హోం

11, ఫిబ్రవరి 2012, శనివారం

ఉద్యమాల ఖిల్లా నల్లగొండ జిల్లా..!!



నల్గొండ లేదా నల్లగొండ, దక్షిణ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నందలి ఒక ముఖ్య నగరము మరియు అదే పేరుగల జిల్లాకు రాజధాని. పూర్వము నల్గొండకు నీలగిరి అని పేరు ఉండేది. నల్గొండ జిల్లాకు ఉత్తరాన మెదక్మరియు వరంగల్ జిల్లాలు, దక్షిణాన గుంటూరు మరియు పాక్షికముగా మహబూబ్ నగర్ జిల్లాలు, తూర్పున ఖమ్మం మరియుకృష్ణా జిల్లాలు, పశ్చిమాన రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ జిల్లాలు సరిహద్దులు.
రెవిన్యూ డివిజన్లు (4): నల్గొండసూర్యాపేటమిర్యాలగూడభువనగిరి.
లోక్‌సభ స్థానాలు (2):భువనగిరి, నల్గొండ.
శాసనసభ స్థానాలు (12): సూర్యాపేటఆలేరుదేవరకొండతుంగతుర్తికోదాడ, మిర్యాలగూడ, హుజూర్ నగర్నకిరేకల్నల్గొండనాగార్జునసాగర్, భువనగిరి, మునుగోడు.
దర్శనీయప్రదేశాలు:- కొలనుపాక, భువనగిరి, పానగల్లువాడపల్లినాగార్జునసాగర్యాదగిరిగుట్ట, పిల్లలమర్రి.
జిల్లా విశిష్టతలు:శాతవాహనుల కాలంలో నీలగిరిగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతమే కాలక్రమంలో నందికొండగా, నల్లగొండగా మారింది. బహుళార్థసాధక ప్రాజెక్టుకు సరైన నిర్వచనం చెప్పగల నాగార్జున సాగర్ ఈ జిల్లాకు ప్రధాన ఆకర్షణ. మానవ నిర్మిత ఆనకట్టలలో ఆసియాలోనే ఇది అతిపెద్దది. క్రీ.శ. 2వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో నివసించిన బౌద్ధమతాచార్యుడైన ఆచార్య నాగార్జునుని పేరుతో నిర్మించిన ఈ ప్రాజెక్టును 1955 లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రారంభించాడు. జలాశయం మధ్యలోని నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకూ కృష్ణా నది పొడవునా 3568 చ.కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించిన రిజర్వు అడవి దేశంలో వన్యమృగ సంరక్షణ కేంద్రాలన్నింటికంటే పెద్దది. జిల్లాలోనియాదగిరి గుట్టతెలంగాణాలోని పర్వత ప్రాంత దేవాలయాల్లో ఎంతో పేరుపొందింది. ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి గుడి అన్ని ప్రాంతాలవారికి దర్శనీయ పుణ్యక్షేత్రం. దేవాలయ నిర్మాణ రీతి ప్రాచీన ఆధునిక సంప్రదాయాల కలగలుపుగా ఉంటుంది. ఏటా రథోత్సవం జరుగుతుంది. ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవం, పెళ్ళిళ్ళు విరివిగా జరిగే ప్రదేశం. జిల్లాలోని ఆలేరుకు సుమారు ఆరుకిలోమీటర్ల దూరంలోని కొలనుపాక జైన మతానుయాయులకు ఒక పవిత్ర యాత్రాస్థలం. ప్రస్తుతం ఇక్కడ శ్వేతాంబర శాఖకు చెందిన ఒక జైన దేవాలయం నిత్య పూజారాధనతో విలసిల్లుతోంది. కాకతీయుల నాటి ప్రసిద్ది చెందిన శివాలయాలు సూర్యాపీట మండలం లోని పిల్లలమర్రి గ్రామంలో కలవు. రాష్త్రంలోనే ముఖ్యమైన మార్కెటింగ్ యార్డ్ సూర్యాపీటలో కలదు. సున్నపురాయి నిల్వలు అత్యధికంగా ఉన్న జిల్లా కావడంతో సిమెంట్ ఉత్పాదనలో ఈ జిల్లా అసియాలోనే ప్రదమ స్థానంలో ఉంది. నల్లగొండ జిల్లా పోరాటాలకు ప్రసిద్ది, ఉద్యమాల ఖిల్లాగా ఈ జిల్లాకు పేరు. ప్రపంచ చరిత్రలో స్థానం సంపాదించిన వీర తెలంగాణ సాయిధ రైతాంగ పోరాటానికి జిల్లా ఆయివుపట్టు. వాడపల్లి తీర్తమ్ ఈ జిల్లా లొ అతి పెద్ద శైవ క్షేత్రము.శివ రాత్రి నాడు స్నానా లు అచరంచడానికి ప్రజలందరు వస్తారు. ఇదీ కృష్ణా ,మూసీ మరియు అంతర్వేది సంగమం నందు అందరు స్నానాలు చేయడానికి వస్తారు.
దర్శనీయ ప్రదేశాలు:-
బుద్ధుడి శిల్పం  :-హైదరాబాదుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగార్జునసాగర్ ప్రధాన పర్యాటకకేంద్రం. ఈ చారిత్రాత్మ ప్రదేశానికి ఈ పేరు బౌద్ధసన్యాసి నార్జునుడి కారణంగా వచ్చింది. ఈ ప్రదేశంలో పండితుడైన ఆచార్య నాగార్జునుడు విద్యాకేంద్రాన్ని స్థాపించాడు. ప్రస్థుతం ఇక్కడ నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మించబడి ఉంది. నాగార్జున సాగర్ ఆనకట్ట ప్రపంచంలో పొడవైన మానవ నిర్మిత ఆనకట్టగా ప్రసిద్ధిగాంచింది. నాగార్జునసాగర్ ఆనకట్ట కింద 10 లక్షల కంటే అధికమైన ఎకరాల సాగుబడి జరుగుతుంది.
ఈ ఆనకట్ట నిర్మించే సమయంలో త్రవ్వకాలలో బౌద్ధసంస్కృతికి చెందిన శిధిలాల పురాతన అవశేషాలు బయటపడ్డాయి. వెలికితీసిన పురాతన అవశేషాలను సుందరమైన నాగార్జున కొండ మీద బధ్రపరిచారు. ఈ కొండ మానవ నిర్మిత సరస్సుకు కేంద్రంలో ఉన్నది. పవిత్రమైన బౌద్ధస్థూప అవశేష మిగులు భాగాలను స్థూప, విహారాలు, ఒక విశ్వవిద్యాలయం మరియు పవిత్రమైన బలిపీఠం జాగ్రత్తగా రిజర్వాయర్‌కు తూర్పు భాగంలో ఉన్నాయి.
నాగార్జున కొండ  :-మానవ నిర్మిత సరస్సు మద్య మనోహరమైన ద్వీపం ఉంది. నాగార్జున కొండ త్రవ్వాకాలలో 2వ 3వ శతాబ్ధానికి చెందిన బౌద్ధసంస్కృతిక స్థూపం బయటపడ్డాయి. ఈ కోడను చేరటానికి విజయపురి వద్ద ఉన్న జెట్టి అనేప్రదేశంలో బోటు సేవలు లభ్యం ఔతాయి.
129 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాదు విమానాశ్రయం నుండి ఇక్కడకు వాయుమార్గంలో ప్రదేశానికి చేరవచ్చు. రైలు మార్గంలో ఇక్కడకు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాచర్ల నుండి చేరవచ్చు.
చంద్రవంక జలపాతము :-
ఎత్తిపోతల జలపాతముకు దిగువగా 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుందరమైన కొండచరియలలో చంద్రవంక జలపాతము ఉంది. ఈ జలపాతము పచ్చని కొండల నుండి 21.3 మీటర్ల నుండి కింద ఒక మడుగులోకి పడుతూ ఉంటుంది. ఈ జలపాతాన్ని తరచూ పర్యాటకులు దర్శిస్తుంటారు.
ఈ సుందర జలపాతము 60 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న చంద్రవంకానది నుండి ప్రవహించే జలాల వలన ఏర్పడింది. ఈ జలపాతం నాగార్జున కొండకు 21 కిలోమీటర్ల దూరంలో తూర్పున ఉంది. అక్కడ ధ్యానంచేసిన ఒక యతీశ్వరుడి వలన ఈ జలపాతానికి ఈ పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో కొన్ని కొండ గుహాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం వారు ఇక్కడి దైవాలను పూజిస్తూ ఉంటారు.
ఈ ప్రాంతం రహదారి మార్గంలో హైదరాబాదు నుండి 150 కిలో మీటర్ల దూరంలో ఉంది విజయపురి సమీపంలో ఉంది.
నందికొండ :-
నందికొండ అంటే క్రిష్ణా నదీ తీరంలో ఉన్న చిన్న పల్లెటూరు. ఇది మిరియాలగూడకు 64.37 కిలో మీటర్ల దూరంలో ఉంది. చాలా ప్రముఖమైన ఈ నిర్మాణం ఇక్ష్వాకు వంశానికి చెందిన వారి చేత నిర్మించబడిన కోట. దృఢమైన గోడలు, కందకము, ద్వారాలు మరియు బురుజులు కలిగిన ఈ కోటలో ఒక దీర్ఘచతురస్రాకార రంగస్థలం (స్టేడియం)ఉంది.
పోచంపల్లి :-
1950 లో ఆచార్యా వినోభాభావే ఇక్కడి నుండి తన ఉద్యమాన్ని ఆరంభించాడు. ఇది బోంగిర్ నుండి 14.48 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే బీబీనగర్ నుండి 9.66 కిలోమీటర్ల దూరంలో ఉంది.
పిల్లలమర్రి :-
ఇక్కడ అద్భుతమైన చిత్రాలు, సున్నితంగా చెక్కబడిన స్థంభాలు కలిగిన పురాతన కాకతీయ ఆలయాలు ఉన్నాయి. ఈ చారిత్రాత్మక ప్రదేశం ప్రసిద్ధ కవి అయిన పిల్లల మర్రి పిన వీరభద్రుని పుట్టిన ప్రదేశం.
కొలనుపాక :-
ఇది హైదరాబాదు నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చాలా చారిత్రక ప్రసిద్ధమైనది. ఇది 93.24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఒకప్పుడు సమృద్ధి కలిగి ఉన్న ప్రదేశం. పాత కోట యొక్క శిధిలాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. ఒకప్పుడు ఎ.డి. 11వ శతాబ్ధం ఇది కల్యాణి చాళుక్యులకు రెండవ కోటగా ఉన్నప్పుడు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది.

ఇంకా కొన్ని దర్శనీయ స్థలాలు:-
  • రాచకొండ
  • గాజుల కొండ
  • ఏలేశ్వరం
  • ఫణిగిరి
  • భోంగిర్ ఫోర్ట్ 
  • బంజారా ఆభరణాలు
  • మటంపల్లి 
  • వడపల్లి 
  • కొలనుపాక

పుణ్య క్షేత్రాలు:-

యాదగిరి గుట్ట:- హైదరాబాదు నుండి వరంగల్లురహదారిలో 50 కి.మీ. దూరంలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం యాదగిరిగుట్ట.

స్థల పురాణం:-

మహర్షి ఋష్యశృంగుని కుమారుడైన యాదగిరి అనే సన్యాసి వలన ఈ కొండకు ఈ పేరు వచ్చింది. యాదగిర్షి ఇక్కడ ఉన్న ఒక గుహలో ఆంజనేయుడి అనుగ్రహంతో నరసింహుని గురించి తపమాచరించాడు. ఈ కొండ నల్గొండలోని బోంగిరి మరియు రైగిరి మద్యలో ఉన్నది. యాదగిర్షి ఘాఢతపస్సుకు మెచ్చి నరసింహుడు ఐదు రూపాలలో సాక్షత్కరించాడు. జ్వాలానరసింహ, యోగానంద నరసింహ, గంఢభేరుండ నరసింహ, ఉగ్ర నరసింహ మరియు లక్ష్మీ నరసింహ అనేవి ఆ ఐదు రూపాలు. ఇలా ప్రత్యక్షమైన నరసింహ రూపాలు ఈ కొండలలో స్వయంభువులుగా వెలసి భక్తుల పూజలు అందుకుకుంటున్నాడు. అందుకనే ఇది పంచ నరసింహ క్షేత్రం అయింది. పురాణ కధనం ప్రకారం యాదర్షికి మొదట జ్వాలా నరసింహుడిగా ప్రత్యక్షమైన జ్వాలా నరసింహరూపాన్ని దర్శించే శక్తి లేని యాదగిర్షి కోరిక మీద నరసింహుడు తరువాత యోగనరసింహుడిగా దర్శనమిచ్చాడు. యాదగిర్షి అంతటితో సంతోషపడక లక్ష్మీ సహితంగా దర్శనమివ్వమని కోరడంతో ఓడిలో లక్ష్మీసహితంగా లక్ష్మీనరసింహుడై దర్శనమిచ్చాడు. లక్ష్మీనరసింహుడు ఆళ్వారుల పూజలు అందుకుంటున్నాడు. ఊగ్రనరసింహుడి ఉగ్రతను తగ్గించడానికి గరుత్మంతుడు గండభేరుండ పక్షి రూపంలో స్వామికి ముందు నిలిచి స్వామి ఊగ్రతను తగ్గిస్తుంటాడు. ఈ శిలను దాటి వంగుతూ వెళ్ళి స్వామిని దర్శించాలి. ఈ క్షేత్రానికి పాలకుడు ఆంజనేయుడు. యాదగిర్షి స్వామిని ఈ ప్రదేశాన్ని తనపేరుతో పిలవాలని కోరాడు. అందుకే ఇది యాదగిరి గుట్ట అయింది. చాలాకాలం నుండి ఇక్కడ లక్ష్మీనరసింహుడు భక్తిల పూజలు అందుకుంటున్నాడు.
మండలాలు:-
భౌగోళికంగా నల్గొండ జిల్లాను 59 రెవిన్యూ మండలాలుగా విభజించినారు. ఈ క్రింద మండలము ముందు ఉన్న సంఖ్య అంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన మండల సంఖ్య.

34. నల్గొండ



ప్రత్యేకతలు:


పోచం పల్లి: పోచం పల్లి లో ఆచార్య వినోబబావే భూదాన ఉద్యమాన్ని ప్రారంభించారు.ఆయన ఇక్కడ కొంతకాలం ఉన్నారు, భూమి లేని 700 కుటుంబాలకు ఆయన భు పంపిణి చేసారు.అందుకే ఈ గ్రామాన్ని భూదాన్ పోచం పల్లి అంటారు.


* పోచంపల్లి కి ఉన్న మరో ప్రత్యేకత ఇక్కడి చీరెలు, పోచం పల్లి అనగానే అందరికి గుర్తుకు వచ్చే పోచం పల్లి చీరలు ఇక్కడే నేస్తారు.అందుకే పోచంపల్లి ని సిల్క్ సిటి అంటారు.



భువనగిరి:- భువనగిరి కోట 12 వ శతాబ్దంలో చాళిక్యులు నిర్ముంచారు, ఆ తర్వాత ఈ కోట కాకతీయుల ప్రముఖ రాజధానులలో ఒకటిగా విలసిల్లింది, భువనగిరి ని పాలించిన వారిలో గౌడ కులానికి చెందినా సర్దార్ సర్వాయి పాపన్న ముఖ్యుడు ఆయన భువన గిరిని రాజధానిగా చేసుకొని సుమారు 30 సంవత్సరాలు పరిపాలించాడు, ఆయన రాజ్యం హుస్నాబాద్ నుండి షా పూర్ వరకు సువిశాలంగా ఉండేది, ఈ సువిశాల సామ్రాజ్యానికి రాజధాని నగరంగా భువన గిరి విలసిల్లింది, ఆయన మరణానంతరం ఈ రాజ్యం గోల్కొండ నవాబుల పాలనలోకి వెళ్ళింది. సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్రకి కింది లింక్ చూడండి.
http://naatelangaana.blogspot.in/2011/10/blog-post_27.html 



నదులు :-
నీటి పారుదల:-
నాగార్జున సాగర్: ఆంద్ర ప్రదేశ్ ఏర్పడక ముందే నంది కొండ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అప్పటి హైదరాబాద్ ప్రభుత్వం 161 టి ఎం సి ల సామర్థ్యం తో ఉండే విధంగా నిర్మాణం చేపట్టింది.ఉమ్మడి రాష్ట్రము ఏర్పడ్డాక ఇరు ప్రాంతాలకు నీరందించాలని దాని స్థలాన్ని, పేరును మార్చారు, నాగార్జున సాగర్ పేరుతో ప్రాజెక్ట్ను నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ దేశంలోనే అతి పెద్ద రాతి డాం, దీనిని అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రు ప్రారంభించారు, ప్రాజెక్ట్ లే ఆధునిక కాలపు దేవాలయాలు అని నెహ్రు చెప్పింది ఇక్కడే.దీనికి రెండు కాలువలు ఉంటాయి, ఒకటి జవహర్ కాలువ, రెండవది లాల్ బహాదుర్ కాలువలు, కుడి కాలువ ఆంద్ర ప్రాంతానికి నీరందిస్తే, ఎడమ కాలువ తెలంగాణా కు నీరందిస్తుంది.


* ప్రాజెక్ట్ ప్రారంభించినపుడు హైదరాబాద్ రాష్ట్రానికి 132 టి ఎం సి లు, ఆంద్ర రాష్ట్రానికి 132 టి ఎం సి ల నీరు అందించాలని అనుకున్నారు, కాని ఉమ్మడి రాష్ట్రము ఏర్పడగానే, తెలంగాణా కు వచ్చే ఎడమ కాలువ లెవెల్స్, ఎలైన్ మెంట్ లలో మార్పు చేసి 106 .2 టి ఎం సి లకు తగ్గించడమే కాక ఆంద్ర ప్రాంతానికి వెళ్ళే కుడి కాలువను పొడగించారు.
* ఈ పరిణామంతో తెలంగాణకు అందుతున్నది కేవలం 85 నుండి 90 టి ఎం సి ల నీరు మాత్రమే. ఆంధ్రలో కుడి కాలువ కింద 15 లక్షల ఎకరాలకు నీరందుతుంటే, తెలంగాణకు కేవలం 5 లక్షల ఎకరాలకు కూడా నీరు అందడంలేదు.
* అంటే కోస్తాకు మొత్తం 811 టి ఎం సి లలో 580 టి ఎం సి లు అంటే 71 % నికి పైచిలుకు వెళ్తుంటే, తెలంగాణా, రాయలసీమలకు 230 టి ఎం సి ల నీరు అందుతున్నది.

శ్రీశైలం:-శ్రీ శైలం మొదట విద్యుత్ ఉత్పత్తికి నిర్దేశించారు కాని ఆ తరువాత సాగు నీటి కొరకు వాడుకోవాలని నిర్ణయించుకున్నారు.
* 1981 లో జరిగిన ఒప్పందం ప్రకారం 48 టి ఎం సి ల నీరు రాయలసీమకు, 50 టి ఎం సి ల నీరు తెలంగాణకు ఇవ్వాలి.
* అయితే 1983 లో రాయలసీమ కు వెళ్ళే కుడి కాలువతో గాలేరు-నగరి, హంద్రినీవ, తెలుగు గంగలను జోడించి 48 టి ఎం సి ల కంటే ఎక్కువగా తీసుకోవడం ప్రారంభించారు.
* దీనికి మూడు తూములు పెట్టారు ఒకటి కుడి కాలువ కొరకు, రెండోది తెలుగు గంగ కొరకు, మూడోది ఎస్కప్ ఛానల్ అని. మొత్తం గా గ్రావిటి పద్ధతిలో ఈ మూడు తుముల ద్వారా 200 టి ఎం సి ల నీటిని పొందవచ్చు, అంతే కాకూడ కుడి గట్టు కాలువ కోసం 20 టి ఎం సి ల నికర జలాన్ని కేటాయించారు.
* ఇక తెలంగాణా లోని ఎడమగట్టు కాలవకు గ్రావిటి ద్వారన, లేక ఎత్తిపోతల ద్వార నీరివ్వాల అన్నది నిర్ణయించలేదు.
* కేటాయించిన నీటిని 26 టి ఎం సి లకు కుదించి, అవి కూడా మిగులు జలాలకు పరిమితం చేసారు.
* అయితే నాగార్జున సాగర్కు మిగిలిన జలం తరలించి అక్కడనుండి ఎలిమినేటి మాధవ రెడ్డి అనే కాలువ నిర్మించి దాని ద్వార ఎడమకాలువ కు నీరిస్తారట..!అయితే అది కూడా నాగార్జున సాగర్ లో 510 అడుగులకు పైగా నీరుంటేనే, అంటే శ్రీ శైలం నుండి తెలంగాణకు నీరు రాదన్న మాట..

పంటలు:-
కడుపు నిండా నీరు ఉన్న గొంతు మాత్రం దప్పికతో ఎండిపోయిన చందంగా ఉంది నల్గొండలో పరిస్థితి, ప్రధానంగా ఇక్కడ బోరుబావులపై ఆధారపడి పంటలు పండిస్తున్నారు.
* ఇక్కడ ప్రధానంగా వరి, సజ్జ, రాగులు,వేరుశనగ,ఆముదాలు,పొద్దుతిరుగుడు, ప్రత్తి మొదలైన పంటలు పండుతాయి.
పరిశ్రమలు:-జిల్లాలో సున్నపురాయి నిల్వలు అధికంగా ఉండడంవల్ల సిమెంట్ పరిశ్రమల్ని నెలకొల్పారు. నల్గొండలో అను పదార్థ మూలకం థోరియం నిల్వలు కూడా ఉన్నాయి, రాశి సిమెంట్స్ హుజూర్ నగర్ లో, దక్కన్ సిమెంట్ ను కేట్లపల్లి లోను ఏర్పాటు చేసారు, ఇంకా కాకతీయ, ప్రియ దర్శిని, రాక్ ల్యాండ్, విష్ణు, సాగర్ వంటి అనేక సిమెంట్ కర్మాగారాలు ఇక్కడ ఉన్నాయి.

రవాణా మార్గాలు:- రెండు జాతీయ రహదారులు జిల్లా గుండా వెళ్తున్నాయి, 9 వ నంబర్ జాతీయ రహదారి జిల్లాలోని సూర్యాపేట, నకిరేకల్, కోదాడ గుండా వెళ్తుంది, 202 వ నంబర్ జాతీయ రహదారి భువనగిరి గుండా వెళ్తుంది.


* బల్లార్ష నుండి సికింద్రాబాద్ ప్రధాన రైల్ మార్గం మధ్యలో జిల్లాలోని ఆలేరు,భువనగిరి రైల్వే స్టేషన్ లు  ఉంటాయి, హైదరాబాద్ నుండి గుంటూరు వెళ్ళే రైల్ మార్గం నల్గొండ పట్టణం గుండా వెళ్తుంది. 
విద్య:-జిల్లాలో 2007 వ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధి విశ్వ విద్యాలయం ను ఏర్పాటు చేసింది, జిల్లాలో 2001 జనాభా లెక్కల ప్రకారం 58 శాతం విద్యావంతులు ఉన్నారు.
* జిల్లాలో స్వామి రామానంద్ తీర్థ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్సు అండ్ టెక్నాలజీ చాల ప్రముఖమైనది.
ఫ్లోరైడ్:-జిల్లా ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య ఫ్లోరైడ్, వందల గ్రామాల ప్రజలు ఫ్లోరైడ్ బారిన పడి జవసత్వాలు కోల్పోయారు, నీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండటం వల్ల తాగే నీరే విషం అవుతుంది, ఆ నీటితో పండిన కూరగాయలు, పండ్లు అన్ని విషమే అవుతున్నాయి, సమైక్య రాష్ట్రం చేసిన తెలంగాణకు చేసిన గాయం ఇది,  బొక్కల్లో సత్తువ లేక వంగి పోవడం, విరిగి పోవడం, ఎత్తు పెరగక పోవడం, ఎంత వయసు వారైన శారీరికంగా అభివృద్ది చెందక పోవడం వంటి అనేఖ సమస్యలకు ఈ ఫ్లోరైడ్ భూతం కారణం,స్వాతంత్ర్యం వచ్చి 60 సంవత్సరాలు గడుతున్న పాలకులు ఈ సమస్యను  పట్టించుకోవడం లేదు, నల్గొండ లో దేశం లోనే అతి పెద్ద ప్రాజెక్ట్ లలో ఒక్కటైనా నాగార్జున సాగర్ ఉంది, కాని వారికి కనీసం తాగడానికి కూడా స్వచ్చమైన నీరు దొరకని పరిస్థితి, వీరి తల రాతలు మారాలంటే తెలంగాణా రాష్ట్రం మినహా మరో దారే లేదు.

జిల్లాలోని ప్రముఖులు:-
* రావి నారాయణ్ రెడ్డి: ఆంద్ర మహా సభ నాయకుడు, తెలంగాణా సాయుధ పోరాట నాయకుడు.
* కోదాటి నారాయణ రావు:
* పులిజాల వెంకట రంగ రావు :
* ఆరుట్ల రామ్ చంద్ర రెడ్డి:ఆంద్ర మహా సభ సభ్యుడు, సాయుధ పోరాట యోధుడు.
* ఆరుట్ల కమల దేవి:ఆంద్ర మహా సభ మహిళా నాయకురాలు. 
* లక్ష్మి నరసింహ రెడ్డి:
* కొండల రావు: ఈయన ను దేవరకొండ గాంధీ అంటారు.
* సి వి చారి:భూదాన ఉద్యమ నేత.
* శబ్నవీసు వెంకట నరసింహా రావు: నీలగిరి పత్రిక ఎడిటర్.
* పెద వెంకట రామారావు:
* కంచర్ల రామ కృష్ణ రెడ్డి:
* ఎ హరికృష్ణ రావు:ఆంద్ర సారస్వత పరిషత్ స్థాపకులు.
* రామచంద్ర రెడ్డి: భూదాన్ ఉద్యమ నేత.
* డి వెంకటేశ్వర రావు:
* నిమ్మల రాములు:ఆర్య సమాజ్ తరపున ఉద్యమ నేత.
* నర్ర రాఘవ రెడ్డి:
* చకిలం రంగ రావు:గ్రందాలయ ఉద్యమ నేత.
* ఉమ్మేత్తల కేశవరావు:రచయిత, గ్రంధాలయ, భూదాన ఉద్యమ నేత.
మరికొంతమంది ప్రముఖులు:
* విమలక్క: అరుణోదయ సాంస్కృతిక కళా వేదిక అధ్యక్షురాలు, ప్రజా గాయకురాలు.
* ఎన్. శంకర్: సుప్రసిద్ధ తెలుగు దర్శకుడు.
సుద్దాల అశోక్ తేజ,ఉత్తేజ్, వేణుమాధవ్...

పోరాటాల ఖిల్లా:- తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభించిన జిల్లా, జమిందార్, జాగిర్దార్, దేశ్ ముఖ్లను తరిమి కొట్టిన జిల్లా, మట్టి మనుషులతో మహత్తర పోరాటం చేయించిన జిల్లా నల్లగొండ జిల్లా నాటి తెలంగాణా సాయుధ పోరాటం నుండి నేటి మలిదశ పోరు వరకు నల్గొండ తన పోరాట పటిమను తెలియజేస్తూనే ఉంది. ఉద్యమ సారథి ఐన రావి నాయరణ రెడ్డి, ఆరుట్ల రామ్ చంద్ర రెడ్డి, ఆరుట్ల కమల, లాంటి ప్రముఖులు ఈ జిల్లా వారే , తెలంగాణా మొత్తం సాయుధ పోరాటం లో నాలుగు వేల మంది మరణిస్తే అందులో రెండు వేల మంది నల్గొండ వారె కావడం ఇక్కడి ఉద్యమ తీవ్రతను తెలియజేస్తుంది, సుద్దాల హన్మంతు పాడిన వేయ్, వేయ్ పాటతో ఉత్తేజితులైన జనం దేశ్ ముఖ్ మనుషులను తరిమి కొట్టారు, యాదగిరి ఆశువుగా పాడిన బండెనుక బండి కట్టి పాట తెలంగాణకు వందేమాతరం అయ్యింది.
  బేతవోలులో, కొలనుపాక, మనుగోడుల్లో రైతులు సాయుధ దళాలుగా ఏర్పడి పోరాటం కొనసాగించారు, ఆ ప్రాంతాల్లోని దేశ్ ముఖ్ లు వేసే పన్నులు, పెట్టె చిత్రహింసలు బరించలేక జనం తిరగబడ్డారు.ఇలా రైతాంగ తిరుగుబాటు ఆ తర్వాత అనేక గ్రామాలకు విస్తరించి దొరలను ఊర్ల నుండి తరిమి కొట్టారు.
      ప్రస్తుత ఉద్యమంలో కూడా నల్లగొండ చురుకైన పాత్ర పోషిస్తుంది, జిల్లాలోని ప్రజలు వివిధ రూపాల్లో తమ నిరసన తెలియ జేసారు, ఆంద్ర కు తెలంగాణా కు సరిహద్దు గ్రామాల్లో రోడ్ పై గోడలు కట్టి తమ నిరసనలు తెలిపారు, విజయవాడ వెళ్ళే పవేట్ వాహనాలను అడ్డగించారు,ఇలా జిల్లా తెలంగాణా ఉద్యమాలకు పట్టు కొమ్మగా ఉంది.

బి జే పీ తెలంగాణా పోరు యాత్ర సంపూర్ణం..


బి జే పీ తలపెట్టిన పోరు యాత్ర మొన్న ఖమ్మం జిల్లా భద్రాచలం లో ముగిసింది, గత నెల 19  న బి జే పీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలం నుండి ప్రారంభించిన యాత్ర 22 రోజుల్లో, 9 జిల్లాల గుండా ప్రయాణించి మొన్న బద్రాచలం లో ముగిసింది. నిన్న బి జే పీ నాయకులు మేడారం చేరుకొని సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని బంగారాన్ని సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు, ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ "కాంగ్రెస్ పార్టీ తెలంగాణా బిల్లు పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని, వచ్చే జాతర తెలంగాణా రాష్ట్రము  లోనే జరగాలని, పోరాడేందుకు కాలసిన శక్తి ని ప్రజలకు ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు" ఆయన చెప్పారు.
                      యాత్ర మహబూబ్ నగర్ లో ప్రారంభం ఐన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బి జే పీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారి హాజారయ్యారు, తెలంగాణా జే ఎ సి యాత్రకు పూర్తి మద్దతు తెల్పింది, యాత్ర మహబూబ్ నగర్, నల్గొండ, రంగా రెడ్డి, నిజామాబాదు,  ఆదిలాబాద్, కరీంనగర్,వరంగల్, మీదుగా ఖమ్మం చేరుకొని భద్రాచలం లో ముగిసింది, అన్ని జిల్లాలలోను యాత్రకు ప్రజలనుండి విశేష స్పందన కనిపించింది, ఈ యాత్ర తో బి జే పీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం కల్గించారు కిషన్ రెడ్డి, యాత్రలో ఆయన రోజు రోజుకు మాటల తీవ్రత పెంచారు, బి జే పీ తోనే తెలంగాణా సాధ్యం అనే విషయాన్నీ ఆయన ప్రజలకు తెలియజేసారు, తెలంగాణా కు కాంగ్రేసే ప్రధాన అడ్డంకి అని, కాంగెస్, టి డి పీ పార్టీ లను బొంద పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు,  ఆయన వివిధ ప్రాంతాల్లోని ప్రజల స్థితి గతులను పరిశీలించారు, గోదావరిఖనిలో బొగ్గు బావిలోకి దిగారు, కార్మికుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు, నల్గొండలో ఫ్లోరైడ్ బాధితులను కలిసి వారి భాధలు తెలుసుకున్నారు, ఇలా ఆయన యాత్ర ప్రజల జీవన స్థితి గతులను కూడా తెలుసుకుంటూ ముందుకు సాగింది, యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్లో భారి బహిరంగ సభను ఏర్పాటు చేసారు.

బి జే పీ సభ:- బి జే పీ అధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం నుండి నిజాం కాలేజి మైదానంలో భారి భహిరంగ సభ ప్రారంభమయ్యింది, దీనికి ముఖ్య అతిదిగా ఛత్తీస్ ఘర్ ముఖ్య మంత్రి రమన్ సింగ్ హాజారయ్యారు,ఇంకా బి జే పీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, వెంకయ్య నాయుడు, జే ఎ సి చైర్మెన్ కొదందారంలు  హాజరయ్యారు, సభకు వేలాదిగా జనం తరలి వచ్చారు.


                        తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా నాటాకాలాడుతున్న కాంగ్రెస్‌ను గద్దె దించాలని చత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ అన్నారు. నిజాం కళాశాలలో ఏర్పాటు చేసిన బీజేపీ తెలంగాణ పోరుయాత్ర ముగింపు సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్ర ఏర్పాటుకు వేయనన్ని కమిటీలు తెలంగాణకు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ కమిటీని వేయడం సిగ్గు చేటన్నారు. చిన్న రాష్ట్రాలు ఎట్లా అభివృద్ధి చెందుతాయో చత్తీస్‌గఢ్‌ను చూసి సోనియా తెలుసుకోవాలన్నారు. 42 రోజులు సమ్మె చేసిన ఉద్యోగుల స్ఫూర్తికి ఆయన అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ తప్పక మద్దతిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

4, ఫిబ్రవరి 2012, శనివారం

నిరంతర పోరాటం - తెలంగాణా ప్రజా జీవితం


నిజాం విమోచన పోరాటం నుండి తెలంగాణా లో ప్రతి రోజు పోరాటమే, ప్రతి క్షణం స్వేచ్చ నినాదమే, ఆటు పోట్లు లేని సముద్రం, గెలుపోటములు లేని యుద్ధం ఉండదు, స్వేచ్చ కోసం తెలంగాణా ప్రజలు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు, కేవలం వాటి పంధాలే మారుతున్నాయి, నాడు సాయుధ పోరాటం నుండి, మొదటి ప్రత్యేక రాష్ట్ర పోరు, తర్వాత ఉదృతంగా నక్సల్ బరీ ఉద్యమం మల్లి ఈ రోజు మాలి విడుత తెలంగాణా పోరాటం..
                                       నాడు హైదరాబాద్ లో  ఒక సమావేశంలో  వెంకట రామారావు అనే వ్యక్తి తెలుగులో మాట్లాడినందుకు తెలుంగి,బెడంగి అని ఆయనను అవమానించారు, దీనితో తెలుగు వారు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఆంద్ర జన సంఘం అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు, 1930 లో ఆంద్ర జన సంఘం ఆంద్ర మహా సభగా ఏర్పడింది ఇది అనేక సమావేశాలు నిర్వహించింది, ప్రజలను చైతన్య వంతులను చేసింది, దీనికి ముఖ్య నాయకులు రావి నారాయణ రెడ్డి, బద్ధం యెల్లారెడ్డి, ముగ్దూం మొహినుద్దిన్ లు, ఈ ఆంద్ర మహా సభనే ఆ తర్వాత కమూనిస్ట్ పార్టీగా ఆవిర్భవించింది, రష్యన్ కమూనిస్ట్ పోరాటం మాదురిగానే ఇక్కడ కూడా రైతాంగ శ్రామిక పోరాటం జరిగింది.

                      అయితే దేశ్ ముఖ్ లు చేసే అరాచకాలను భరించలేక పోయారు ప్రజలు, అదే సమయంలో కమూనిస్ట్ పార్టీ ఆవిర్భవించడం తో అనేక మంది ప్రజలు సంఘం లో చేరారు, సంఘం లో ప్రజలను నాయకులు చైతన్య పరచి నిజాం ప్రభువుకు అతని దేశ్ముఖులకు ఏ విధంగానూ సహకరించ కూడదని చెప్పారు, అయితే పన్నులు కట్టని ప్రజలను దేశముఖ్ లు  చిత్రహింసలు పెట్టేవారు, అంతే కాక దేశ్ ముఖ్ లు తమ ఇష్టరాజ్యంగా ప్రజలపై పన్నులు వేసే వారు, పంట కు, భూమికి, వారి ఇండ్లల్లో శుభకార్యాలకు ప్రజలు పన్ను కట్టాల్సిందే.దీనితో ప్రజలు అప్పులపాలయ్యారు, భూములు జమీందార్ లు ఆక్రమించుకున్నారు, యజమానులు కాస్తా కౌలుదార్లు అయ్యారు,  ప్రభుత్వ అధికారులైన పోలీసు పటేల్, మాలి పటేల్, తాసిల్ దార్, ఇలా అందరు దేశ్ ముఖ్ లకు పూర్తిగా సహకరించి పల్లెల్లో అరాచకం సృష్టించారు, ఆడవారిని మానభంగాలు చెయ్యడం, మగవారిని చిత్ర హింసలు పెట్టి చంపెయ్యడం పరిపాటి అయ్యింది, ఇలాంటి సమయంలోనే అనేక మంది సంఘం వైపు ఆకర్షితులైనారు, సంఘానికి సహకరించే వారిని పోలీసు ల సహాయంతో చిత్రహింసలు పెట్టేవారు జమిందార్లు.

                                     అయితే మరోవైపు అప్పటికే తెలంగాణా జిల్లాల్లో కర్మాగారాలను నెలకొల్పాడు నిజాం నవాబ్, అయితే అందులో వెట్టి చాకిరి మాత్రమె ఉండేది, పనిలో చేరిన వారిని బానిసలుగా బావించేవారు, దీనితో అక్కడి కార్మికులు శ్రమ దోపిడికి గురవుతున్నారని, కార్మికుల హక్కుల కొరకు పోరాడాలని కమూనిస్ట్ పార్టీ భావించింది, నైజాంలో కమూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది, పట్టణాలలో ఉన్న కార్మికులను సంఘటిత పరచింది, తమ హక్కుల కోసం పోరాడే విధంగా వారిని తయారు చేసింది, రష్య విప్లవ సాహిత్యాన్ని వారికి పంచి, రష్యన్ ప్రజలు ఎ విధంగా స్వేచ్చను పొందింది, తమ హక్కులను కాపడుకుందో తెలియజెప్పింది. 
                                చాకలి ఐలమ్మ ఆమె కుటుంభ సభ్యులు సంఘంలో చేరి తరచుగా సంఘం సమావేశాలు జరుపుతూ ఉన్నారు, ఈ సమావేశాలకు ఆరుట్ల రామచంద్ర రెడ్డి, ఆరట్ల కమలమ్మ లాంటి గొప్ప నాయకులు వచ్చి ప్రజలను చైతన్య పరుస్తున్నారు, ఇది నచ్చని దేశ ముఖ్ దొంగ కేసులు బనాయించి ఐలమ్మ భర్త, కొడుకుల్ని అరెస్ట్ చేయిస్తాడు, ఐన అధైర్య పడని ఐలవ్వ కాపు కొచ్చిన  పంటను కోయడానికి సిద్ధం అవుతుంది, అవ్వల్ తాసిల్దార్ నుండి కౌలుకు తీసుకున్న ఆపోలం తమ దొరదని దొర మనుషులు వచ్చి ఐలమ్మ ను బెదిరిస్తారు, ఐన ఐలవ్వ భయ పడదు, వారిని ఎదురిస్తుంది, అయితే చిన్న దొర ఐలమ్మ కూతురును ఎత్తుకెళ్ళి పాడుచేయ్యలని ప్రయత్నిస్తాడు, అప్పుడే అటువైపుగా గొర్రె లను కాచుకుంటూ వెళ్తున్న దొడ్డి కొమురయ్య దొరపైకి దూకి వాడిని కొట్టి ఆమెను కాపాడుతాడు, మరుసటి దినం సంఘం వాళ్ళు వచ్చి ఎర్రజెండాలు పాతి ఐలవ్వ పొలానికి రక్షణ గా నిలబడుతారు, పొలం కోతలు అయ్యాక కమునిస్ట్లు భోజనానికి ఐలమ్మ ఇంట్లో కి వస్తారు, ఈ విషయం తెలుసుకున్న అమీను కమూనిస్ట్ లను అరెస్ట్ చేస్తాడు, ఐలమ్మ ఇంట్లో ఉన్న ధాన్యాన్ని మొత్తం దోచుకేల్తడు, కమూనిస్ట్ నాయకులను విడిచిపెట్టాలని వారి మద్దతుదారులు రాలి నిర్వహిస్తారు, దొడ్డి కొమురయ్య అన్నానికి ఇంటికి వస్తాడు, అదేసమయంలో అటుగా ఆ రాలి వెళ్తుంది అది చూసిన కొమురయ్య  అన్నాన్ని వొదిలేసి ఆ రాలిలోకి వెళ్తాడు, దొర వారి బంగ్లా వరకు వెళ్ళగానే లోపలినుండి తుపాకి తో కాలుస్తుంది దొరసాని, దొడ్డి కొమురయ్య నేలకోరుగుతాడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో మొదటి అమరుడు దొడ్డి కొమురయ్య.
                                    షేక్ బందగి అన్న దేశ ముఖ్ వద్ద పనిచేస్తాడు దొరవారితో ఉన్న చనవుతో తన తమ్ముళ్ళ భూములు కూడా తన పేరు మీద పట్టా చేయించుకుంటాడు, అయితే ఈ విషయం తెలిసిన బందగి తన అన్నాను నిల దీస్తడు, పంచాయతి దొర వద్దకు వెళ్తుంది, అయితే దొర తన వద్ద పనిచేసే బందగి అన్నకు అనుకూలంగా తీర్పు చెప్తాడు, దీనితో ఆగ్రహించిన బందగి దేశ్ ముఖ్ దొరను ఎదురించి హై కోర్ట్ కు వెళ్తాడు, పన్నెండేళ్ళ పోరాటం తర్వాత బంధగికి అనుకూలంగా న్యాయస్థానం తీర్పు ఇస్తుంది, అయితే ఈ విషయం ఊర్లో తెలిస్తే తన పరువు పోతుందని భావించిన దొర హైదరాబాద్ నుండి వస్తున్న బందగిని మార్గ మధ్యంలోనే హత్య చేయిస్తాడు.
                          షోయబుల్ల ఖాన్ నిజమైన జర్నలిస్ట్, ఆయన పోరాటంలో భాగంగా ఇమ్రోజ్ అనే పత్రికను స్థాపించారు, పత్రిక ద్వార నిజాం రాజుపై మాటల తూటాలను పేల్చాడు, ఇతని రాతలకు జనం చైతన్య వంతులు అవుతుండడంతో, కాశీం రజ్వి సేనలు ఆయనను చంపేసాయి.

                                 గిరిజన గోండు తెగకు చెందిన కొమురం చిన్నూమ్ సోంబాయి దంపతులకు 1900 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకా లోని సంకేపల్లి గ్రామంలో జన్మించాడు. 
భీం కుటుంబం పదిహేడేళ్ళ వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్ కు వలస వెళ్లింది. అక్కడ వాళ్ళు సాగుచేసుకుంటున్న భూమిని సిద్దిఖీ అన్న జమీందారు ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్ అతన్ని హతమార్చి అస్సాం వెళ్ళిపోయాడు. అక్కడ ఐదేళ్ళపాటు కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన భీమ్ తిరిగి కరిమెర చేరుకున్నాడు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించాడు.  ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు మరియు జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబు పై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించాడు. కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 సెప్టెంబర్ 1 న జోడేఘాట్ అడవుల్లోని కొమురం భీమ్ స్థావరాన్ని ముట్టడించి భీమ్ ని హతమార్చాయి. 
                              రెండవ ప్రపంచ యుద్ధ కాలం తీవ్ర కరువుతో జనం అల్లాడుతున్నారు, యుద్ధంలో పాల్గొంటున్న బ్రిటిష్ సైన్యానికి ఆహారంతో పాటు, డబ్బును కూడా పంపించాలని డిల్లి నుండి నిజాం రాజుకు ఆదేశాలు అందాయి, నిజాం రాజు "లేవి గళ్ళు " వసూలు చెయ్యల్సిన్ధిగా దేశముఖ్లను ఆదేశించాడు, అయితే కమూనిస్ట్ లు  లేవి గళ్ళు కట్టవద్దని జనానికి పిలుపునిచ్చారు, జనం లేవి వాసులు చెయ్యడానికి వచ్చిన వారిపై తిరగ బడ్డారు, కర్మాగారాల్లో కార్మికులు కూడా నిరంకుశ పాలన అంతం కావాలని  పోరు బాట పట్టారు, తాను ఎంతో అభివృద్ది చేసిన ప్రజలు తన నాయకత్వాన్ని తిరస్కరిస్తున్నరనే కోపంతో నిజాం రాజు తెలంగాణా ను ముస్లిం రాజ్యం చెయ్యాలని భావించాడు, హైదరాబాద్లో ప్రతి ముస్లిం రాజేనని ప్రకటించాడు, దీనితో అనేక రాష్ట్రాలనుండి ముస్లింలు హైదరాబాద్ కు వచ్చి స్థిరపడ్డారు, అనేక మంది హిందూ యువకులు ఆ మతంలో చేరారు.ఇదే సమయంలో ఆర్య సమాజ అధ్యక్షుడు స్వామీ రామానంద తీర్థ హైదరాబాద్ సంస్థానం అంత పర్యటించి నిజాంకు, ముస్లిమ్స్ కు వ్యతిరేక ప్రచారం చేస్తాడు, అయితే ఈయన ప్రచార౦  తెలంగాణా ప్రాంతాన్ని ప్రభావితం చెయ్యకపోయినా, మరాట, కన్నడ ప్రాంతాల్లో తీవ్ర మత ఘర్షణలు చెలరేగుతాయి, కాశీం రజ్వి ని సైన్యాధ్యక్షునిగా నియమించి అరాచకానికి దిగాడు నిజాం, రజ్వి మనిషి కాదు వాడొక రాక్షసుడు, కనిపించిన వారిని కనిపించినట్టు కాల్చేసి ధాన్యాన్ని, పశువులను, డబ్బును దోచుకున్నాడు, విడి ఆగడాలకు అంతే లేకుండా పోయింది, సంఘం పేరు చెప్పిన వారిని, సంఘానికి సహకారం అందించే వారిని చిత్రహింసలు పెట్టి వారిని చంపేసే వాడు, అధికారులు , దేశ ముఖ్ లు  మద్యం మత్తులో తూలుతూ, కనిపించిన ఆడదాన్ని అనుభవిస్తూ అడ్డం వచ్చిన వారిని చంపేస్తు పల్లెల్లో అరాచకం సృష్టించారు, గృహ దహనాలు, హత్యలు, లూటీలు, మానభంగాలు, క్రురంగా హింసించడం జరిగేవి, లేవికి వ్యతిరేఖం గా పోరాడిన లంబాడా నాయకుడు "తను నాయక్ "ను పట్టుకొని కట్టేసి అందరు చూస్తుండగా జనం మధ్యలో కాల్చేస్తారు రజాకార్లు, లేవి కి వ్యతిరేఖంగా మాట్లాడిన "గోపాల్ రెడ్డి" ని కాల్చి చంపుతారు, పల్లెల్లో ఉన్న ధాన్యం దోచుకేల్తారు, ఎప్పుడు ఎవరు వచ్చి  ఇంటి మీద పడతారో, అనే భయం తో ప్రాణాలను అరచేతులో పెట్టుకొని బతికారు. 

                        ఆంద్ర మహా సభలో అంతరాలు పెరుగుతూ వచ్చాయి, అతివాదులు మితవాదులు గా విడిపోయారు, మితవాదులంత కాంగ్రెస్ ను స్థాపించుకున్నారు, అతి వాదులు జనం లో ప్రాభల్యం కలిగి ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు, ఈ పరిస్థితులన్నీ చూసిన రావి నారాయణ రెడ్డి, బద్దం ఏళ్ళ రెడ్డి, ముగ్ధుం మొహినోద్దిన్ లు సాయుధ పోరాటానికి పిలుపునిస్తారు, గ్రామా రక్షక దళాలను ఏర్పాటు చేస్తారు, వారికి ఆయుధాల శిక్షణ ఇచ్చి, వారిని గ్రామానికి రక్షణగా ఉంచుతారు, ఆ సమయంలో గ్రామాల్లోకి వచ్చిన రాజాకర్లపై వీరోచిత పోరాటం చేసారు, ప్రజలంతా ఆడ , మగ అనే తేడా లేకుండా ఆయుధం పట్టారు, ఒక రోజు ఆరుట్ల రామచంద్ర రెడ్డి సభ జరుగుతుంటే పోలీసులు, దొర గుండాలు సభపై దాడికి దిగారు అదే సమయం లో అక్కడే ఉన్న సుద్దాల దేవయ్య "వెయ్, వెయ్" అనే పాటను పాడుతుంటే జనం రౌద్రులయ్యారు దొర మనుషుల్ని కొట్టి చంపారు.                    
                                   భైరాన్ పల్లి, గాలిపల్లి లలో జరిగిన ఘటనలు మరో జలియన్ వాళ భాగ్ ను తలపించాయి, గ్రామం లోని ప్రజలందరిని కాల్చి చంపారు, ఇండ్లకు నిప్పుపెట్టారు, ఆడవారిని చెరచారు, పంట ధాన్యాన్ని కాల్చేసారు, తాగునీటి బావులు, చెరువుల్లో మూత్ర విసర్జన చేసారు ఇలా వాళ్ళ అరాచకాలకు అంతే లేకుండా పోయింది, జనం తిరగ బడే సరికి ఒక్కొక్కరిగా దేశ్ ముఖ్ లు గ్రామాలను వదిలి హైదరాబాద్ కు పారిపోయారు. యాదగిరి రాసిన బండెనుక బండి కట్టి అనే పాట తెలంగాణా కు వందేమాతరం అయ్యింది.

                                       తెలంగాణా లో పరిస్థితులు చెయ్యి దాటుతున్దడంతో భారత హోం శాఖ మంత్రి సారధ్యంలో పోలీసు చర్య జరుగుతుంది, అదే "ఆపరేషన్ పోలో", నిజాం రాజు లొంగిపోతాడు, సెప్టెంబర్ 17 1948 న తెలంగాణా కు విముక్తి లభిస్తుంది, అయితే ఆ తర్వాత ఇక్కడ మిలటరీ పాలన విధిస్తుంది భారత ప్రభుత్వం, కమునిస్ట్లు దొరల భూముల్ని పేద ప్రజలకు పంచుతారు, అయితే ఆ భూమిని సాగు చేసుకుందామనే సరికి దొరలు మల్లి గ్రామాల్లో అడుగు పెడతారు, అన్ని రోజులు దేశ్ ముఖ్ లు గా ఉన్న దొరలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మిల్టరిని తీసుకొని గ్రామాలపై పడతారు. గ్రామాల మీద దొరల ఆధిపత్యం పోవాలంటే దొరలకు వ్యతిరేఖంగా పోరాడాలని, భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని, దొరలకు సాయం చేస్తున్న సైన్యానికి కూడా వ్యతిరేఖంగా పోరాడాలని బద్దం ఏళ్ళ రెడ్డి, రావి నారాయణ రెడ్డి, ముగ్ధుం మొహినోద్దిన్ లు తీర్మానం చేస్తారు. దోరలపై దాడులు చేస్తూ భూములను ఆక్రమిస్తారు కమూనిస్ట్ లు, అయితే ఈ క్రమంలో భారత సైన్యంతో తలపడతారు వీరు, భారత దేశంలో హైదరాబాద్ విలీనం కమూనిస్ట్ లకు ఇష్టం లేదని అందుకే సైన్యం పై దాడులు చేస్తున్నారు అని  భావించిన నెహ్రు కమూనిస్ట్ లపై నిషేధం విధిస్తాడు, దీనితో కమునిస్ట్ లు అడవుల్లోకి వెళ్లి పోరాటం కొనసాగిస్తారు, 1952 లో సాయుధ పోరాటం ముగించి మొదటి సార్వత్రిక ఎన్నికల్లో నిలబడతారు, అయితే అధికారం సాధించేంత మెజారిటి రాక ప్రతిపక్షానికే పరిమితం అవుతారు.

                             అయితే గద్దేదిగిన నిజాం ఎటు వెళ్ళాడు..? ఎక్కడ తన శేష జీవితం గడిపాడు..? ప్రజలను చిత్ర హింసలకు గురిచేసిన నిజాంను నెహ్రు అక్కున చేర్చుకున్నాడు, 1948  నుండి 1956 ఆంద్ర ప్రదేశ్ ఏర్పడేవరకూ హైదరాబాద్ స్టేట్ కు నిజాం రాజ్ ప్రాముఖ్ గా ఉన్నారు, ఆ తర్వాత రాయలసీమ నుండి ఎం పీ గా కాంగ్రెస్ పార్టీ తరపున రెండు సార్లు గెలిచారు, రెండవ సారి పదవిలో ఉండగానే మరణించాడు,నిజాం కు నెహ్రు ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏమిటి..? అసలు పోరాటం మొత్తం కమూనిస్ట్ లు చేస్తే అధికారం కాంగెస్ కు ఎలా వచ్చింది..? సెప్టెంబర్ 17 ను ఆ రోజుల్లో కూడా విమోచన దినంగా ఎందుకు జరుపుకోలేదు..? కమూనిస్ట్ లు   విమోచన దినాన్ని విద్రోహ దినం అని ఎందుకు అన్నారు..? నిజానికి నిజాం గద్దె దిగడంతో జనాల కష్టాలు తిరాయా..? 
                  నిజాం దిగిపోవడంతో జనాల కష్టాలు తీరిపోలేదు, వారికి కావాల్సింది భూమి, అది దక్కలేదు, దొరలు కాంగ్రెస్ లో చేరి గ్రామాల్లోని తమ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు, అందుకే 1952 వరకు కమునిస్ట్  లు పోరాటాన్ని కొనసాగించారు, అందుకే సెప్టెంబర్ 17 ను విద్రోహ దినం అని అన్నారు, నిజాం దిగిపోవడంలోనే కుట్ర ఉంది, తాను దిగిపోవడానికి ముందే నెహ్రూతో ఒప్పందం చేసుకున్నాడన్నది సుస్పష్టం, అందుకే ఆయనకు రాజ్ ప్రముఖ్ పదవి లభించింది, తర్వాత రెండు సార్లు ఎం పీ కూడాను, తాను పొందడమే కాకుండా అన్ని రోజులు తనకు సేవచేసిన దేశ్ ముఖ్ లకు కూడా న్యాయం చేసాడు, వారిని కాంగ్రెస్ లో చేర్చి తిరిగి గ్రామాల్లోకి వచ్చేలా చేసాడు, ఇక నెహ్రూకు కావాల్సింది కూడా డబ్బున్న వారే కదా...
                1952 లో నాన్ ముల్కి గోబాక్ ఉద్యమం జరిగింది, ఉద్యోగాల్లో స్థానికుల్ని పక్కనబెట్టి ఇతర ప్రాంతాల వారికి ప్రాధాన్యత ఇవ్వడం తో ఉద్యోగులు పోరుబాట పట్టారు, వీరికి విద్యార్థులు సహకరాయించి ఉద్యమంలోకి దిగారు, అప్పుడు జరిగిన కాల్పులో పది మంది విద్యార్థులు మరణించారు,  ఈ ఉద్యమంలో నాన్ ముల్కి గో బాక్ , లేదా ఇడ్లి సాంబార్ గో బాక్ , గోంగూర పచ్చడి గో బాక్ అనే నినాదాలు చేసారు,(1919 లో ముల్కి రూల్స్ అమల్లోకి వచ్చాయి, 15 సంవత్సరాలు ఇక్కడ నివసించిన వారే ఉద్యోగానికి అర్హులు) అయితే సీమంద్ర్లు మాత్రం ఈ ఉద్యమాన్ని ఆజాద్ హైదరాబాద్ ఉద్యమంగా చిత్రీకరించారు.
ఫజల్ అలీ కమిషన్ లేదా మొదటి ఎస్ ఆర్ సి: రాష్ట్రాల పునర్ వ్యవస్థికరణ కోసం ఆ రోజులలో కేంద్ర ప్రభుత్వం మొదటి ఎస్ ఆర్ సి ని వేసింది, ఈ కమిటి దేశ వ్యాప్తంగా పర్యటనలు చేసి నివేదికను కేంద్రానికి సమర్పించింది, ఇందులో భాగంగానే ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాల గురించి తెలియజేసింది.
~తెలంగాణా ను ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలని, ఒక వేల కలపాలనుకుంటే 1961 ఎన్నికల వరకు ఆగాలని, ఎన్నికలలో గెలిచినా అభ్యర్తులలో 2 /3  సభ్యులు ఒప్పుకుంటే అప్పుడు విలీనం గురించి ఆలోచించాలి అని చెప్పారు.
~"విశాలాంద్రలో మునుముందు అభివృద్ది పతకాలను చేపట్టినపుడు తెలంగాణా హక్కులకు తగిన గుర్తింపు లభించకపోవచ్చును అనే భయం ఆ ప్రాంతంలో ఉన్నదీ. ఉదాహరణకు : నందికొండ (కృష్ణ), కుష్ట పురం (గోదావరి) వంటి ప్రాజెక్ట్లు తెలంగాణాలోనే కాకమొత్తం దేశంలోనే చేపట్టిన పథకాలలో ముక్యమైనది, ఈ రెండు పెద్ద నదులపై సేద్యపు పథకాలు చేపట్టాలనే ఆలోచన కోస్తా ప్రాంతంలో కూడా ఉంది, ఈ పరిస్థితిలో కృష్ణ గోదావరి జలాలలో ప్రస్తుతం తమకున్న స్వతంత్ర అధికారాన్ని కోల్పోవడానికి తెలంగాణా ప్రాంతం సిద్ధంగా లేదు. (ఎస్.ఆర్.సి రిపోర్ట్ పేరా 377 )
             హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు మొదటినుండి విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారు, అయితే విలీనానికి ఒత్తిడి పెరుగుతున్న సమయంలో ఆయన వారి పార్టీ అధిష్టానానికి ఉత్తరం రాసారు దాని సారాంశం ఏంటంటే:
తెలంగాణా లో విభిన్న వాదనలు ఉన్నా అధిక సంఖ్యలో ప్రజలు తెలంగాణా రాష్ట్రాన్నే కోరుకుంటున్నారని రాసారు.
 ఆ తర్వాత డిల్లి నుండి ఆయనకు పిలుపు వచ్చింది, విలీనానికి ఒప్పుకునేదే లేదు అని బేగంపేట్ విమానాశ్రయంలో చెప్పి వెళ్ళిన బూర్గుల, డిల్లి నుండి రాగానే వీలైనంత త్వరలో రాష్ట్రాలని విలీనం చెయ్యాలి ఇప్పుడు జరగకపోతే ఇంకెప్పుడు జరగదు అంటూ తన మార్చుకున్న భిప్రాయాన్ని చెప్పారు.
               ఇంతకి డిల్లి లో జరిగిందేమిటి..? బుర్గులకు ఎం చెప్పి ఒప్పించారు..? 1952 మొదటి సార్వత్రిక ఎన్నికలు,ఒక వైపు అన్ని రోజులు తమను హింసించిన దొరలు కాంగ్రెస్ పార్టీ తరపున పోటి చేస్తుంటే, మరో వైపు ప్రజలకోసం పోరాడిన కమూనిస్ట్ లు పోటి చేస్తున్నారనుకో.. , జనం ఎవరికీ ఒటేస్తారు, కమూనిస్ట్ లకే కదా.. తెలంగాణా మొత్తం కమూనిస్ట్ రాష్ట్రం ఐపోతే అక్కడ భవిష్యత్తులో కాంగ్రెస్ పుంజుకోవడం అనేది అసాధ్యం, దక్షిణ భారత దేశంలోని ఒక ప్రధాన రాష్ట్రాన్ని కోల్పోవడానికి నెహ్రు సిద్దంగా లేరు, మరో వైపు కమునిస్ట్ లు అధికారంలోకి వస్తే భూ సంస్కరణల చట్టం తీసుకొని వస్తే తమ భూములన్నీ పోతాయని దొరల భయం, ప్రజలకు భూమిని పంచితే  నిన్నటి వరకు దొర అంటూ తమ చుట్టూ తిరిగిన వాడుకుడా తమను లెక్క చెయ్యరని వీరి భావన,  ఒక వైపు పార్టీని, మరో వైపు తన పార్టీ నాయకుల్ని కాపాడుకోవడానికి నెహ్రు కమూనిస్ట్ పార్టీ పై నిషేధం విధించాడు , అలాంటి సమయంలో కొంతమంది కమూనిస్ట్ నాయకులు పిడిఎఫ్ అనే పార్టీ ని స్థాపించి ఎన్నికల్లో పాల్గొన్నారు, అయితే వీరు ఎక్కువ స్థానాల్లో పోటి చెయ్యలేక పోయారు, పోటి చేసిన స్థానాల్లో విజయం సాధించారు, అయితే ప్రజలు మాత్రం గత్యంతరం లేక కాంగ్రెస్ దొరలనే ఎన్నుకున్నారు, అయితే ఆ తర్వాత క్రమంగా పి డి ఎఫ్  బల పడింది, ఫజల్ అలీ కమిషన్ లో చెప్పినట్టు  1961  వరకు ఆగితే కాంగ్రెస్ గెలవదు, కాబట్టి కమూనిస్ట్ పార్టీని దెబ్బ తీయాలంటే హైదరాబాద్ రాష్ట్రానికే ఉనికి లేకుండా చెయ్యాలని అనుకున్నరు, అందుకే భాష ప్రాతిపదికన మరాటి మాట్లాడే జిల్లాలను మహారాష్ట్రలో, కన్నడ మాట్లాడే జిల్లాలను కర్ణాటకలో కలిపి, మిగిలిన ప్రాంతాన్ని ఆంధ్రతో కలిపారు, అయితే మరాటి, కన్నడ ప్రాంతాలు తొలగించడంతో తెలంగాణా అసెంబ్లీ మరియు పార్లమెంట్ స్థానాలు ఆంద్ర కంటే తగ్గిపోయాయి, కాబట్టి 1957 లో పీ డి ఎఫ్ బలం పుంజుకున్న అధికారంలోకి రాలేదు, ఈ ఎత్తుగడతో కాంగ్రెస్ ఆంధ్రను ,తెలంగాణాను కలిపింది. అనుకున్నట్టుగానే 1957 లో తెలంగాణాలో చాల స్థానాల్లో పీ డి ఎఫ్ జయకేతనం ఎగురవేసిన ఫలితం లేకుండా పోయింది.
 ఆంద్ర ప్రదేశ్ ఏర్పడటానికి ముందు రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ తెలంగాణాలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది, సీమాంద్ర , తెలంగాణా పెద్దలు విశాలాంద్ర తీర్మానం చెయ్యడానికి హన్మకొండ కు వచ్చారు, ఖాజిపేట్ లో రైల్ దిగి కారులో హన్మ కొండ వెళ్తున్న వారిని అడుగడుగునా ప్రజలు అడ్డుకున్నారు, ఖాజిపేట్ నుండి హన్మకొండ వరకు  రోడ్లన్నీ జనమయంయ్యాయి. ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటుచేశాయి. తెలంగాణా రక్షణల పేరుతో ఒక ఒప్పందం చేసుకున్నారు అదే..

మనుషుల ఒప్పందం:

* ఒప్పందంలోని కొన్ని ముఖ్యమైన అంశాలు:

-తెలంగాణా మంత్రులతో తెలంగాణా అభివృద్ది కొరకు " రిజినల్ స్టాండింగ్ కమిటి " ఏర్పాటు చేయాలి. తెలంగాణా లోని భూముల అమ్మకానికి, తెలంగాణాలో మధ్య నిషేధానికి ఈ కమిటి అనుమతి తప్పనిసరి.

-డోమినల్ రూల్స్: అప్పటి వరకు హైదరాబాద్ స్టేట్లోని ఉద్యోగుల ఉద్యోగాలు ఎధతధం గా ఉంటాయి.విధ్యభివ్రుద్ది పై దృష్టి, ముల్కి రూల్స్ అమలును పర్యవేక్షించడం దీని పని.
-ఉర్దూ భాషకు రెండవ అధికార భాష హోదా.
-అప్పటి వరకు తెలంగాణా లో ఉన్న మిగులు బడ్జెట్ ను తెలంగాణా అభివృద్ధికి కర్చు చెయ్యాలి.
-ఆదాయాన్ని ఎ ప్రాంతానిది ఆ ప్రాంతానికే కర్చు చెయ్యాలి, తెలంగాణా లోని ఆదయ, వ్యయాల్ని లెక్క చూపాలి.
-మంత్రి వర్గంలో 60 :40 పంపిణి,ఆంద్ర నుండి ముక్య మంత్రి ఉంటె తెలంగాణా వాళ్ళు ఉపముక్య మంత్రి ఉండాలి.
* పెద్దమనుషుల ఒప్పందం పై ఇరు ప్రాంతాల నేతలు 19 జూలై 1956 లో సంతకం చేసారు,
ఆంద్ర నుండి 1 బెజవాడ గోపాల్ రెడ్డి, 2 నీలం సంజీవ రెడ్డి, 3 గౌతు లచ్చన్న లు 
తెలంగాణా నుండి 1 బూర్గుల రామకృష్ణ రావు, 2 మర్రి చెన్నారెడ్డి, 3 కే వి రంగా రావు లు సంతకాలు చేసారు.


మొత్తానికి 1956 నవంబర్ 1 న ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసారు, అయితే మొదటి నుండి వివక్ష, దోపిడీకి తెలంగాణా ప్రజలు గురవుతూనే ఉన్నారు, ఆంద్ర వాళ్ళు ఎదేచ్చాగా తెలంగాణా నిధుల్ని అందరకు తరలించుకేల్లరు, ఉద్యోగాలన్నీ వారె పొందడం, ఇవన్ని చుసిన జనం కేవలం 12 సంవత్సరాలకే విసిగి పోయారు, పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలు చెయ్యాలని మొదటి సారిగా ఉద్యమం మొదలయ్యింది.



 1969 హక్కుల పోరాటం-ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం: ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలు కలిసి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు కావడంలో కీలకమైనది పెద్దమనుషుల ఒప్పందం. 1956 [ఫిబ్రవరి 20] న కుదిరిన ఈ ఒప్పందంలో తెలంగాణా అభివృద్ధికి, తెలంగాణా సమానత్వ పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. ఆంధ్ర, హైదరాబాదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ మంత్రులు, రెండు ప్రాంతాల కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు ఈ ఒప్పందంపై సంతకాలు చేసారు. ఈ ఒప్పందాన్ననుసరించి 1956 నవంబర్ 1 న ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. అయితే  ఈ తంతును మొత్తం కొంతమంది హడావిడిగా చేసేసారు, తెలంగాణా ప్రాంతంలోని అధిక ప్రజలు విలీనానికి ఒప్పుకోలేదు,  తాము విద్యాపరంగా ఆంద్ర కంటే వెనక బడి ఉన్నందున ఉద్యోగాలన్నీ ఆంధ్రా వాళ్ళే తన్నుకు పోతారని ఇక్కడి ప్రజలు భావించారు, అదేవిధంగా తమ వనరులు సైతం విద్యాధికులైన ఆంధ్రుల చేతుల్లోకి వెళ్తాయని భయపడ్డారు, ఇదే విషయాన్నీ మొదటి ఎస్ ఆర్ సి కూడా చెప్పింది, అయితే కొంతమంది రాజకీయ నాయకులు ఆంద్ర నాయకుల ఒత్తిడికి లొంగి హైదరాబాద్ ను ఆంధ్రలో విలీనం చేసారు.ఆంధ్ర ప్రాంతానికి చెందిన నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు.
                               ఈ ఒప్పందం అమలు విషయమై కొద్దికాలంలోనే తెలంగాణా ప్రజల్లో అసంతృప్తి బయలుదేరింది. ఒప్పందాన్ననుసరించి ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణా వాసికి ఇవ్వలేదు, అప్పటికే అనేకమంది ఆంద్ర వాళ్ళు నకిలీ నివాస పాత్రలతో తెలంగాణా కు రావాల్సిన ఉద్యోగాల్లో చేరిపోయారు, అంతే కాకుండా విద్య విషయంలో తక్కువ శాతం విధ్యవంతులున్న తెలంగాణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కాని ప్రభుత్వం సీట్లన్నీ ఆంద్ర వారికి కేటాయించడం, ఆంద్ర వారు తెలంగాణా కు వచ్చి దొరల భూముల్ని తక్కువ ధరలకు కొని వ్యవసాయం చెయ్యడం (దొరల భూములలో కామునిస్ట్లులు(అన్నలు) జండాలు పాతి వారి దోపిడిని అడ్డుకుంటున్న కాలం అది. వేల ఎకరాల్లో ఉన్న దొరల భూముల్ని పేదలకు పంపిణి చెయ్యాలని అన్నలు ప్రయత్నించారు, అలాంటి సమయంలో అనేక మంది దొరలూ, జమీన్ దార్ల పై వారు దాడులు చేసారు, దీనితో విధిలేక వారు హైదరాబాద్ కు పారిపోయారు, దొరవారి భూముల్ని కొనడానికి ఎవరు సాహసించేవారు కాదు, ఎందుకంటే అన్నలు తమపై దాడి చేస్తారనే భయం, కాని ఆంద్ర వారు చాల మంది అతి తక్కువ ధరలకు, {ఎంతో కాలం గా వెట్టి చేస్తున్న అక్కడి ప్రజలకు దక్కాల్సిన భూముల్ని} కొని వ్యవసాయం చేయసాగారు ) ఇక్కడి ప్రజలకు అది మింగుడు పడలేదు.

1967లో ముఖ్యమంత్రి అయిన తరువాత కాసు బ్రహ్మానంద రెడ్డి కుట్రలతో రాజకీయంగా స్థిరపడ్డారు. తెలంగాణ నేతలను తొక్కేసారు. కాసు బ్రహ్మానందరెడ్డి ఆంద్ర వారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకు ముల్కీ నిబంధనలకు పాతరేసారు. దీంతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఖమ్మంలో రవీంద్రనాథ్ అనే విద్యార్థి నిరసనకు దిగాడు. దీంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది.                         
ఉద్యమం లో వీరోచితంగా పోరాడిన విద్యార్థుల్లో 369 మంది వీర మరణం పొందారు, ఆంద్ర పాలకుల తుపాకి తూటాలకు నేలకొరిగారు.కాని జనం కోరిక మాత్రం నెరవేరలేదు, తాని విశాలన్ద్రకే మద్దతు ఇస్తానని ఇందిరాగాంధీ పార్లమెంట్ల ప్రకటించారు, రాజ్యంగా పరమైన రక్షణలను కల్పించారు కాని ఇవి సత్ఫలితాలు ఇవ్వలేదు.

* సెప్టెంబర్ 21  1973 న సిక్స్ పాయింట్ ఫార్ముల వచ్చింది:
- రాష్ట్రాన్ని ఆరు జోన్స్ గా ఏర్పాటు చెయ్యడం.
- రాష్ట్ర పరిధిలో ప్లానింగ్ బోర్డు మరియు సబ్ కమిటి ల ఏర్పాటు.
- తెలంగాణా లో విద్యాభివృద్ధికి సెంట్రల్ యునివర్సిటీ ఏర్పాటు.
- ఉద్యోగుల భద్రతకు హై లెవెల్ అడ్మినిస్త్రేటింగ్ ట్రిబునల్ ఏర్పాటు.
- దీనిలో దేనికి విఘాతం కల్గిన రాష్ట్రపతి నేరుగా కల్పించుకోవచ్చు.
- పైవి అమలైతే ఇక ముల్కి రూల్స్ , రిజినల్ కమిటీలు రద్దు అవుతాయి.అయితే 15 సంవత్సరాల నివాస నిబంధన నాల్గు సంవత్సరాలకు  కుదించారు.
* 1969 ఉద్యమం తర్వాత ఏర్పాటు చేసిన భార్గవ కమిటి 1969 నాటికి 25 వేల మంది ఆంద్ర వాళ్ళు తెలంగాణా కు రావాల్సిన ఉద్యోగాలు కొల్లగొట్టారని తేల్చింది.
* అయితే ఈ మధ్యలోనే 1969 లో రాష్ట్ర ప్రభుత్వం ఐదు సూత్రాల పథకం తీసుకు వచ్చింది.
* 1969 జి ఓ నంబర్ 36 విడుదలయ్యింది దీని ప్రకారం తెలంగాణాలోని ఆంద్ర ఉద్యోగుల్ని ఆంద్ర కు  పంపి తెలంగాణా ఉద్యోగులతో కాలిలను నింపాలి.
* 1985 లో వేసిన జై భరత్ రెడ్డి కమిటి ప్రకారం 1969 నుండి 1985 మధ్యలో 58 వేల మంది ఆంద్ర వాళ్ళు తెలంగాణా ఉద్యోగాల్లో అక్రమంగా చేరారని తేల్చింది. 
* 1985 లో 610 జి ఓ వచ్చింది, ఇది జి ఓ 36 కు పుత్రిక.అయితే ఇవేవి కార్య రూపం దాల్చలేదు, తెలంగాణా ఏర్పడలేదని ఆవేశంలో ఉన్న యువకులు నక్సల్బరి ఉద్యమం వైపు అడుగులు వేసారు.

అప్పటికే జన నాట్య మండలి ని ప్రారంభించి వివిధ కళారూపాల ద్వార జనానికి చేరువవుతున్న కమూనిస్ట్ ల వైపు యువత ఆకర్షితులయ్యారు, పిజి లు పి హెచ్ డి లు చదివిన మేధావులు కమూనిస్ట్ ఉద్యమంలో భాగమయ్యారు.

నక్సల్ బరీ ఉద్యమం:నెహ్రు నిషేధం విధించడంతో అడవుల్లోకి వెళ్ళిన కమునిస్ట్లులు 1952 లో సాయుధ పోరాటం ముగించి ఎన్నికల్లో పోటి చేసారు, కాని అనేక మంది కమూనిస్ట్ లు ఈ వ్యవస్థ ద్వారా సామాన్య ప్రజలకు న్యాయం జరగదని భావించి అజ్ఞాతంలో ఉండి ఉద్యమాన్ని కొనసాగించారు, దొరలను చంపుతూ గడీలని కుల్చుతున్నారు, దొర భూముల్లో ఎర్ర జండాలను పాతి, దొర పంటలను పేదలకు పంచేవారు. 1969 లో ఈ వ్యవస్థ తో విసుగుచెందిన అనేక మంది విద్య వంతులు ఉద్యమంలో భాగం కావడంతో ఉద్యమం ఉధృతం అయ్యింది, 1970 నుండి 2000 సంవత్సరాల వరకు తెలంగాణా గ్రామాల్లో నక్సల్ బరీ ఉద్యమం ఉదృతంగా సాగింది, కరీం నగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలు నక్సలైట్ లకు అడ్డాలుగా మారాయి, పోలీసు లు ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి భయపడేవారు, ఈ సమయాల్లో దొరలూ ఊర్లు ఖాళి చేసి పట్టణాలకు పారిపోయారు, అయితే భూ సంస్కరణలు మాత్రం జరగ లేదు, 1980 -1990 మధ్య కాలంలో ఈ ఇతివృత్తం తో అనేక తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘనవిజయం సాధించాయి. 
                   జన నాట్య మండలి ద్వారా గద్దర్, విమలక్క లాంటి వారు గ్రామాల్లో తిరిగి ప్రజలను చైతన్య వంతులను చేసారు. రాజ్య హింసను కళ్ళకు కట్టే విధంగా నాటకాల ద్వార ప్రజలకు తెలియ జెప్పేవారు జననాట్యమండలి వారు.తెలంగాణా నుండి చేరిన అనేక మంది సభ్యులు జాతీయ స్థాయికి వెళ్లారు. 1981 ఏప్రిల్ 20 న నక్సలైట్ లకు సహాయం చేస్తున్నారనే నెపంతో ఇంద్రవెల్లి లో పోలీసులు నర మేదానికి దిగారు, ఈ కాల్పుల్లో అనేక మంది గిరిజనులు మరణించారు, వీరి స్మారకంగా ఇక్కడ అతిపెద్ద స్థూపాన్ని నిర్మించారు. జగిత్యాల జైత్ర యాత్రకు చిహ్నంగా అక్కడ దేశంలోనే అతిపెద్ద స్థుపాన్ని నిర్మించారు. చర్చల పేరుతో ప్రభుత్వం వారిని పిలిచి అనేకమంది ని ఎన్కౌంటర్ చేయించింది, జన జీవన స్రవంతిలో కలవమని ఉపాధి చూపిస్తామని చెప్పారు, సీతక్క అనే మాజీ నక్సలిట్ కు టి డి పీ ఎం ఎల్ ఎ టికెట్ కూడా ఇచ్చింది, పద్మక్కను అరాచకంగా చంపడం తో పాటు అనేక మందిని శాంతి చర్చలు, పునరావాసం పేరుతో అంతం చేసారు..

మలిదశ తెలంగాణా పోరాటం: 1996 లో ప్రో. జయశంకర్ అధ్యక్షతన వరంగల్లో ఒక సదస్సు జరిగింది, దానికి అనూహ్యంగా వేలాదిమంది ప్రజలు హాజరయ్యారు, ఈ పరిణామంతో జయశంకర్ సార్ లో కొత్త ఆశలు చిగురించాయి, పరాయి పాలనా నుండి ప్రజలు విముక్తిని కోరుకుంటున్నారని గ్రహించిన ఆయన ప్రజాసంఘాలను, కవులు,కళాకారులూ, మేధావులను ఒక్క తాటిపైకి తెచ్చారు, అనేక సభలు,సమావేశాలు నిర్వహించారు, ప్రజలలో చైతన్యం తేవడం ప్రారంబించారు, 1999 NRI తెలంగాణా డెవలప్మెంట్ ఫోరం ను ఏర్పాటు చేసారు. 2000 సంవత్సరంలో ఆయన అమెరికా వెళ్లి అక్కడున్న NRI లను సంగటితం చేసారు,వాళ్ళను ఉద్యమం వైపుగా కదిలించగలిగారు, ఇక అందరు ఒక అభిప్రాయానికి వచ్చారు, తెలంగాణా కోసం ఒక రాజకీయ వేదిక కావాలని, అదే సమయంలో TDP కి రాజీనామా చేసిన కెసిఆర్ ప్రో.జయశంకర్ ను కలిసి ఆయన అధ్వర్యంలో తెరాస ను ఏర్పాటు చేసారు, సార్ పార్టీ సిద్ధాంతకర్తగా ఉన్నారు, కరీం నగర్ లో టి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారి భహిరంగ సభకు 12 లక్షల మంది హాజరయ్యారు, దీంతో కేంద్ర, రాష్ట్రాల్లో అధికారం కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ తన మానిఫెస్టోలో తెలంగాణా అంశం చేర్చి టి ఆర్ ఎస్ తో పొత్తు పెట్టుకుంది..2004  సార్వత్రిక ఎన్నికల్లో 5 పార్లమెంట్ స్థానాల్లో పోటి చేసిన టి ఆర్ ఎస్ 5 స్థానాలను గెలుచుకుది, 26 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరింది,  2009 ఎన్నికల్లో  ముందుకు వెళ్ళాడు, కాని ఈ ఎన్నికల్లో టి ఆర్ ఎస్ కేవలం రెండు పార్లమెంట్, పది అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలుహుకుంది, ఈ పరిణామంతో కే సి ఆర్ కుంగిపోయారు, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానన్నారు.
                                  కొద్ది రోజుల్లోనే కొత్త వ్యూహంతో ముందుకు వచ్చారు కే సి ఆర్, రాష్ట్ర పతి ఉత్తర్వుల్లోని 14 F ను రద్దు చెయ్యాలని, లేకపోతే తను నిరాహార ధిక్షకు దిగుతానని ప్రధానికి, రాష్ట్రపతికి, ముక్యమంత్రికి తెలియజేసారు, సిద్దిపేట వేదికగా 29 నవంబర్ 2009 న ఉదయం కరీం నగర్ నుండి ధిక్ష స్థలానికి బయలు దేరారు, అయితే రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహంతో కే సి ఆర్ ను అర్రెస్ట్ చేసి ఖమ్మం సబ్ జైలు కు తరలించింది, ఈ వార్త తెలిసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం రగిలి పోయింది, శ్రీ కాంత చారి అనే విద్యార్థి ఒంటిపై కిరోసిన్ పోసుకొని అందరు చూస్తుండగానే ఆత్మ హత్యా చేసుకున్నాడు, ఈ సంఘటన తో యావత్ తెలంగాణా  భగ్గుమంది, పది జిల్లాల్లో నిరసనలు దిష్టి బొమ్మల దహనాలు జరిగాయి, ఓ యు జాక్ రెండు రోజుల బంద్ కు పిలుపునిచ్చింది, రెండవ రోజు లాటీలు విరిగాయి, అనేక మంది విద్యార్థులు గాయలపాలు అయ్యారు, రబ్బరు బుల్లెట్లు , భాష్ప వాయు గోలలు ప్రయోగించారు, అంత కంతకు కే సి ఆర్ ఆరోగ్యం ధిగ జారుతుంది అని డాక్టర్లు చెప్పే సరికి విద్యార్థులు ఆవేశంతో రగిలి పోయారు, 

పంజాగుట్టలోని షాపులపై దాడులకు దిగారు, dec 10 న అసెంబ్లీ ముట్టడికి విద్యార్థులు పిలుపు నిచ్చారు, కే సి ఆర్ ఆరోగ్య పరిస్థితి, అసెంబ్లీ ముట్టడి ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోం మంత్రి ద్వార డిసెంబర్ 09 2009 న ఒక ప్రకటన చేయించింది, " తెలంగాణా రాష్ట్రము ఏర్పాటు చేస్తాం" అని, ఈ ప్రకటన తో కే సి ఆర్ నిరాహార దిక్ష విరమించారు, తెలంగాణా అంతట సంబరాలు జరిగాయి, కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు, సీమంద్రలో కృత్రిమ ఉద్యమం ప్రారంబమైంది, దీనితో కేంద్రం వెనక్కి వెళ్ళింది.
                      ఈ పరిణామంతో కే సి ఆర్ జానా రెడ్డి నివాసానికి వెళ్లి ఉమ్మడిగా పోరాడేందుకు ఒక వేదికను ఏర్పాటు చేసారు, అదే తెలంగాణా రాజకీయ JAC , జే ఎ సి కన్వినర్ గా ప్రో.కోదండ రామ్ ను ఎన్నుకున్నారు, ఇందులో కాంగ్రెస్, టి ఆర్ ఎస్, టి డి పి, బి జే పి, న్యూ డేమోక్రసి పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంగాలు, కవులు కళాకారులు, మేధావులు, గద్దర్, మంద కృష్ణ మాదిగ, ఇలా చాల మంది ఉన్నారు, ఒకటి రెండు సమావేశాలు జరిగాయి, అయితే ప్రాధాన్యతల గొడవతో గద్దర్ లాంటి వాళ్ళు , వివిధ కారణాలతో మంద కృష్ణ , కొన్ని సంగాలు జే ఎ సి నుండి తొలగి పోయాయి, అన్ని పార్టీల వాళ్ళు కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చారు, జనవరి 28 2010 లోగ రాజీనామాలు చెయ్యాలని, కాంగ్రెస్ మాట నిలుపుకోలేక జే ఎ సి నుండి బయటికి వెళ్ళింది, టి డి పి రాజీనామాల జిరాక్ష్ కాగితాలు కోదండ రామ్ కు ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేసారు, జే ఎ సి, టి డి పి ని భహిష్కరించింది, ఇక జాక్ లో కేవలం టి ఆర్ఎస్, బి జే పీ, న్యూ డేమోక్రాసి లు మాత్రమే ఉండడంతో రాజకీయ జాక్ విఫలం చెందిందని సీమంద్ర ఛానళ్ళు ప్రచారం చేసాయి, దీంతో జాక్ లో కొన్ని మార్పులు చేసారు, రాజకీయ jac ని తెలంగాణా jac గా ఏర్పరచి, చైర్మెన్గా కోదండ రామ్, కో చైర్మెన్గా మల్లేపల్లి లక్ష్మయ్య ఎన్నికయ్యారు. జాక్ మాట విని 11 మంది టి ఆర్ ఎస్ , ఒక బి జే పి ఎం ఎల్ ఎ లు రాజీనామా చేసారు.. జాక్ జిల్లా మండల స్థాయిల నుండి గ్రామ స్థాయి వరకు జాక్ లను ఏర్పరచి పూర్తిగా పరిపుష్టం అయ్యింది.JAC  పిలుపు మేరకు రాజీనామా చేసిన తెలంగాణా వాదులకు పోటిగా కాంగ్రెస్, టి డి పి లు తమ అబ్యర్తులను నిలబెట్టాయి, జాక్ తన అబ్యర్తులను గెలిపించుకోవడానికి, విద్యార్థులు బస్సు యాత్ర చేసారు, అమరవీరుల కుటుంబాలు ప్రచారంలో పాలు పంచుకున్నై, టి ఆర్ ఎస్, బి జే పి లు ప్రచారం చేసాయి, జూలై 30 ,2010  ఎన్నికల ఫలితాలు వచ్చాయి, అన్ని స్థానాల్లో జాక్ అభ్యర్థులు భారి మెజారిటితో విజయం సాధించారు, కాంగ్రెస్ నాల్గు, టి డి పి పన్నెండు స్థానాల్లో డిపాసిట్ కోల్పోయాయి. జే ఎ సి పిలుపుతో సహాయ నిరాకరణ, సకల జనుల సమ్మె జరిగాయి కాని ప్రభుత్వం కదలలేదు, మన ఎం ఎల్ ఎ లు మంత్రులు అసలే కదలలేదు. ఎందుకు..?
                 నాడు నిజాం ముందు కుచ్చు టోపీలు పెట్టుకొని, నిజాం దిగిపోగానే గాంధీ టోపీ లతో కాంగెస్ పార్టీలో చేరిన ఆ దొరల వారసులే నేటి కాంగెస్ ఎం ఎల్ ఎ లు, మంత్రులు,పార్టీలు మార్చి టి డి పీ లో ఉన్నవారు, ప్రజల ఆకాంక్షలకు విలువ ఎందుకు ఇస్తారు, తెలంగాణా వస్తే భూసంస్కరణలు వస్తాయి వారి అధికారం పోతుంది, అనే భయం, ఎ నాడు సాయుధ పోరాటంలో పాల్గొనని కుటుంభాలు, ఇంకా చెప్పాలంటే వీరి పుర్వికులకు వ్యతిరేఖంగానే సాయుధ పోరు సాగింది, అలంటి వారి పల్లకి ఎత్తుతున్నాం. వారు ఎన్నటికి ప్రజల ఆకాంక్షలకు విలువ ఇవ్వరు, అందుకే ఆంద్ర వారితో కలిసి తెలంగాణా రాకుండా అడ్డుపడుతున్నారు.
           ఈ రోజు కూడా ఉద్యమం కొనసాగుతూనే ఉంది పోరు యాత్ర పేరుతో బి జే పీ చేస్తున్న యాత్రకు జనం అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ నెల 15 ఓ యు లో విద్యార్థి ఘర్జన సభను నిర్వహిస్తున్నారు..


*** ఆటుపోట్లు లేని సముద్రం, గెలుపోటములు లేని యుద్ధం ఉండదు***
ఈ నేల వందల ఏళ్ళుగా పీడనలో నలిగిపోతునే ఉంది, స్వేచ్చ కోసం పోరాటం జరుగుతూనే ఉంది, ప్రాణ త్యాగాలు చేస్తూనే ఉంది, తర తరాలుగా స్వేచ్ఛకోసం పోరాడుతున్న ప్రజలు పార్లమెంట్ లో బిల్లు పెట్టేదాకా, తెలంగాణా రాష్ట్రం వచ్చే దాక, గమ్యాన్ని ముద్దాడే దాక ఈ పోరాటాన్ని కొనసాగిస్తారు.. 
జై తెలంగాణ.!!