హోం

13, జనవరి 2012, శుక్రవారం

కళలకు ఖిల్లా-కరీంనగర్ జిల్లా.!!



అక్షాంశరేఖాంశాలు18.4579.13 కరీంనగర్ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమునకు చెందిన ఒక జిల్లా. జిల్లాకు ఉత్తరాన అదిలాబాదు జిల్లా, ఈశాన్యమున మహారాష్ట్ర మరియు చత్తీసుగఢ్ రాష్ట్రాలు, దక్షిణాన వరంగల్ జిల్లా, ఆగ్నేయాన మెదక్జిల్లా, మరియు పశ్చిమాన నిజామాబాదు జిల్లా సరిహద్దులు.


చరిత్ర:కరీంనగర్, సయ్యద్ కరీముద్దీన్ ఖిలాదారు పేరుమీదుగా నామకరణము చేయబడినది. పురాతన కాలము నుండి వేద అభ్యాసన కేంద్రముగా ప్రసిద్ధికెక్కినది. పూర్వము ఈ ప్రాంతమునకు 'సబ్బినాడు' అని పేరు. కరీంనగర్ మరియు శ్రీశైలములలో దొరికిన,కాకతీయ రాజులు ప్రోల II మరియు ప్రతాపరుద్రుని శాసనాలు ఈ ప్రాంత ఘనమైన చరిత్రకు నిదర్శనాలు. నిజాం పరిపాలనలో కరీంనగర్ ఒక రాజధాని మరియు మాజీ భారత ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు, ప్రసిద్ధ కవులు సింగిరెడ్డి నారాయణ రెడ్డి(సినారె), వేములవాడ భీమకవి,దన్దు కమలాకర్, తెలంగాణా సాయుధ పోరాట యోధుడు బద్దం యెల్లారెడ్డి, సినిమా దర్శకుడు బి ఎస్ నారాయణ, మొదటి దాదా సాహెబ్ పల్కే గ్రహీత జై రాజ్,సాయుధ పోరాట యోధుడు అనభేరి ప్రభాకర్, ఉన్నత విద్యకే మకుటం ప్రో.రామ్ రెడ్డి,  పొన్నమ్ ప్రబాకర్' వంటి పలు సుప్రసిద్ధ వ్యక్తులు ఈ జిల్లా వాస్తవ్యులే. గోదావరినది ఈ ప్రాంత సౌందర్యమును మరింత ఇనుమడింపజేస్తున్నది. కరీంనగర్ గోండ్లు, కోయలు, చెంచులు మొదలైనటువంటి అనేక గిరిజన జాతులకు ఆవాసము. ఈ ప్రాంతీయులు సున్నితమైన లోహకళ అయినటువంటి వెండి నగిషీ పనిలో(సిల్వర్ పిలిగ్రి) మంచి నిపుణులు.
తెలుగు జాతికి మొదటి రాజధాని నగరం కోటిలింగాల కరీంనగర్ జిల్లలో ఉంది, తెలుగు జాతి ఉనికి మొదలయ్యింది ఇక్కడినుండే, శాతవాహనుల మొదటి రాజధాని నగరం కోటిలింగాల, తెలంగాణా చరిత్రను మొత్తం మరుగున పడేసిన ఆంద్రులు మొదటి రాజధాని ధరనికోటగా రాసుకున్న, తవ్వకాల్లో దొరికిన సాక్షలను బట్టి కోటిలింగాల నే శాతవాహనుల మొదటి రాజధానిగా గుర్తించారు, అంతే కాకుండా కాకతీయుల పూర్వికులు కూడా కరీం నగర్ వాసులే.వీరి వంశం ప్రారంభం అయ్యింది కరీంనగర్ లోనే.
నేటి కరీంనగర్ ప్రాంతాన్ని పూర్వం సబ్బినాడు అని వ్యవహరించేవారు. 1905కు పూర్వము జిల్లా ఎలగందల్ జిల్లాగా ప్రసిద్ధి చెందినది. 1905లో వరంగల్‌ జిల్లా నుండి పర్కాల తాలూకాను జిల్లాలో కలిపి, లక్సెట్టిపేట మరియు చెన్నూరు తాలూకాలను అదిలాబాద్‌ జిల్లాలో, సిద్దిపేట తాలూకాను మెదక్‌ లో చేర్చి జిల్లాను 7 తాలూకాలతో పునర్‌వ్యవస్థీకరించి కరీంనగర్ జిల్లాగా నామకరణము చేశారు.
కరీంనగర్ కు 30. కి.మీ. దూరంలో గోదావరి నది శాఖైన మూలవాగు తీరంలో వేములవాడ రాజరాజేశ్వరస్వామి పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి, గోదావరి తీరాన గల ప్రసిద్ధ కాళేశ్వర క్షేత్రము ఈ జిల్లా లో కలదు. కరీంనగర్ కు ఉత్తరంగా 50 కి.మీ. దూరంలో గోదావరీ తీరంలోని ధర్మపురిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది. ఇవికాక జగత్యాల కొండగట్టు దగ్గర శ్రీఆంజనేయస్వామి ఆలయం ఎత్తైన పర్వతంపై ఉంది. హజూరాబాద్ సమీపానగల కొత్తగట్టు వద్ద అరుదైన శ్రీ మత్సగిరీంద్ర స్వామి వారి ఆలయం ఉన్నది. రామగుండం వద్ద ఉన్న ఫెర్టిలైజర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా బొగ్గు ముడిపదార్థంగా ఉపయోగించి ఎరువును తయారుచేసిన మొట్టమొదటి ఫ్యాక్టరీ. నల్ల బంగారం ఉత్పత్తిలో సిరులపంట పండిస్తున్న సింగరేణి, ఖజానాలో ఎక్కువ ఆదాయం లభించేది రామగుండం నుంచే. 2001 జనాభాలెక్కల ప్రాధమిక అంచనా ప్రకారం ఈ జిల్లాలో పురుషుల కంటే స్త్రీల జనాభా అధికంగా ఉంది.
గణాంకాలు:
  • రాష్ట్రవైశాల్యంలో జిల్లా వైశాల్యం శాతం - 4.29
  • రాష్ట్రజనాభాలో జిల్లా జనాభా శాతం - 4.59
  • నగరీకరణ - 20.55%
  • వర్షపాతం - 953 మి.మీ.
  • అడవుల శాతం - 21.18
  • రెవిన్యూ డివిజన్లు : 5 (కరీంనగర్, పెద్దపల్లి, మంథని, జగిత్యాల, సిరిసిల్ల)
  • శాసనసభ నియోజకవర్గాలు: 13 (రామగుండము, వెములవాడమంథనిపెద్దపల్లిహుజూరాబాద్, హుస్నాబాద్,మానకొండూర్,  కరీంనగర్, చొప్పదండిజగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, సిరిసిల్ల)
  • లోక్‌సభ స్థానాలు : 2 (పెద్దపల్లి, కరీంనగర్)
  • పురపాలక సంఘాలు : 5 
  • కార్పోరేషన్లు: 2 ( కరీంనగర్, రామగుండము)
  • నదులు: మానేరు. గోదావరి నది దాదాపు 283 కిలో మీటర్లు ఈ జిల్లాలో ప్రవహిస్తోంది.
  • పుణ్య క్షేత్రాలు: వేములవాడ, ధర్మపురి, మంథని, కాళేశ్వరం, కొండగట్టు, బిజ్ గిర్ షరీఫ్.
  • దర్శనీయ ప్రదేశాలు: రామగిరి ఖిల్లా, ఎలగందుల ఖిల్లా.

మండలాలు:భౌగోళికంగా కరీంనగర్ జిల్లాను 57 రెవిన్యూ మండలాలుగా విభజించినారు.


సంస్కృతి జీవనవిధానం :కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా మాట్లాడబడు తెలుగు భాషతో పాటు ఉర్దూ కూడా వాడుకలో ఉంది. సాంప్రదాయబద్ధమైన చీర, ధోవతితో పాటు ఆధునిక ధోరణి కూడా ఉంది. తెలంగాణా సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పెద్ద పండగ. ఇంకా వినాయక చవితి, దీపావళి, హోళీ, మహాశివరాత్రి, ఉగాది, సంక్రాంతి, రంజాన్, బక్రీద్ పండుగలను కూడా బాగా జరుపుకుంటారు.,

కరీంనగర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థకు లాభసాటిగానున్నది. ప్రధాన వ్యాపార కేంద్రాలను కలుపు రైలు మార్గమేమీ లేనందువల్ల, రోడ్డు రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందింది. దీనివల్ల అదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం మరియు కరీంనగర్ జిల్లాలకు జోనల్ హెడ్ క్వార్టర్ గా కరీంనగర్ జిల్లా బస్ స్టేషన్ ఉంది.
పుణ్య క్షేత్రాలు: కరీంనగర్ జిల్లా పుణ్య క్షేత్రాలకు ఆలవాలంగా ఉంది, ఇక్కడున్న దేవాలయాలు అనేక విశేషాలను కలిగి బక్తులచేత విశేష  పూజలు అందుకుంటున్నాయి.

వేములవాడ:ఈ పురాతన గ్రామం పశ్చిమ చాళుక్యుల కాలం నుండీ ఉన్నదని ఇక్కడ లభించిన పురాతత్వ ఆధారాలను బట్టి తెలుస్తోంది. పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి దేవాయమునకు వేములవాడ ప్రసిద్ధి చెందింది. చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహుడుకు రాజాదిత్య అనే బిరుదు ఉండేది. ఆ బిరుదు పేరిట గాని, లేదా అతడు కట్టించినందువలన గాని ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. రాజాదిత్య మొదటి వినయాదిత్య యుద్ధమల్లుని మనుమడు. దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు కలదు. గ్రామాన్ని ఆనుకుని ప్రవహించే వాగు ఈ కోనేటికి నీటి వనరు. వద్దేగేశ్వర స్వామి దేవాలయము కూడా ఇక్కడ ఉన్నది.శివరాత్రి రోజున మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుపుతారు. అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. రాత్రివేళ దీపాలంకరణలతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. విద్యార్ధులకు ఉచిత వసతి, భోజన ఏర్పాట్లు చేస్తారు. ఇంకా, ఈ దేవాలయం ఇతర చిన్న ఆలయాలకు దానధర్మాలు చేస్తుంది.
కాళేశ్వరం:కరీంనగర్ జిల్లా లోని అతి ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి కాళేశ్వర క్షేత్రం, కరీంనగర్ పట్టణం నుండి 125 కిలో మీటర్ల దూరంలో ఉన్నది కాళేశ్వరం, కాళేశ్వరం లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయ్ గోదవరి ప్రాణహిత నదులు సంగమించే చోట ఈ క్షేత్రం ఉంది, ఇక్కడ శివ లింగంతోపాటు యమ లింగం కూడా ఉంటుంది.
అనేక ప్రత్యేకతలకు నెలవు ఈ ఆలయం, పచ్చని ప్రకృతి మధ్య నెలవైన ఈ క్షత్రంకు వచ్చిన వారు భక్తి తన్మయత్వంలో మునిగిపోతారు, అతి అరుదైన సరస్వతి క్షేత్రాలలో ఒకటి ఇక్కడ ఉంది, సరస్వతి దేవి ఆలయాలు దక్షిణ భారతంలో కేవలం రెండే ఉన్నాయ్, ఆ రెండింటిలో ఇది ఒకటి, అలాగే మరో అరుదైన ఆలయం కూడా ఇక్కడున్నది, అదే సూర్య దేవాలయం, ఆంద్ర ప్రదేశ్ లో కేవలం రెండే సూర్య దేవాలయాలు ఉండగా అందులో ఒకటి ఇక్కడ ఉంది.
కాలేశ్వరానికి సంబంధించిన మరిన్ని వివరాలకు ఇదే బ్లాగ్ లోని http://naatelangaana.blogspot.com/2011/10/1.html  లింక్ చుడండి.
ధర్మపురి:ధర్మపురి తెలంగాణాలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం, తీర్థరాజం. శ్రీ లక్ష్మీనృసింహుడు యోగనారసింహుడిగా, ఉగ్ర నారసింహుడిగా రెండు అవతారాల్లో ఇక్కడ కొలువై ఉన్నాడు. ఉత్తర తెలంగాణాలోని కరీంనగర్ జిల్లాకు ఉత్తరంగా 65 కిలోమీటర్ల దూరంలో,జగిత్యాలకు 27 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీతీరాన ఈ క్షేత్రరాజం కలదు. ఇక్కడ గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవహించుచు తన పవిత్రతను చాటుకొనుచున్నది. ఎంతో ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు, చరిత్ర కలిగిన ఈ క్షేత్రం ప్రాచీన కాలంనుంచి వైదిక విద్యలకు, జ్యోతిశ్శాస్త్రానికి ప్రముఖస్థలముగా పేరొంది నేటికీ సాంప్రదాయ వేదవిద్యలకు నెలవైయున్నది.

స్థల పురాణము

పూర్వకాలములో ధర్మవర్మ అనే మహారాజు నృసింహుడిని గూర్చి తపమాచరించగా, నృసింహుడు అతని తపస్సుకు మెచ్చి లక్ష్మీ సమేతుడై యోగ నారసింహుడుగా ఈ క్షేత్రమందు అవతరించెను. ధర్మపురి క్షేత్రం పితృకర్మలకు, కుజదోష నివారణకు ప్రసిద్ధము. కుజదోషమున్న వారు ఈ క్షేత్రమందు స్వామివారికి కళ్యాణము చేయించిన వారి కుజదోష నివారణము జరిగి శీఘ్రంగా వివాహమవటం ఇక్కడి క్షేత్ర మహాత్మ్యం. సాధారణంగా కుజదోషం అంటే వివాహానికి ముందే దానికి సంబంధించిన పరిహారక్రియలు చేసుకోవటం చేస్తుంటారు. కొన్ని సార్లు కుజదోషం ఉన్నట్లు తెలియక వివాహం చేసుకోవటం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో వివాహానంతరం వైవాహిక జీవితం సమస్యల పాలవటం కద్దు. ధర్మపురి క్షేత్రం వివాహానంతరం కుజదోషం కారణంగా వచ్చే సమస్యలకు మంచి పరిహారం. దంపతులు ఇక్కడ గోదావరి తీరంలో సరిగంగ స్నానాలాడి, స్వామివారిని అర్చించినచో ఎటువంటి వైవాహిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి.
కొండగట్టు:కొండగట్టు, కరీంనగర్ నుండి దాదాపు 35 కి.మీ.లు దూరమున ఉన్న ఒక ఆంజనేయ స్వామి దేవాలయము. ఇది జిల్లాలో జగిత్యాల నుండి 15 కెలోమీటర్ల దూరములో కలదు. కొండలు, లోయలు మరియు సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు చాలా ప్రకృతి సౌందర్యము కలిగిన ప్రదేశము. జానపదాల ప్రకారము, ఈ గుడిలో 40 రోజుల పాటు పూజ చేస్తే సంతానము లేని వారికి సంతానము కలుగుతుందని భక్తుల నమ్మకము.
పూర్వము రామ రావణ యుద్దము జరుగు కాలమున లక్ష్మణుడు మూర్చనొందగా సంజీవనిని తెచ్చేందుకు హనుమ బయలుదేరుతాడు. అతడు సంజీవనిని తెచ్చునపుడు ముత్యంపేట అనెడి ఈ మార్గమున కొంతభాగము విరిగిపడుతుంది. ఆ భాగమునే కొందగట్టుగా కల పర్వతభాగముగా పిలుస్తున్నారు.ఈ గుడిని 300 సంవత్సరాల క్రితం ఒక ఆవులకాపరి నిర్మించినాడు. ప్రస్తుతము ఉన్న దేవాలయము 160 సంవత్సరాల క్రితము క్రిష్ణారావు దేశ్‌ముఖ్‌ చే కట్టించబడినధీ.


* కోరుట్ల సాయినాధుడి దేవాలయం కూడా చాల ప్రసిద్ది చెందింది. 
* బిసిగిర్ షరీఫ్ దర్గా కూడా చాల ప్రసిద్ది చెందింది, ప్రతియేడు జరిగే ఉత్సవాల సమయంలో హిందు, ముస్లింలు ఈ జాతరకు సోదరభావంతో తరలి వస్తారు.


పరిశ్రమలు:పరిశ్రమలు అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది రామగుండము. ఇక్కడ నిజాం కాలంలోనే పరిశ్రమలకు భీజం పడింది.
* నిజాం కాలంలో ప్రతిపాదించిన అజామాబాద్ పవర్ స్టేషన్ మొట్టమొదటి థర్మల్ విద్యుత్ కేంద్రం.ఇది RTS -1.


* RTS -2 ని ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎ పీ జెన్ కో ఆధ్వర్యంలో ప్రారంబించింది, దీని సామర్ధ్యం 62 .5 MW.


* NTPC - దేశం లోనే అతి పెద్ద మహా రత్న కంపనిల్లో ఒకటి ఇక్కడ ఉంది, అదే N T P C ఇది 2600 MW ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తూ దేశంలోనే రెండవ అతిపెద్ద విద్యుత్ కేంద్రం గా ఉంది, 7 ప్లాంట్ లు నడుస్తున్నాయి, ఇది మన రాష్ట్రానికే కాకా పొరుగు రాష్ట్రాలకు కూడా విద్యుత్ను అందిస్తుంది.
* FCI - బొగ్గు నుండి ఫెర్టిలైజెర్ ను తయారుచేసే మొదటి కంపని ఇది, ఉన్నత లక్షంతో ప్రారంభం అయ్యింది, కాని ఒక దశాబ్దం లోనే మూతపడింది.
* అంతర్గాం స్పిన్నింగ్ మిల్: కాన్దిశికుల కోసం ఏర్పాటుచేసారు కాని ఇది కూడా తొందరగానే మూతపడింది. ఈ మిల్లు యొక్క మరిన్ని వివరాలకు కింది లింక్ చుడండి.
http://naatelangaana.blogspot.com/2011/12/blog-post_18.html 

* కేశోరం సిమెంట్ ఫ్యాక్టరీ : ఇది బిర్లా గ్రూప కు  చెందినది, రామగుండంలోని బసంత్ నగర్ సమీపంలో ఈ సిమెంట్ పరిశ్రమ ప్రారంభించారు. 
                                         ***
ప్రారంభం కానున్నవి: 25 MW సామర్థ్యంతో సోలార్ పవర్ ప్లాంట్.
* FCI తిరిగి ఓపెన్ చెయ్యడానికి కేంద్రం అంగీకరించింది.
* nTpc లో 8 వ ప్లాంట్.
* బి పీ ఎల్ : గతంలో పనిచేసిన అజామాబాద్ పవర్ స్టేషన్ కాల పరిమితి తీరడంతో అదే స్థానంలో 500 MW తో బి పీ ఎల్ వారు కొత్త విద్యుత్ కేంద్రం ఏర్పాటు చెయ్యడానికి ప్రణాళికలు వేసారు అయితే ఇది మధ్యలోనే ఆగిపోయింది.
                                     ***
మరికొన్ని పరిశ్రమలు: నిజామాబాదు సరిహద్దు( కరీం నగర్ జిల్లా లోని) గ్రామాల్లో అనేక చెక్కర పరిశ్రమలు ఉన్నాయి.
* కరీంనగర్ ముల్కనూర్ సహకార డయిరి: మహిళలు ఒక సహకార గ్రూప్ గ  ఏర్పడి సాధించిన అపురూప విజయం ముల్కనూర్ సహకార డయిరి, ఇది అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది.


* సిరిసిల్ల సెస్: ఇదొక సహకార సంఘం ఆధ్వర్యంలో నడిచే సహకార విద్యుత్ సంస్థ, ఇది మానేరు తీరాన నిర్మితంయ్యింది, ఇది 173 గ్రామాలకు విద్యుత్ని అందిస్తుంది, 2004 నాటికి ఇది 51403 వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చి రాష్ట్రంలోనే ప్రధమ శ్రేణిలో నిలిచింది, లక్ష 18 వేల 20 భారి , కుటీర పరిశ్రమలకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి, సిరిసిల్ల పట్టణానికి చెందిన 20 వేల మర మగ్గాలకు విద్యుత్ను 3 ఫేజ్ లలో అందిస్తుంది.
* మల్లాపూర్ మండలం లోని ముత్యంపేట్ లోని  నిజాం దక్కన్ షుగర్ ఫాక్టరీ, నిజాం రాజు ప్రారంభించిన కర్మాగారాల్లో ప్రముఖమైనది, అయితే లాభాల్లో ఉన్న ఈ ఫ్యాక్టరీని చంద్రబాబు నాయుడు హయాంలో ప్రవేట్ పరం చేసారు, దీనిలో పనిచేసే కార్మికులు రోడ్డున పడ్డారు.
* జిల్లలో మరొక ప్రముఖ కుటీర పరిశ్రమ బీడీ పరిశ్రమ, జిల్లా లోని అనేక మంది మహిళలు కుటీర పరిశ్రమగా బిడీపరిశ్రమను ఎంచుకొని ఉపాధి పొందుతున్నారు.
వివక్ష: అయితే జిల్లలో ఇన్ని పరిశ్రమలున్న, పారిశ్రామికంగా సీమంద్రుల వివక్షకు గురయ్యిందనే చెప్పవచ్చు, రామగుండము ఎ పవర్ సెషన్ మూసివేసిన తర్వాత ఆ ప్రాంతంలో బి పీ ఎల్ అనే మరో కొత్త పరిశ్రమకు అనుమతినిచ్చారు, కానీ పాలకుల అశ్రేద్ద కారణంగా అక్కడ ఇంతవరకు పనులు ముందుకు కదలలేదు.
* లాభ సాటిగా ఉన్న FCI ని ప్రభుత్వం అకారణంగా మూసివేసింది, ఇప్పుడు తెరవదానికి మీనమేషాలు లెక్కిస్తుంది.
* కందిశికుల  ఉపాధి కొరకు ఏర్పాటుచేసిన అంతర్గాం స్పిన్నింగ్ మిల్ కూడా నిర్వహణ లోపంతో ధశాబ్దం తిరగకుండానే మూతపడింది, అక్కడ ఆకలి చావుల సంఖ్య గణనీయంగా ఉంది.
* చెక్కర కర్మాగారాలను ప్రవేట్ పరం చేసారు.
* కరీంనగర్ సమీపంలో  గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్ ఏర్పాటుచేస్తామని చెప్పారు, కాని అది జరగలేదు.
* చుట్టూ గోదావరి, పక్కనే బొగ్గు ఉన్న రామగుండంలో ఎ పీ జెన్కో విద్యుత్ కేంద్రం సామర్థ్యం 62 .5 MW, ఇది ప్రారంభం నుండి ఇంతే ఉంది, కాని నీరు , బొగ్గు ఏది లేని రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ ను మాత్రం 4 దశల్లో విస్తరించి దాని సామర్థ్యాన్ని మంతం 1000 MW లకు  పెంచారు, ఇది వివక్ష కాదా..?
జిల్లా ఎదుర్కుంటున్న సమస్యలు:
* జిల్లలో ఉన్న ప్రధాన సమస్యల్లో వలసలు ప్రధానమైనది, జిల్లా ఇంత సుసంపన్నంగా ఉన్నా జిల్లా నుండి దుబాయ్, ముంబై కి వలస వెళ్ళిన వాళ్ళు అనేకం, దుబాయ్, ముంబై, బొగ్గుబాయి అన్నట్టుగా ఉంది జిల్లా పరిస్థితి, గల్ఫ్ కు వెళ్ళే వాళ్ళ కుటుంబాలు ఇక్కడ, వాళ్ళేమో ఎడారి దేశాల్లో ఉండి కష్టపడి కుటుంబాలను పోషిస్తున్నారు, పాలకుల వివక్ష వలన ఇన్ని వనరులున్న జిల్లా ప్రజలకు వినియోగించేది మాత్రం అరకొరగానే..
* జిల్లలో ఉన్న మరొక సమస్య ఆకలి చావులు, సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం వారి చావులకు కారణం అయ్యింది.
* రైతుల ఆత్మహత్యలు, జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సదుపాయం ఉన్న అనేకప్రాంతలు నీటి ఎద్ధదితో కొట్టు మిట్టాడుతున్నాయి, నదులు ఉన్న సరైన ప్రాజెక్ట్లు లు నిర్మించాక పోవడం వాళ్ళ ఇప్పటికి రైతులు వర్షాలపై ఆధారపడి పంటలు పండిస్తున్నారు, ఇక్కడ ప్రధానంగా బోరు బావులపై ఆధారపడి పంటలు పండిస్తారు, కాబట్టి కరెంట్ కూడా ప్రధాన సమస్య గా ఉంది, దీనితో అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
కళలకు కాణాచి మన కరీం నగరం: కరీంనగర్ కు మాత్రమె పరిమితమైన అరుదైన కళ సిల్వర్ పిలిగ్రి, ఇది సున్నితమైన కళ, సన్నని వెండి తీగాలని పెట్టెలకు, కత్తి ఒరలకు అల్లికలు వేస్తారు, ఇది ప్రపంచంలోనే అరుదైన కళ.


సిరిసిల్ల: చేనేతకు ప్రసిద్ది సిరిసిల్ల, ఇప్పటికి నేత వృత్తిని నమ్ముకొని అనేక కుటుంబాలు ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నాయి, అయితే పాలకుల అశ్రేద్ద కారణంగా ఇక్కడ తరచు ఆకలి చావులు సంభవిస్తున్నాయి.
అగ్గిపెట్టెలో పట్టే చీర:సిరిసిల్ల చేనేత కార్మికుడు పరంధామయ్య ఈ ఘనతను సాధించాడు, 1990 లో మొదటి సారిగా అగ్గిపెట్టెలో పట్టేచీర ను నేసి ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచారు, ఇది అప్పట్లో ఇక సంచలనం, ఆయన 1994 చిన్న అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసారు, నిత్యం ప్రయోగాలు చేసే ఆయన తాను నేసిన బట్టలను రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఎన్టి ఆర్ కు భాహుకరించాడు, 
నేదురుమల్లి, కోట్ల, ఎన్ టి ఆర్, చంద్రబాబు లాంటి నాయకులంతా ఆయనను అభినందించారు, 2000 అట్లాంటా ఒలంపిక్స్ కు బానర్ ను నేసి ఇచ్చిన అరుదైన ఘనతను సాధించి సిరిసిల్ల ప్రతిభను ప్రపంచానికి చాటారు పరంధామయ్య, 2005 లో తానా సభల్లో ఆయన వస్త్రాల ప్రదర్శనను కూడా ఏర్పాటు చేసారు..
రామగిరి ఖిల్లా
కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలంలోని రామగిరి ఖిల్లాది శతాబ్దాల చరిత్ర. కాకతీయులు, శాతవాహనులు దీన్ని తమ ప్రధాన సైనిక స్థావరంగా చేసుకుని మధ్య, ఉత్తర భారతాన్ని పాలించినట్లు తెలుస్తోంది. ఇక్కడున్న శత్రు దుర్భేద్య కోటలు, బురుజులు, ఫిరంగులు అలనాటి రాచరికానికి ఆనవాళ్ళుగా నిలుస్తున్నాయి. కోటగోడల మీది శిల్పకళ కళాకారుల అద్భుత నైపుణ్యానికి అద్దం పడుతోంది. ఖిల్లాపై అనేక రకాల ఔషధ మొక్కలు కనిపిస్తయి.





సిరులపంట సింగరేణి: జిల్లాలోని గోదావరి లోయలో అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నాయి, జిల్లలో గోదావరిఖని బొగ్గు ఉత్పత్తికి ప్రసిద్ది, ఇక్కడ అనేక బొగ్గు బావులు, ఒపన్ కాస్ట్లులు ఉన్నాయి, అనేక వేల కుటుంభాలు ప్రత్యక్షం గా , పరోక్షంగా సింగరేణి ద్వారా ఉపాది పొందుతున్నాయి.


* సున్నపురాయి నిల్వలు కూడా జిల్లలో అత్యధికంగా ఉన్నాయి.
* రెడ్ ఫ్లవర్ గ్రనేట్ : ఇది ప్రపంచంలోనే అరుదైన గ్రనేట్ ఇది కేవలం కరీంనగర్ జిల్లాలోనే దొరుకుతుంది, దీనిని చైనా ఒలంపిక్స్ కోసం నిర్మించిన బర్డ్ నెస్ట్ స్టేడియం అలంకరణకు వాడారు.
రవాణా సౌకర్యాలు: జిల్లలో రవాణ సౌకర్యాలు కొంతమేరకు మెరుగ్గానే ఉన్నాయి.
* 1944 లో కరీంనగర్ పట్టణంలో తొలి సారిగా బస్సు తిరిగింది.
* ఒక్క డిపోతో ప్రారంభమైనది, ఇప్పుడు 11 డిపో లు ఉన్నాయి జిల్లలో.
* రాజీవ్ రహదారి హైదరాబాద్ నుండి కరీంనగర్ ను కలుపుతుంది.
* ఉత్తర తెలంగాణా లోనే అతి పెద్ద బస్ స్టాండ్ కరీం నగర్ బస్సు స్టాండ్, ఇది నాలుగు జిల్లాలకు కేంద్రంగా ఉంటూ ప్రభుత్వానికి ఆర్థికంగా లాభాలను చేకూరుస్తుంది.



* రైల్ మార్గాల విషయానికి వస్తే జిల్లలో బల్లార్శ నుండి సికింద్రబాద్ రైల్ మార్గం ప్రధానమైనది, జిల్లలో ఉన్న  ప్రధాన రైల్ జంక్షన్ రామగుండము, ఇది ప్రయాణికుల అవసరాలతో పాటు, బొగ్గు, సిమెంట్ రవాణాకు  ఉపయోగ పడుతుంది, అలాగే ఇక్కడ HP towers  ను కూడా ఏర్పాటు చేసారు.
* ఇక కరీం నగర్ రైల్ మార్గం అనేక దశాబ్దాలపాటు నలిగి ఇప్పుడు విద్యుత్ లేకుండా సింగిల్ మార్గం పూర్తయ్యింది, ఈ మార్గం ఇప్పుడు జగిత్యాల్ వరకు పూర్తయ్యింది, కోరుట్ల, మెట్ పల్లి మీదుగా నిజామాబాదు కు కలపాలని ప్రణాళిక, కాని పనులు మాత్రం మందకొడిగా జరుగుతున్నాయి.
 కొత్తగా చెప్పుకోదగిన రైల్ మార్గాలు  ఏమీలేవు.


* ఎంతో కాలంగా రామగుండము ఎయిర్ పోర్ట్ పెండింగ్లో ఉంది, ఇక్కడ బిర్లా తనకోసం ఒక ప్రవేట్ ఎయిర్ పోర్ట్ ను ఏర్పాటుచేసుకున్నాడు, అయితే దాన్ని అభివృద్ది పరచి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
నీటి పారుదల: కరీంనగర్ రైతులు బోరు బావుల మీదనే ఆధారపడి పంటలు పండిస్తునారు.
మానేరు డాం: కరీంనగర్ పట్టణంలో ఉన్న డాం ఇది, లోయర్ మానేర్ డాం ప్రధానంగా nTpc కి  నీరందిస్తుంది, అలాగే వ్యవసాయానికి కూడా నీరందిస్తుంది, కాకతీయ కలువ ద్వార వరంగల్ నీటి అవసరాలు కూడా తీర్చుతుంది.
                                        (మానేరు డాం)
ఎస్ ఆర్ఎస్ పీ కెనాల్: SRSP కెనాల్ రాకతో కరీంనగర్ రైతుల కష్టాలు చాలావరకు తీరాయి, శ్రీ రామ్ సాగర్ నుండి ఈ కెనాల్ మానేరు డాం వరకు ఉంది , జిల్లాలోని ప్రధాన కాలువ ఇది.
ఎల్లంపల్లి ప్రాజెక్ట్: నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్, nTpc వారి సహకారంతో మొదటి దశను పూర్తి చేసుకున్నది ఈ ప్రాజెక్ట్.
నాగులపెట్ సైఫాన్:కోరుట్ల మండలం లోని నాగుల పెట్ గుండా శ్రీ రామ్ సాగర్ ప్రధాన కాలువ వెళ్తుంది, అయితే ఈ ఊరి చివర అకస్మాత్తుగా ఈ కలువ మాయం అవ్తుంది ఆ తర్వాత కొంత దూరంలో మల్లి ప్రత్యక్షం అవుతుంది, అదొక అపురూప సొరంగం అని చెప్పొచ్చు అదే సైఫాన్, దీనిని ఇంజనీర్ రామకృష్ణ రాజు ఆధ్వర్యంలో నిర్మించారు, ఇదొక వింత, ఇదొక అద్భుతం, ప్రపంచంలోనే చాల అరుదైన సైఫాన్. ఈ ఊరిలో ఒక వాగు ఉన్నదీ, ఈ వాగు శ్రీరామ్ సాగర్ కాలువకు అడ్డుగా వెళ్తుంది, అయితే ఈ వాగు ప్రవాహానికి ఎ విధమైన అడ్డు లేకుండా వాగు కింది భాగంలో ఈ సైఫాన్ ను ఏర్పాటు చేసారు, ఈ సైఫాన్ గుండా కాలువ నీరు వెళ్తుంది, పైన వాగు ప్రవహిస్తుంది,  కాలువ నీరు వదలడానికి తూర్పు, పడమర భాగాల్లో ఐదేసి ఖానాలు 144 అడుగుల వైశాల్యంతో ఉంటాయి.వీటికి ఇనుప షేటర్ లను ఏర్పాటు చేసారు, ఈ సైఫాన్ పొడవు 300 ల అడుగులు, కాలువ ప్రవాహ వేగం మాములుగా 4 .22 అడుగులు కాగ సైఫాన్ పద్ధతి వలన ఈ వేగం 11 . 38 అడుగులకు పెరిగింది, దీని ద్వార సైఫాన్ ఆవల నీరు మాములు వేగం తో ప్రయాణిస్తుంది, ఈ సైఫాన్ ద్వార సెకనుకు 8200 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది.
వ్యవసాయం: జిల్లా మొక్కజొన్న పంటకు ప్రసిద్ది.
* 2006 - 07 , 2007 -08 సంవత్సరాలలో వారి ఉత్పత్తిలో జిల్లా నెం.1 గా నిలిచింది, ఎందుకంటే ఆయా సంవత్సరాలలో వర్షం పుష్కలంగా కురిసింది, అంటే ఇక్కడ రైతులు ప్రధానంగా వర్షాల మీద ఆధార పడిపంటలు పండిస్తున్నారు.
* ప్రస్తుతం వరి ఉత్పత్తిలో జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది,
* జొన్న, పసుపు, పత్తి, సన్ ఫ్లవర్, చెరకు లాంటి పంటలు జిల్లలో పండుతాయి.
* కోళ్ళ ఫారం లకు జిల్లా ప్రసిద్ది.
విద్య:స్వాతంత్ర్యం నాటికి జిల్లలో నాలుగు శాతం విద్యావంతులు ఉండేవారు, ఇప్పుడు 77 శాతం మంది విద్యావంతులు ఉన్నారు, జిల్లలో శాతవాహన విశ్వవిద్యాలయం ఏర్పడేవరకూ ఒక్క విశ్వవిద్యాలయం కూడా లేదు, 
కరీం నగర్ లో ప్రధాన విద్య కేంద్రం ఎస్ ఆర్ ఆర్, ఇది 1956 లో వేముల వాడ దేవాలయ సహకారంతో ఇది ప్రారంభించారు, ఇది స్వర్ణోత్సవాలు జరుపుకుంది, అనేక మంది మేధావులు , రాజకీయ నాయకులు ఈ కాలేజి విద్యార్థులే, 1970 లలో ప్రవేట్ విద్య సంస్థలు ఏర్పడటం ప్రారంభం అయ్యింది, 
1996 నుండి జిల్లలో 370 పభుత్వ పాటశాలలు నడుస్తున్నాయి, 24  ప్రభుత్వ జూనియర్  కాలేజిలు ఉన్నాయి. 
* ప్రతిమ అనే ఒక ప్రవేట్ మెడికల్ కాలేజి ఉంది, 
* జిల్లలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజి కూడాలేదు.
జిల్లాలోని ప్రముఖులు:
ఆదికవి పంపకవి: తెలుగులో కావ్యాలు రచించిన మొదటి కవి పంపకవి.. ఈయన కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందినా వారుగా చెప్తారు, నన్నయకంటే ఈయన చాల పుర్వికుడు ఐన ఈయనను ఆదికవిగా గుర్తించలేదు సీమంద్రులు, ఈయన కన్నడలో కూడా అనేక కావ్యాలు రాసారు అందుకే కన్నడిగులు ఈయనను ఆదికవిగా గౌరవిస్తున్నారు.. కన్నడిగులకు ఉన్న సంస్కారం ఆంద్రులకు లేదు. 
పీవీ:మాజీ ప్రధాని, ఏకైక తెలుగు ప్రధాని.ఆయనకు సంభందించిన పూర్తి వివరాలకు కింది లింక్ చుడండి.
http://naatelangaana.blogspot.com/2011/12/blog-post_23.html
బద్దం ఏళ్ళ రెడ్డి:సాయుధ పోరాట యోధుడు, ఈయన పేరును జిల్లాకు పెట్టాలని ప్రతిపాదించింది ప్రభుత్వం కాని కమూనిస్ట్ పార్టీ అందుకు ఒప్పుకోలేదు: ఈయనకు సంబంధించిన మరిన్ని వివరాలకు కింది లింక్ చుడండి.
 http://naatelangaana.blogspot.com/2011/11/blog-post_19.html 
* దూరవిధ్యకు పిత్మహుడు ప్రో.రాంరెడ్డి: ఈయన చందుర్తి మండలం బండపల్లి లో జన్మించారు, ఈయన ఉస్మానియా, IGNOU లకు వైస్  చాన్సలర్ గా పని చేసారు, అలాగే యూనివర్సిటి గ్రాంట్స్ కమీషన్ చైర్మెన్ గా పనిచేసారు, మారుమూల గ్రామాల ప్రజలు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలని తలంచారు, అందుకే ఆయన దేశంలోనే మొదటి దూర విద్య విశ్వవిద్యాలయం డా.బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు, దేశంలో దూరవిద్య పితామహుడు ఆయన, ఆయన పదిహెన్ సంవత్సరాల క్రితం మరణించారు, ఆయన గౌరవంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్య కేంద్రానికి ఆయన పేరు పెట్టారు, ప్రో.రాంరెడ్డి దూరవిద్య కేంద్రం...
* సిని హీరో , మొదటి దాదా ఫాల్కే అవార్డు గ్రహీత జైరాజ్: ఈయన కరీంనగర్ పట్టణంలో జన్మించారు, ఉత్తరాదికి వెళ్లి హిందీ సిని పరిశ్రమ లో మొదటి తరం హీరోగా గొప్ప కీర్తినందుకున్నారు, ఆయన మొత్తం 300 ల సినిమాలలో  నటించారు, 11 మూఖి, 156 టాకీ లలో ఆయన హీరోగా నటించారు, షాహిద్ ఎ ఆజం సినిమా లో ఆయన వేసిన చంద్రశేకర్ ఆజాద్ పాత్రకు ఆయనకు మంచి పేరు వచ్చింది, ఆయన అనేక సినిమాలకు దర్శకత్వం వహించారు, ఆయన రాజ్ కపూర్, శేమ్మి కపూర్, లతో మల్టీ స్టారర్ సినిమాల్లో నటించారు, 1990 లో టీవీ సిరియల్ లో నటించారు, ఆయన సిని పరిశ్రమకు అందించిన సేవలకు గాను ఆయనకు 1980 లో సిని పరిశ్రమలో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అందుకున్నారు. ఆయన పదేళ్ళ కిందట మరణించారు.
* సిని దర్శకుడు బి ఎస్ నారాయణ: ఈయన జిల్లాలోని కొత్త పల్లి లో జన్మించారు, 1977 లో ఈయనతీసిన ఊరుమ్మడి బతుకులు సినిమాకు బంగారు నంది వచ్చింది, 1979 లో ఈయన తీసిన నిమర్జనం సినిమాకు తెలుగులో మొదటి జాతీయ అవార్డు లభించింది, ఆ సినిమాలో నటనకు శారదకు జాతీయ ఉత్తమ నటి అవార్డు "ఊర్వశి" లభించింది, ఆయన తెలుగు, తమిళ్, కన్నడ , మలయాళం లో అనేక సినిమాలను నిర్మించారు కూడా, ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు, కాని ఆయన భార్య మరణం, తర్వాత ఆయన సంతానం కూడా మరణించడంతో ఆయన కుంగిపోయారు, ఆయనకు షుగర్ వచ్చింది, ఆయన చూపు కోల్పోయారు, ఐన ఆయన తన పట్టుదల వీడలేదు, మార్గదర్శి అనే సినిమా తీసారు, ఇది నంది అవార్డు గెలుచుకుంది, అలాగే ఆయన అంధ డైరెక్టర్ గా లిమ్కా బుక్ లో స్థానం పొందారు, ఆయన 1994 లో తన సొంత ఊరిలో మరణించారు.
ఇంకొంతమంది ప్రముఖులు: 
* ఒగ్గుకతకు మారు పేరు మిద్దె రాములు,
* ఆర్ధిక రంగానికి అండ హనుమంత రావు,
* సాయుధ పోరాటయోధుడు అనేభేరి ప్రభాకర్,
* కవి జ్ఞాన పీట్ అవార్డు గ్రహీత సినారే,
* చిత్రకళకు చిరునామా పి. టి .రెడ్డి,
* కెమరా కవి రాజన్ బాబు,
*  నవ చిత్ర వైతాళికుడు తోట వైకుంతం,
* తొలితరం కథకుడు సీతారాం, 
* సామాజిక తత్వవేత్త బి ఎస్ రాములు,
* పరాక్రమానికి, శౌర్యానికి తావు కెప్టన్ విజయ రఘునందన్.


తెలంగాణా ఉద్యమం లో జిల్లా పాత్ర: తెలంగాణా సాయుధ పోరాట కాలం నుండి ఉద్యమం లో జిల్లా చురుకైన పాత్ర పోషిస్తుంది, సాయుధ పోరాటాయోదుల్లోని ప్రముఖులు బద్దం యెల్లారెడ్డి కరీంనగర్ జిల్లా వాసి, ఆయన అనేక వందల గ్రామాల్లో ప్రజా ఉద్యమ చైతన్యాన్ని నింపారు.
* కమూనిస్ట్ పార్టీకి మాత్రు రూపం ఐన ఆంద్ర మహా సభ నాల్గోవ సమావేశం 1935 లో జిల్లాలోని సిరిసిల్ల లో జరిగింది, దీనికి బద్దం యెల్లారెడ్డి, అనభేరి ప్రభాకర్ లు నాయకత్వం వహించారు, దీనిలో రావి నారాయణ రెడ్డి, ముగ్ధుం మొహినోద్దిన్ లు పాల్గొన్నారు.
* 1947 సెప్టెంబర్ లో గాలి పల్లిలో గ్రామస్తులంత కలిసి నిజాం పోలీసు లను గ్రామం నుండి తరిమి కొట్టారు, అయితే ఆ పోలీసు లు మరింత మందిని కలుపుకొని కొన్ని గంటల్లోనే గాలి పల్లి పై విరుచుకుపడ్డారు, ఈ కాల్పుల్లో 18 మంది అక్కడికక్కడే మరణించారు, గాలిపల్లి లో రక్తపుటేరులు పారాయి.
* 1969 ఉద్యమ సమయంలో కరీంనగర్ లోని  ఇందిరా చౌక్ వద్ద జరిగిన రిలే ధీక్ష లు ప్రపంచాన్నే ఆకర్షించాయి, ఇక్కడ మూడు నెలలపాటు BBC ప్రతినిధి ఉంది ఇక్కడి వార్తలను కవర్ చేసారు.
* ప్రస్తుత ఉద్యమానికి వెన్నుముక కే సి ఆర్ ను  మొదట అత్యధిక మెజారిటి తో ఎన్నుకునది కరీంనగర్ ప్రజలే.
* ప్రస్తుతం కూడా జిల్లా నుండి తెలంగాణా రాష్ట్ర సమితికి  6 గురు ఎం ఎల్ ఎ లు శాసన సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
                ( కరీం నగర్ జిల్లా మేట్ పల్లిలో సకల జనుల సమ్మె)
రాజీవ్ రహదారి: హైదరాబాద్ నుండి కరీంనగర్ ను కలిపే ప్రధాన రహదారి, దీన్ని విస్తరిస్తుంది ప్రభుత్వం అయితే నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చి ఇక్కడ చేస్తున్న పనుల గురించి కింది లింక్లో చుడండి;
http://naatelangaana.blogspot.com/2012/01/blog-post_06.html 



2005 నాటికి కరీంనగర్ నగరం ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయ్యింది ఈ సందర్భంగా అప్పటి రాష్ట్ర మంత్రి ఎం ఎస్ ఆర్ ఇక్కడ టీవీ నందుల ప్రధానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా " శత వసంతాల కరీంనగరం " అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు దీనిలో కరిమ్ నగర్ కు సంభందించిన అన్ని విషయాలు ఉన్నాయి.తప్పక చదవండి...  

12, జనవరి 2012, గురువారం

దీక్షకు జనం కరువు



జగన్ దీక్షకు రైతులే కరువయ్యారు. రైతుల సమస్యలను తెలుసుకునే పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మంగళవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌ను వేదికగా చేసుకొని ఆర్భాటంగా మొదలుపెట్టిన రైతుదీక్ష పేలవంగా సాగుతోంది. దీక్ష రెండో రోజు ఉదయం 7 గంటలకే జగన్ దీక్షవేదికపై వచ్చి కూర్చున్నారు. 20 నుంచి 25వేల మందిని లైనులో నిలబెట్టి జగన్ చేత ఓదార్పు మాటలు చెప్పించేందుకు నిర్వాహకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పట్టుమని ఐదారువేల మంది మాత్రమే దినమంతా జగన్‌ను కలువగలిగారు. వీరిలోనూ సగం మంది సీమాంధ్ర నుండి తరలించిన వారే కావడం గమనార్హం. జగన్ ఇందూర్ గడ్డపై కాలుమోపినప్పటి నుంచి దీక్షస్థలికి చేరేలోగా తెలంగాణవాదులు అడుగడుగున అడ్డుకున్న దరిమిలా పరిస్థితిని అంచనా వేసినా ఆ పార్టీ ముఖ్య నేతలు పొరుగు ప్రాంతాల నుండి జనాన్ని తరలించారు. విజయవాడ, విశాఖపట్నం,విజయనగరం, గుంటూర్, కృష్ణా, కడప, కర్నూలు, అనంతపురం తదితర సీమాంధ్ర జిల్లాలతో పాటు నల్గొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాల నుండి పథకం ప్రకారం జనాన్ని బుధవారం ఆర్మూర్‌కు తరలించారు. పొరుగు జిల్లాల నుండి జనాన్ని తరలించి ఉండకుంటే రెండో రోజు దీక్షశిబిరం వెల కానీ జగన్ రైతు దీక్ష విషయంలో మాత్రం స్థానిక రైతాంగం ప్రతికూలంగా స్పందించారు. ఆర్మూర్, బాల్కొండ ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ ముఖ్య నేత బాజిడ్డి గోవర్ధన్‌కు ఉన్న పరిచయాలతో ముందస్తు ప్రణాళికతో వివిధ గ్రామాల నుండి తోలుకొచ్చిన జనంతోనే రెండు రోజుల జగన్ రైతు దీక్షను మొక్కుబడిగా నడిపించారు. 
ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం బలంగా ఉండటంతో పాటు జగన్ సమైక్యవాదన్న బలమైన ముద్ర ఉండటం వల్లే చెప్పుకోదగ్గ స్థాయిలో స్థానికులు జగన్ దీక్ష వైపు కదలలేదు. 

ఇదేందప్పా...
పాపం మాజీ మంత్రి మారెప్ప ఆగమాగమై కాలుకాలిన పిల్లిలా అటుఇటు తిరుగుతు కనబడ్డారు. రెండవ రోజంతా దీక్ష వేదికపై తిరుగాడుతూ సభా ప్రాంగణంలో పలుచబడుతున్న జనాన్ని చూస్తు నిట్టూర్పు విడవడం కనిపించింది. సహచరులతో ఇదేందప్పా... జనం ఇట్ల పలుసబడుతుండ్రు అంటూ ఆయన పెదవి విరిచారు. 


సెగతోనే తెలంగాణ ఆటపాట
తెలంగాణ ఉద్యమసెగ తాకడంతో రెండవ రోజు దీక్ష నిర్వహణలో తెలంగాణ ఆటపాటకు చోటు లభించింది. మధ్యాహ్నం న్యూడెమోక్షికసి నేతలు జై తెలంగాణ నినాదాలతో జగన్ దీక్ష శిబిరాన్ని దద్దరిల్లగొట్టారు. దీంతో వైఎస్సార్ కీర్తనలను పక్కనబెట్టి కళాకారులు తెలంగాణ ఆటపాటలతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అచ్చంగా గద్దర్ పోలికలున్న ఓ సీనియర్ కళాకారుని వేదికపై నిలబెట్టి పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా అంటూ రికార్డును వేసి అచ్చంగా గద్దర్ హావభావాలను అనుకరించే ప్రయత్నం చేయించారు. 

ఫ్లాప్ షో... ఇంటలిజెన్స్ నివేదికలు
తెలంగాణలో మొదటిసారి జగన్ చేస్తున్న రైతు దీక్షలకు స్పందన కరువైందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంటలిజెన్స్ అధికారులు నివేదికలు పంపారు. ఆయా శాఖలకు చెందిన అధికారులు రెండు రోజులుగా ప్రాంగణం పరిసరాలలో పరిశీలించిన అధికారులు ఏఏ ప్రాంతాల నుండి ఎంత మంది హాజరయ్యారనే అంశాలను సేకరించారు. 

ముగింపు సభకైనా బయటి జనమే
రెండు రోజుల దీక్ష అనుభవం దృష్ట్యా గురువారం సాయంత్రం జరిగే రైతుదీక్ష ముగింపు సభకైనా భారీ సంఖ్యలో జనాన్ని తరలించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. నిజామాబాద్, డిచ్‌పల్లి, కామాడ్డి, ఎల్లాడ్డి, బోధన్, ఆర్మూర్, బాల్కొండ తదితర ప్రాంతాల నుండి జనాన్ని తరలించేందుకు వందలాది వాహనాలను మాట్లాడి పల్లెలకు పంపించే ఏర్పాట్లు చేశారు. జనసమీకరణపై ఆ పార్టీ యంత్రాంగం దృష్టిసారిస్తోంది. ఈ మేరకు వైఎస్సార్‌పార్టీ ముఖ్య నేతలు బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు.అయితే ముగింపు సభకు కూడా జన సందడి లేకపోవడంతో దీక్ష ముగుంపు కార్యక్రమాన్ని తూ.. తూ .. మంత్రగా జరిపించి ఐపోయింది అనిపించుకున్నారు..

9, జనవరి 2012, సోమవారం

తెలంగాణకు పూర్తి మద్దతిస్తామన్నమేధాపాట్కర్‌


ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తమ మద్దతు ఎప్పుడూ 
ఉంటుందని ప్రజా ఉద్యమాల రధసారధి మేధా పాట్కర్ 
స్పష్టం చేశారు. చిన్న రాష్ట్రాల ద్వారానే అభివృద్ది 
సాధ్యమవుతుందంటున్నారు.పోలవరం ప్రాజెక్టుతో 
లక్షలాది గిరిజనులు నిరాశ్రయులవుతున్నా ప్రభుత్వం 
పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పలు రాష్ట్రాల్లోని 
సమస్యలను అధ్యయనం చేసేందుకు పర్యటిస్తున్న
మేధాపాట్కర్ ఈరోజు మెదక్ జిల్లాలో ఆత్మహత్యలు 
చేసుకున్న కుటుంబాలను పరామర్శిస్తారు. రేపు 
ఓపెన్ కాస్ట్ భాదితులతో సమావేశమయ్యేందుకు 
ఖమ్మం జిల్లాకు వెళ్తారు. 


ఫిబ్రవరి 9న చంద్రబాబు కోర్టుకు..

 తెలంగాణవాదుల ప్రజల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని, 700 మంది ఆత్మహత్యలకు కారకుడు అయ్యాడని జనార్థన్‌రెడ్డి అనే వ్యక్తి రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై స్పందించిన కోర్టు ఫిబ్రవరి 9న కోర్టులో హాజరు కావాలని బాబుకు నోటిసులు జారీ చేసింది.తెలంగాణ విషయంలో డిసెంబర్ 7 న అకిలపక్షంలో చెప్పిన మాటను 9 వ తేది ప్రకటన తర్వాత మార్చాడని తత్ ఫలితంగా 700 మంది ఆత్మహత్య చేసుకున్నారని టిడిపి అధినేత చంద్రబాబుపై దాఖలైన పిటిషన్ పై రంగారెడ్డి కోర్టు సంచలన ఆదేశాలు జారీచేసింది. బాబుపై 417 కింద కేసు నమోదు చేయాలని, ఫిబ్రవరి 9 న కోర్టులో హాజరుపర్చాలని చైతన్యపురి పోలీసులను ఆదేశించింది. 

8, జనవరి 2012, ఆదివారం

1969 - తెలంగాణా నెత్తుటి పోరాటం..



             ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలు కలిసి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు కావడంలో కీలకమైనది పెద్దమనుషుల ఒప్పందం. 1956 [ఫిబ్రవరి 20] న కుదిరిన ఈ ఒప్పందంలో తెలంగాణా అభివృద్ధికి, తెలంగాణా సమానత్వ పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. ఆంధ్ర, హైదరాబాదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ మంత్రులు, రెండు ప్రాంతాల కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు ఈ ఒప్పందంపై సంతకాలు చేసారు. ఈ ఒప్పందాన్ననుసరించి 1956 నవంబర్ 1 న ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. అయితే  ఈ తంతును మొత్తం కొంతమంది హడావిడిగా చేసేసారు, తెలంగాణా ప్రాంతంలోని అధిక ప్రజలు విలీనానికి ఒప్పుకోలేదు,  తాము విద్యాపరంగా ఆంద్ర కంటే వెనక బడి ఉన్నందున ఉద్యోగాలన్నీ ఆంధ్రా వాళ్ళే తన్నుకు పోతారని ఇక్కడి ప్రజలు భావించారు, అదేవిధంగా తమ వనరులు సైతం విద్యాధికులైన ఆంధ్రుల చేతుల్లోకి వెళ్తాయని భయపడ్డారు, ఇదే విషయాన్నీ మొదటి ఎస్ ఆర్ సి కూడా చెప్పింది, అయితే కొంతమంది రాజకీయ నాయకులు ఆంద్ర నాయకుల ఒత్తిడికి లొంగి హైదరాబాద్ ను ఆంధ్రలో విలీనం చేసారు.ఆంధ్ర ప్రాంతానికి చెందిన నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు.
                               ఈ ఒప్పందం అమలు విషయమై కొద్దికాలంలోనే తెలంగాణా ప్రజల్లో అసంతృప్తి బయలుదేరింది. ఒప్పందాన్ననుసరించి ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణా వాసికి ఇవ్వలేదు, అప్పటికే అనేకమంది ఆంద్ర వాళ్ళు నకిలీ నివాస పాత్రలతో తెలంగాణా కు రావాల్సిన ఉద్యోగాల్లో చేరిపోయారు, అంతే కాకుండా విద్య విషయంలో తక్కువ శాతం విధ్యవంతులున్న తెలంగాణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కాని ప్రభుత్వం సీట్లన్నీ ఆంద్ర వారికి కేటాయించడం, ఆంద్ర వారు తెలంగాణా కు వచ్చి దొరల భూముల్ని తక్కువ ధరలకు కొని వ్యవసాయం చెయ్యడం (దొరల భూములలో కామునిస్ట్లులు(అన్నలు) జండాలు పాతి వారి దోపిడిని అడ్డుకుంటున్న కాలం అది. వేల ఎకరాల్లో ఉన్న దొరల భూముల్ని పేదలకు పంపిణి చెయ్యాలని అన్నలు ప్రయత్నించారు, అలాంటి సమయంలో అనేక మంది దొరలూ, జమీన్ దార్ల పై వారు దాడులు చేసారు, దీనితో విధిలేక వారు హైదరాబాద్ కు పారిపోయారు, దొరవారి భూముల్ని కొనడానికి ఎవరు సాహసించేవారు కాదు, ఎందుకంటే అన్నలు తమపై దాడి చేస్తారనే భయం, కాని ఆంద్ర వారు చాల మంది అతి తక్కువ ధరలకు, {ఎంతో కాలం గా వెట్టి చేస్తున్న అక్కడి ప్రజలకు దక్కాల్సిన భూముల్ని} కొని వ్యవసాయం చేయసాగారు ) ఇక్కడి ప్రజలకు అది మింగుడు పడలేదు.


                             1967లో ముఖ్యమంత్రి అయిన తరువాత కాసు బ్రహ్మానంద రెడ్డి కుట్రలతో రాజకీయంగా స్థిరపడ్డారు. తెలంగాణ నేతలను తొక్కేసారు. కాసు బ్రహ్మానందరెడ్డి ఆంద్ర వారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకు ముల్కీ నిబంధనలకు పాతరేసారు. దీంతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఖమ్మంలో రవీంద్రనాథ్ అనే విద్యార్థి నిరసనకు దిగాడు. దీంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది.
ఉద్యమ ప్రారంభం:



తెలంగాణా ఉద్యమం తెలంగాణా హక్కుల పరిరక్షణ ఉద్యమంగా మొదలైంది. తెలంగాణా రక్షణలను అమలు చెయ్యాలని కోరుతూ 1969 జనవరి 9న ఖమ్మం పట్టణంలో ఒక విద్యార్ధి నిరాహారదీక్ష ప్రారంభించాడు. ఆరోజు జరిగిన ఊరేగింపులో హింసాత్మక ఘటనలు జరిగాయి. మరుసటి రోజు ఉద్యమం నిజామాబాదుకు పాకింది. జనవరి 10 న హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం లో జరిగిన విద్యార్ధుల సమావేశంలో తెలంగాణా రక్షణల అమలుకై జనవరి 15 నుండి సమ్మె చెయ్యాలని ప్రతిపాదించారు.


అయితే, జనవరి 13 న అదే విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో విద్యార్ధులలోని ఒక వర్గం "తెలంగాణా విద్యార్ధుల కార్యాచరణ సమితి" గా ఏర్పడి, ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనే తమ ధ్యేయంగా ప్రకటించారు. అదే రోజున పురప్రముఖులు కొందరు "తెలంగాణా పరిరక్షణల కమిటీ" ని ఏర్పాటు చేసారు.

జనవరి 18 న విద్యార్ధుల్లోని రెండు వర్గాలు (తెలంగాణా రక్షణల కోసం ఉద్యమించిన వారు, ప్రత్యేక తెలంగాణా కోరేవారు) వేరువేరుగా హైదరాబాదులో ఊరేగింపులు జరిపారు. ఈ సమయంలో పోలీసులు విచక్షణ రహితంగా విద్యార్థులపై కాల్పులు జరిపారు, అనేక మంది విద్యార్థులు అమరులయ్యారు. అదేరోజు శాసనసభలోని ప్రతిపక్ష పార్టీలు తెలంగాణా రక్షణల అమలు కొరకు ప్రభుత్వాన్ని వత్తిడి చేసాయి.
ఉద్యమకారుల కోరికలను చర్చించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జనవరి 19 న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశం కింది విధంగా ఒక ఒప్పందానికి వచ్చింది.


తెలంగాణాలో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపించాలి.
పెద్దమనుషుల ఒప్పందంలోని తెలంగాణా రక్షణలను అమలు చెయ్యాలి.
అయితే ప్రత్యేక తెలంగాణా వాదులు ఈ ఒప్పందానికి సమ్మతించలేదు. ప్రత్యేక రాష్ట్రమే తమ ధ్యేయమని, అది నెరవేరేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని వారు ప్రకటించారు.

అఖిలపక్ష కమిటీ ఒప్పందాన్ని అమలు చేస్తూ జనవరి 22న ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఉత్తర్వును జారీ చేసింది. దీని ప్రకారం ఫిబ్రవరి 28 కల్లా స్థానికులు కాని ఉద్యోగులని వారి వారి స్థానాలకు వెనక్కి పంపివేస్తారు. తెలంగాణా రక్షణల అమలుకై మిగులు నిధుల అంచనాకు ఢిల్లీనుండి ఒక బృందం వస్తుంది. ఈ హామీలతో ఉద్యమానికి ఆద్యుడైన ఖమ్మం విద్యార్ధి తన దీక్షను విరమించాడు. దీనితో తెలంగాణా రక్షణల అమలు ఉద్యమం ఆగిపోయింది; ప్రత్యేక తెలంగాణా ఉద్యమం రెండవ దశలోకి ప్రవేశించింది.


మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము యొక్క రెండవ దశను ప్రారంభించిన ఉద్యమకర్త కాళోజీ నారాయణరావు.


జనవరి 24 న సదాశివపేటలో జరిగిన పోలీసు కాల్పుల్లో గాయపడి మరుసటి రోజు హైదరాబాదు గాంధీ ఆసుపత్రిలో ఒక వ్యక్తి చనిపోయాడు. జనవరి 27న రంగాచార్యులు అనే ఒక ఆంధ్ర ప్రాంతపు ఉద్యోగిని నల్గొండ పట్టణంలో పెట్రోలు పోసి తగలబెట్టారు. జనవరి 28న వరంగల్లులో కాళోజీ నారాయణరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి రాజీనామా చెయ్యాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని తీర్మానం చేసారు. క్రమేణా ఆందోళనలో హింసాత్మక చర్యలు పెరగసాగాయి. ఆంధ్రప్రాంతపు వారి ఆస్తులు తగలబెట్టడం విస్తృతంగా జరిగాయి. తెలంగాణాలోని అనేక పట్టణాల్లోను సైన్యం కవాతు జరిపింది. . ఫిబ్రవరి 25న తాండూరు లో హింసాత్మక ఘటనలు జరిగినపుడు పోలీసు కాల్పుల్లో ఒక వ్యక్తి చనిపోయాడు.
తెలంగాణా ప్రజాసమితి:
1969 ఫిబ్రవరి 28 న యువకులు, మేధావి వర్గాలు కలిసి హైదరాబాదులో తెలంగాణా ప్రజాసమితి ని స్థాపించారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రమే దీని ధ్యేయం. మొదటి కార్యక్రమంగా మార్చి 3 న తెలంగాణా బందును జరిపింది.

ఉద్యమాన్ని రాజకీయం చేసిన కాంగ్రేసు పార్టీ నాయకుడు మర్రి చెన్నారెడ్డి,
మార్చి 29 న ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉద్యమం మరింత హింసాత్మకంగా మారింది. కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేసి, తెలంగాణా కాంగ్రెసు సమితిని ఏర్పాటు చేసాడు. ఏప్రిల్ 21 న మర్రి చెన్నారెడ్డి కూడా ప్రత్యేక తెలంగాణాను సమర్ధిస్తూ ఉద్యమంలోకి రంగప్రవేశం చేసాడు. మే 1  మేడే నాడు తెలంగాణా కోర్కెల దినంగా జరపాలని తెలంగాణా ప్రజా సమితి ఇచ్చిన పిలుపు హింసాత్మకంగా మారింది. మే 15 న కె.వి.రంగారెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేసి, ఉద్యమ ప్రవేశం చేసాడు. అప్పటికి ఉద్యమాన్ని పూర్తిగా రాజకీయులు ఆక్రమించినట్లయింది. రాజకీయ నాయకుల జోక్యంతో ఉద్యమం నీరుగారుతుందని ఊహించిన కొందరు విద్యార్ధి నాయకులు పోటీ తెలంగాణా ప్రజా సమితిని ఏర్పాటు చేసారు. విద్యార్థి నాయకుడు శ్రీధరరెడ్డి దీనికి అధ్యక్షుడు. చెన్నారెడ్డి ప్రత్యర్ధులైన కొందరు రాజకీయ నాయకులు దీనికి మద్దతు పలికారు. వందేమాతరం రామచంద్రరావు, బద్రివిశాల్ పిట్టి వీరిలో ఉన్నారు.1969 జూన్ మొదటి వారం ఉద్యమానికి అత్యంత హింసాత్మకమైన కాలం. సమ్మెలు, బందులు, దాడులు, లాఠీచార్జిలు, పోలీసుకాల్పులు, కర్ఫ్యూలు మొదలైన వాటితో హైదరాబాదు అట్టుడికిపోయింది. విద్యార్ధులతోపాటు, కార్మికులు, ఉద్యోగులు కూడా సమ్మెలు చేసారు. జూన్ 10 నుండి తెలంగాణా ప్రాంత ఉద్యోగులు నిరవధిక సమ్మెను ప్రారంభించారు. అప్పటికి అనేక మంది విద్యార్థులు అమరులయ్యారు, రోజు పోలీసుల కాల్పుల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు నేల రాలుతున్న విద్యార్థులు మాత్రం వెనక్కి తగ్గలేదు, ఉద్యమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది, 359 మంది విద్యార్థులు అసువులు బాయడంతో ఒక్కసారిగా కేంద్రం ఉలిక్కి పడింది, హుటాహుటిన ప్రధాని ఇందిరా గాంధీ హైదరాబాద్ కు చేరుకొని పరిస్థితిని సమీక్షించింది,1969 జూన్ 24 న తెలంగాణా నాయకులు ప్రధానమంత్రి ఇందిరా గాంధీతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జూన్ 25న హైదరాబాదులో సమ్మె జరిగింది. ఆ రాత్రి ఉద్యమ నాయకులను పోలీసులు అరెస్టు చేసి, రాజమండ్రికి తరలించారు.జూన్ 27 న ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తన పదవికి రాజీనామాచేసాడు. కానీ ఆయన తన రాజీనామా లేఖను గవర్నరుకు కాక, కాంగ్రెసు అధ్యక్షుడు నిజలింగప్పకు పంపించాడు. దానిని ఆయన తిరస్కరించాడు.1969 ఆగష్టు 18 న లోక్‌సభలో తెలంగాణా ప్రాంత ప్రతినిధులు జి.వెంకటస్వామి, జి.ఎస్.మేల్కోటేలు ప్రత్యేక తెలంగాణా గురించి తమ వాదనను వినిపించారు. ఆగష్టు 24న కొందరిని, 28న మరికొందరిని ప్రభుత్వం రాజమండ్రి జైలు నుండి విడుదల చేసింది.
విద్యార్ధులు ఆందోళన మాని చదువులకు మళ్ళాలని తెలంగాణా ప్రజా సమితి సెప్టెంబర్ 23న ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. ఆ ప్రకటనపై చెన్నారెడ్డి, మల్లికార్జున్ సంతకం చేసారు. అప్పుడు హైదరాబాదులో ఉన్న రాష్ట్రపతి వి.వి.గిరికి చెన్నారెడ్డి స్వయంగా ఈ విషయం తెలిపాడు. దీనితో విద్యార్ధులలో అయోమయం నెలకొంది. నాయకత్వంపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి తలెత్తింది. కేంద్ర నాయకత్వపు సాచివేత ధోరణి దృష్ట్యా, విద్యార్థులు చదువులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని మల్లికార్జున్ సర్ది చెప్పే ప్రయత్నం చేసాడు. సెప్టెంబర్ 25 న తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడి హోదాలో కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా రాష్ట్రపతిని కలిసి, తెలంగాణాను ఏర్పాటు చెయ్యాలని కోరాడు. 1969 సెప్టెంబర్ 22న కొండా లక్ష్మణ్ బాపూజీ "ముఖ్యమంత్రిని మారిస్తే ఉద్యమం వాయిదా పడవచ్చు" అని అన్నాడు.విద్యార్థులను తరగతులకు వెళ్ళమని నాయకులు చేసిన ప్రకటన పలు విమర్శలకు గురైంది. నిరసన ప్రదర్శనలు జరిగాయి. 9 నెలలుగా చేసిన పోరాటం కొరగాకుండా పోతుందని విమర్శలు వచ్చాయి. తెలంగాణా ప్రజాసమితి ఉపాధ్యక్షుడు, వీరారెడ్డి కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. 1969 సెప్టెంబర్ 29 న కేంద్ర ప్రభుత్వం తెలంగాణా నాయకులను విడివిడిగా మాట్లాడడం మొదలుపెట్టింది. రాష్ట్ర నాయకత్వ మార్పు విషయంలో సహజంగానే భిన్నాభిప్రాయాలు బయటపడ్డాయి.
అక్టోబర్ 10 నుండి తెలంగాణా అంతటా, చెన్నారెడ్డి పిలుపుమేరకు సత్యాగ్రహాలు మొదలయ్యాయి. ఇందులో 18 ఏళ్ళలోపు విద్యార్ధులు పాల్గొనరాదని నిబంధన పెట్టారు. ఆ రోజునుండి మల్లికార్జున్ నిరాహారదీక్ష మొదలు పెట్టాడు. నవంబర్ 3 వరకు కొనసాగిన ఈ దీక్ష పోలీసులు ఆయనను అరెస్టు చేసి, ఆసుపత్రిలో చేర్చడంతో ముగిసింది.
1969 నవంబర్ 26 చెన్నారెడ్డి ఒక ప్రకటన చేస్తూ విద్యార్థులు పరీక్షలలోను, గ్రామీణులు వ్యవసాయపు పనులలోను నిమగ్నమై ఉన్నందున, ఉద్యమంలో స్తబ్దత వచ్చిందని అన్నాడు. మరుసటిరోజు మరో ప్రకటనలో ప్రస్తుతానికి ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్లూ, మళ్ళీ జనవరి 1 నుండి ప్రారంభిస్తున్నట్లు తెలియజేసాడు. ఈ ప్రకటనతో ఉద్యమం ముగిసినట్లైంది. డిసెంబర్ 6న తెలంగాణా ప్రజాసమితి నాయకులు టి.ఎన్.సదాలక్ష్మి, మరో ముగ్గురు ఒక సంయుక్త ప్రక టనలో చెన్నారెడ్డిని ప్రజాసమితి అధ్యక్ష పదవి నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రజాసమితిలోని మిగిలిన నాయకులెవరూ వీరికి మద్దతు నివ్వలేదు.

1971 లో పార్లమెంటుకు జరిగిన మధ్యంతర ఎన్నికలలో 10 సీట్లు సాధించింది. అయితే ఆ ఎన్నికల్లో ఇందిరా గాంధీకి సంపూర్ణ ఆధిక్యత రావడంతో తెలంగాణా ప్రజాసమితి మద్దతు కీలకం కాలేదు. 1971 సెప్టెంబర్ 24 న బ్రహ్మానంద రెడ్డి రాజీనామా చేసాక కొద్దిరోజులకు చెన్నారెడ్డి తెలంగాణా ప్రజా సమితిని రద్దు చేసాడు.ఈ పార్టీ ని రద్దు చెయ్యడం వెనకాల పెద్ద కుట్రే ఉందని యిట్టె అర్థం అవుతుంది, పార్టీ రధ్ధయ్యాక, గవర్నర్ పదవి చేపట్టాడు మర్రి చెన్న రెడ్డి, ఆ తర్వాతి కాలం లో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి కూడా అయ్యారు, అందుకే మొదటి తెలంగాణా ఉద్యమంలో ఉద్యమ ద్రోహిగా మిగిలి పోయాడు మర్రి చెన్నారెడ్డి.


        ఉద్యమం ఉదృతంగా సాగుతున్న రోజుల్లో కరీం నగర్ లోని ఇందిరా చౌక్ వద్ద రోజుకు ఒక కులంవారు తమ నిరసనను నిరాహార ధీక్షల రూపంలో కేంద్రానికి తెలియజేసారు, ఇక్కడ జరిగిన ఉద్యమాన్ని BBC ఛానల్ తమ ప్రతినిధిని పంపి కవర్ చేసింది.
               ఉద్యమం లో వీరోచితంగా పోరాడిన విద్యార్థుల్లో 369 మంది వీర మరణం పొందారు, ఆంద్ర పాలకుల తుపాకి తూటాలకు నేలకొరిగారు.
     అనేక మంది ఉద్యోగ నాయకులు తమ ఉద్యోగాలను కోల్పోయారు, రాజకీయ నాయకుల గారడిలో ప్రజల ఆకాంక్ష ఆవిరై పోయింది, ఆ శూన్యంలో ఏర్పడిన అంధకారం, నిరాశ, నిస్పృహల్లో ప్రజలు మల్లి తెలంగాణా ఉద్యమం యొక్క ఊసే ఎత్తలేదు, తెలంగాణా ప్రజలపై దోపిడి అధికమయ్యింది. ఆర్థికంగా   ఆంధ్రా వాళ్ళు బలవంతులయ్యారు, తెలంగాణా నాయకులను గుప్పిట్లో పెట్టుకున్నారు, ఎన్టిఆర్ వచ్చాక ఈ దోపిడి అధికమయ్యింది, తెలంగాణా అనే పదం పోయి తెలుగు వారి ఆత్మ గౌరవం తెరమీదికి వచ్చింది, తెలంగాణా సంస్కృతి, చరిత్రలపై ఎదేచ్చగా దాడి జరిగింది, చంద్రబాబు వచ్చాక తెలంగాణా అనే పదాన్నే నిషేధించాడు, మొత్తంగా తెలంగాణా లో ప్రతిరంగంవారు ఆంద్ర వారి వేధింపులకు గురి అయ్యారు, ఎందుకంటే ఉన్నతుద్యోగులు వాళ్ళు, కిందిస్థాయి ఉద్యోగులు తెలంగాణా వాళ్ళు, బొగ్గు తీసేవాళ్ళు తెలంగాణా వాళ్ళు, ఎ సి గదుల్లో వాళ్ళు, ఇవన్ని బరించి సహించారు తెలంగాణా ప్రజలు, తమ కళ్ళ ముందే తమ సంపదను ఆంద్ర వాళ్ళు దోచుకేల్తుంటే మౌనంగా చూస్తూ ఊరుకున్నారు, మల్లి తెలంగాణా ఉద్యమం వచ్చింది, చావో రేవో అంటున్నారు. ఈ పోరాటం సఫలం కావలి, తెలంగాణా సాధించుకోవాలి, మొద్దు నిద్దుర నటిస్తున్న కేంద్రానికి జ్ఞానోదయం కావలి, తెలంగాణా ప్రజలంతా ఇదే చైతన్యతో ఒక్క తాటి పైనే ఉండాలి, అదే తెలంగాణా ప్రజలకు శ్రీ రామ రక్ష... 

