హోం

31, డిసెంబర్ 2011, శనివారం

2011 సింహావలోకనం...2012 కు స్వాగతం...

* 2011 ఆదిలోనే వివక్షకు గురయ్యింది తెలంగాణా, ఈ సారి అది సినిమా రూపంలో జరిగింది, తెలంగాణా సినిమా గా గుర్తింపు తెచ్చుకున్న జై భోలో తెలంగాణా సినిమా ను విడుదల కాకుండా అడ్డుకునేందుకు సీమంద్రులు ప్రయత్నించారు, కాని ఆ కుట్రలను తెలంగాణా ప్రజలు తిప్పి కొట్టి జై భోలో తెలంగాణా సినిమా ను విడుదల చేసుకొని అపూర్వ విజయాన్ని కట్టబెట్టారు..
* 2011 లోనే ఉద్యోగుల సహాయ నిరాకరణ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది..
* ఇదే క్రమంలో జరిగిన మిలియన్ మార్చ్ గ్రాండ్ సక్సెస్ కాగ ఆంద్ర ఆధిపత్య అహంకారానికి దర్పణం గా ట్యాంక్ బ్యాండ్ పై ఉన్న విగ్రహాలను తెలంగాణా ప్రజలు తొలగించారు.
* పార్టీ లతో సంబంధం లేకుండా అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు జూన్లో రాజీనామా చేసారు.
* ఆ తర్వాత కార్మిక కర్షక ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలతో పాటు సకల జనుల సమ్మె ఉధృతం గా 42 రోజులపాటు కనీవినీ ఎరుగని రీతిలో సాగింది.
* భాన్సు వాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డిని గెలిపించి తెలంగాణా ప్రజలు తమ ఆకాంక్షను మరోసారి చాటి చెప్పారు.
* పత్రిక రంగంలో తెలంగాణా కు ఒక దిన పత్రికను అందించింది ఈ సంవత్సరం.
* ప్రో . జయ శంకర్ సార్ను, మిద్దె రాములు వంటి గొప్పవారిని కోల్పోయాం.

* ఈ ఏడాది తెలంగాణా వాదులు సాధించిన గొప్ప విజయం 14 F ను రద్దు చేయించుకోవడం.. ఇదే స్పూర్తితో 2012 లో తెలంగాణా సాధించుకోవాలని ఆశిస్తూ "నా తెలంగాణా " అభిమానులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు....


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి