హోం

24, మార్చి 2012, శనివారం

ఎక్కడుంది అశాంతి, తెలంగాణా ప్రజల ఒట్లలోన, కాంగ్రెస్ కు పోయిన సీట్లలోనా..?



తెలంగాణా లో శాంతి యుత వాతావరణం ఏర్పడితేనే చర్చల ప్రక్రియ ప్రారంభమౌతుంది-రెండు రోజుల క్రితం ప్రధాని మన్మోహన్ బోడోలాండ్ ఉద్యమ నేతల ముందు చేసిన కామెంట్.
తెలంగాణా వాదం తగ్గింది, అందుకే టి ఆర్ ఎస్ కు 2010 ఉప ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు ఓటింగ్ శాతం తగ్గింది-గండ్ర వెంకట రమణ రెడ్డి, డి కే అరుణ.
మా ఫలితాలు గతంలో కంటే మెరుగుపడ్డాయి-చంద్రబాబు నాయుడు.
మహబూబ్ నగర్ లో మతతత్వం గెలిచింది, మతం పేరుతో బి జే పీ ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు సంపాదించుకుంది-లగడపాటి రాజగోపాల్.
                            ఉపఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఇవి, ఎలాగు గెలవలేకపోయము కదా గెలిచిన వారికి మసిపూసి మారేడుకాయ చేద్దాం అనే తీరులో వ్యవహరిస్తున్నారు. 
             తెలంగాణా అట్టుడికింది, బంద్ లు, రాస్తారోకోలు, ధర్నాలు, నిరాహార ధీక్షలు, సమ్మె లతో,.. ఒకవైపు ఆత్మహత్యలు, మరో వైపు పోలీసు ల దౌర్జన్యాలు, కాని నేడు తెలంగాణా ప్రశాంతంగా ఉంది, సునామి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత సునామి బారిన పడిన నేల ఎలా ఉంటుందో అలాగే ఉంది, శాంతి నేలకోనాలి శాంతి నేలకోనాలి అని పాడిన పాటే పాడిన కేంద్ర సర్కార్ మాటకు తలొగ్గి నేడు తెలంగాణా శాంతించింది, ఈ శాంతి ఎలాంటి శాతి అంటే ఇది సునామి ధాటికి మరణించిన మనుషుల శవాల గుట్టల్లో ఉండే స్మశాన శాంతి, ప్రధానికి ఇంకెంత శాంతి కావాలి..? నేల రాలిన యువకుల స్మృతులను తలచుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తున్న ఆ మాత్రుముర్తుల హృదయ రోదనలు ప్రధానికి సైరన్ మోతల్లా వినిపిస్తున్నాయా..? ఎక్కడుంది అశాంతి, తెలంగాణా ప్రజల ఒట్లలోన, కాంగ్రెస్ కు పోయిన సీట్ లలోనా..? 
కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణా లో ప్రశాంత వాతావరణం ఏర్పడినట్లా..? 
                          2010 ఎన్నికలతో పోల్చుకుంటే తెలంగాణా కు పడిన ఓట్లు తగ్గాయి. తెలంగాణా వాదం తగ్గింది, అవును తెలంగాణా వాదం తగ్గింది, పదవి రాకముందు ఉన్నంత తెలంగాణా వాదం చీప్ విప్ అనే చిల్లర పదవి రాగానే తెలంగాణా వాదం తగ్గిపోయింది, కాంగ్రెస్ కు ఇద్దరు ఎం ఎల్ ఎ లు ఉన్న మహబూబ్ నగర్ లో ఈ ఉప ఎన్నికలతో ఒక స్థానం తగ్గింది లింగు లిటుకు మంటూ ఇప్పుడు ఉన్నది ఒక్క ఎం ఎల్ ఎ నే కదా మరి ఇక్కడ ఒక్క స్థానం కూడా లేని టి ఆర్ ఎస్, బిజేపీ లు చెరొక స్థానం నేగ్గాయి, మరి తెలంగాణా వాదం తగ్గిందా, కాంగ్రెస్స్ వాదం తగ్గిందా..? అనేది జిల్లా మంత్రికే తెలుసు.
                           గతంలో కంటే మెరుగు పడ్డాడట బాబు, గతంలో అన్ని స్థానాల్లో డిపాజిట్లు రాలేదు కాని ఇప్పుడు 6 స్థానాల్లో కేవలం మూడు స్థానాల్లోనే డిపాజిట్ రాలేదు అంటే మెరుగు పడ్డట్టే కదా.. టి ఆర్ ఎస్ బలం, తెలంగాణా వాదం బలం అమాంతం తగ్గి టి డి పీ అసామాన్యంగా పుంజుకుంది కదా.. మహబూబ్ నగర్, ఆదిలాబాద్ టి డి పి కి కంచుకోటలు ఒకప్పుడు కాని నేడు తెలంగాణా వాదం దెబ్బకు ఆ కోటలు బీటలు వారి ముక్కలు ముక్కలు గా విరిగి పోయాయి, 7 స్థానాల్లో నలుగురు ఎం ఎల్ ఎ లు (కొవ్వురుతో కలిపి) గతంలో టి డి పీ వారె నాలుగింటికి నాలుగు ఓడిపోయినా ఇతను మేరుగుపడ్డాడట.. 
                   రాష్ట్రంలో అతిపెద్ద జ్యోతిష్కుడు ఎవరో మీకు తెలుసా..? విజయవాడ ఎం పీ లగడపాటి, ఉప ఎన్నికల ఫలితాలతో జోకర్ గా మారాడు, తన సర్వ్ రిపోర్ట్స్ ఎప్పుడు తప్పుకావని ప్రతి ఎన్నికల ముందు వీరు గెలుస్తారు వారు ఓడుతారు అని చెప్పే లగడపాటి ఈ ఎన్నికల్లో కూడా అలాగే చెప్పారు కాని మహబూబ్ నగర్ లో మాత్రం ఇతను చెప్పింది జరగలేదు అక్కడ టి ఆర్ ఎస్ గెలుస్తున్ధనేది ఇతని జ్యోస్యం కాని అక్కడ బి జే పి గెలిచేసరికి తట్టుకోలేక పోయిన లగడపాటి మతతత్వం గెలిచింది, ఇది రాష్ట్రానికి ప్రమాదకరం అని చెప్పారు, మరి లగడపాటి జ్యోస్యనికి ఈ ప్రాంతీయ తత్వం భోధపడిన ఈ జాతీయ వాదికి మత తత్వం ముందుగా కనబడలేదా..?
             ఎవరు ఏమనుకున్న తెలంగాణా ప్రజలు సమైక్య వాద పార్టీలకు దిమ్మతిరిగే సమాధానం చెప్పారు, మూడు స్థానాల్లో టి డి పి కి డిపాజిట్ లు పోయాయి, టి డి పి గెలుపు కోసం కాకుండా డిపాజిట్ల కోసం ప్రచారం చేసే పరిస్థితి వచ్చింది, కాంగ్రెస్ కు కూడా చావుతప్పి కన్ను లోట్టపోయింది, మహబూబ్ నగర్ లో టి ఆర్ ఎస్ ఓటమి గురించి తెలంగాణా వ్యతిరేఖులు రక రకాలుగా మాట్లాడుతున్నారు, ఎవరు ఏమనుకున్న అక్కడ తెలంగాణా కు మద్దతుగా ఉద్యమిస్తు జే ఎ సి లో భాగంగా ఉన్న బిజెపి, టి ఆర్ ఎస్ లే పోటి పడ్డాయి, చివరి వరకు ఆ రెండు పార్టీల మధ్యే పోరు నడిచింది, చివరికి 1800 ఓట్ల తేడాతో బిజెపి విజయం సాధించింది, ఒక లక్ష పది వేల ఓట్లు ఉన్న నియోజకవర్గంలో దాదాపు ఎనభై వేల ఓట్లు టిఅరేస్, బిజెపి లకు దక్కాయి, మిగతా ఓట్లను ఇండిపెండెంట్లు, సిపిఎం తో పాటు కాంగ్రెస్, టిడిపి లు దక్కించుకున్నాయి, మరి ఇక్కడ ఎ వాదం గెలిచింది..? తెలంగాణా వాదం కాదా.? 
         2010 లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటి చేసిన వారు, 2009 సార్వత్రిక ఎన్నికల్లో టి ఆర్ ఎస్ పార్టీ తరపున గెలిచిన వారే, కావున వారి ఓటింగ్ శాతం అనేది 2010 లో ఘననీయంగా పెరిగింది, కాని నేటి ఎన్నికలు పూర్తిగా విభిన్న మైనవి, ఇప్పుడు పోటి చేసిన వారు గతం లో వేరే పార్టీల తరపున ఎన్నికై ఇప్పుడు తెలంగాణా కోసం రాజీనామా చేసి ఎన్నికల్లో పోటిపడుతున్నవారు, అంతే కాకుండా గతంలో కనీసం టి ఆర్ ఎస్ పోటి చెయ్యని కొల్లాపూర్, ఆదిలాబాద్, కామారెడ్డి వంటి నియోజకవర్గాలలో టి ఆర్ ఎస్ గెలుచుకుంది, అంటే ఆయ ప్రాంతాల్లో టి ఆర్ ఎస్ బలపడుతుంది, 2009 సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ , కొల్లాపూర్, ఘనపూర్ లలో భారి మెజారిటి తో గెలవాలి, ఎందుకంటే గతంలో కాంగ్రెస్కు కు,పి ఆర్ పి కి పడ్డ ఓట్లు మొత్తం కాంగ్రెస్కు పడాలి కాని పడలేదు అంటే కాంగ్రెస్ కు ఓటింగ్ శాతం పెరిగిందా, తగ్గిందా..? టి ఆర్ ఎస్ కమూనిస్ట్ లతో కలిసి మహా కూటమిగా వచ్చి కామారెడ్డి, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ లలో పోటి చేసిన టిడిపి బలం ఏంటో ఈ ఎన్నికలతో తెలిసింది, ఇప్పుడు వచ్చిన ఓట్లను బట్టి చూస్తే టిడిపి ఒంటరిగా పోటి చేస్తే గెలవడం కష్టం అనేది సుస్పష్టం అయ్యింది, గత ఎన్నికలలో మహబూబ్ నగర్లో కేవలం 1800 ఓట్లను తెచ్చుకున్న బిజెపి ప్రస్తుతం 1800 ఓట్ల మెజారిటి తో గెలిచి టిడిపి, కాంగ్రెస్ ల డిపాజిట్ లు గల్లంతు చేసిందంటే ఈ బలం ఎక్కడినుండి వచ్చింది..? తెలంగాణా వాదం నుండి కాదా..?
                  అయితే వచ్చిన ఫలితాలతో సంతృప్తి పడకుండా జరిగిన పొరపాట్లు మల్లి జరగకుండా ముందు ముందు నడుచుకోవాలి, తెలంగాణా కు మద్దతు ఇస్తున్న బిజెపి ని టి ఆర్ ఎస్ కలుపుకొని పోవాలి, మహబూబ్ నాగర్ లో రెండింటిలో  ఏదో ఒక పార్టీ పోటి చేస్తే 50000 మెజారిటి వచ్చేది, కాని రెండు పార్టీలు పోటిచేయ్యడం వల్ల ఒక దశలో ఓట్లు చీలి ఇతర పార్టీలకు లాభం చేకూరే అవకాశం ఏర్పడింది, కావున భవిష్యత్తులో జరిగే ఎన్నికలలో ఈ రెండు పార్టీ లతో పాటు తెలంగాణా కు మద్దతు ఇచ్చే అన్ని పార్టీలను కలుపుకొని పోవాలి, పర్కాల లో జరిగే ఉపేన్నికతో జగన్ తెలంగాణా లో పాగా వెయ్యాలని చూస్తున్నాడు, ఈ రెండు పార్టీలు విడి విడి గా అభ్యర్థులను నిలబెట్టకుండా, ఒక్క అభ్యర్తినే నిలబెట్టి ఇద్దరు సహకరిస్తే జగన్ ను తెలంగాణాలో అడ్డుకోవడం కష్టమేమి కాదు.

2 కామెంట్‌లు:

  1. Ee rajakiya nayakula em matladutaro valake teliyali.. edi telangana vijayamani andariki telisinaa valu matram ulta matladutaru..........
    veelu mararu.

    రిప్లయితొలగించండి
  2. Congress ki poye kalam vachindi... 2014 lo Congress, TDP Bhoo sthapithamavvabothunnayi. Idi 100% nijam.
    2014 kalla Telangana state ravadam khayam.

    రిప్లయితొలగించండి