6, జనవరి 2012, శుక్రవారం

యమపురికి దారి-రాజీవ్ రహదారి



తెలంగాణా లోని అతిపెద్ద రహదారి అది, సింగరేణి బొగ్గును, గోదావరి ఇసుకను తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కొట్లలో ఆర్ధిక వనరులను కురిపిస్తున్న మార్గం, నిత్యం అనేక ప్రమాదాలకు నెలవు ఈ రహదారి, అదే హైదరాబాద్ నుండి కరీంనగర్ జిల్లాను కలుపుతున్న రాజీవ్ రహదారి.
                1990 వరకు ఇదొక సాధారణ రహధారే, పీవి ప్రధాని ఐన తర్వాత దీనికి మోక్షం వచ్చింది, స్వయంగా ప్రధాని రోడ్ ను విస్తరించాలని ఆదేశించడంతో హడావిడిగా ఉన్న రోడ్ నే వెడల్పు చేసి ఒదిలేసారు అధికారులు, ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి కరీంనగర్ జిల్లా రామగుండము వరకు ఉంది, ఉత్తర తెలంగాణా లోనే అతి ప్రధానమైన రహదారి, 250 కిలో మీటర్ ల దూరం కలిగి, మూడు జిల్లాలను హైదరాబాద్ కు అనుసంధానం చేస్తుంది, 6 ప్రధాన పుణ్య క్షేత్రాలను కలుపుతుంది, అంతే కాదు ఇది ప్రమాదాల్లో కూడా నెం.1 , గడిచిన 15 సంవత్సరాలలో 7000 మంది మరణించగా, 12000 మంది గాయలపాలు అయ్యారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు, తరచుగా జరుగుతున్న ప్రమాదాలను అరికట్ట మంటూ స్థానిక ప్రజలు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు, కాని ప్రజా ప్రతినిదులుకాని, ప్రభుత్వం కాని వీరి గోడును పట్టించుకోలేదు, అయితే 2009 ఎన్నికలకు ముందు అప్పటి రోడ్ భవనల శాఖ మంత్రిగా ఉన్న జీవన్ రెడ్డి సొంత జిల్లా సమస్య కావడంతో అప్పటి ముఖ్య మంత్రి రాజశేకర్ రెడ్డి దీనిపై ద్రుష్టిపెట్టాడు, 1500  కోట్ల తో రోడ్ విస్తరణ కు ప్రతిపాదనలు సిద్ధం చేసారు, అయితే ఎన్నికలలో జీవన్ రెడ్డి ఓటమి, రాజశేకర్ రెడ్డి మరణంతో ఈ రహదారి విస్తరణ పనులు మూలకు పడ్డట్టే అని అంత అనుకున్నారు, కాని అనూహ్యంగా ఈ రహదారి పై ప్రభుత్వానికి ప్రేమపుట్టుకొని వచ్చింది, అది ఎందుకంటే..
                          అంచనా వ్యయాన్ని అమాంతం పెంచి 2500 కోట్లు చేసారు, అందులో 1500  కోట్లను ప్రభుత్వం విడదల చేసి సదరు గుత్తేదారు కంపనికి  అప్పగించింది, అంతే కాదు రోడ్ నిర్వహణ భాద్యతను సదరు కంపనికి 25 సంవత్సరాలవరకు రాసి ఇచ్చారు, 25 సంవత్సరాల వరకు రహదారిపై టోల్ వాసులు చేసుకునే సౌకర్యం కూడా సదరు కంపనికి ఇచ్చారు, రోడ్ ను విస్తరించడం మాత్రమే కాకుండా 3 ప్రధాన బ్రిడ్జ్ లు, 32 చిన్న బ్రిడ్జ్ లు, 413 కల్వర్టులు , 3  ఫ్లై ఓవర్లు, 3 టోల్ ప్లజాలు, 3 విశ్రాంతి భావనలు, ఒక రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలి, ఐతే టెండర్ పద్ధతిలో కాకుండా నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్ట్ అప్పగించారు, ఇంతకి ఆ కంపని ఎవరిదంటే కాంగ్రెస్స్ పార్టీ నేత సుబ్బి రామి రెడ్డి యొక్క గాయత్రి కన్స్ట్రక్షన్, కేవలం 600 కోట్లతో పూర్తి కావాల్సిన ఆ రోడ్ కు 2500 కోట్లు విడుదల చేయించుకొని కనీస ప్రమాణాలు పాటించకుండా, రోడ్ను మృత్యు దారిగా మారుస్తున్నారు సదరు వ్యక్తి.


                                 ఈ రోడ్ ను విస్తరించడం లేదు, దీని కోసం అదనంగా భూమిని సేకరించడం లేదు, ఆర్ అండ్ బి వారి భూమిలో మాత్రమె డబుల్ రోడ్ పక్కన ఇంకో డబుల్ రోడ్ వేస్తున్నారు, రోడ్ ను వెడల్పు చేస్తున్నారు అంతే, అయితే ఈ రోడ్కు అధికారుల, ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ కరువయ్యింది, స్థానిక ప్రజల కధనం ప్రకారం అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు సదరు కంట్రాక్టర్ నుండి మాముల్లు తీసుకొని రహదారి పర్యవేక్షణను గాలికి ఒదిలేసరని అంటున్నారు, నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ రహదారి పూర్తయితే వేలమంది ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడం ఖాయం అంటున్నారు, ఈ రహదారి దేశంలో ఎక్కడలేని విధంగా నిభందనలకు విరుద్ధంగా ఉందని, ఏదో మొక్కుబడిగా విస్తరిస్తున్నారని నిపుణులు అంటున్నారు, ఈ రోడ్ పై అనేక మలుపులు , యు ఆకారంలో, s ఆకారంలో ఉన్నాయి, మాములుగా నిభంధనల ప్రకారం ఒక మలుపు తర్వాత ఒకటిన్నర నుండి రెండు కిలో మీటర్ల వరకు మరో మలుపు ఉండ కూడదు, ఆ నిభందనను ఇక్కడ ఎవరు పాటించడం లేదు, అంతే కాకుండా అనేక ఎత్తు పల్లాలు ఈ రోడ్ ప్రత్యేకం.





                            ఈ రోడ్ విస్తరణ పూర్తయితే దీని వళ్ళ ఉపయోగం ఎంతో కాని తమ ప్రాణాలను బలి తీసుకుంటుందని జనం భయపడుతున్నారు, కాంట్రాక్టర్లుకు మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చే సొమ్ము పైన  , 25 ఏళ్ళ వరకు వచ్చే టోల్ వసులుపైనే పూర్తి దృష్టి ఉంది, ఇక ప్రభుత్వం మాత్రం కంట్రాక్టర్ కు లాభం చెయ్యాలని చూస్తుందే కాని, ప్రజల ప్రాణాలపై దృష్టి లేదు, ఎందుకంటే కంట్రాక్టర్ సీమంద్రుడు, ప్రజలు తెలంగాణావాళ్ళు కదా.. 

5, జనవరి 2012, గురువారం

పరేషాన్లో పచ్చపార్టీ..!



చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా అక్రమంగా నిర్భందించిన తెలంగాణ వాదులను అందరిని తనముందు హాజరుపరచాలని వరంగల్ పోలీసులకు చీఫ్ జుడీషియల్ మెజిస్టేట్ నిమ్మనారాయణగారు అల్టిమేటం జారీ చేశారు. మెజిస్టేట్ ఆదేశాలకు స్పందించిన జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ సెక్షన్ 151 కింద అరెస్టు చేసిన వారందరిని వెంటనే విడుదల చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ పోలీస్‌స్టేషన్‌ల పరిశీలనకు రెండు న్యాయవాద బృందాలు బయలుదేరారు. రేపు ఎలాంటి సంఘటనలకు పాల్పడవద్దని ఎస్పీ తెలంగాణ వాదులకు విజ్ఞప్తి చేశాడు.
                        చంద్రబాబు రేపు వరంగల్లు రావద్దని పరిస్థితులు బాగాలేవని వరంగల్లు ఎస్పీ రాజేష్‌కుమార్ బాబుకు నోటీస్ జారి చేశారు. గత నాలుగు రోజులగా వరంగల్ అట్టుడికిపోతున్న దశలో చంద్రబాబుకు రక్షణ కల్పించలేమని ఎస్పీ నోటీసులో పేర్కొన్నట్లు తెలిసింది. చంద్రబాబు రైతు పోరుయాత్రను రద్దు చేసుకోమని వరంగల్ ఎస్పీ రజేష్‌కుమార్ సూచించడంతో తెలుగు తమ్ముల్లు గందరగోళంలో పడిపోయారు. బాబు పోరు యాత్ర చేస్తే జిల్లాలో పరిస్థితులు చేయి దాటిపోతాయని బాబుకు రక్షణ కల్పించడం మా చేతుల్లో ఉండదని ఎస్పీ నోటీసులో తెలిపారు. తాజా పరిస్థితుల్లో టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి ఆగంమగమ్ అవుతున్నాడు. అంత తయారు చేసుకున్నాక ఈ రాత్రి నోటీసులు అందించడమేంది? అని రేవురి, కడియం శ్రీహరితో సమవేశమై మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఎస్పీ రజేష్‌కుమార్ ను కాసేపట్లో కలువనున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు.