హోం

21, మార్చి 2012, బుధవారం

జయహో తెలంగాణా



రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నిక ఫలితాల్లో కారు జోరు, ఫ్యాన్ హోరుకు కాంగ్రెస్, టీడీపీ చతికీల బడ్డ్డాయి. కామారెడ్డిలో టీడీపీ డిపాజిట్ గల్లంతు చేసి రెండుకండ్ల సిద్దాంతం చంద్రబాబుకు తగు రీతిలో బుద్ది చెప్పారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో నమ్మక ద్రోహపు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ గల్లంతు చేసి తెలంగాణలో సరైన నిర్ణయం తీసుకోకుంటే తెలంగాణలో అడ్రస్ ఉండదాని నిరుపించారు. కామారెడి- గంప గోవర్థన్ 44,466, స్టేషన్‌ఘన్‌పూర్- రాజయ్య 32,63 ఓట్ల మెజారిటితో గెలిపించి త్యాగదనులకు తమ గుండెల్లో స్థానం ఉంటుందని నిరుపించారు.కొల్లాపూర్- జూపల్లి 15013 , ఆదిలాబాద్-రామన్న 31396 , నాగర్‌కర్నూల్- నాగం 27325 , కోవూరు- ప్రసన్న 23496  వోట్లతో విజయం సాధించారు, మొత్తంగా 2 స్థానాల్లో కాంగ్రెస్, 3 స్థానాల్లో టి డి పీ ధరావతు గల్లంతు అయ్యింది.

                                    మహబూబ్‌నగర్ అసెంబీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీఆర్‌ఎస్ అభ్యర్థి ఇబ్రహింపై 1895 ఓట్ల తేడాతో గెలుపొందారు.  మహబూబ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి యెన్న శ్రీనివాస్‌రెడ్డి విజయం తెలంగాణ ప్రజల విజయమని, తెలంగాణ వాదం విజయమని కిషన్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి, బీజేపీకి ఓట్లు వేసి సహకరించిన ప్రజలందరికి జేఏసీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి పనిచేసిన కళాకారులు, కార్యకర్తలు ఈ విజయంలో బాగస్వాములన్నారు. తెలంగాణ విషయంలో మోసం చేసిన వారికి తగిన బుద్ది చెప్పారని తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి