తనకు తానుగానో రామభక్తుడై తెలుగు ప్రాంతమంతటా క్రీ.శ. 5వ శతాబ్దంలో రామలింగేశ్వరాలయాలను కట్టించాడు. మూడు, నాలుగు చోట్ల అ విషయాన్ని నిర్ధారించే విధంగా శాసనాలు కూడా దొరికాయి. కాబట్టి, ఎక్కడ ప్రాచీన చారివూతక రామలింగేశ్వరాలయం కనిపించినా దాని మూలాలు కనీసం 5వ శతాబ్దం నుండైనా ఉంటాయని చెప్పవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి