హోం

12, మార్చి 2012, సోమవారం

మల్లినాథ సూరి



తెలంగాణకు చెందిన మహాకవులలో మల్లినాథ సూరి ఒకరు. పంచ కావ్యాలను వారు సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించారు. మెదక్ జిల్లాలోని కొలిచాల పస్తుతం కొల్చారం) గ్రామం ఆయన జన్మస్థలం. 16వ శతాబ్ధంలో పేద బ్రహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయన పశువుల కాపరిగా పనిచేస్తున్న సమయంలోనే తిరుమలయ్య గుట్టలో ఓ సాధువు స్ఫూర్తితో వేదాలు నేర్చుకున్నారు. ఈ క్రమంలోనే పంచ కావ్యాలుగా చెప్పుకునే రఘువంశం, మేఘసందేశం, హర్షవైష్ణము, మాఘకావ్యం, కుమార సంభవంతో పాటు అనేక సంస్కృత కావ్యాలను తెలుగులోకి అనువదించారు. 

రాచకొండ రాజ్యాన్ని పరిపాలించిన సింగభూపాలుడు సూరిని మహామహోపాధ్యాయ బిరుదుతో సత్కరించారు. వ్యాఖ్యాన చక్రవర్తి అనే బిరుదుతో పాటు అనేక సంస్థానాల్లోనూ ఆయన సన్మానాలు పొందారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోనూ కొంతకాలం మల్లినాథ సూరి ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.ప్రస్తుతం మెదక్ జిల్లాలోని కొల్చారంలో ఆయన నివసించిన ఇంటిని ఎవరూ పట్టించుకోక పోవడంతో శిథిలమై పశువుల పాకగా మారింది. మరోవైపు గ్రామంలో ఏర్పాటు చేస్తామన్న ఆయన విగ్రహం విషయంలో అంతే నిర్లక్షం ప్రదర్శిస్తున్నారు. ఆ విగ్రహాన్ని వీధిలో వదిలి వేయడంతో ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ ప్రజాప్రతినిధుల నిర్లక్షానికి అద్దం పడుతోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి